المختصر المفيد للمسلم
ఒక ముస్లిం కొరకు ఉపయోగకరమైన సంక్షిప్త రచన
ఒక ముస్లిం కొరకు ఉపయోగకరమైన సంక్షిప్త రచన
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
ముందుమాట
ప్రశంసలు, కృతజ్ఞతలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి, అల్లాహ్ మనందరి కొరకు అంతిమ ప్రవక్తగా పంపబడిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై అనేక శుభాలను, శాంతిని వర్షించుగాక!
అమ్మా బాద్:
ఇస్లాం ధర్మమును, దానిపై నిలకడ చూపుటను, మరియు తన ఆదేశాలను, శాసనాలను అమలు చేయుటను అనుగ్రహించటం అనేది అల్లాహ్ మనిషికి ప్రసాదించిన గొప్ప అనుగ్రహం. ఈ పుస్తకంలో ఒక ముస్లిం, ఈ గొప్ప ధర్మం యొక్క ప్రాధమికాంశాలను క్లుప్తంగా వివరించిన శైలిలో, తన ధర్మాన్ని సరిదిద్దుకునే సూత్రాలను నేర్చుకుంటాడు; తద్వారా తన ప్రభువు, తన ధర్మం ఇస్లాం, మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అతని జ్ఞానం అధికమై, అతను పూర్తి అవగాహనతో, జ్ఞానంతో మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధిస్తాడు.
దాసులను సృష్టించడం వెనుకనున్న విజ్ఞత
మహోన్నతుడైన అల్లాహ్ మనల్ని సృష్టించిన గొప్ప ఉద్దేశ్యం: ఆయనకు భాగస్వాములను కల్పించకుండా కేవలం ఆయనను ఒక్కడినే ఆరాధించడం. మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్దారియాత్ 51:56] అంటే: ఆయన ఒక్కడే, ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించకుండా ఆరాధించడానికి, ఈ గొప్ప లక్ష్యం చుట్టూనే ఈ ప్రపంచంలోని మన సమస్త ఆచరణలు మరియు ఉద్దేశ్యాలు తిరుగుతాయి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా? కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు! [అల్ ముమినూన్ 23:115-116]
నా ప్రభువు అల్లాహ్:
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! [అల్ బఖరహ్ 2:21]
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. [ అల్ హష్ర్ 59:22]
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఆయనను పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్షూరా 42:11]
అల్లాహ్ ఆయనే నా ప్రభువు మరియు ప్రతీ దానికి ప్రభువు, యజమాని, సృష్టికర్త, ఆహారొపాధి ప్రసాదకుడు, ప్రతీది నిర్వహించేవాడు.
ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడు. ఆయన తప్ప ప్రభువు లేడు మరియు ఆయన కాకుండా ఎవ్వరు ఆరాధ్యుడు కాడు.
ఆయన కొరకు అందమైన పేర్లు మరియు ఉన్నతమైన గుణగణాలు కలవు వేటినైతే ఆయన తన స్వయం కొరకు నిరూపించుకున్నాడో మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించారో. అవి పరిపూర్ణతలో, అందములో అత్యంత స్థానాలకు చేరుకున్నవి. ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయన వినేవాడు మరియు చూసేవాడూను.
ఆయన అందమైన పేర్లలోంచి:
అర్రజ్జాఖు (ఆహారోపాధి ప్రదాత), అర్రహ్మాను (అనంత కరుణామయుడు), అల్ ఖదీర్ (సామర్ధ్యం కలవాడు), అల్ మలికు (యజమాని), అస్సమీఉ (వినేవాడు), అస్సలాము (శాంతి ప్రధాత), అల్ బసీరు (చూసేవాడు), అల్ వకీలు (కార్యసాధకుడు), అల్ ఖాలిఖు (సృష్టికర్త), అల్లతీఫు (సూక్ష్మ గ్రాహి), అల్ కాఫీ (సరిపోయేవాడు), అల్ గఫూర్ (మన్నించేవాడు).
అల్ రజ్జాఖ్: దాసుల జీవనోపాధికి బాధ్యత వహించేవాడు, ఆ ఉపాధి ద్వారానే వారి హృదయాలు మరియు శరీరాలు బలాన్నిపొందుతాయి.
అర్రహ్మాను’కరుణామయుడు: సమస్తాన్ని ఆవరించి ఉన్న, కరుణాప్రదాత.
అల్ ఖదీరు: ఆయన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను కలిగినవాడు, దానికి (ఆ సామర్థ్యానికి) ఎటువంటి అసమర్థత, బలహీనత దరిచేరదు.
అల్-మలికు: ఇది గొప్పతనం, ఆధిక్యత మరియు ప్రణాళిక వంటి లక్షణాలతో వివరించబడింది, సమస్త వస్తువులకు యజమాని, మరియు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అమలుపర్చే అధికారి.
అస్సమీ’ఉ : ఆయనే వినబడే వాటన్నింటిని, వాటి గోప్యములను, బాహ్యములను వింటాడు, మరియు తన దాసుల ప్రార్థనలను, వారి ప్రార్థనలు వింటాడు.
అస్సలాము: సమస్త లోపాలకు, బలహీనతలకు మరియు దోషాలకు అతీతుడు.
అల్-బసీరు: ప్రతి దానిని’ అది ఎంత చిన్నదైన, రేణువైన కంటి చూపుతో చుట్టుముట్టినవాడు, విషయాలపై అంతర్దృష్టి కలవాడు, సర్వ విషయాలకు నిపుణుడు, అంతర్గత పరిజ్ఞానం కలవాడు.
అల్ వకీలు: తన సృష్టి జీవనోపాధికి సంరక్షకుడు, వారి ప్రయోజనాలకు బాధ్యుడు మరియు ఆయనే తన మిత్రులను నియమిస్తాడు వారికి సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు, కష్టకారకాల నుండి రక్షిస్తాడు, వారి వ్యవహారాలకు సరిపోతాడు.
అల్ ఖాలిఖు: వస్తువులకు ఉనికిని ప్రసాదించువాడు, ఎటువంటి పూర్వప్రణాళిక, నమూనా లేకుండా ఆవిష్కరించువాడు.
అల్లతీఫ్: ఆయనే తన దాసులను గౌరవిస్తాడు మరియు వారిపై దయ చూపుతాడు మరియు వారు అర్ధించిన వాటిని వారికి ప్రసాదిస్తాడు.
అల్ కాఫీ: తన సమస్త దాసులకు మరియు వారికి అవసరమైన వాటన్నిటికీ సరి పోయేవాడు మరియు ఆయన సహాయంలో ఇతరులకు సరిపోతాడు మరియు ఇతరులు సంతృప్తి చెందుతారు.
అల్ గఫూరు: ఆయన తన దాసులను వారి పాపాల నుండి రక్షిస్తాడు మరియు ఆ చర్యలపై వారిని శిక్షించడు.
నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: (ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణాప్రదాత. [తౌబ 9:128]
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. [అల్ అంబియా 21:107]
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యముర్తిగా పంపించబడినారు.
ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ.
ఆయన తల్లి: ఆమినా బిన్తె వహబ్, మరియు ఆయనకు పాలు పట్టినది: హలీమా సాదియా. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పదకొండు స్తిరీ లను వివాహం చేసుకున్నారు, మరియు ఆయన మరణించేటప్పుడు వారిలో తొమ్మిది మంది ఉన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏడుగురు సంతానం, వారిలో ముగ్గురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. కుమారులు: అల్-ఖాసిమ్, అబ్దుల్లాహ్ మరియు ఇబ్రాహీమ్. కుమార్తెలు: జైనబ్, రుఖయ్యహ్, ఉమ్మె కుల్సూమ్ మరియు ఫాతిమహ్.
ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన, మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మబద్ధం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
ఆయన సందేశం మరియు ఆయన కంటే మునుపటి ప్రవక్తలందరి సందేశం ఎటువంటి సాటి లేకండా ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించటం వైపునకు పిలవటం, అల్లాహ్ ప్రకటన: మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అనే దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము. [అల్-అంబియా 21:25]
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్తల మరియు దైవసందేశహరుల పరంపరలో అంతిమ ప్రవక్త, అల్లాహ్ ప్రకటన: (ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. [అల్-అహ్’జాబ్ 33:40]
మహోన్నతుడై అల్లాహ్ ఆయనను ఇస్లాం ధర్మంతో సర్వమానవాళి వైపుకు ప్రవక్తగా పంపించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు. [సబా 34:28]
ప్రవక్త ﷺ కు ప్రతి ముస్లింపై గొప్ప హక్కులు ఉన్నాయి, వాటిలో నుండి:
1- ఆయన ప్రవక్త పదవి, సత్యసంధత మరియు ఆయన తీసుకువచ్చిన గొప్ప ధర్మశాస్త్రం దోషరహితమైనదని విశ్వసించటం, మరియు వాటిలో ఆయనకు విధేయత చూపడం మరియు ఆయనను అనుసరించడం, మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. [అన్ నజ్మ్ 53: 3 - 4]
2- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించడం, మరియు స్వయము, పిల్లల మరియు సమస్త సృష్టి జీవుల ప్రేమపై ఆయన ప్రేమకు ప్రాధాన్యతనివ్వడం తప్పనిసరి. ఈ ప్రేమ యొక్క భావమేమనగా: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వానికి అనుగుణంగా ఉండటం, ఆయన ఆజ్ఞాపించిన దానిలో ఆయనకు విధేయత చూపడం మరియు ఆయన నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండటం.
3- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదరణ చూపటం, మద్దతు ఇవ్వడం, గొప్పతనమును చూపటం మరియు ఘనతను చూపటం అనివార్యము.
4- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం. అదేమిటంటే: ఆయనను (సల్లల్లాహు అలైహి వసల్లం) కీర్తించడం, మరియు ఆయన ప్రస్తావనను ఉన్నతపరచమని, ఆయన గౌరవాన్ని, ఘనతను మరింత పెంచమని అల్లాహ్ ను ప్రార్థించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై దాని ద్వారా పదిసార్లు శుభాలు పంపిస్తాడు. దీనిని ముస్లిం నమోదు చేసినారు.
5- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో అతిశయోక్తి చేయకూడదు, మరియు అల్లాహ్ ఆయనకు ప్రసాదించిన ఉత్తమ స్థానం కంటే ఆయనను ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయికి చేర్చకూడదు. ఈ విషయం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా హెచ్చరిస్తూ ఇలా అన్నారు: క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసాను పొగడటంలో మితిమీరినట్లుగా మీరు నా ప్రశంసలో మితిమీరకండి. నేను ఆయన దాసుడను మాత్రమే. కనుక నన్ను అల్లాహ్ దాసుడనీ, ఆయన ప్రవక్త అనీ అనండి. (దీనిని బుఖారీ ఉల్లేఖించారు).
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణగణములు :
నిజాయితీ, కరుణ, దయ, సహనం, ధైర్యం, ఔదార్యం, మంచి నడవడిక, న్యాయం, వినయం, క్షమాపణ.
దివ్యఖుర్ఆన్ నా ప్రభువు అయిన అల్లాహ్ వాక్కు:
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీ కొరకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. [అన్నిసా 4:174]
దివ్యఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు. దానిని ఆయన యదార్థంగా పలికి, ప్రజలను చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీయటానికి మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకం చేయటానికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. దానిని పఠించే వారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది. దాని మార్గనిర్దేశాన్ని ఆచరించే వారు సరైన మార్గంపై నడుస్తారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంథము నుండి ఒక అక్షరం పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం పది పుణ్యాలతో సమానం. నేను 'అలిఫ్ లామ్ మీమ్' ఒక అక్షరము అని చెప్పడం లేదు, కానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మరియు మీమ్ ఒక అక్షరము. దీనిని అత్తిర్మిదీ నమోదు చేసినారు.
మహోన్నతుడైన అల్లాహ్ దానిని మార్పు చేర్పుల నుండి, వక్రీకరణ నుండి పరిరక్షించి, ప్రళయదినం వరకు శాశ్వతమైన సూచనగా చేసాడు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. [అల్ హిజ్ర్ 15: 9] కాబట్టి, ఎవరైతే ఖుర్’ఆన్ అసంపూర్ణమైనదని లేదా వక్రీకరించబడినదని దావా చేస్తారో, వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ధిక్కరించినవారు మరియు ఇస్లాం పరిధి నుండి బయటికి పోయినవారు అవుతారు.
మరియు పవిత్ర ఖుర్ఆన్ కరీంలో పూర్వగ్రంధాలలో మార్పులు చేర్పులకు గురికాకుండా మిగిలి ఉన్నవన్నీ అలాగే ప్రస్తావించబడినాయి, మరియు దైవిక ఆదేశాలు మరియు ఆత్మ సంబంధిత నైతికతల ప్రామాణికతలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి, మరియు వాటిలో ఉన్న సత్యాన్ని అది ధృవీకరిస్తుంది. ఈ కాలంలో మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి ఏ గ్రంథమూ లేదు, పవిత్ర ఖుర్ఆన్ కరీం తప్ప - దానిని అనుసరించడం, పవిత్రపరచడం, దాని పారాయణంతో ఆరాధించడం మరియు దాని ప్రకారం ఆచరించడం తప్పనిసరి; .
ఇస్లాం నా ధర్మము
ధర్మం యొక్క స్థాయిలు మూడు: ఇస్లాం, ఈమాన్ మరియు ఇహ్సాన్.
మొదటి స్థాయి: ఇస్లాం
ఇస్లాం: అల్లాహ్ కొరకు ఏకత్వాన్ని స్వీకరించడం, ఆయనకు విధేయత చూపడం ద్వారా ఆయనకు లొంగిపోవడం, షిర్క్ మరియు ముష్రికుల నుంచి దూరంగా ఉండటం.
ఇస్లాం మూలస్థంభాలు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఇస్లాం ఐదింటిపై నిర్మితమై ఉన్నది : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం,నమాజు నెలకొల్పడం, జకాత్ చెల్లించడం, రమదాన్ ఉపవాసములు ఉండటం, కాబా దైవ గృహము యొక్క హజ్ చేయటం (సందర్శించడం). ముత్తఫఖున్ అలైహి
ఇస్లాం మూలస్థంభాలు ప్రతి ముస్లింకు తప్పనిసరి అయిన ఆరాధనలు. మరియు వాటి అనివార్యమవుటను నమ్మటం మరియు వాటన్నింటిని ఆచరించటం ద్వారానే మనిషి యొక్క ఇస్లాం సరి అగును. ఎందుకంటే ఇస్లాం వాటిపై నిర్మితమై ఉన్నది. అందుకనే అవి ఇస్లాం మూలస్తంభాలు అని పిలవబడుతున్నాయి.
మరియు ఈ మూలస్థంభాలు:
మొదటి మూలస్థంభము : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: కావున తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. [ముహమ్మద్ 47:19]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: (ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు. [తౌబ 9:128]
అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం : అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యుడు లేడు.
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం : ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన, మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మబద్ధం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
రెండవ మూలస్థంభము : (సలాహ్) నమజు నెలకొల్పడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: సలాహ్ (నమాజ్) స్థాపించు [అల్ బఖరహ్ 2:110]
నమాజును నెలకొల్పటం అనేది దాన్ని అల్లాహ్ ధర్మబద్ధం చేసిన విధంగా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించిన విధంగా నిర్వర్తించటంతో పూర్తి అవుతుంది.
మూడవ మూలస్థంభము: జకాత్ చెల్లించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: విధిదానం (జకాత్) చెల్లించు [అల్ బఖరహ్ 2:110]
ముస్లిం యోక్క విశ్వాసం సత్యమవుటకు పరీక్షగా మరియు తనపై అనుగ్రహించిన సంపద యొక్క అనుగ్రహమునకు;పేదలకు మరియు అక్కర గలవారికి సహాయము చేసే అనుగ్రహమునకు బదులుగా తన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోవటానికి మహోన్నతుడైన అల్లాహ్ జకాత్ ను విధిగావించాడు.
జకాత్ చెల్లించటం అనేది హక్కుదారులకు దానిని అందజేయటంతో నెరవేరుతుంది.
అది ధనం నిర్ణీత పరిమాణమునకు చేరినప్పుడు అందులో (ధనంలో) విధిగావించబడిన హక్కు. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో ప్రస్తావించిన ఎనిమిది వర్గాల వ్యక్తులలో ఎవరికైనా అది ఇవ్వబడుతుంది. వారిలో నిరుపేదలు మరియు అగత్యపరులు ఉన్నారు.
దానిని నిర్వహించడాన్ని కారుణ్యము, దయతో జోడించడం మరియు ముస్లిం నైతిక విలువలు కాపాడటం, అతని సంపదలను ప్రక్షాళన చేయటం మరియు పేదల, అగత్యపరుల మనస్సులను సంతృప్తిపరచడం మరియు ముస్లిం సమాజ సభ్యుల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వ బంధాలను బలోపేత చేయడం ఉన్నది. అందుకనే పుణ్య ముస్లిం సంతోష హృదయంతో దానిని సరిగ్గా లెక్కించి, సంతోషంతో చెల్లిస్తాడు. ఎందుకంటే అందులో ఇతరుల సంతోషం ఉన్నది.
నిలువ చేయబడిన బంగారం, వెండి మరియు కరెన్సీ నోట్లు మరియు లాభం పొందే ఉద్దేశముతో అమ్మకానికి, కొనుగోలు చేయటానికి సిద్ధం చేయబడ్డ వ్యాపార సామగ్రి వంటి సంపదల జకాత్ పరిమాణం 2.5% అది కూడా వాటి వెల నిర్ణీత పరిమాణానికి చేరి, పూర్తిగా ఒక సంవత్సరం గడిచిపోయినప్పుడు.
అదే విధంగా పశువుల్లో (ఒంటెలు, ఆవుల, గొర్రెలు) నిర్ణీత పరిమాణమునకు చేరితే వాటిపై జకాత్ విధిగావించబడుతుంది. అది కూడా అవి మేత సంవత్సరములో చాలా వరకు తమ యజమాని కొని, తినిపించకుండా భూమి నుండి గడ్డి మేసినప్పుడు.
మరియు అదేవిధంగా భూమి నుండి లభించే రికాజ్ - (అది పూర్వ కాలంలో పాతిపెట్టబడిన నిధి) - లో, అలాగే ధాన్యములు, పండ్లు మరియు గనులలో, అవి ఒక నిర్ణీత పరిమాణానికి చేరినప్పుడు జకాత్ విధి అవుతుంది.
నాల్గవ మూలస్థంభము: మొత్తం రమదాను మాసమంతా ఉపవాసములు పాటించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగావంచబడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగావించబడిందో, బహుశా మీరు దైవభీతిపరులు అవుతారని! [అల్ బఖరహ్ 2:110]
రమదాన్ మాసం: అది ఇస్లామీయ హిజ్రీ క్యాలండరులోని తొమ్మిదో నెల. అది ముస్లిముల కొరకు మహా గొప్ప నెల. మరియు దానికి సంవత్సరపు మిగితా నెలల కంటే ప్రత్యేక స్థానం ఉంది. మరియు దాని పూర్తి ఉపవాసాలు ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాల్లో ఒక మూలస్థంభంగా పేర్కొనబడింది.
రమదాన్ మాసపు ఉపవాసముండటం: పవిత్ర రమదాన్ మాసం యొక్క రోజులన్నీ ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తినటం, త్రాగటం, సంభోగము మరియు ఉపవాసమును భంగపరిచే వాటి నుండి దూరంగా ఉండి మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధించడం.
ఐదవ మూలస్థంభము: అల్లాహ్ పవిత్ర గృహం యొక్క హజ్ చేయటం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు మక్కా వెళ్ళడానికి తగిన శక్తిసామర్ధ్యాలు, ధనము గలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం విధిగావించడింది. [ఆలె ఇమ్రాన్ 3:97]
హజ్ అనేది మక్కాకు వెళ్ళే స్థోమత కలిగిన వారి కొరకు జీవితకాలంలో ఒకసారి చేయవలసి ఉంటుంది. మరియు అది ఎలాగంటే నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ఆరాధనలు నిర్వర్తించటం కొరకు మక్కా ముకర్రమాలో ఉన్న పరిశుద్ధ గృహమును మరియు పవిత్ర స్థానాలను సందర్శించే ఉద్దేశ్యంతో( హజ్ చేయడం). మరియు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేశారు. మరియు ఆయన కంటే మునుపటి ప్రవక్తలు కూడా హజ్ చేశారు. మరియు అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ప్రజల్లో హజ్ పిలుపు ప్రకటించమని ఆదేశించాడు. దాని గురించి అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన: మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: "వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు. [ అల్ హజ్జ్ 22:27]
రెండవ స్థాయి: ఈమాన్ (విశ్వాసం)
ఈమాన్ (విశ్వాసం): అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విశ్వసించమని ఆదేశించిన విషయాలన్నింటినీ అంగీకరించడం, ధృడంగా విశ్వసించడం, సంపూర్ణంగా ఒప్పుకోవడం, మరియు వాటికి బాహ్యంగా, అంతర్గతంగా విధేయత చూపడం. అది సహృదయంతో విశ్వసించడంతో పాటు ఈమాన్ (విశ్వాసం) హృదయ కార్యాలను మరియు శారీరక కార్యాలను కలిగి ఉంటుంది, ఇది ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించడాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది అల్లాహ్ కు విధేయత చూపే కార్యాల వలన పెరుగుతుంది మరియు అవిధేయ కార్యాల వలన తగ్గుతుంది.
ఈమాన్ (విశ్వాస) మూలస్థంభాలు:
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా జవాబు ఇచ్చినారు : నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంథాలపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమ దినంపై విశ్వాసము చూపుట మరియు నీవు విధివ్రాతపై దాని మంచి, చెడులపై విశ్వాసము చూపుట.
విశ్వాసమునకు మూలస్థంభాలు - అవి ప్రతి ముస్లిం యొక్క మనస్సుకు సంబంధించిన తప్పనిసరి ఆరాధనలు. మరియు మనిషి యొక్క ఇస్లాం వాటిని విశ్వసించటం మరియు వాటి ప్రకారం ఆచరించటం ద్వారా మాత్రమే సరిఅగును. అందుకనే వాటిని విశ్వాసము యొక్క మూలస్థంభాలు అని పిలవటం జరిగినది. విశ్వాసం యొక్క మూలస్థంభాలకు మరియు ఇస్లాం మూలస్థంభాలకు మధ్య తేడా ఏమిటంటే ఇస్లాం మూలస్థంభాలు బాహ్యపరమైన ఆచరణలను సూచిస్తున్నాయి, వాటిని మనిషి తన అవయవములతో నిర్వర్తిస్తాడు. ఉదాహరణకు షహాదతైన్ ను పలకటం, నమాజు, జకాతు, ఉపవాసం మరియు హజ్ యాత్ర. మరియు విశ్వాసం యొక్క మూలస్థంభాలు హృదయానికి సంబంధించిన ఆచరణలు. వాటిని మనిషి తన హృదయంతో నిర్వర్తిస్తాడు. ఉదాహరణకు అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించడం.
మొదటి మూలస్థంభం: అల్లాహ్ ను విశ్వసించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: వాస్తవానికి ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో, వారే నిజమైన విశ్వాసులు. [అన్నూర్ 24:62]
మేము అల్లాహ్ ఉనికిని, మరియు ఆయన రుబూబియత్ లో, ఆయన ఉలీహియత్ లో, ఆయన నామములు, గుణములలో ఆయన ఏకత్వాన్ని విశ్వసిస్తున్నాము. కావున అల్లాహ్ పై విశ్వాసము ఈ క్రింది వాటిలో ఉంటుంది:
పరమ పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఉనికిపై విశ్వాసం ఉంచడం.
పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయన రుబూబియత్ (ప్రభువు అవటం) పై విశ్వాసం ఉంచడం. మరియు ప్రతీ దాని యజమాని, సృష్టికర్త, పోషకుడు మరియు వ్యవహారాన్నీ నడిపేవాడు ఆయనే అని విశ్వసించడం.
పరిశుద్ధుడైన ఆయన ఉలూహియత్ పై విశ్వాసం ఉంచడం. మరియు ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడని నమాజు, వేడుకోలు, ప్రార్ధన, మొక్కుబడి, జుబాహ్ చేయటం, సహాయం కోరటం, శరణు వేడుకోవటం మరియు ఇతర ఆరాధనలు వంటి వాటిలో ఆయనకు సాటి ఎవరూ లేరని విశ్వసించడం.
ఆయన స్వయంగా తన కోసం నిరూపించుకున్న లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించిన ఆయన శుభనామాలను, ఆయన ఉన్నత గుణాలను విశ్వసించడం మరియు ఆయన స్వయంగా నిరాకరించిన లేదా ఆయన ప్రవక్త ద్వారా నిరాకరింపజేసిన నామాలను, గుణములను నిరాకరించడం. మరియు ఆయన నామములు, ఆయన గుణగణాలు పరిపూర్ణతలో, అందంలో అత్యంత స్థానమునకు చేరినవి. మరియు ఆయనను పోలినది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు.
రెండవ మూలస్థంభము: దైవదూతలపై విశ్వాసం ఉంచడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు. [ఫాతిర్ 35:1]
దైవదూతలు కనబడని అదృశ్యమైన సృష్టి అని మరియు వారు అల్లాహ్ దాసులని ఆయన వారిని కాంతితో సృష్టించాడని మరియు ఆయన వారిని విధేయులుగా, శిరసావహించేవారిగా చేశాడని మనము విశ్వసించాలి.
మరియు వారు ఒక గొప్ప సృష్టి, వారి శక్తిని మరియు వారి సంఖ్యను మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే ఎరుగును. మరియు వారిలో నుంచి ప్రతి ఒక్కరికి అల్లాహ్ కేటాయించిన వర్ణాలు,పేర్లు మరియు విధులున్నాయి. వారిలో నుంచి దైవవాణి బాధ్యత ఇవ్వబడిన జిబ్రయీల్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన దైవవాణిని అల్లాహ్ వద్ద నుండి తీసుకుని ఆయన ప్రవక్తల వద్దకు అందజేస్తారు.
మూడవ మూలస్థంభము: దైవగ్రంథములను విశ్వసించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: (ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మన కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన సందేశాలను ఇంకా మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ ఆయన తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము. (సూరహ్ అల్ బఖరహ్ 2:2:136)
మహోన్నతుడైన అల్లాహ్ తన సందేశహరులపై, సర్వలోకాలపై ఒక వాదనగా మరియు ఆచరించేవారి కొరకు ఒక స్పష్టమైన మార్గదర్శకంగా గ్రంథాలను అవతరింపజేశాడని మేము విశ్వసిస్తున్నాము.
వారికి దాని ద్వారా వివేకమును బోధించి వారిని సంస్కరిస్తాడు.
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రజలందరి వద్దకు ప్రవక్తగా పంపించి ఆయన షరీఅతు ద్వారా పూర్వ షరీఅతులన్నిటిని రద్దుపరచాడు. మరియు దివ్యఖుర్ఆన్ ను దివ్యగ్రంథాలన్నిటిపై పర్యవేక్షకునిగా మరియు వాటిని రద్దుపరిచేదిగా చేశాడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఏ రకమైన మార్పులు చేర్పులు జరగకుండా దివ్యఖుర్ఆన్ పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. మరియు మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు : నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. [అల్ హిజ్ర్ 15:9] ఎందుకంటే దివ్యఖుర్ఆన్ మానవుల వద్దకు వచ్చిన అల్లాహ్ గ్రంధముల్లోంచి చివరిది. మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల్లో చిట్టచివరి ప్రవక్త. మరియు ఇస్లాం ధర్మము అల్లాహ్ ప్రళయం స్థాపించబడే వరకు మానవుల కొరకు ఇష్టపడిన ధర్మము. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. [ఆలె ఇమ్రాన్ 3:19]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ తన పుస్తకంలో ప్రస్తావించిన దివ్యగ్రంథాలు:
దివ్యఖుర్ఆన్: అల్లాహ్ దీనిని తన అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేశాడు.
తౌరాత్: అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాంపై అవతరింపజేశాడు.
ఇంజీలు: అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాంపై అవతరింపజేశాడు.
జబూర్: అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన దావూద్ అలైహిస్సలాంపై అవతరింపజేశాడు.
సుహుఫె ఇబ్రాహీం (ఇబ్రాహీం పుటములు): అల్లాహ్ వీటిని తన ప్రవక్త అయిన ఇబ్రాహీం అలైహిస్సలాంపై అవతరింపజేశాడు.
నాల్గవ మూలస్థంభము ప్రవక్తలపై విశ్వాసం ఉంచడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహల్ 16: 36]
మేము విశ్వసిస్తున్నాము, అల్లాహ్ తఆలా తన సృష్టి వైపునకు ప్రవక్తలను పంపించాడని, వారు ప్రజలను ఎటువంటి సాటి లేని ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని మరియు మహోన్నతుడైన ఆయనను వదిలి ఆరాధించబడే వాటిని తిరస్కరించమని పిలుస్తారు.
మరియు వారందరు మానువులు,అల్లాహ్ దాసులని మరియు వారు సత్యవంతులు, ధృవీకరించేవారు, భయభీతి గలవారు, నీతిమంతులు, సన్మార్గం చూపేవారు, సన్మార్గం పొందేవారు అని, అల్లాహ్ వారి నిజాయితీపై సూచించే సంకేతాలతో వారికి మద్దతు కలిగించాడని మరియు వారు దేనినైతే అల్లాహ్ వారికిచ్చి పంపించాడో వాటన్నిటిని చేరవేశారని మరియు వారందరు స్పష్టమైన సత్యముపై, స్పష్టమైన సన్మార్గంపై ఉన్నారని విశ్వసించడం.
ధర్మ మూలం విషయంలో వారిలో (ప్రవక్తలలో) మొదటి వారి నుండి చివరి వారి వరకు వారి పిలుపు ఏకీభవిస్తుంది. మరియు అది ఆరాధన విషయంలో, ఆయనతో పాటు సాటి లేకపోవటంలో అల్లాహ్ అజ్జవజల్ల యొక్క తౌహీదు అంటే ఏకత్వం.
ఐదవ మూలస్థంభము: అంతిమ దినమును విశ్వసించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది? [అన్నిసా 4:87]
మేము అంతిమ దినాన్ని విశ్వసిస్తాము, అది తీర్పు దినం (యౌముల్ ఖియామ), దాని తర్వాత రోజు ఉండదు. మరియు మేము దానికి సంబంధించిన వాటన్నిటిని, మన ప్రభువు అజ్జవజల్ల దాని గురించి తన దివ్యగ్రంధములో తెలియపరచిన దాన్ని లేదా మనప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి మనకు తెలియపరచిన దాన్ని విశ్వసిస్తాము. ఉదాహరణకు : మనిషి మరణం, మరణాంతరం లేపబడటం, మరలి వెళ్ళటం, సిఫారసు చేయటం, త్రాసు, లెక్కతీసుకోవటం, స్వర్గము, నరకము మరియు అంతిమ దినమునకు సంబంధించిన ఇతరత్రా విషయాలు.
ఆరవ మూలస్థంభము: మంచి - చెడు విధివ్రాతను విశ్వసించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము. [అల్ ఖమర్ 54:49]
మేము విధివ్రాత యొక్క మంచి చెడులను, అది మహోన్నతుడైన అల్లాహ్ తన పూర్వ జ్ఞానం మరియు వివేకం ప్రకారం సృష్టిరాసుల కొరకు చేసిన అంచనా అని, మరియు ఇహలోకంలో సృష్టిరాసులపై జరిగే సంఘటనలన్ని అల్లాహ్ జ్ఞానముతో మరియు పరిశుద్ధుడైన, మహోన్నతుడైన ఆయన విధివ్రాతతో మరియు ఎటువంటి సాటి లేని ఒక్కడైన పర్యాలోచనతో అని, మరియు ఈ విధివ్రాతలన్ని మానవుని సృష్టికి ముందే వ్రాయబడినవని, మరియు మానవునికి కోరిక, ఇచ్చ కలదని, మరియు వాస్తవానికి అతడు తన కర్మలను చేసేవాడని; కానీ అవన్ని అల్లాహ్ జ్ఞానము నుండి, ఆయన కోరిక నుండి, ఆయన ఇచ్చ నుండి తొలగిపోవని విశ్వసిస్తున్నాము.
విధివ్రాతపై విశ్వాసం నాలుగు స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. అవి:
మొదటిది : చుట్టూ ఉన్న అల్లాహ్ విశ్వజ్ఞానాన్ని విశ్వసించడం.
రెండవది : ప్రళయదినం వరకు జరిగే వాటిని అల్లాహ్ వ్రాసి భద్రపరచుటను విశ్వసించడం.
మూడవది: శాసనమగు అల్లాహ్ చిత్తాన్ని మరియు ఆయన పూర్తి సామర్ధ్యమును విశ్వసించడం. ఆయన కోరుకున్నది జరిగినది.ఆయన కోరనిది జరగలేదు.
నాల్గవది: అల్లాహ్ ప్రతిదానికి సృష్టికర్త అని విశ్వసించడం. అతని సృష్టించడంలో అతనికి భాగస్వామి ఎవడూ లేడు.
మూడవ స్థానం: ఇహ్సాన్
ఇహ్సాన్: అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూడకపోయిన ఆయన నిన్ను చూస్తున్నాడు. అల్లాహ్ తఆలా ప్రకటన: నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. [అన్ నహ్ల్ 16:128]
తహారత్ (పరిశుద్ధత)
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు. [అల్ బఖరహ్ 2:22]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నేను చేసిన ఈ ఉదూ మాదిరిగా ఉదూ చేసిన పిదప రెండు రకాతుల నమాజును, వీటి మధ్య ఎలాంటి ప్రాపంచిక ఆలోచన లేకుండా చేసిన వ్యక్తి యొక్క వెనుకటి పాపాలు క్షమించబడుతాయి. దీనిని ఇమామ్ బుఖారీ నమోదు చేసినారు.
నమాజు విషయంలో గొప్పతనము ఏమిటంటే అల్లాహ్ నమాజుకు ముందు పరిశుద్ధతను ధర్మబద్ధం చేశాడు. మరియు నమాజు సరి అవటానికి దాన్ని ఒక షరతుగా చేశాడు. కావున అది నమాజు తాళము. మరియు దాని ఘనతను గ్రహించడం హృదయమును నమాజు నిర్వర్తించడం కోసం ఆరాటపరుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా ప్రవచించారు: “పరిశుభ్రత విశ్వాసములో సగభాగం, ‘అల్-హందులిల్లాహ్’ త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి మరియు అల్’హందులిల్లాహి’ భూమ్యాకాశాల మధ్యనున్న దానిని నింపుతాయి (లేదా నింపుతుంది), నమాజు ఒక జ్యోతి, దానధర్మం ఒక సాక్ష్యం, సహనం ఒక కాంతి, మరియు ఖుర్’ఆన్ నీ పక్షమున లేదా నీకు వ్యతిరేకంగా ఒక సాక్ష్యం. ప్రతి మనిషి ఉదయం బయలుదేరి తన ఆత్మను అమ్ముకుంటాడు, తద్వారా దానిని విముక్తి చేస్తాడు లేదా నాశనం చేసుకుంటాడు.” దీనిని ముస్లిం నమోదు చేసినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి. దీనిని ముస్లిం నమోదు చేసినారు.
కావున దాసుడు ఉదూ ద్వారా ఇంద్రియ స్వచ్ఛతను మరియు ఈ ఆరాధనను మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గమును అవలంభిస్తూ నిర్వర్తించి నైతిక స్వచ్ఛతను పొందుతూ తన ప్రభువు వైపునకు ముందడుగు వేస్తాడు.
వీటి కొరకు ఉదూ తప్పనిసరి :
1- నమాజు - అది ఫర్జ్ నమాజ్ అయినా నఫిల్ నమాజ్ అయినా సరే.
2-కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షణ)
3- ఖుర్ఆన్ ను ముట్టుకోవడం
నేను పరిశుభ్రమైన నీటితో ఉదూ చేస్తాను మరియు గుసుల్ చేస్తాను.
పరిశుభ్రమైన నీరు ఏదంటే అది: ఆకాశము నుండి కురిసిన లేదా భూమి నుండి బయటికి వచ్చిన ప్రతీ నీరు. మరియు అది తన అసలు రూపంలో ఉండాలి. మరియు దాని మూడు గుణాలైన రంగు, రుచి, వాసన నీటి యొక్క పరిశుభ్రతను తొలగించే వస్తువుల్లోంచి ఏ వస్తువుతో మారకూడదు.
ఉదూ
1 : సంకల్పము, దాని స్థలము హృదయము. మరియు సంకల్పము యొక్క అర్థం: మహోన్నతుడైన అల్లాహ్ సన్నిహితమునకు ఆరాధన చేయటానికి హృదయ దృఢనిర్ణయం.
2: బిస్మిల్లాహ్ అని పలుకుట.
3: రెండు అరచేతులను మణికట్టు వరకు మూడు సార్లు కడగడం.
4: మూడు సార్లు పుక్కిలించుట.
పుక్కిలించటం ఎలాగంటే అది : నీటిని నోటిలోకి తీసుకుని దాన్ని లోపల త్రిప్పి మరల దాన్ని బయటకు ఉమ్మడం.
5: ఇస్తింషాఖ్, తర్వాత మూడుసార్లు బయటకు ఛీదరించటం, ఇస్తింషాఖ్ అంటే నీటిని ముక్కులో చివరి వరకు శ్వాస ద్వారా లోపలికి పీల్చటం.
మరియు ఛీదరించటం ఎలాగంటే ముక్కులో ఉన్న శ్లేష్మం మరియు ఇతర వాటిని శ్వాస ద్వారా బయటకు తీయటం.
6: ముఖాన్ని మూడు సార్లు కడగడం
ముఖము యొక్క హద్దులు
ముఖము అన్నది దేనితోనైతే ఒకరినొకరు అభిముఖమవటం జరుగతుందో అది.
వెడల్పున దాని హద్దు: చెవి నుండి చెవి వరకు.
పొడవున దాని హద్దు తల యొక్క సాధారణ వెంట్రుకలు మొలసే చోటు నుండి గడ్డం క్రింద చివరి వరకు మధ్య ఉన్న భాగం.
తేలికపాటి వెంట్రుకలు ఉన్న చోటు ముఖమును కడగటంలోకి వస్తాయి. మరియు అలాగే తెల్లదనం (అల్ బయాజ్), ఇజార్ (బుగ్గ) కూడాను.
తెల్లదనం (అంటే) ఇజార్ మరియు చెవి క్రింద భాగమునకు మధ్య భాగము.
మరియు ఇజార్ అంటే పొంగి వచ్చిన ఎముకపై ఉన్న వెంట్రుకలు, చెవి రంధ్రము ఉన్న ప్రదేశమునకు సమాంతరంగా తల వరకు ఉన్న భాగము మరియు దాని నుండి చెవి యొక్క ముందు భాగము వరకు క్రిందకు ఉన్న భాగము.
మరియు అలాగే గడ్డము యొక్క దట్టమైన వెంట్రుకలు దాని నుండి వ్రేలాడేవి కూడా ముఖమును కడగటంలోకి వస్తాయి.
7: రెండు చేతుల వేళ్ళ తల భాగముల నుండి రెండు మోచేతుల వరకు రెండు చేతులను మూడు సార్లు కడగటం.
మరియు రెండు మోచేతులు రెండు చేతులను కడిగే విధిలో వస్తాయి.
8: రెండు చెవులతో సహా పూర్తి తలను ఒకసారి రెండు చేతులతో మసహ్ చేయటం.
తల ముందు భాగం నుండి మొదలు పెట్టి దాని వెనుక భాగము వరకు వాటిని (రెండు చేతులు) తీసుకుని పోవాలి. ఆ తరువాత వాటిని మరల్చాలి.
మరియు తన చూపుడు వేలును తన రెండు చెవులలోకి దూర్చాలి, మరియు తన రెండు బొటన వేళ్ళను తన రెండు చెవుల బాహ్య భాగముపై పోనిచ్చి వాటితో చెవుల బాహ్య మరియు అంతర భాగముపై మసహ్ చేయాలి.
9: రెండు కాళ్ళను వేళ్ళ మొదలు నుండి చీలమండలాల వరకు మూడు సార్లు కడగటం. చీలమండలాలను కడగటం రెండు కాళ్ళను కడిగే విధిలోకి వస్తుంది.
గిలకలు అంటే కాలి పిక్క క్రింది భాగములో వెలుపలికి పొంగిన రెండు ఎముకలు.
10: ఉదూ తర్వాత ముస్లిం ఇలా పలకడం సున్నత్: "అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీక లహూ, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్". ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: (ఎవరైతే చక్కగా ఉదూ చేసి, ఆ తర్వాత: 'అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీక లహూ, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్' అని పలుకుతాడో, అతని కోసం ఎనిమిది స్వర్గద్వారాలూ తెరువబడతాయి. అతను తాను కోరిన ద్వారం గుండా లోనికి వెళ్ళవచ్చు) (తిర్మిదీ).
ఈ విషయాలు ఉదూను భంగపరుస్తాయి.
1 - రెండు మార్గముల నుండి వెలువడేవి: మూ త్రం, మలము, గాలి, మనీ (వీర్యం), మజీ (పురుషాంగము నుండి వెలువడే పలుచటి జిగురు పదార్థం) లాంటివి.
2 - గాఢ నిద్ర వలన లేదా స్పృహ కోల్పోవటం వలన లేదా మత్తు వలన లేదా పిచ్చితనం వలన బుద్ధిని కోల్పోవటం.
3- జనాబత్ (సంభోగము వలన వీర్య స్ఖలనం అయిన పరిస్థితి), రుతుస్రావం, పురిటి రక్తస్రావం మొదలైన గుసుల్ ను అనివార్యం చేసే ప్రతీది.
మనిషి కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మలినమును పరిశుభ్రమైన నీటితో తొలగించటం అతని పై తప్పనిసరి. ఇది మంచిది. లేదా పరిశుభ్రమైన నీరు కాకుండా రాళ్ళు,ఆకులు,వస్త్రం లాంటివి మరియు అలాంటివే ఇతర మలినమును తొలగించే వాటితో మాలిన్యమును తొలగించుకోవాలి. అది మూడు తుడిచే పరిశుభ్రమైనవి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మరియు పరిశుభ్రమైన దానితో (మలినమును తొలగించటం) మంచిది.
మేజోళ్లపై, పాదకూసములపై మసహ్ చేయటం
మేజోళ్ళను లేదా పాదకూసములను తొడిగినప్పుడు రెండు కాళ్ళను కడిగే అవసరం లేకుండా కొన్ని షరతులతో వాటిపై మసహ్ చేసుకోవచ్చు. అవి:
1- చిన్న మాలిన్యము, పెద్ద మాలిన్యము నుండి పూర్తి శుభ్రత పొందిన తరువాత వాటిని తొడిగి ఉండటం.
2- అవి రెండు పరిశుభ్రంగా ఉండాలి. వాటికి మలినము అంటుకుని ఉండకూడదు.
మసహ్ అన్నది దాని నిర్ణీత కాలములో అయి ఉండాలి.
4- అవి హలాల్ అయినవి ఉండాలి. అవి దొంగలించబడిన లేదా బలవంతాన లాక్కున్నటువంటివి కాకూడదు.
రెండు ఖుఫ్ లు (మేజోళ్ళు) అంటే పల్చటి చర్మం, అలాంటి వాటితో చేయబడి కాళ్ళలో తొడగబడేవి. రండు కాళ్ళను కప్పే బూట్లు వాటి లాంటివే. రెండు జవ్రబ్ లు (పాదకూసములు) అంటే వస్త్రంతో,అటువంటి వాటితో చేయబడినవి ఏవైతే మనిషి తన రెండు కాళ్ళలో తొడుగుతాడో. వాటి లాంటివే అష్షర్రాబ్ అని పిలవబడేవి.
రెండు మేజోళ్ళపై మసహ్ చేయటం యొక్క ధర్మబద్ధత యొక్క విజ్ఞత: మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేయటం యొక్క విజ్ఞత ఏమిటంటే ముస్లిములపై సులభతరం చేయటం మరియు తేలిక చేయటం. ఎవరికైతే మేజోళ్ళను, పాదకూసములను తీసి రెండు కాళ్ళను కడగటం కష్టమవుతుందో ముఖ్యంగా శీతాకాలం, తీవ్ర చలి సమయాల్లో మరియు ప్రయాణంలో.
మసహ్ గడువు: నివాసికి: ఒక పగలు మరియు ఒక రాత్రి (24 గంటలు). ప్రయాణికుడికి: మూడు రాత్రింబవళ్ళు (72 గంటలు).
మేజోళ్ళపై లేదా పాదకూసములపై ఉదూ భంగమై ఉదూ చేసి మొదట మసహ్ చేసినప్పటి నుండి మసహ్ కాలవ్యవధి లెక్కింపు ప్రారంభమవుతుంది.
మేజోళ్ళపై లేదా పాదకూసములపై మసహ్ చేసే పధ్ధతి:
1- రెండు చేతులను తడి చేసుకోవాలి.
2- చెయ్యి పాదము యొక్క పై భాగముపై తీసుకుపోవాలి (కాలి వేళ్ళ కొనల నుంచి పిక్క మొదలు వరకు).
కుడి కాలును కుడి చేతితో మరియు ఎడమ కాలును ఎడమ చేతితో మసహ్ చేయాలి.
మసహ్ ను భంగపరిచేవి: 1. గుస్ల్ ను తప్పనిసరి చేసే ప్రతిదీ. 2. మసహ్ కాలం ముగియటం.ష
గుస్ల్
పురుషుడు లేదా స్త్రీ వీర్యస్ఖలనం జరగకపోయినా సరే సంభోగం చేసినట్లయితే, లేదా మేల్కొన్న స్థితిలో కామ కోరికతో వారి నుండి వీర్యస్ఖలనం అయినప్పుడు, లేదా నిద్ర స్థితిలో వీర్యస్ఖలనం జరిగినప్పుడు; వారు నమాజు నెరవేర్చడానికి లేదా దేనికోసమైన పరిశుద్ధతను పాటించటం తప్పనిసరి అయినప్పుడు, వారిపై గుసుల్ తప్పనిసరి అవుతుంది. మరియు ఇదే విధంగా స్త్రీ ఋతుస్రావం, పురుటి రక్తస్రావం నుండి పరిశుద్ధత పొందినప్పుడు ఆమె నమాజును నెరవేర్చే నిర్ణయం తీసుకొనక ముందు లేదా దేనికైనా పరిశుద్ధత పాటించటం తప్పనిసరి అవకముందే ఆమెపై గుసుల్ అనివార్యమవుతుంది.
గుసుల్ యొక్క పధ్ధతి క్రింద తెలిపిన విధంగా ఉండాలి.
ముస్లిం తన శరీరం మొత్తాన్ని ఏ విధంగానైనా నీటితో కడగాలి, పుక్కిలించటం, ముక్కులో నీటిని పీల్చటంతో సహా. తన శరీరమును నీటితో కడుతున్నప్పుడు అతని నుండి పెద్ద అశుద్ధత తొలగిపోతుంది. మరియు అతని పరిశుభ్రత పూర్తవుతుంది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆచరించే మరింత సంపూర్ణమైన మరొక విధానం కూడా ఉంది, అది ఈ క్రింది విధంగా ఉంది:
01- అల్ హదథ్ (ఆచార అశుద్ధి) నుండి పరిశుభ్రత పొందాలనే నియ్యత్.
02 బిస్మిల్లాహ్ పఠించడం, చేతులను మూడుసార్లు కడగడం, ఆపై మర్మావయవాలను కడగడం.
03 ఒక ముస్లిం నమాజ్ కోసం ఉదూ చేసుకున్నట్లే పూర్తి ఉదూ చేయుట.
4- తలపై మూడు సార్లు నీళ్ళు పోసుకోవాలి, జుట్టు మూలాలు బాగా తడిసే విధంగా.
05 మొత్తం శరీరంపై నీటిని చేర్చాలి, మొదట శరీరం యొక్క కుడి భాగాన్ని, ఆ తర్వాత ఎడమ భాగాన్ని కడగాలి, అలాగే శరీరంలోని అన్ని భాగాలకు నీరు చేరేలా చేతులతో రుద్దాలి.
అశుద్ధావస్థలో ఉన్న వారిపై గుసుల్ చేయనంతవరకు ఈ క్రిందివి చేయటం నిషేధము.
01- నమాజు (సలాహ్)
02- కాబా యొక్క తవాఫ్ (ప్రధక్షణ)
03- మస్జిద్ లో బస చేయడం. మరియు బస చేయకుండా కేవలం దాటి వెళ్ళటము అతన కొరకు సమ్మతమే.
04- ఖుర్ఆన్ ను ముట్టుకోవటం
05- ఖుర్ఆన్ చదవటం
తయమ్ముమ్
ముస్లిం పరిశుద్ధతను పొందవలసిన స్థితిలో నీటిని పొందనప్పుడు లేదా అనారోగ్యం వలన లేదా అటువంటిదే ఏదైన కారణం చేత నీటిని వాడలేకపోయినప్పుడు అతనికి నమాజు కోల్పోయే భయం ఉంటే అతడు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోవాలి.
అదెలాగంటే రెండు చేతులను ఒక సారి మట్టిపై కొట్టి వాటితో ముఖముపై మరియు చేతులపై మసహ్ చేసుకోవాలి. మట్టి పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి.
ఈ క్రింది విషయాలు తయమ్ముమును భంగపరుస్తాయి.
1- దేనితోనైతే ఉదూ భంగమవుతుందో దానితో తయమ్ముమ్ భంగమవుతుంది.
2- ఏ నమాజు కొరకు తయమ్ముమ్ చేయబడినదో ఆ నమాజు ఆరంభించక ముందే నీరు లభించినప్పుడు.
నమాజు
అల్లాహ్ ముస్లింపై రేయింబవళ్లలో ఐదు నమాజులను విధి చేశాడు. మరియు అవి ఫజర్, జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా.
నమాజు చేయటానికి సిద్ధమవడం
నమాజు సమయం ఆసన్నమైనప్పుడు ముస్లిం చిన్న అశుద్ధత నుండి మరియు పెద్ద అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించాలి. ఒకవేళ అశుద్ధావస్థకు గురైన వ్యక్తి పెద్ద అశుద్ధతకు గురైనా సరే.
పెద్ద అశుద్ధత ఏమిటంటే ముస్లింపై గుసుల్ ను తప్పనిసరి చేసేది.
చిన్న అశుద్ధత ఏమిటంటే ముస్లింపై ఉదూను తప్పనిసరి చేసేది.
ముస్లిం పరిశుభ్రమైన బట్టలు వేసుకుని, అశుద్ధతల నుండి (దూరంగా ఉంటూ) పరిశుభ్రమైన స్థలంలో తన మర్మావయవాలను కప్పుకుని నమాజు చేస్తాడు.
నమాజ్ వేళ ముస్లిం సరైన మంచి దుస్తులను ధరిస్తాడు. మరియు వాటితో తన శరీరమును కప్పుకుంటాడు. నమాజ్ లో నాబికి మరియు మోకాళ్ళకి మధ్య ఉన్న దేనిని బయటకు కనబడేటట్లు ఉంచటం పురుషునికి సమ్మతం కాదు.
స్త్రీ ముఖము, అరచేతులు తప్ప తన పూర్తి శరీరమును నమాజులో కప్పుకోవటం తప్పనిసరి.
ఒక ముస్లిం నమాజులో దానికి ప్రత్యేకించిన సూక్తులు తప్ప వేరేవి మాట్లాడకూడదు. మరియు ఇమామ్ చదివేది అతను శ్రద్ధగా వినాలి. మరియు ఒక వేళ అతనికి నమాజుకు ప్రత్యేకించిన సూక్తులు గుర్తుండకపోతే అతడు నమాజు ముగించే వరకు అల్లాహ్ స్మరణ చేయాలి మరియు ఆయన పరిశుద్ధతను కొనియాడాలి. అతను నమాజు మరియు దాని సూక్తులను నేర్చుకోవటానికి చొరవతీసుకోవాలి.
అల్లాహ్ అనుమతితో, మన నమాజును సరైన పద్ధతిలో ఆచరించడానికి, మనం ఈ క్రింది దశలను అనుసరించి, వాటిని స్థిరంగా పాటించాలి:
1: నేను నిర్వర్తించాలని కోరుకుంటున్న విధి కొరకు సంకల్పము అవసరం. దాని స్థానం హృదయం.
నేను ఉదూ చేసుకున్న తరువాత ఖిబ్లాకి అభిముఖమై నిలబడాలి. మరియు నేను నిలబడగలిగే స్థితిలో ఉంటే నమాజును నిలబడే చేయాలి.
2: నేను నా రెండు చేతులను భుజాలకు సమాంతరంగా పైకి ఎత్తి నమాజులో ప్రవేశించే సంకల్పం చేసుకుంటూ అల్లాహు అక్బర్ అని పలకాలి.
3: హదీథులో వచ్చిన ఇస్తిఫ్తాహ్ దుఆను చదవాలి. ఆ సూక్తులు ఇవి : సుబ్'హానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక. (ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో నిజ ఆరాధ్యుడు లేడు.)
4: ధుత్కరించబడిన షైతాను నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటూ, ఇలా పలకాలి : (అఊజుబిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను.
5: ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించాలి. మరియు అది : సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత తీర్పుదినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను.
సూరతుల్ ఫాతిహా తరువాత ఖుర్ఆన్ లో నుండి అందుబాటులో ఉన్నదాన్ని ప్రతి నమాజులో మొదటి రెండు రకాతులలో మాత్రమే చదవాలి. మరియు ఇది తప్పనిసరి కాదు. కాని అలా చేయటంలో గొప్ప ప్రతిఫలం గలదు.
6: అల్లాహు అక్బర్ అని పలికి ఆ తరువాత వీపును భూమికి సమాంతరంగా ఉంచుతూ మరియు రెండు చేతులను వేళ్ళు ఎడంగా, రెండు మోకాళ్ళపై గట్టిగా పట్టుకునేట్లు ఉంచుతూ రుకూ చేయాలి. ఆ తరువాత రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని మూడు సార్లు పఠించాలి.
7: సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అని పలుకుతూ రెండు చేతులను రెండు భుజాలకు సమాంతరంగా పైకి ఎత్తుతూ రుకూ నుండి పైకి లేవాలి. శరీరం నిటారుగా నిలబడినప్పుడు రబ్బనా వలకల్ హమ్ద్ అని పలకాలి.
8: అల్లాహు అక్బర్ అని పలికి రెండు చేతులపై, రెండు మోకాళ్ళపై, రెండు పాదాలపై, నుదుటిపై మరియు ముక్కుపై సజ్దా (సాష్టాంగం) చేయాలి. మరియు సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా అని మూడు సార్లు పలకాలి.
9: అల్లాహు అక్బర్ అని పలికి సజ్దా నుండి పైకి లేవాలి వీపును తిన్నగా ఉంచుతు ఎడమ కాలి పై కూర్చుని కుడికాలును నిలబెట్టాలి. మరియు రబ్బిగ్ఫిర్లీ అని మూడు సార్లు చదవాలి.
10: అల్లాహు అక్బర్ అని పలికి మొదటి సజ్దా వలే ఇంకొకసారి సజ్దా చేయాలి.
11: అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి పైకి లేవాలి. చివరికి నిటారుగా నిలబడాలి. మరియు మొదటి రకాతులో చేసినట్లే నమాజు యొక్క మిగతా రకాతుల్లో చేయాలి.
జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజు రెండవ రకాతు తరువాత మొదటి తషహ్హుద్ చదవటం కొరకు కూర్చోవాలి. మరియు అది: అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. (సమస్త ఆరాధనలు, ప్రార్థనలు మరియు పవిత్రమైనవన్నీ అల్లాహ్కే దక్కుతాయి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కురియుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులందరిపై శాంతి కురియుగాక. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ ﷺ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.) మరల దీని తరువాత మూడవ రకాతు కొరకు లేచి నిలబడాలి.
అన్నీ నమాజుల్లో చివరి రకాతు తరువాత చివరి తషహ్హుద్ చదవటం కొరకు కూర్చోవాలి. మరియు అది: అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు,అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (సమస్త ఆరాధనలు, ప్రార్థనలు మరియు పవిత్రమైనవన్నీ అల్లాహ్కే దక్కుతాయి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కురియుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులందరిపై శాంతి కురియుగాక. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ ﷺ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ఆయన సంతతిపై శుభాలను కురిపించినట్లే, ముహమ్మద్ ﷺ మరియు ఆయన సంతతిపై కూడా నీ శుభాలను కురిపించు. నిశ్చయంగా నీవు మాత్రమే స్తోత్రాలకు అర్హుడవు మరియు అత్యంత గౌరవనీయుడవు. ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ఆయన సంతతిని దీవించినట్లే, ముహమ్మద్ ﷺ మరియు ఆయన సంతతిని కూడా దీవించు. నిశ్చయంగా నీవు మాత్రమే స్తోత్రాలకు అర్హుడవు మరియు అత్యంత గౌరవనీయుడవు.)
12: దీని తరువాత నమాజు నుండి బయటకు వచ్చే సంకల్పము చేసుకుని అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడి వైపునకు సలాం చేయాలి. మరియు అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ ఎడమ వైపునకు సలాం చేయాలి.
ముస్లిం మహిళ పరదా
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [అల్ అహ్జాబ్ 33:59]
అల్లాహ్ ముస్లిం స్త్రీలపై పరదాను అంటే ఆమె తన మర్మావయవాలను, తన పూర్తి శరీరమును పరాయి పురుషుల నుండి తమ ప్రాంతములో ఉండే సాధారణ దుస్తులతో కప్పుకోవటం అనివార్యం చేశాడు. మరియు ఆమె తన పరదాను తన భర్త లేదా తన మహారిమ్ ల ముందు తప్ప ఇతరుల ముందు విడవటం సమ్మతం కాదు. వారెవరంటే ముస్లిం స్త్రీకి వారితో వివాహం చేయటం ఎన్నటికి సమ్మతం కానివారు.(ఈదగువ పేర్కొన బడినవారు ముస్లింలు: తండ్రి, తాతలు; కుమారులు, మనుమలు; తండ్రి సోదరులు మరియు తల్లి సోదరులు; సోదరుడు; సోదరుని కుమారుడు; సోదరి కుమారుడు; తల్లి భర్త; భర్త తండ్రి, భర్త తాతలు; భర్త కుమారుడు, అతని కుమారులు; పాలు త్రాగిన సోదరుడు; పాలిచ్చిన స్త్రీ భర్త. మరియు రక్త సంబంధం ద్వారా నిషిద్ధమైన వారందరూ పాల సంబంధం ద్వారా కూడా నిషిద్ధమవుతారు).
ముస్లిం మహిళ తన వస్త్రధారణలో (దుస్తుల విషయంలో) పలు నిబంధనలను పాటించాలి:
మొదటిది: పూర్తి శరీరమును కప్పాలి.
రెండవది: స్త్రీ ధరించేది పరాయి పురుషుల సమక్షంలో అలంకరణ కొరకు కాకూడదు.
మూడవది: ఆమె దుస్తులు శరీరం బయటకు కనబడే విధంగా పల్చగా ఉండకూడదు.
నాల్గవది: శరీర ఆకారం కనబడే విధంగా బిగుతువుగా కాకుండా వదులుగా ఉండాలి.
ఐదవది: తన నుండి వెలువడే సువాసనను పసిగట్టే పరాయి పురుషుల సమీపం నుండి వెళ్ళవలసి వస్తే, అది సువాసన వెదజల్లేదై ఉండకూడదు.
ఆరవది: మగవారి దుస్తులను పోలి ఉండకూడదు.
ఏడవది: ముస్లిమేతర మహిళల ఆరాధన లేదా వారి పండుగల దుస్తులను పోలి ఉండకూడదు.
ఎనిమిదవది: కీర్తి ప్రతిష్టల కోసం ధరించే వస్త్రం కాకూడదు.
విశ్వాసి లక్షణాలు
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: నిశ్చయంగా, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికం అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీద మాత్రమే దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. [అల్ అన్ఫాల్ 8:2]
విశ్వాసి మాట్లాడటంలో సత్యవంతుడై ఉంటాడు మరియు అస్సలు అబద్ధం పలకడు.
ప్రమాణమును మరియు వాగ్దానమును పూర్తి చేస్తాడు.
తగువులాటలో బూతుమాటలు మాట్లాడడు, అబద్దం పలకడు.
అమానత్ ను (నమ్మకాన్ని) నెరవేరుస్తాడు.
తన కొరకు ఏదైతే ఇష్టపడుతాడో దానినే తోటి ముస్లిం సోదరుని కొరకు కూడా ఇష్టపడతాడు.
ఉదార స్వభావుడై ఉంటాడు.
ప్రజలతో మంచిగా మెలుగుతాడు.
బంధుత్వాలను కలుపుతాడు, కొనసాగిస్తాడు.
అల్లాహ్ తన కొరకు నిర్ణయించిన విధివ్రాత పట్ల సంతుష్టపడతాడు. మరియు కలిమిలో ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటాడు మరియు కష్టకాలంలో సహనం చూపుతాడు.
సిగ్గు, బిడియం గలవాడై ఉంటాడు.
సృష్టిరాశులపై కరుణ చూపుతాడు.
అతని హృదయం అసూయా ద్వేషములు, వైరముల నుండి నిర్మలమై ఉంటుంది మరియు అతని అవయవములు ఇతరులపై దాడి చేయటం నుండి సురక్షితంగా ఉంటాయి.
ప్రజలను క్షమించివేస్తాడు.
అతను వడ్డీ సొమ్ము తినడు మరియు దానితో లావాదేవీలు చేయడు.
వ్యభిచారానికి పాల్బడడు.
మద్యం సేవించడు.
తన ఇరుగు పొరుగు వారితో మంచిగా మెలుగుతాడు.
ఇతరులకు అన్యాయం చేయడు మరియు నమ్మకద్రోహానికి పాల్పడడు.
ఇతరుల సొమ్ము దొంగలించడు మరియు ఇతరులకు మోసం చేయడు.
తన తల్లిదండ్రులు ముస్లిమేతరులైనప్పటికి వారితో మంచిగా మెలుగుతాడు. మరియు మంచి కార్యములలో వారికి విధేయత చూపుతాడు.
తన సంతానమును మంచి నడవడికపై మార్గదర్శకం చేస్తాడు. మరియు వారికి ధర్మబద్ధమైన విధుల గురించి ఆదేశిస్తాడు. మరియు వారిని దుర్గుణాల నుండి, నిషేధించబడిన ఆచరణల నుండి వారిస్తాడు.
అతను ముస్లిమేతరుల వారి మతపరమైన లక్షణాలను లేదా వారి ప్రత్యేకతగా, వారి చిహ్నంగా మారిన అలవాట్లను కలిగి ఉండడు.
- అల్లాహ్ వద్ద పశ్చాత్తాపం చెందుతూ, తన లోపాలు మరియు పాపాలకు క్షమాపణ వేడుకుంటాడు.
ఒక ముస్లిం యొక్క విశ్వాసంలో ముఖ్యమైన నియమాలు
01 అల్లాహ్ మా ప్రభువు, ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన తప్ప మరో ప్రభువు లేడు, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు సాటి లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆకాశంలో తన సమస్త సృష్టి కంటే అత్యున్నతుడు. ఆయన తన సృష్టికి ఆవల ఉన్నాడు. ఆయన ఉన్నత స్థితి అన్ని కోణాల నుండి సంపూర్ణమైనది: ఆయన సారాంశం (దత్) పరంగా ఉన్నతుడు, ఆయన గౌరవం/స్థాయి పరంగా ఉన్నతుడు, మరియు ఆయన శక్తి/అధికారం (ఖహర్) పరంగానూ ఉన్నతుడు. మరియు ఆయన (అల్లాహ్) ప్రతి దానినీ పరివేష్టించి ఉన్నాడు (అంటే ఆయన జ్ఞానం మరియు శక్తిలో సమస్తం ఇమిడి ఉన్నాయి).
03 అల్లాహ్ తన గురించి తాను దేనినైతే ధృవీకరించుకున్నాడో లేదా ప్రవక్త ముహమ్మద్ ﷺ అల్లాహ్ గురించి వేటినైతే ధృవీకరించారో, ఆ పేర్లను (అస్మా) మరియు గుణాలను (సిఫాత్) మనం కూడా ధృవీకరిస్తాము. అలాగే అల్లాహ్ తన గురించి వేటినైతే తిరస్కరించాడో లేదా ప్రవక్త ముహమ్మద్ ﷺ అల్లాహ్ గురించి వేటినైతే తిరస్కరించారో, వాటిని మనం కూడా తిరస్కరిస్తాము.
04 అల్లాహ్ తఆలా దుఆలను స్వీకరిస్తాడు, అవసరాలను తీరుస్తాడు, ప్రతి వస్తువుకు యజమాని ఆయనే, ఆయన తప్ప కీడు మరియు మేలు చేసేవాడు మరెవ్వరూ లేరు, మరియు దాసుడు రెప్పపాటు కాలం కూడా ఆయన అవసరం లేకుండా ఉండలేడు. దుఆ, నమాజ్, మొక్కుబడి, ఖుర్బానీ, భయం, ఆశ, నమ్మకం (తవక్కుల్) మరియు ఇతర బహిరంగ లేదా ఆంతరంగిక ఆరాధనల వంటి ఏ రకమైన ఆరాధనలోనైనా అల్లాహ్ తఆలాను కాకుండా ఇతరులను ఉద్దేశించడం ఒక ముస్లింకు ధర్మసమ్మతం కాదు. ఎవరైతే ఏ ఆరాధననైనా అల్లాహ్ తఆలాకు కాకుండా ఇతరుల కోసం చేస్తాడో, అతను అల్లాహ్ కు సాటి కల్పించినవాడు (ముష్రిక్) అవుతాడు.
05 పాపాలన్నింటిలోకి అత్యంత భయంకరమైనది మరియు మహా పాపాలలో (కబాయిర్) కెల్లా పెద్దది 'అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం' (షిర్క్). ఎవరైతే షిర్క్ చేసిన స్థితిలోనే మరణిస్తారో, అల్లాహ్ వారిపై స్వర్గాన్ని నిషిద్ధం (హరామ్) చేశాడు మరియు వారి నివాసం నరకం అవుతుంది. ఒక దాసుడు (మనిషి) పశ్చాత్తాపం (తౌబా) చేసుకోకుండా, షిర్క్ చేసిన స్థితిలోనే మరణించడం అనేది, అల్లాహ్ ఎన్నటికీ క్షమించని ఏకైక పాపం.
06 ఒక దాసుడికి (మనిషికి) ఏ కష్టమైతే తప్పిపోతుందో, అది అతనికి సంభవించేది కాదు. అలాగే ఏ కష్టమైతే అతనికి సంభవించిందో, అది అతని నుండి తప్పి పోయేది కాదు (అంటే అది జరగక తప్పదు). కాబట్టి ప్రతి ముస్లిం అల్లాహ్ యొక్క తీర్పును (ఖదా) మరియు విధి రాతను (ఖదర్) నమ్మాలి. అల్లాహ్ నిర్ణయించిన ప్రతి దానిపై సంతృప్తి చెందాలి, మరియు తన ప్రభువును కీర్తిస్తూ, అన్ని పరిస్థితులలోనూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి.
07 మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులలో కెల్లా అత్యంత శ్రేష్ఠులు మరియు ప్రవక్తల పరంపరకు పరిసమాప్తి. ఆయన ప్రళయ దినాన సిఫారసు చేస్తారు మరియు ఆయన సిఫారసు అంగీకరించబడుతుంది. ఎలాగైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను తన ఆత్మీయ మిత్రునిగా చేసుకున్నాడో, అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను కూడా తన ఆత్మీయ మిత్రునిగా చేసుకున్నాడు.
10. మన గ్రంథం ఖుర్ఆను కరీమ్. అది అద్భుతమైనది, దాని ప్రామాణికత నిస్సందేహమైనది, దాని పారాయణం ఒక ఆరాధన. అల్లాహ్ తఆలా దానిని దైవదూతలలో శ్రేష్ఠుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేశాడు. మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ క్రింద తెలిపినట్లుగా, ఆయన దానిని మార్పులు చేర్పుల నుండి సంరక్షించాడు. నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. [అల్ హిజ్ర్ 15:9]
11- అల్లాహ్ కు అత్యంత విధేయులైన వారు, ఆయన షరిఅతును ఎక్కువగా అనుసరించేవారే ఆయనకు అత్యంత సన్నిహితులు. ఏ అరబ్బునకు అరబ్బేతరునిపై, ఏ అరబ్బేతరునికి అరబ్బునిపై, ఏ తెల్లవానికి నల్లవానిపై, ఏ నల్లవానికి తెల్లవానిపై ఎలాంటి ఆధిక్యత లేదు - కేవలం తఖ్వాలో (అల్లాహ్ పట్ల భయభక్తులలో) తప్ప. ప్రజలందరూ ఆదమ్ నుండి వచ్చినవారే, మరియు ఆదమ్ మట్టి నుండి సృష్టించబడ్డాడు. పరమపవిత్రుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. [అల్ హుజరాత్ 49:13]
12- ముస్లిం, గౌరవనీయులైన, కర్మలను వ్రాసే దైవదూతలను మరియు వారి ఉనికిని విశ్వసిస్తాడు. వారు అల్లాహ్ తఆలా యొక్క సృష్టిరాసులలోని వారు, అల్లాహ్ కాంతి (నూర్) నుండి సృష్టించిన దాసులు. వారిలో వహీ (దైవసందేశం) తీసుకురావడానికి నియమించబడిన జిబ్రయీల్, వర్షానికి బాధ్యత వహించే మీకాయీల్, సూర్ (శంఖం) ఊదడానికి నియమించబడిన ఇస్రాఫీల్, మరియు దాసుల ప్రాణాలను తీయడానికి నియమించబడిన మలకుల్ మౌత్ (మరణ దూత) ఉన్నారు.
13- ఒక ముస్లిం ప్రళయం యొక్క సంకేతాలను, మసీహ్ అద్-దజ్జాల్ ఆవిర్భావాన్ని, చివరి దినాలలో ఈసా ఇబ్నె మర్యమ్ అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి రావడాన్ని, మరియు సూర్యుడు పడమర నుండి ఉదయించడాన్ని విశ్వసిస్తాడు.
14- అర్హులైన వారికి సమాధి శిక్ష, అలాగే అర్హులైన వారికి సమాధి అనుగ్రహాలు ఉంటాయని, మరియు అతని సమాధిలో అతని ప్రభువు, అతని ధర్మం మరియు అతని ప్రవక్త గురించి మున్కర్ మరియు నకీర్ ప్రశ్నిస్తారని, మరియు సమాధి స్వర్గ బృందావనాల్లో ఒక బృందావనం లేదా నరకాగ్ని గోతుల్లో ఒక గొయ్యిగా ఉంటుందని ఒక ముస్లిం విశ్వసిస్తాడు.
15- ప్రళయదినాన మరల లేపబడటం జరుగుతుందని మరియు కర్మలపై ప్రతిఫలం ఉంటుందని, స్వర్గము మరియు నరకము అల్లాహ్ సృష్టిలోనివని, అవి ఎన్నటికీ నశించవని విశ్వసించటం.
16- చేతబడి అనేది అల్లాహ్ పట్ల అవిశ్వాసం (కుఫ్ర్), దానిని నేర్చుకోవడం మరియు మాంత్రికులు, దజ్జాలీన్ (వంచకుల) వద్దకు వెళ్లడం ధర్మసమ్మతం కాదు. ఒక ముస్లిం జోతీస్యుడిని (కాహిన్) లేదా భవిష్యత్తు చెప్పేవాడిని (అర్రాఫ్) విశ్వసించకూడదు. ఎవరైతే వారిద్దరినీ విశ్వసిస్తాడో, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని ధిక్కరించిన వాడవుతాడు.
17 - ఒక ముస్లిం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ప్రేమిస్తాడు, వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తాడు మరియు వారిని ద్వేషించే వారిని ద్వేషిస్తాడు; ఎందుకంటే వారిని ప్రేమించడం ధర్మము మరియు పుణ్యకార్యం, మరియు వారిని ద్వేషించడం అవిశ్వాసం మరియు కపటత్వము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: (నా సహచరులను దూషించకండి) (ముస్లిం నమోదు చేసినారు). మరియు ఎవరైతే సహాబాలలో రదియల్లాహు అన్హుమ్ లలో ఎవరినైనా నిందిస్తాడో లేదా కించపరుస్తాడో, అతడు మార్గభ్రష్టుడు మరియు బిద్అతీ.
16- ఒక ముస్లిం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం తరువాత ఖిలాఫతును ఈ విధంగా ధృవీకరిస్తాడు: మొదటగా అబూ బకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హుకు, ఆయనకు సమస్త ఉమ్మత్ పై ప్రాధాన్యత మరియు ఘనత ఇస్తూ; ఆ తరువాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుకు; ఆ తరువాత ఉస్మాన్ రదియల్లాహు అన్హుకు; ఆ తరువాత అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హుకు. వీరే సన్మార్గ గాములైన ఖలీఫాలు మరియు మార్గదర్శకత్వం పొందిన ఇమాములు.
17- ఆరాధనా కార్యాలు (ఇబాదతులు) తౌఖీఫియ్యహ్. అందువల్ల, అల్లాహ్ తఆల గ్రంథములో లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులో ధృవీకరించబడినది తప్ప మరే ఆరాధనా చెల్లదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం, ఆయన మార్గదర్శకత్వానికి అనుగుణంగా లేకుండా ప్రజలు కొత్తగా కల్పించే ప్రతి ఆరాధనా తిరస్కరించబడిన బిద్అత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: (ఎవరైనా మా ఈ ధర్మం విషయంలో దానిలో లేని దేనినైనా క్రొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది). దీనిని బుఖారీ నమోదు చేసినారు.
18- ఆరాధన స్వీకరించబడటం రెండు ప్రాథమిక స్థంభాలపై ఆధారపడి ఉంటుంది, అవి: ఆరాధనలో అల్లాహ్ తఆలా కొరకు ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) కలిగి ఉండటం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం. కావున, ఆరాధన అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో లేకపోతే అది అంగీకరించబడదు, మరియు అది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం లేకపోయినా కూడా అంగీకరించబడదు.
నా ఆనందం నా ధర్మమైన ఇస్లాంలోనే ఉంది.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. [అన్-నహ్ల్ 16:97]
ఒక ముస్లిం హృదయంలో సంతోషమును, మనశ్శాంతిని, శుభమును ప్రవేశింపజేసే పెద్ద విషయము - అతను సజీవుల లేదా మృతుల లేదా విగ్రహాల ద్వారా కాకుండా అల్లాహ్ తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం. కాబట్టి అల్లాహ్ తన దివ్య గ్రంథములో తాను తన దాసులకు నిత్యం దగ్గరగా ఉంటానని తెలిపినాడు. ఆయన వారిని వింటాడు మరియు వారి దుఆలను స్వీకరిస్తాడు. ఏ విధంగానైతే ఆయన ఇలా తెలియపరచాడో : మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు. [అల్-బఖరహ్ 2:186] మరియు అల్లాహ్ తనను వేడుకోవటం గురించి మనకు ఆదేశించాడు. మరియు ఆయన ఈ ఆదేశమును ఒక ముస్లిం తన ప్రభువునకు దగ్గర అయ్యే గొప్ప ఆరాధనలలోంచి చేశాడు. అందుకనే గౌరవోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు : మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ తననే వేడుకోవాలని మనల్ని ఆజ్ఞాపించాడు. ఒక ముస్లిం తన ప్రభువుకు దగ్గరవ్వడానికి చేసే అత్యంత గొప్ప ఆరాధనలలో దుఆను కూడా ఒకటిగా చేశాడు. దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు." [గాఫిర్ 40:60] కావున ఒక పుణ్యాత్ముడైన ముస్లిం ఎల్లప్పుడు తన ప్రభువు అవసరం కలిగిన వాడై ఉంటాడు. మరియు ఎల్లప్పుడు ఆయన ముందు ప్రాధేయపడతాడు. మరియు పుణ్య ఆరాధనల ద్వారా ఆయన సామీప్యాన్ని పొందుతాడు.
మరియు అల్లాహ్ తఆలా ఒక గొప్ప విజ్ఞత కొరకు ఈ విశ్వంలో మమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మమ్మల్ని వృధాగా సృష్టించ లేదు. అదేమిటంటే ఏ సాటి లేని ఒకే ఒక్కడైన ఆయనను ఆరాధించుట. మరియు ఆయన మన జీవితము యొక్క ప్రత్యేక, సార్వజనిక వ్యవహారాలన్నింటిని నియంత్రించే సమగ్రమైన దైవిక ధర్మాన్ని మన కొరకు ధర్మంగా నియమించాడు. మరియు ఆయన ఈ న్యాయపూరితమైన ధర్మము ద్వారా జీవిత అవసరాలైన మన ధర్మమును, ప్రాణములను, మన మానమును, మన బుద్దులను, మన సంపదలను సంరక్షించాడు. మరియు ఎవరైతే ధర్మాదేశాలను అనుసరిస్తూ, నిషేధితాల నుండి దూరంగా ఉంటూ జీవితం గడుపుతాడో అతడు ఈ అవసరాలను సంరక్షించాడు. మరియు తన జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా మనశ్శాంతితో సంతోషముగా జీవించాడు.
మరియు తన ప్రభువుతో ముస్లిం అనుబంధము లోతైనది. అది మనశ్శాంతి మరియు మానసిక సౌకర్యము, సంతృప్తి, శాంతి, ఆనందము యొక్క భావనను మరియు ప్రభువు యొక్క తోడు మరియు ఆయన కరుణా కటాక్షములు మరియు విశ్వాసపరుడైన తన దాసుని కొరకు తన స్నేహము యొక్క భావనను రేకెత్తిస్తుంది. మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి బయటికి తీసి వెలుగులోకి తెస్తాడు. [అల్ బఖరహ్ 2:257]
ఈ గొప్ప అనుబంధం (అల్లాహ్తో ఉన్న సంబంధం) ఒక రకమైన ఆత్మీయ స్థితి. ఇది కరుణామయుడైన అల్లాహ్ యొక్క ఆరాధనలో పరవశాన్ని (ఆనందాన్ని) పొందేలా చేస్తుంది మరియు ఆయనను కలుసుకోవాలనే తపనను కలిగిస్తుంది. అంతేకాకుండా, ఇది విశ్వాసం (ఈమాన్) యొక్క మాధుర్యాన్ని చవి చూపిస్తూ, విశ్వాసి హృదయాన్ని ఆనందమనే ఆకాశంలో విహరింపజేస్తుంది.
ఆ (ఈమాన్ యొక్క) మాధుర్యం ఎంత గొప్పదంటే - అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం (పుణ్యకార్యాలు చేయడం) మరియు పాపాలకు దూరంగా ఉండటం ద్వారా దానిని స్వయంగా రుచి చూసిన వారు తప్ప, ఇతరులెవ్వరూ ఆ ఆనందాన్ని వర్ణించలేరు. అందుకే ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, మరియు మహమ్మద్ను ప్రవక్తగా అంగీకరించినవాడు విశ్వాసం (ఈమాన్) యొక్క రుచి చూసాడు. దీనిని ముస్లిం నమోదు చేసినారు.
అవును, ఒక మనిషి తాను ఎల్లప్పుడూ తన సృష్టికర్త సమక్షంలోనే ఉన్నానని భావించినప్పుడు, మరియు ఆయనను ఆయన శ్రేష్ఠమైన పేర్లు (అస్మా) మరియు గుణాల (సిఫాత్) ద్వారా గుర్తించినప్పుడు, అలాగే అల్లాహ్ను చూస్తున్నామన్న భావనతో (లేదా ఆయన మనల్ని చూస్తున్నాడన్న స్పృహతో) ఆయనను ఆరాధించినప్పుడు, మరియు తన ఆరాధనను కేవలం అల్లాహ్ కోసమే స్వచ్ఛంగా (ఇఖ్లాస్తో) అంకితం చేసి, దాని ద్వారా అల్లాహ్ తప్ప మరే ఇతర ప్రతిఫలాన్ని ఆశించనప్పుడు... అటువంటి వ్యక్తి ఈ లోకంలో అత్యంత పవిత్రమైన, సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు మరియు పరలోకంలో శుభప్రదమైన ముగింపును (ముక్తిని) పొందుతాడు.
చివరికి ఈ లోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యే ఆపదలు లేదా కష్టాల యొక్క తీవ్రత కూడా... అల్లాహ్ పై ఉన్న దృఢమైన నమ్మకం (యఖీన్) అనే చల్లదనంతో తొలగిపోతుంది. అల్లాహ్ యొక్క విధిని (ఖదర్) మనస్ఫూర్తిగా స్వీకరించడం ద్వారా, మరియు ఆయన నిర్ణయించిన మంచి-చెడులన్నింటిపై ఆయనను స్తుతిస్తూ (అల్హందులిల్లాహ్ అంటూ), ఆ నిర్ణయాల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం వల్ల ఆ కష్టాల భారమే అతనికి తెలియకుండా పోతుంది.
ఒక ముస్లిం తన ఆనందాన్ని మరియు మనశ్శాంతిని పెంపొందించుకోవడానికి - అల్లాహ్ను అధికంగా స్మరించడం (జిక్ర్) మరియు పవిత్ర ఖుర్ఆన్ను పఠించడం పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉండాలి. దీని గురించి అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది. [అర్రఅద్ 13:28] ఒక ముస్లిం అల్లాహ్ను ఎంత ఎక్కువగా స్మరిస్తూ (జిక్ర్ చేస్తూ) మరియు ఖుర్ఆన్ పఠిస్తూ ఉంటాడో, అల్లాహ్తో అతని బంధం అంతగా బలపడుతుంది. దాని వలన అతని ఆత్మ పరిశుద్ధమవుతుంది మరియు అతని విశ్వాసం (ఈమాన్) మరింత శక్తివంతం అవుతుంది.
అదేవిధంగా, ఒక ముస్లిం తన ధార్మిక విషయాలను సరైన ప్రామాణిక ఆధారాల (మూలాల) నుండి నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. తద్వారా అతను పూర్తి అవగాహనతో మరియు స్పష్టమైన జ్ఞానంతో (బసీరత్) అల్లాహ్ను ఆరాధించగలడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా సెలవిచ్చారు: విధ్యను అభ్యసించటం ప్రతీ ముస్లింపై తప్పనిసరి. దీనిని ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు. మరియు తనను సృష్టించిన అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు అతను పూర్తిగా లొంగిపోయి, విధేయుడై ఉండాలి. ఆ ఆజ్ఞల వెనుక ఉన్న అంతరార్థం (హిక్మత్/కారణం) అతనికి తెలిసినా, తెలియకపోయినా సరే (విధేయత చూపాలి). దీని గురించి అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో (ఖుర్ఆన్లో) ఇలా సెలవిచ్చాడు: మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే! [అల్ అహ్జాబ్ 33:36]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.