المختصر المفيد للمؤذن والإمام والخطيب وأحكام المساجد
كتاب "المختصر المفيد للمؤذن والإمام والخطيب وأحكام المساجد" يتناول مسؤوليات المؤذن والإمام والخطيب وأحكام الأذان والإقامة وصلاة الجمعة وأحكام المساجد. يوضح الكتاب تعريف الأذان والإقامة وحكمهما وفضلهما، كما يبين الصفات المطلوبة في المؤذن والشروط اللازمة لصحة الأذان والإقامة. بالإضافة إلى ذلك يستعرض الكتاب أحكام الإمامة، ومشروعيتها وفضلها، وشروط وصفات الإمام، مع التركيز على أهمية العلم والخلق في من يتولى هذه الوظيفة الشرعية.
ముఅజ్జిన్, ఇమామ్, ఖతీబ్ మరియు మస్జిద్ల నియమాల కొరకు ఉపయోగకరమైన సంక్షిప్త రచన
వివిధ భాషలలో ఇస్లామీయ సాహిత్య సేవా సంఘం యొక్క శాస్త్రీయ కమిటీ
ఇన్నల్ హమ్ద లిల్లాహి నహ్మదుహు, వ నస్తయీనుహు, వనస్తగ్ఫిరుహు, వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వమిన్ సయ్యిఆతి అఅ్ మాలినా, మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహు,వమయ్యుజ్ లిల్ ఫలా హాదియలహు. (నిశ్చయంగా ప్రశంశలన్ని అల్లాహ్ కొరకే, మేము ఆయన ప్రశంశలను కొనియాడుతున్నాము,ఆయనతోనే సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపును వేడుకుంటున్నాము. మరియు మా హృదయముల చెడు నుండి మరియు మా దుష్కర్మల నుండి అల్లాహ్ తో మేము శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపినవారిని అపమార్గమునకు లోను చేసేవాడు ఎవడూ లేడు మరియు ఆయన అపమార్గమునకు లోను చేసినవారిని సన్మార్గము చూపేవాడు ఎవడూ లేడు.) వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, సల్లల్లాహు అలైహి వఅలా ఆలిహి వఅస్హాబిహి వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, వసల్లమ తస్లీమన్ (అల్లాహ్ తప్ప వేరే నిజఆరాధ్యదైవం లేడని, ఆయనకు ఎవరు సాటి లేరని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడని, ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. అల్లాహ్ ఆయనపై మరియు ఆయన కుటుంబంపై,ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు సహృదయంతో ఆయనను అనుసరించే వారిపై శుభాలను శాంతిని కురిపించుగాక.
(ఇక) దీని తరువాత : నిస్సందేహంగా ప్రజల నిరంతర అవసరాలను బట్టి వారి పరిస్థితుల దిద్దుబాటుకొసం షరీఅత్ (ధర్మశాస్త్రం) దానిని నెరవేర్చే (ఆదేశాలను) తెచ్చింది. ఇందులో అధాన్ ఇఖామత్ మరియు ప్రజల ఇమామత్ సంబంధించిన విషయాలు మరియు జుముఅహ్ ప్రసంగం మరియు మస్జిద్ యొక్క ఆదేశాలు ఉన్నాయి. అందువలన మస్జిద్ యొక్క ముఅజ్జిన్ మరియు ఇమాం మరియు జుముఅహ్ ప్రసంగీకుని యొక్క బాధ్యతలు అత్యంత గొప్పవి. మరియు ఈ కారణంతోనే ఈ అంశంతో ఒక పుస్తకాన్ని సిద్ధం చేయాలని (అల్ ముఖ్తసర్ లిల్ ముఅజ్జిన్ వల్ ఇమాం వల్ ఖతీబ్ వ అహ్కామిల్ మసాజిద్) మరియు దాని వివిధ భాషలలో అనువందించాడనికి నిశ్చయించాము.
మొదటి అధ్యాయం : అజాన్ మరియు ఇఖామత్ యొక్క ఆదేశాలు
అజాన్ ఇస్లాం మరియు ముస్లిముల చిహ్నం, ఏదైతే ప్రతి రోజు మరియు రాత్రిలో ఐదు పూటలు పిలుపు ఇవ్వబడుతుంది. మరియు ధార్మికపండితులు తమ గ్రంధాలలో దీని విధుల గురించి, సున్నతుల గురించి, మరియు ఆదేశాల గురించి, అభిలషణీయమైనవి మరియు భంగపరిచేవాటి గురించి జాగ్రత్తవహించారు. మరియు ఇది కేవలం దీని ఆరాధన యొక్క ప్రాముఖ్యత కొరకు మాత్రమే. [1] చూడండి: ఫత్హుల్ మున్ఇమ్ షరహ్ సహీహ్ ముస్లిం: (2/460).
మొదటి అంశం : అధాన్ మరియు ఇఖామత్ యొక్క నిర్వచనం
అధాన్ అంటే షరీఅత్ పరంగా : షరీఅత్ నిర్ధారించిన ప్రత్యేక పదాలను వినియోగించి నమాజు సమయం ప్రారంభమైనట్లు ప్రకటించడం. చూడండి : అల్ ముఘ్నీ లిఇబ్ని ఖుదామహ్ 1/292, మరియు ముఖ్తారుస్సిహాహ్ : పేజి 16 అద్యాయం అధాన్, మరియు వల్ అధాను వల్ ఇఖామతు లిల్ ఖహ్తానీ : పేజి 5
ఇఖామత్ అంటే షరీఅత్ పరంగా : షరీఅత్ నిర్ధారించిన ప్రత్యేక స్మరణను వినియోగించి నమాజు కోసం ప్రజలు నిలబడటానికి ప్రకటించడం. చూడండి: (కష్షాఫ్ అల్ ఖినా 1/230)
రెండవ అంశం : అధాన్ మరియు ఇఖఆమత్ యొక్క ఆదేశం
అధాన్ మరియు ఇఖామత్ ఖుర్ఆన్, హదీసు మరియు ఇజ్మా ద్వారా నిర్ధారించబడినవి.
ఖుర్ఆన్ గ్రంధంలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు : మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు! [అల్ మాయిదా :17]
మరియు సున్నత్ లో : అనేక హదీసులు దీనిని షరీఅత్ పరంగా నిర్ధారిస్తున్నాయి. అందులో :
ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు కధనం : ఆయన అన్నారు ఎప్పుడైతే ముస్లిములు మదీనాకు వచ్చారో వారు నమాజు కోసం సమయం కేటాయించి సమావేశమయ్యేవారు (కానీ) దాని కోసం అధాన్ పిలవబడేది కాదు. ఒకరోసు వారు దాని గురించి చర్చించారు. అందులో కొందరు అన్నారు : క్రైస్తవుల లాంటి గంటను తీసుకోండి. మరికొందరు అన్నారు : యూదుల లాంటి శంఖాన్ని పూరించండి. (అప్పుడు) ఉమర్ అన్నారు : ఒక వ్యక్తిని నమాజుకోసం పిిలుపు ఇవ్వడానికి ఎందుకు పంపకూడదు? అప్పడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు : ((ఓ బిలాల్ లే మరియు నమాజు కోసం పిలుపు ఇవ్వు)) దీనిని బుఖారీ : 604 మరియు ముస్లిం : 377 లో ఉల్లేఖించారు
మరియు ఇజ్మా : ఐదు పూటల నమాజు కోసం (అధాన్) దీని షరీఅత్ నిర్దారణపై ముస్లిం సమాజం ఏకగ్రీవంగా అంగీకరించింది.
ఇమాం ఇబ్నుల్ ఖుదామహ్ అల్ మఖ్దీసీ అన్నారు : ఐదు పూటల నమాజు కోసం అధాన్ యొక్క షరీఅత్ నిర్దారణపై ముస్లిం సమాజం ఏకగ్రీవంగా అంగీకరించింది. [5] అల్-ముఘ్నీ (1/293).
అధాన్ మరియు ఇఖామత్ ప్రయాణంలో మరియు స్థానికంగా ఉన్న పురుషలకు ఐదు పూటల నమాజు కోసం ఫర్జె కిఫాయ. ఇది మాలిక్ బిన్ హువైరిస్ రజియల్లాహు అన్హు హదీసు ఆధారంగా (తెలుస్తుంది) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు : నమాజు సమయం ఎప్పుడైతే అవుతుందో మీలోని ఒకరు అధాన్ ఇవ్వవలెను మరియు మీలో పెద్దవారు మీకు నమాజు సారధ్యం వహించవలెను. ((6)) [6] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (628) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (674) లో ఉల్లేఖించారు.
మరియు ఇవి రెండూ ఇస్లాం యొక్క ఛిహ్నాలు కాబట్టి వీటిని వదలివేయడం ధర్మసమ్మతం కాదు.
కాగా స్త్రీలు అధాన్ మరియు ఇఖామత్ వారికి ధర్మబద్దం కావు. స్త్రీ ఒంటరిగా నమాజు చదివినా లేదా స్త్రీలకు సారధ్యం వహించినా. (7) [7] షరహ్ అల్ ఉమ్దా, ఇబ్ను తైమియా - నమాజు పుస్తకం (పు: 101).
మూడవ అంశం: అజాన్ మరియు ఇఖామత్ యొక్క ఘనత
అజాన్ మరియు ముఅజ్జిన్ల ఘనత గురించి అనేక వచనాలు ఉల్లేఖించబడ్డాయి, వాటిలో కొన్ని ఘనతలు ఈ క్రిందివి:
ముఅజ్జిన్ అల్లాహ్ వైపునకు పిలిచే వారిలో ఒకడు, మరియు ప్రజలందరిలో ఉత్తమమైన మాట పలికే వారిలో ఒకడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: "నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది? [ఫుస్సిలత్: 33]
అజాన్ ఇచ్చేవారి (మఅజ్జిన్ల) మెడలు ప్రళయదినాన ప్రజలందరికంటే పొడవుగా ఉంటాయి; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ముఆవియా రజియల్లాహు అన్హు తెలియజేశారు: “ప్రళయ దినాన ముఅజ్జిన్లు అందరికంటే పొడవైన మెడలు కలిగి ఉంటారు.” [8]. [8] ముస్లిం, హదీథు సంఖ్య (387).
అజాన్ మరియు ఇఖామత్ షైతానును తరిమికొడతాయి. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "నమాజు కొరకై అజాన్ ఇవ్వబడినప్పుడు, ఆ శబ్దాన్ని వినలేక షైతాన్ అపానవాయువు వదులుతూ వెనుదిరిగి పారిపోతాడు. అజాన్ పూర్తవగానే మళ్ళీ తిరిగివస్తాడు. ఆ తరువాత నమాజు కొరకు ఇఖామత్ చెప్పగానే, మళ్ళీ తిరిగి పారిపోతాడు. ఇఖామత్ పూర్తవగానే మళ్ళీ తిరిగివచ్చి, మనిషికి మరియు అతని మనస్సుకు మధ్య చేరి దుష్ట ఆలోచనలు కలిగిస్తాడు. అతనికి అంతకు ముందు గుర్తులేని విషయాలను గుర్తు చేస్తూ, అది గుర్తు తెచ్చుకో, ఇది గుర్తు తెచ్చుకో' అని ప్రేరేపిస్తాడు. చివరికి ఆ వ్యక్తి తాను ఎన్ని రకాతులు నమాజ్ చేశాడో కూడా మరిచిపోతాడు." [9] [9] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1222) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (389) లో ఉల్లేఖించారు.
ముఅజ్జిన్ యొక్క అజాన్ విన్న ప్రతి వస్తువూ అతనికి సాక్ష్యం పలుకుతుంది; అబ్దుల్లా బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్-అన్సారీ కథనం ప్రకారం, అబూ సయీద్ అల్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఆయనతో ఇలా అన్నారు: «నీకు గొర్రెలు మరియు అడవి అంటే ఇష్టమని నేను గమనించాను. కాబట్టి, నువ్వు నీ గొర్రెలతో లేదా అడవిలో ఉన్నప్పుడు నమాజ్ కోసం అజాన్ ఇస్తే, గట్టిగా అజాన్ ఇవ్వు, ఎందుకంటే:» “ముఅజ్జిన్ యొక్క స్వరం ఎంత దూరం వరకు చేరుకుంటుందో, అంత పరిధిలో ఆ స్వరాన్ని విన్న జిన్నాతులు కానీ, మనుషులు కానీ లేదా మరే ఇతర వస్తువు కానీ ప్రళయదినాన అతని పక్షాన సాక్ష్యం ఇవ్వకుండా ఉండదు.” అబూ సయీద్ రజిఅల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: నేను దీనిని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నాను [10]. [10] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (609) లో ఉల్లేఖించారు.
అజాన్ యొక్క విశిష్టత గురించి ప్రజలకు నిజంగా తెలిస్తే, దాని కోసం వారు ఒకరితో ఒకరు పోటీ పడేవారు' అంటే అజాన్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కాలో తేల్చుకోవడానికి వారు లాటరీ కూడా వేసేవారు. హజ్రత్ అబూహురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ఒకవేళ ప్రజలకు అజాన్ ఇవ్వడంలో మరియు మొదటి వరుసలో (సఫ్) నిలబడటంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, దాని కోసం వారు ఖుర్రా (లాటరీ) వేయవలసి వచ్చినా తప్పక వేసేవారు." [11] [11] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 615) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 437) నమోదు చేసారు.
ముఅజ్జిన్ యొక్క పాపాలు, అతని స్వరం చేరినంత దూరం వరకు క్షమించబడతాయి. అతని అజాన్ విన్న ప్రతి సజీవ మరియు నిర్జీవ వస్తువు అతని కొరకు సాక్ష్యమిస్తుంది. మరియు అతనితో పాటు నమాజ్ చేసిన వారి పుణ్యమంత పుణ్యం అతనికి కూడా లభిస్తుంది; ఎందుకనగా, మంచి వైపు మార్గనిర్దేశం చేసేవాడు ఆ మంచిని ఆచరించిన వాని వంటివాడు. బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: «నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు మొదటి వరుస (సఫ్)లో నిలబడే వారిపై కరుణను పంపుతూ ఉంటారు. ముఅజ్జిన్ యొక్క స్వరం ఎంత దూరం వరకు వెళ్తుందో అంత మేర అతను క్షమించబడతాడు. మరియు అతని (అజాన్) స్వరం విన్న ప్రాణమున్న మరియు ప్రాణంలేని ప్రతిదీ అతని పక్షాన సాక్ష్యమిస్తుంది. అంతేకాక అతనితో పాటు నమాజ్ చేసిన వారందరి పుణ్యమంత పుణ్యం అతనికి కూడా లభిస్తుంది.» [12] [12] దీనిని అహ్మద్ హదీథు సంఖ్య (18506) లో మరియు నసాయీ హదీథు సంఖ్య (646) లో ఉల్లేఖించారు. అత్తర్గిబ్ వత్తర్హీబ్ (1/176) లో మున్జిరి దీని ఇస్నాద్ ఉత్తమమైనది మరియు మంచిది అని పలికారు. మరియు అల్ బద్ర్ అల్ మునీర్ (3/385) లో ఇబ్నుల్ ములఖ్ఖిన్ ఇది ఒక మంచి ఇస్నాద్ అని పలికారు.
నిస్సందేహంగా అజాను ఇస్లాం యొక్క అత్యంత గొప్ప చిహ్నాలలో ఒకటి, ఇది ఇస్లామిక్ భూభాగం (దార్ అల్-ఇస్లాం) మరియు ఇస్లామేతర భూభాగాల (దార్ అల్-కుఫ్ర్) మధ్య తేడాను చూపే గుర్తు; నిశ్చయంగా ఇమామ్ బుఖారీ తన సహీహ్ గ్రంథంలో “అజాన్ ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చు” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని పొందుపరిచారు, ఆ తర్వాత వారు అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారి హదీసును ఉల్లేఖించారు: ""దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో కలిసి ఏదేని ఒక జాతిపై దాడి చేసేటప్పుడు, తెల్లవారే వరకు వేచి చూసేవారు. ఒకవేళ అజాన్ వినిపిస్తే, వారిపై దాడి చేయకుండా ఆగిపోయేవారు, వినిపించకపోతే వారిపై దాడి చేసేవారు"[13]." [13] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 610) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 382) నమోదు చేసినారు.
ఇమామ్ ఖత్తాబీ ఇలా తెలిపారు: "దీనిలో ఈ విషయం స్పష్టం చేయబడింది, అజాన్ ఇస్లాం ధర్మం యొక్క చిహ్నం మరియు అది ఒక తప్పనిసరి విధి, దానిని విడిచిపెట్టడం అనుమతించబడదు. ఒకవేళ ఒక పట్టణ ప్రజలు అజాన్ను విడిచిపెట్టడానికి ఏకమై దాని నుండి విరమించుకుంటే, పాలకుడు దాని కొరకు వారితో పోరాడవలసి ఉంటుంది"[14]. [14] అ'లాముల్ హదీథ్ షరహ్ సహీహ్ బుఖారీ: (1/ 460).
నాలుగవ అంశం : అజాన్ మరియు ఇఖామత్ యొక్క స్వీకార షరతులు
1- ఇస్లాం: కాఫిర్ నుండి అజాన్ మరియు ఇఖామత్లు చెల్లవు; ఎందుకంటే అవి రెండూ ఆరాధనలు, మరియు ఆరాధన కాఫిర్ నుండి చెల్లదు.
2- బుద్ధి: మతిస్థిమితంలేని వారు, మత్తులో ఉన్నవారు మరియు విచక్షణ జ్ఞానం లేని చిన్నపిల్లల నుండి అజాన్ మరియు ఇఖామత్ చెల్లవు. ఇతర ఆరాధనల మాదిరిగానే వీటికి కూడా వివేకం అవసరం.
3 - అన్నియ్యహ్: ఇది లేకుండా అజాన్ మరియు ఇఖామతులు చెల్లవు; ఎందుకంటే ఇవి రెండు ఆరాధనలు, మరియు ఏ ఆరాధన అయినా సంకల్పం లేకుండా చెల్లదు; దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ ప్రవచనాన్ని బట్టి: «నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి ‘ప్రతీ వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది.» ((15)) [15] దీనిని బుఖారీ (1) మరియు ముస్లిం (1907) ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.
4- పురుషుడై ఉండాలి: స్త్రీ అజాన్ మరియు ఆమె ఇఖామత్ చెల్లవు.
5- అజాన్ నమాజు సమయంలో ఇవ్వాలి: దాని సమయం ప్రవేశించకముందు అది చెల్లదు; ఎందుకంటే మాలిక్ బిన్ హువైరిథ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త ఇలా సెలవిచ్చారు: నమాజు సమయం ఎప్పుడైతే అవుతుందో మీలోని ఒకరు అజాన్ ఇవ్వవలెను, మరియు మీలో పెద్దవారు మీకు నమాజు సారధ్యం వహించవలెను. [16]، అందువల్ల అజాన్ వ్యవహారం, నమాజు సమయం హాజరవ్వడంతో ముడిపెట్టబడింది, దాని సమయం ప్రవేశించిన తర్వాతే అది (నమాజు) ఉంటుంది, మరియు ఇఖామత్, నమాజు కోసం నిలబడాలని సంకల్పించినప్పుడు ఉండాలి. [16] ఈ హదీథును బుఖారీ, హదీథు సంఖ్య (628); ముస్లిం, హదీథు సంఖ్య (674) లో ఉల్లేఖించారు.
6- అజాన్ - అదే విధంగా ఇఖామత్ కూడా - క్రమబద్ధంగా ఉండాలి: క్రమబద్ధత యొక్క ఉద్దేశ్యం ఏమనగా: అజాన్ మరియు ఇఖామత్ యొక్క విధానాన్ని వివరించిన షరియా ప్రమాణాలకు అనుగుణంగా, ఒక పదాన్ని లేదా వాక్యాన్ని మరొకదాని కంటే ముందు వెనుక చేయకుండా ముఅజ్జిన్ వాటిని పలకాలి; ఎందుకంటే అజాన్ ఈ క్రమంలో స్థిరపరచబడిన ఒక ఆరాధన, కాబట్టి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఆదేశానుసారం అది ఎలా పేర్కొనబడిందో అలాగే పాటించడం తప్పనిసరి. “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది” (17) [17] ఈ హదీథును బుఖారీ హదీథు సంఖ్య (2697) లో మరియు ముస్లిం హదీథు సంఖ్య (1718) లో ఆయిష రదియల్లాహు అన్హా హదీథు నుండి ఉల్లేఖించారు.
7- అజాన్ - అలాగే ఇఖామత్ కూడా నిరంతరాయంగా ఉండాలి: అంటే అజాన్ పదాల మధ్య ఎటువంటి మాటలు లేదా పనులతో విరామం ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చెప్పాలి, మరియు దాని పదాల మధ్య పొడవైన విరామం ఉండకూడదు.
8- అజాన్ మరియు ఇఖామాలు ప్రవక్త వారి సున్నత్ ద్వారా వచ్చిన అరబ్బీ పదాలలోనే ఉండాలి. అలాగే, పదాల అర్థం మారిపోయేలా తప్పుగా పలకడం వంటివి లేకుండా, స్పష్టంగా మరియు సరైన ఉచ్ఛారణతో ఉండాలి.
9- అజాన్ను ఉద్ఘాటంగా పలకాలి; ఎందుకంటే, ముఅజ్జిన్ కేవలం తనకు మాత్రమే వినిపించేలా తన స్వరాన్ని తగ్గిస్తే అజాన్ యొక్క ధార్మిక ఉద్దేశ్యం నెరవేరదు. దానికి నిదర్శనంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: «మీలోని ఒకరు అధాన్ ఇవ్వవలెను» [18] ఇది ఇతరులకు వినిపించేలా స్వరం పెంచటాన్ని సూచిస్తుంది; తద్వారా ప్రకటన ఉద్దేశ్యం నెరవేరుతుంది. ఒకవేళ తన కోసం లేదా తనతో పాటు ఉన్నవారి కోసం అజాన్ ఇస్తే, అప్పుడు స్వరం పెంచటం షరతు కాదు. కానీ, తనకు లేదా తనతో ఉన్నవారికి వినపడేంతగా స్వరాన్ని పెంచాలి. అయినప్పటికీ, దానికంటే ఎక్కువగా స్వరం పెంచితే అది మరింత శ్రేయస్కరం; అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసు ఇలా ఉంది: నువ్వు నీ గొర్రెలతో లేదా అడవిలో ఉన్నప్పుడు నమాజ్ కోసం అజాన్ ఇస్తే, గట్టిగా అజాన్ ఇవ్వు, ఎందుకంటే: ముఅజ్జిన్ యొక్క స్వరం ఎంత దూరం వరకు చేరుకుంటుందో, అంత పరిధిలో ఆ స్వరాన్ని విన్న జిన్నాతులు కానీ, మనుషులు కానీ లేదా మరే ఇతర వస్తువు కానీ ప్రళయదినాన అతని పక్షాన సాక్ష్యం ఇవ్వకుండా ఉండదు. (19) [18] దీని వివరణ మరియు మూలం పైన ఇదివరకే ఇవ్వబడింది. [19] దీని వివరణ మరియు మూలం పైన ఇదివరకే ఇవ్వబడింది.
ఐదవ అంశం: ముఅజ్జిన్ కలిగి ఉండవలసిన ఉత్తమ గుణాలు:
1- న్యాయపరుడుగా మరియు ధర్మనిష్ఠాపరుడుగా ప్రసిద్ధి చెంది ఉండాలి; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సూక్తి : ఇమామ్ బాధ్యతాయుతుడు, మరియు ముఅజ్జిన్ నమ్మకస్తుడు. ఓ అల్లాహ్! ఇమాములకు సన్మార్గం చూపు, మరియు ముఅజ్జిన్లను మన్నించు. [20] ముఅజ్జిన్ నమాజ్ మరియు ఉపవాస సమయాల విషయంలో ఒక నమ్మకస్థుడైన బాధ్యుడు. ఇటువంటి నమ్మకమైన బాధ్యతను కేవలం నీతిమంతుడు మాత్రమే నెరవేర్చగలడు. కాబట్టి, ముఅజ్జిన్ దుర్మార్గుడు (ఫాసిక్), బహిరంగంగా పాపాలు చేసేవాడు లేదా గౌరవం లేని వ్యక్తిగా ఉండకూడదు. [20] దీనిని అబూదావూద్ హదీథు సంఖ్య (517) మరియు తిర్మిజీ హదీథు సంఖ్య (207) ఉల్లేఖించారు
2- ప్రాజ్ఞ వయస్కుడై ఉండాలి; ఎందుకంటే ప్రాజ్ఞ వయస్కుడి అజాన్ మరింత పరిపూర్ణమైనది. అయితే, వివేచనా శక్తి గల బాలుడు సరైన సమయంలో అజాన్ ఇస్తే, అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అతను అజాన్ ఇచ్చినప్పుడు, అది సరిపోతుంది; ఎందుకంటే దాని ద్వారా సమయం ప్రవేశించినట్లు తెలియజేయడం జరుగుతుంది.
3- సమయాల గురించి జ్ఞానం కలిగి ఉండాలి; తద్వారా వాటిని నిర్ధారించుకుని, వాటి ఆరంభంలోనే అజాన్ ఇవ్వగలడు; ఎందుకంటే, అతనికి వాటి గురించి జ్ఞానం లేకపోతే, అతను పొరబడటానికి లేదా తప్పు చేయడానికి ఆస్కారం ఉంది.
4- స్వరం బిగ్గరగా ఉండాలి; అజాన్ కలకు సంబంధించి అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు హదీసు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: «నిశ్చయంగా ఇది సత్యమైన కల. కాబట్టి నీవు బిలాల్తో కలిసి వెళ్ళు; అతని స్వరం నీకంటే చాలా బిగ్గరగా మరియు సుదీర్ఘంగా ఉంటుంది. నీకు కలలో వినిపించిన పదాలను అతనికి నేర్పించు, అతను వాటితో అజాన్ ఇవ్వనీ.» [21]، మరియు అర్ధం: «నీకంటే అతని స్వరం చాలా బిగ్గరగా మరియు సుదీర్ఘంగా ఉంటుంది.» అనగా: నీ కన్నా ఉన్నత మరియు గంభీర స్వరము గలవాడు. దీనిని బట్టి అజాన్ ఇచ్చే వ్యక్తికి గంభీరమైన మరియు బిగ్గరగా వినిపించే స్వరం ఉండటం ఉత్తమమని తెలుస్తోంది; ఎందుకంటే అజాన్ ద్వారా సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి అటువంటి స్వరం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది [22]. [21] దీనిని తిర్మిజీ (189) ఉల్లేఖించారు, మరియు ప్రామాణికమైన,దృఢమైన హదీస్ అన్నారు. [22] చూడండి: తుహఫతుల్ అహ్వజీ (1/481).
5- మధురమైన స్వరం కలిగి ఉండాలి; పైన ఉల్లేఖించబడిన అబ్దుల్లాహ్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా, అతని స్వరము నీ కన్నా చాలా బిగ్గరగా మరియు సుదీర్ఘంగా ఉంటుంది.» అనగా: అత్యంత మంచి మరియు మధురమైన స్వరం.
6- చిన్న అశుద్ధత నుండి మరియు పెద్ద అశుద్ధత నుండి పరిశుద్ధుడై ఉండాలి; ఎందుకంటే అజాన్ మరియు ఇఖామత్ అల్లాహ్ యొక్క జిక్ర్, మరియు జిక్ర్ చేసేవాడు పరిశుద్ధుడై ఉండటం ఉత్తమం.
7- నిలబడి అజాన్ పలకాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి: ((ఓ బిలాల్ లే మరియు నమాజు కోసం పిలుపు ఇవ్వు)) [23]. ఇబ్నె అల్-మున్జిర్ ఇలా పేర్కొన్నారు: "ముఅజ్జిన్ నిలబడి అజాన్ ఇవ్వడం సున్నత్ అనే విషయంపై పండితులందరూ ఏకీభవించారు"[24]. [23] దీనిని బుఖారీ: (604) మరియు ముస్లిం: (377) ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి ఉల్లేఖించారు. [24] అల్ ఇజ్మా ఇబ్నుల్ మున్జిర్: (పేజీ 38).
8- ఖిబ్లా వైపు అభిముఖమై అజాన్ ఇవ్వాలి; ఎందుకంటే అజాన్ కల గురించి హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి హదీసులోని ఒక ఉల్లేఖనంలో ఇలా వచ్చింది: «ఖిబ్లాకు అభిముఖమై, ఇలా పలికారు: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్...»[25]، ఇబ్నుల్ మున్జిర్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: "అజాన్ కొరకు ఖిబ్లాకి అభిముఖమవటం సున్నత్ అనే విషయంపై పండితులందరూ ఏకీభవించారు"[26]. [25] అబూ దావుద్, హదీథు సంఖ్య (507). [26] అల్ ఇజ్మా, ఇబ్నుల్ మున్జిర్: (పేజీ 38).
9- తన రెండు చూపుడు వేళ్ళను చెవుల్లో పెట్టుకోవాలి; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో బిలాల్ రజియల్లాహు అన్హు అజాన్ ఇచ్చేటప్పుడు ఇలాగే చేశారని అబూ జుహైఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను బిలాల్ రజియాల్లాహు అన్హును అజాన్ ఇవ్వగా చూశాను, ఆయన తన ముఖాన్ని అటూ ఇటూ త్రిప్పుతున్నారు,ఆయన రెండు వేళ్ళు రెండు చెవుల్లో పెట్టుకునియున్నారు, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఎరుపు గుడారం లో ఉన్నారు... [27] దీనిని తిర్మిజీ (197) ఉల్లేఖించారు, మరియు ఇది హసన్ సహీ హదీసు అని అన్నారు. దీని మూలం సహీ బుఖారీ (634)లో ఈ పదాలతో ఉంది: ఔన్ బిన్ అబీ జుహైఫా తన తండ్రి ద్వారా ఉల్లేఖించారు, నేను బిలాల్ అజాన్ ఇవ్వగా చూశాను, కాబట్టి ఆయన అజాన్ పలుకుతూ తన ముఖాన్ని (నోటిని) ఇటు అటు తిప్పడాన్ని నేను గమనించాను.
ఇమామ్ తిర్మిజీ ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఇలా తెలిపారు: జ్ఞానవంతులైన ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఇది ఆచరణలో ఉన్నది: అజాన్ ఇచ్చేటప్పుడు ముఅజ్జిన్ తన వ్రేళ్ళను చెవులలో దూర్చడాన్ని వారు అభిలషణీయంగా భావిస్తారు.
ఇబ్న్ షుబ్రుమాను ఇలా ప్రశ్నించారు: “ముఅజ్జిన్ తన వేళ్ళను చెవులలో ఉంచాలని ఎందుకు ఆదేశించబడింది?” దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు: “శబ్దం బిగ్గరగా చేయడానికి...”[28]. [28] అల్ అవ్సత్ (4/11)
ఇమామ్ అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "అజాన్ ఇచ్చేటప్పుడు తన రెండు వేళ్లను రెండు చెవుల రంధ్రాలలో ఉంచుకోవడం సున్నత్. ఈ విషయంపై అందరూ ఏకీభవించారు. అల్-మహామిలీ 'అల్-మజ్మూఅ్'లో దీనిని సాధారణ పండితులందరి అభిప్రాయంగా పేర్కొన్నారు. మా పండితులు ఇందులో మరొక ప్రయోజనం కూడా ఉందని చెప్పారు: అదేమిటంటే, ఎవరైనా వ్యక్తి చెవుడు వల్ల లేదా దూరం వల్ల ముఅజ్జిన్ స్వరాన్ని వినలేకపోతే, అతని వేళ్లు చెవులలో ఉండటం చూసి అతను అజాన్ ఇస్తున్నాడని గ్రహించవచ్చు" [29]. [29] షరహుల్ ముహజ్జబ్ (3/113).
10- అజాన్ ఇచ్చే సమయంలో రెండు సార్లు 'హయ్య అలస్సలాహ్' అన్నప్పుడు కుడి వైపుకు, రెండు సార్లు 'హయ్య అలల్ ఫలాహ్' అన్నప్పుడు ఎడమ వైపుకు ముఖం తిప్పడం సున్నత్. అయితే ఈ సమయంలో పాదాలు మాత్రం కదలకుండా స్థిరంగా ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హజ్రత్ బిలాల్ రజిఅల్లాహు అన్హు ఇచ్చిన అజాన్ గురించి హజ్రత్ అబూ జుహైఫా రజిఅల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: «నేను అతని నోటిని ఇటు, అటు గమనించసాగాను, ఆయన అటుఇటు కుడి వైపుకు మరియు ఎడమ వైపుకు తిరుగుతూ: "హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్" అని పలుకుతున్నారు.[30] ఎందుకంటే మస్జిదు నుండి దూరంగా ఉన్నవారికి నమాజు కొరకు పిలుపును వినిపించడంలో ఇది మరింత ప్రభావవంతమైనది. [30] ఈ హదీసును బుఖారీ (634) మరియు ముస్లిం (503) ఉల్లేఖించారు. మరియు పదాలు ముస్లింవి.
11- అదాన్ ను విస్తరించకుండా మరియు అతిగా పొడగించకుండా నిదానంగా పలకాలి; ఎందుకంటే అదాన్ మస్జిద్ లో లేని వారికి చేసే ప్రకటన గనుక, దానిని నిదానంగా పలకడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మరియు ఇఖామత్ ను వేగంగా పలకాలి; ఎందుకంటే అది హాజరైన వారికి చేసే ప్రకటన గనుక, దానిని వేగంగా పలకడం సముచితమైనది[31]. [31] చూడండి: అల్ ముఘ్నీ లిఇబ్ని ఖుదామహ్: (1/ 295).
12- అజాన్ను కృత్రిమంగా లేదా రాగయుక్తంగా కాకుండా, పాటగా మార్చకుండా, దాని ఉద్దేశ్యాన్ని దెబ్బతీసే విధంగా అతిగా పొడగించకుండా, ముఅజ్జిన్ తన సహజ స్వరంతో, షరిఅత్ నిర్దేశించిన నియమాలు మరియు పద్ధతులను పాటిస్తూ, సరళంగా మరియు సులభంగా పలకాలి.
ఆరవ అంశం : అజాన్ మరియు ఇఖామత్ యొక్క విధానం
అజాన్ మరియు ఇఖామత్ కొరకు ప్రవక్త వారి హదీసులలో స్పష్టంగా వివరించబడింది. అజాన్ మరియు ఇకామత్ యొక్క పద్ధతి గురించి హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో, అజాన్ పదాలు ఈ విధంగా ఉన్నాయి
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)
అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్. (అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని నేను సాక్షమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని నేను సాక్షమిస్తున్నాను)
అష్ హదు అన్న ముహమ్మదర్ర సూలుల్లాహ్, అష్ హదు అన్న ముహమ్మదర్ర సూలుల్లాహ్. (ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్షమిస్తున్నాను, ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్షమిస్తున్నాను)
హయ్య అలస్సలాహ్, హయ్య అలస్సలాహ్ (నమాజ్ వైపుకు రండి, నమాజ్ వైపుకు రండి)
హయ్య అలల్ఫలాహ్, హయ్య అలల్ఫలాహ్. (సాఫల్యం (విజయం) వైపుకు రండి.)
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)
లాఇలా హఇల్లల్లాహ్. (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడు)
ఇఖామత్ పదాలు:
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)
అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని నేను సాక్షమిస్తున్నాను)
అష్ హదు అన్న ముహమ్మదర్ర సూలుల్లాహ్ (ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్షమిస్తున్నాను)
హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ఫలాహ్. (నమాజ్ వైపుకు రండి, సాఫల్యం (విజయం) వైపుకు రండి.)
ఖద్ ఖామతిస్సలాత్, ఖద్ ఖామతిస్సలాత్ (నమాజ్ నెలకొల్పబడింది)
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ (అల్లాహ్ యే అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ యే అందరి కంటే గొప్పవాడు)
లాఇలా హఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడు).[32] [32] దీనిని అబూ దావూద్ (499), మరియు తిర్మిదీ సంక్షిప్తంగా (189) ఉల్లేఖించారు, మరియు ఆయన ఇలా అన్నారు: "అబ్దుల్లాహ్ బిన్ జైద్ హదీథు హసన్ సహీహ్."
ఇదే అజాన్ మరియు ఇఖామత్ యొక్క పద్ధతి. దీనినే బిలాల్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు, ఆయనతో పాటు నివాసంలో మరియు ప్రయాణంలో స్థిరంగా పాటిస్తూ వచ్చారు.
ఫజర్ నమాజు అజాన్లో ‘హయ్యా అలల్ ఫలాహ్’ తరువాత ‘అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్’ అని రెండుసార్లు పలకాలి; ఎందుకంటే అబూ మహ్జూరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: «ఇక అది ఫజ్ర్ నమాజు అయితే, అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్, అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్ (నమాజు నిద్ర కన్న మేలైనది) అని చెప్పాలి» [33] [33] అబూ దావుద్ (500). ఇమామ్ నవవి 'ఖులాసతుల్ అహ్కామ్' (1/286)లో దీనిని హసన్ (మంచిది)గా పేర్కొన్నారు.
అజాన్లో 'తర్జీ' అనే మరొక విధానం కూడా ఉంది, అనగా పునరావృతం చేయడం. దీనిలో, విశ్వాసం యొక్క రెండు సాక్ష్యాలను మొదట స్వరమును తగ్గించి పలికి, ఆ తర్వాత వాటిని బిగ్గర స్వరంతో మళ్ళీ పలుకుతాడు. మరియు ఇఖామత్ లోనైతే, దాని వాక్యాలను జంటగా పలుకుతాడు. ఈ విధానం అబూ మహ్జూర రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ప్రస్తావించబడింది. ఆయన ఇలా అన్నారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా నాకు అజాన్ నేర్పించి, ఇలా పలికారు:" «నీవు ఇలా పలుకు: "అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్. అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్, అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్". తరువాత తిరిగి నీ స్వరాన్ని పెంచి ఇలా పలుకు: "అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్. అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్, అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్. హయ్య అలస్సలాహ్, హయ్య అలస్సలాహ్. హయ్య అలల్’ఫలాహ్, హయ్య అలల్’ఫలాహ్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహ్"».
మరియు ఇఖామత్: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్'హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్'హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్'హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, అష్'హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, హయ్య అలస్సలాహ్, హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్, హయ్య అలల్ ఫలాహ్, ఖద్ ఖామతిస్సలాహ్, ఖద్ ఖామతిస్సలాహ్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. నమాజ్ కొరకు రండి, నమాజ్ కొరకు రండి. విజయం కొరకు రండి, విజయం కొరకు రండి. నిశ్చయంగా నమాజ్ నిలబెట్టబడింది, నిశ్చయంగా నమాజ్ నిలబెట్టబడింది. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు). ((34)) [34] ఈ హదీథును అబూ దావుద్ హదీథు సంఖ్య (502, 503) లో ఉల్లేఖించారు.
మరియు ఇది వైవిధ్యభరితమైన అభిప్రాయ భేదానికి చెందినది కావడంతో, ప్రమాణపూర్వకంగా స్థిరపడిన ఈ విధానాలలో ముఅజ్జిన్ దేనిని పాటించినా అది మంచిదే. షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహిమహుల్లాహ్, అజాన్ యొక్క స్థిరపడిన కొన్ని రూపాలను పేర్కొన్న తరువాత, ఇలా అంటున్నారు: విషయం ఇలా ఉన్నప్పుడు, అప్పుడు అహ్లె హదీస్ మరియు వారితో ఏకీభవించిన వారి అభిప్రాయమే సరైనది. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ విషయంలో ప్రామాణికంగా నిరూపితమైన అన్ని పద్ధతులను అనుమతించడం. వారు వాటిలో దేనినీ అసహ్యించుకోరు. ఎందుకంటే అజాన్ మరియు ఇఖామత్ పద్ధతులలోని వైవిధ్యం, ఖురాన్ పఠన పద్ధతులు, తషహ్హుద్ పద్ధతులు మొదలైన వాటిలోని వైవిధ్యం లాంటిదే. మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కోసం నిర్దేశించిన దానిని అసహ్యించుకునే అధికారం ఎవరికీ లేదు. ((35)) [35] మజ్మూఉల్ ఫతావా: (22/66).
ఏడవ అంశం : అజాన్ విన్నప్పుడు పలకవలసినవి, మరియు దాని తర్వాత చేయవలసిన దుఆ
అజాన్ విన్నవారు ముఅజ్జిన్ పలికినట్లుగా పలకడం అభిలషణీయం; హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీసు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”. [36]. హైఅలతైన్ విషయంలో మినహాయింపు కలదు – అవి ముఅజ్జిన్ పలికే: ‘హయ్య అలస్సలాహ్’ మరియు ‘హయ్య అలల్ ఫలాహ్’ – అజాన్ వినేవారు ఆ రెండింటిలో ప్రతి దాని తరువాత ఇలా పలకడం అభిలాషణీయం: "లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" "అల్లాహ్ సహాయం లేకుండా (పాపాల నుండి) మళ్ళే శక్తి గానీ, (పుణ్యకార్యాలు చేసే) సామర్థ్యం గానీ ఎవరికీ లేదు." ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.” ((37)) [36] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (611), ముస్లిం హదీథు సంఖ్య (383) లో ఉల్లేఖించారు. [37] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (385)
మరియు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్ దహు లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, రదీతు బిల్లాహి రబ్బన్ వబి ముహమ్మదిన్ రసూలన్ వ బిల్ ఇస్లామి దీనా (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు సాటి ఎవ్వరూ లేరని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ యే నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యే నా సందేశహరుడిగా, ఇస్లాం యే నా ధర్మముగా నేను ఇష్టపడ్డాను) అని షహాదతైన్ తరువాత పలకాలి.
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:" “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”[38]. [38] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (386) లో ఉల్లేఖించారు.
ఫజర్ నమాజులో ముఅజ్జిన్ ‘అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్’ అని అన్నప్పుడు, వినేవారు కూడా అదే విధంగా పలకాలి; ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”. ((39)) ముత్తఫఖున్ అలైహి[39].
ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించి, హదీథులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా ఇలా పలకాలి: “ఎవరైతే అజాన్ విన్న తరువాత ఈ దుఆ: ‘అల్లాహుమ్మ రబ్బ హాదిహి-ద్-ద’వతి-త్-తామ్మహ్, వ-స్-సలాతి-ల్-ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్-వసీలత వల్-ఫజీలత, వబ్’అథ్’హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ’అద్’తహు’ (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు, మరియు స్థాపించబడబోయే ఈ నమాజుకు ప్రభువా! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీలాను, ఘనతను ప్రసాదించు. మరియు నీవు ఆయనకు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన స్థానంలో ఆయనను పునరుత్థరించు) అని పఠిస్తాడో, అతనికి ప్రళయ దినాన నా సిఫారసు తప్పక లభిస్తుంది.” [40] మరియు దీని భావం: పరిపూర్ణ ఆహ్వానం అనగా: అజాను యొక్క ఆహ్వానం; అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది; ఎందుకంటే అందులో అల్లాహ్ ను మహిమపరచడం, ఆయన ఏకత్వం(తౌహీద్), రిసాలత్ యొక్క సాక్ష్యం, మరియు మేలు వైపు ఆహ్వానం ఇమిడి ఉన్నాయి. మరియు స్థాపించబడిన నమాజు అంటే: నెలకొల్పబడేది మరియు ఆచరించబడేది. ‘వసీలహ్’ స్వర్గంలో స్థానము. విశీష్టత ఎవ్వరూ పాలుపంచుకోలేని అత్యున్నతమైన స్థానము. 'మఖామె మహమూద్' (ప్రశంసాత్మకమైన స్థానం) మఖామ్-ఎ-మహ్మూద్: ప్రజలందరూ ప్రశంసించే ప్రతి ఉన్నత స్థానాన్ని ఇది సూచిస్తుంది. ఇందులో భాగంగానే సకల సృష్టి తరపున చేసే 'అత్యున్నత సిఫారసు' (షఫాఅత్-ఎ-ఉజ్మా) కూడా ఉంది. తీర్పు దినమున మైదానంలో ఉన్న వారందరి మధ్య తీర్పు వెలువడే వరకు ప్రవక్త వారు ఈ సిఫారసు చేస్తారు. [40] దీనిని బుఖారీ (614) జాబిర్ రదియల్లాహు అన్హు హదీథు నుండి నమోదు చేసినారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: "మీరు ముఅజ్జిన్ అజాన్ విన్నప్పుడు, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి. ఆ తర్వాత నా కొరకు దరూద్ పఠించండి. ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అనంతరం, నా కొరకు ‘వసీలా’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోండి. నిస్సందేహంగా అది స్వర్గంలో ఒక ఉన్నత స్థానం, అది అల్లాహ్ దాసులలోని ఒకే ఒక్క దాసునికి తప్ప మరెవరికీ యోగ్యమైనది కాదు. ఆ ఒక్కడిని నేనే అవుతానని నేను ఆశిస్తున్నాను. కనుక, ఎవరైతే నా కొరకు వసీలాను అర్ధిస్తారో, అతనికి సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది." [41] [41] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (384)
మరియు అజాన్లో ప్రవేశపెట్టబడిన కొన్ని బిదఅత్లు, అజాన్ తరువాత ముఅజ్జిన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై బిగ్గరగా దరూద్ మరియు సలాం చదవడం. అలాగే, అజాను తర్వాత ఉల్లేఖించబడిన జికర్: (అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతిత్తామ్మహ్ . . .) ను సామూహికంగా పఠించడం, మరియు దుఆ చేసేటప్పుడు రెండు చేతులను పైకి ఎత్తడం, అదేవిధంగా, ముఅజ్జిన్ తో పాటు పలికేవారు చివరి వాక్యంలో 'హఖ్ఖన్' లేదా 'అబదన్' అనే పదాన్ని అదనంగా చేర్చి '(హఖ్ఖన్ లా ఇలాహ ఇల్లల్లాహ్)' లేదా '(అబదన్ లా ఇలాహ ఇల్లల్లాహ్)' అని పలకడానికి కూడా ఎలాంటి ఆధారమూ లేదు.
ఎనిమిదవ అంశం : అజాన్ తర్వాత మస్జిద్ నుండి బయటకు వెళ్లడం యొక్క ఆదేశం
అజాన్ తర్వాత, ఒక వ్యక్తి నమాజు చేసేంత వరకు మస్జిద్ నుండి బయటకు వెళ్లడం నిషేధం. అయితే, ఏదైనా బలమైన కారణం ఉన్నా లేదా తిరిగి వస్తాననే ఉద్దేశ్యం ఉన్నా వెళ్లడంలో తప్పు లేదు.; అబూ అష్-షఅసా ఇలా అన్నారు: ""మేము అబూ హురైరాతో మస్జిద్లో కూర్చొని ఉన్నాము. ముఅజ్జిన్ అజాన్ పలికాడు. ఒక వ్యక్తి మస్జిద్ నుండి లేచి నడవసాగాడు. అబూ హురైరా అతను మస్జిద్ నుండి బయటకు వెళ్ళిపోగానే, 'ఇతను అబుల్ ఖాసిమ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత చూపాడు' అని అన్నారు"[42]. [42] ముస్లిం, హదీథు సంఖ్య (655)
తిర్మిజీ తన సునన్లో ఈ హదీసును ఉల్లేఖించిన తరువాత ఇలా తెలిపారు: విద్వాంసులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు మరియు వారి తర్వాత వచ్చిన వారి ఆచరణ కూడా ఇదే: వుజూ లేకపోవడం లేదా మరేదైనా తప్పనిసరి అయిన పని వంటి సముచిత కారణం ఉంటే తప్ప, అజాన్ తర్వాత మస్జిద్ నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదు.[43] [43] సునన్ తిర్మిజీ, 1/397, హదీథు సంఖ్య 204.
తొమ్మిదవ అంశం : అజాన్ మరియు ఇఖామత్ మధ్య ఎంత సమయం ఉండాలి?
అజాన్ మరియు ఇఖామత్ మధ్య తగినంత సమయం ఉండాలని సున్నత్ ద్వారా నిరూపితమైంది. హజ్రత్ అబ్దుల్లా బిన్ ముగఫ్ఫల్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అజాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు. [44]. ‘రెండు పిలుపులు’ అనగా ఉద్దేశ్యం: అజాన్ మరియు ఇఖామత్. కనుక ముఅజ్జిన్ తన అజాన్ మరియు ఇఖామత్ మధ్య కొంత వ్యవధిని ఉంచాలి, తద్వారా హాజరైన వారు నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించగలుగుతారు, అలాగే మసీదుకు వచ్చే ఇతర ముస్లింలు కూడా సకాలంలో చేరుకుని నమాజ్లో పాల్గొనే వీలు కలుగుతుంది.. [44] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (627); ముస్లిం, హదీథు సంఖ్య (838) లో ఉల్లేఖించారు.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ ఇలా తెలిపారు : ముఅజ్జిన్ అజాన్ ఇచ్చిన తరువాత ఇఖామత్ పలకటంలో తొందరపడరాదు. మస్జిదుకు వచ్చే వారు చేరుకునే వరకు, మరియు మరియు ప్రకృతి అవసరాలు (మలమూత్ర విసర్జన వంటివి) తీర్చుకోవాల్సిన వారు తమ అవసరాలను తీర్చుకునే వరకు వేచి ఉండాలి. అజాన్కు మరియు ఇఖామత్కు మధ్య ప్రజలకు తగినంత సమయం (విరామం) ఇవ్వాలి.[45] [45] షర్హ్ ఉమ్దతుల్ ఫిఖ్ ఇబ్నె తైమియా, నమాజు అధ్యాయం: (పు. 135).
పదవ అంశం: ముఅజ్జిన్ బాధ్యతలు మరియు అదబ్లు (మర్యాదలు)
ముఅజ్జిన్ తన అజాన్ ద్వారా అల్లాహ్ తఆలా యొక్క ప్రసన్నతను ఆశించాలి; ఈ విషయమై ఉస్మాన్ బిన్ అబి అల్-ఆస్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: «దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు చేసిన ఆఖరి ఉపదేశం, తన అజాన్ పై వేతనం తీసుకోని వాడిని ముఅజ్జిన్ గా నియమించుకోవాలని»[46]. [46] దీనిని తిర్మిజీ, హదీథు సంఖ్య (209)లో ఉల్లేఖించారు. ఈ హదీసు హసన్ (ఉత్తమ) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికారు.
తిర్మిజీ రహిమహుల్లాహ్ ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఇలా తెలిపారు: విద్వాంసుల వద్ద ఆచరణ ఏమనగా, వారు ముఅజ్జిన్ అజాన్ కొరకు ప్రతిఫలం తీసుకోవడాన్ని అయిష్టకరమైనదిగా భావించారు మరియు ముఅజ్జిన్ తన అజాన్లో పుణ్యాన్ని ఆశించడాన్ని ఇష్టపడ్డారు.
ముస్లింల బైతుల్ మాల్ నుండి ముఅజ్జిన్కు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదు; ఎందుకంటే బైతుల్ మాల్ కేవలం ముస్లింల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేయబడింది, మరియు అజాన్ మరియు ఇఖామత్లు కూడా ముస్లింల ప్రయోజనాలకు సంబంధించినవే [47]. [47] చూడండి: అల్ అజాను వల్ ఇఖామతు లిల్ ఖహ్తానీ: (పేజి 19).
మరియు ఐదు పూటల నమాజులకు వాటి సమయాలలో అజాన్ ఇవ్వడానికి తాను బాధ్యుడని అతను తెలుసుకోవాలి; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఇమాము బాధ్యుడు, మరియు ముఅజ్జిన్ అమానత్ దారుడు. [48] అనగా: అతను నమాజ్ సమయాల విషయంలో నమ్మకస్తుడు కాబట్టి, అజాన్ సమయానికి తగినంత ముందే శుద్ధి చేసుకుని మస్జిదుకు రావాలి. ఆమోదయోగ్యమైన కారణం ఉంటే తప్ప అతను అజాన్కు గైర్హాజరు కాకూడదు. ఒకవేళ రా లేని పరిస్థితి ఉంటే, తన తరపున అజాన్ ఇచ్చేందుకు మరొకరిని ఏర్పాటు చేయాలి. [48] దీనిని అబూ దావుద్ (517), తిర్మిజీ (207) అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.
ముఅజ్జిన్ కొరకు పాటించవలసిన విషయాలు:
(1) మస్జిద్ యొక్క పరిశుభ్రత మరియు సంరక్షణపై శ్రద్ధ వహించాలి, ఈ విషయంలో మస్జిద్ సిబ్బందితో మరియు అక్కడకు వచ్చే నమాజీలతో (జమాత్) కలిసికట్టుగా సహకరించుకోవాలి. తన గృహాలను (మసీదులను) నిర్మించే మరియు సంరక్షించే వారిని అల్లాహ్ ఇలా ప్రశంసించాడు: నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు! [తౌబా : 18] వాటిని నిర్మించడం, వాటిని పరిరక్షించడం మరియు వాటిని శుభ్రపరచడం ద్వారా అయినా, లేదా వాటిలో నమాజు స్థాపించడం మరియు అల్లాహ్ ను స్మరించడం ద్వారా అయినా, ఈ రెండు భావాలూ ఆ నిర్వహణలో ఉద్దేశించబడినవే[49]. [49] చూడండి: ఇబ్నె హజర్ యొక్క ఫత్హుల్ బారీ: 1/541.
(2) సరైన విశ్వాసం, అజాన్, పవిత్రత మరియు నమాజు యొక్క విధివిధానాలను నేర్చుకోవాలి, అల్లాహ్ గ్రంథం నుండి గణనీయమైన భాగాన్ని కంఠస్థం చేయాలి, మరియు ఇమామ్ నమాజుకు గైర్హాజరైనప్పుడు అతనికి బదులుగా నాయకత్వం వహించడానికి అర్హుడై ఉండాలి.
(3) మంచి గురించి ఆదేశించాలి మరియు చెడు నుండి వారించాలి, వివేకంతో (హిక్మత్) మరియు మంచి ఉపదేశంతో అల్లాహ్ తఆలా వైపునకు ఆహ్వానించాలి, ప్రజలతో మృదువుగా వ్యవహరించాలి, వారి ద్వారా కలిగే హానిపై సహనం వహించాలి మరియు ఈ విషయంలో మస్జిద్ ఇమామ్తో సహకరించాలి.
(4) మస్జిద్ను కేవలం జ్ఞానార్జన (ఇల్మ్), ఆరాధన (ఇబాదత్) మరియు నమాజీలకు మేలు చేసే పనులకే పరిమితం చేయాలి. వారి ధార్మిక మరియు లౌకిక జీవితాలకు నష్టం కలిగించే ప్రతి అంశానికి దూరంగా ఉండాలి.
(5) మస్జిద్ వచ్చే నమాజీలతో మరియు స్థానిక ముస్లింలతో స్నేహపూర్వకంగా ఉంటూ, వారితో సహకరించుకోవాలి. ఎవరైనా మస్జిదుకు రాకపోతే వారి యోగక్షేమాలు విచారించాలి, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించాలి, వారి జనాజా నమాజులలో పాల్గొని అంత్యక్రియలలో తోడుండాలి మరియు ఆపదలు లేదా కష్ట సమయాల్లో వారికి అండగా నిలబడాలి.
రెండవ అధ్యాయం: ఇమామత్ యొక్క ఆదేశాలు
మొదటి అంశం: ఇమామత్ యొక్క నిర్వచనం
నమాజ్లో ఇమామత్ (నాయకత్వం): నమాజీలలో ఒకరు ముందుకు వెళ్లి నిలబడగా, మిగిలిన వారందరూ ఆయనను అనుసరిస్తూ నమాజ్ చేయడం. నమాజ్లో ఇమామ్ అంటే: ఎవరినైతే అనుసరిస్తూ ప్రజలు తమ నమాజ్ను నిర్వహిస్తారో ఆ వ్యక్తి[50]. [50] చూడండి: హాషియ అర్రౌద్ అల్ మురబ్బ: (2/296), అల్ ఇమామతు ఫిస్సలాత్ లిల్ ఖహ్తానీ: (పేజి 6).
రెండవ అంశం: ఇమామత్ యొక్క ధర్మబద్ధత మరియు దాని ఘనత
నమాజ్లో ఇమామత్ చేయడం అనేది అత్యుత్తమ పనులలో ఒకటి. దీనిని ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తులు, అంటే ధార్మిక జ్ఞానం (ఇల్మ్), ఖురాన్ పఠనం (ఖిరాత్), మరియు నీతిమంతులైన వారు మాత్రమే చేపట్టాలి. ఇమామ్ లేకుండా జమాత్ (సామూహిక) నమాజ్ సాధ్యం కాదు, మరియు జమాత్ నమాజ్ అనేది ఇస్లాం యొక్క గొప్ప చిహ్నాలలో ఒకటి[51]. [51] చూడండి: అల్ మౌసూఅ అల్ ఫిఖియ్య అల్ కువైతియ్య (6/ 201).
ఇమామత్ యొక్క ఘనతలు:
1- ఇమామత్ యొక్క ఘనత ప్రసిద్ధమైనది, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ జీవితాంతం ఇమామత్ బాధ్యతను నిర్వర్తించారు. వారి తర్వాత ఖులాఫాయె రాషిదీన్ (ధర్మబద్ధమైన ఖలీఫాలు) కూడా దీనిని కొనసాగించారు. నాటి నుండి నేటి వరకు, జ్ఞానంలో మరియు ఆచరణలో ముస్లింలలో అత్యుత్తమమైన వారే ఈ బాధ్యతను చేపడుతున్నారు[52]. [52] చూడండి: అల్-ఇమామతు ఫిస్సలాత్-రచన అల్-ఖహ్తానీ (పే 9).
2- నమాజులో ఇమామత్ అనేది అనేది శ్రేష్ఠమైన గుణాలు కలవారు చేపట్టే ఒక షరియా బాధ్యత. ఇమామత్ యొక్క విశిష్టత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ప్రజలలో ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని (ఖురాన్ను) అందరికంటే బాగా పఠించగలరో, వారే వారికి ఇమామత్ వహించాలి... ...» [53], ఖుర్ఆన్ ను బాగా పఠించేవాడు ఉత్తముడన్నది విదితమే; అందుకే దానిని అతనితో జతపరచడం దాని శ్రేష్ఠతను సూచిస్తుంది [54]. [53] దీనిని ముస్లిం, అబూ మస్ఊద్ అల్-అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి (హదీథు సంఖ్య: 673) నమోదు చేసినారు. [54] చూడండి: అష్-షర్హుల్ ముమ్తి అలా జాదుల్ ముస్తఖ్ని (2/41).
3- ఇమామ్లకు సన్మార్గం కలగాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ; అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ఇమామ్ బాధ్యుడు, మరియు ముఅజ్జిన్ విశ్వసనీయుడు. ఓ అల్లాహ్! ఇమాములకు సన్మార్గం చూపు, మరియు ముఅజ్జిన్లను మన్నింపుము» [55] [55] దీనిని అబూ దావుద్ హదీసు సంఖ్య (517) మరియు తిర్మిజీ హదీసు సంఖ్య (207) ఉల్లేఖించారు.
మరియు అర్ధం: «ఇమాము బాధ్యుడు» అనగా: ముక్తదీల (ఇమామ్ను అనుసరించేవారి) నమాజ్ యొక్క ప్రామాణికతకు ఇమామ్ బాధ్యత వహిస్తాడు; ఎందుకంటే వారి నమాజ్ ఆయన నమాజ్తో ముడిపడి ఉంటుంది. దీని అర్థం: ఓ అల్లాహ్ ఇమాములకు సన్మార్గం చూపు. అనగా: వారు నమాజ్ను అత్యంత పరిపూర్ణమైన స్థితిలో నిర్వహించేలా వారికి సరైన మార్గాన్ని చూపమని అర్థం. [56]. [56] చూడండి: షర్హ్ అబీ దావూద్ ఐనీ: (2/ 468), మరియు ఫైజుల్ ఖదీర్ మునావీ: (3/ 182).
మూడవ అంశం: ఇమామతుకు అత్యధిక హక్కు కలవారు
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇమామతుకు అత్యంత అర్హుడు మరియు ప్రాధాన్యత గలవాడు ఎవరో స్పష్టం చేశారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రజలకు ఇమామత్ వహించడానికి వారిలో అల్లాహ్ గ్రంథాన్ని (ఖురాన్ను) అందరికంటే బాగా పఠించేవారు అర్హులు. ఒకవేళ పఠనంలో అందరూ సమానంగా ఉంటే, సున్నత్పై ఎక్కువ అవగాహన ఉన్నవారు; ఒకవేళ సున్నత్లో కూడా అందరూ సమానంగా ఉంటే, అందరికంటే ముందుగా హిజ్రత్ చేసినవారు; హిజ్రత్లోనూ సమానంగా ఉంటే, అందరికంటే ముందుగా ఇస్లాం స్వీకరించినవారు - మరో రివాయత్ ప్రకారం: వయస్సులో పెద్దవారు - ఇమామత్ వహించాలి. మరియు ఒక వ్యక్తి యొక్క అధికార పరిధిలో (అతని ఇంట్లో లేదా అతని బాధ్యత గల చోట) మరొకరు అతని అనుమతి లేకుండా ఇమామత్ చేయకూడదు. [57]. ఇమామతుకు ప్రజలలో అత్యంత అర్హులు మరియు అత్యధిక హక్కు కలవారు ఈ క్రింది విధంగా ఉన్నారు: [57] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (673) లో ఉల్లేఖించారు.
1- ఖుర్ఆన్ ను ఎక్కువగా కంఠస్థం చేసినవారు మరియు అత్యుత్తమంగా పఠించేవారు, (ఖిరాత్) అంటే ఖురాన్ పఠనంలో ప్రావీణ్యం కలిగి ఉండి, దానిని పరిపూర్ణంగా పఠించగలిగే వారు మరియు నమాజ్ యొక్క విధివిధానాల (ఫిఖ్)పై అవగాహన ఉన్నవారు. ఒకవేళ ఇద్దరిలో ఒకరు ఖురాన్ బాగా పఠించేవారు, మరొకరు పఠనంలో కొంచెం తక్కువైనా నమాజ్ నియమాలపై ఎక్కువ అవగాహన ఉన్నవారైతే, అప్పుడు ఆ పఠనం తెలిసిన పండితుడికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే పఠన నైపుణ్యం కంటే నమాజ్ యొక్క ఫిఖ్ మరియు దాని చట్టాల అవసరం నమాజ్లో చాలా ఎక్కువ.
2- ఆ తర్వాత సున్నత్పై ఎక్కువ అవగాహన ఉన్నవారు. ఒకవేళ ఇద్దరు ఇమాములు పఠనం (ఖిరాత్)లో సమానంగా ఉంటే, వారిలో ఎవరికైతే సున్నత్ మరియు ఫిఖ్ (ధర్మశాస్త్రం)పై ఎక్కువ అవగాహన ఉంటుందో, వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒకవేళ ఖురాన్ పఠనంలో (ఖిరాత్లో) అందరూ సమానంగా ఉంటే, వారిలో సున్నత్పై ఎక్కువ అవగాహన ఉన్నవారు (ఇమామత్ వహించాలి).
3-ఒకవేళ ఖురాన్ పఠనంలో మరియు సున్నత్ జ్ఞానంలో అందరూ సమానంగా ఉన్నట్లయితే, అప్పుడు కుఫ్ర్ (అవిశ్వాస) దేశం నుండి ఇస్లామిక్ దేశానికి అందరికంటే ముందుగా హిజ్రత్ (వలస) చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒకవేళ సున్నత్లో కూడా అందరూ సమానంగా ఉంటే, అందరికంటే ముందుగా హిజ్రత్ చేసినవారు (ఇమామత్ వహించాలి)
4- ఆ తరువాత ఇస్లాంలో జ్యేష్ఠుడు, వారు హిజ్రత్లో సమానంగా ఉంటే; గత హదీసులోని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపిన విధంగా: ఒకవేళ హిజ్రత్ లో కూడా అందరూ సమానమైతే, ఇస్లాం ను ప్రథమంగా స్వీకరించినవాడు ఇమామతు వహించాలి. అంటే ఇస్లాం అని.
5- ఒకవేళ పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ సమానంగా ఉంటే, అప్పుడు వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వాలి; గత హదీసు యొక్క ఒక రివాయత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «వారిలో వయసులో పెద్దవారు» మరియు మాలిక్ బిన్ అల్ హువైరిథ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: మీలోని ఒకరు అజాన్ ఇవ్వండి, మరియు మీలో పెద్దవారు నమాజు చదివించండి. ((58)) [58] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (628); ముస్లిం, హదీథు సంఖ్య (674) లో ఉల్లేఖించారు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వయసులో పెద్దవారికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకనగా వారు జ్ఞానములో దాదాపు సమానంగా ఉండేవారు.
ఒకవేళ పైన పేర్కొన్న అన్ని విషయాలలో వారు సమానంగా ఉండి, ప్రతి ఒక్కరూ ఇమామత్ చేయాలని పట్టుబట్టి వివాదపడితే, అప్పుడు వారి మధ్య లాటరీ వేయాలి. లాటరీలో గెలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది; ఎందుకంటే వారిద్దరూ అర్హతలో సమానంగా ఉన్నారు మరియు ఇద్దరినీ (ఒకేసారి ఇమామ్గా) నియమించడం సాధ్యం కాదు, కాబట్టి ఇతర హక్కుల మాదిరిగానే వారి మధ్య లాటరీ ద్వారా నిర్ణయించబడుతుంది.
మరియు ఇంటి యజమాని తన అతిథి కంటే ఇమామతుకు ఎక్కువ హక్కు కలవాడు. అలాగే పాలకుడు - అంటే అత్యున్నత నాయకుడు - ఇతరుల కంటే ఇమామతుకు ఎక్కువ హక్కు కలవాడు; వారిలో ప్రతి ఒక్కరూ ఇమామతుకు తగిన అర్హత ఉన్నవారైనప్పుడు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి కూడా మరొకరి ఇంటిలో లేదా అతని అధికార పరిధిలో (అతని అనుమతి లేకుండా) ఇమామత్ వహించకూడదు.
మరియు వీరిద్దరిలాగే మసీదు యొక్క శాశ్వత ఇమామ్ కూడా ఇతరుల కంటే ఎక్కువ అర్హత కలిగి ఉంటారు — పాలకుడు తప్ప. ఇతరులు ఆయన కంటే బాగా ఖురాన్ పఠించేవారైనా లేదా ఎక్కువ జ్ఞానవంతులైనా సరే, ఆ ఇమామ్కే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పైన పేర్కొన్న హదీసు యొక్క సాధారణ అర్థం దీనికే వర్తిస్తుంది.
ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా, తన సేవకుడొకరు నమాజ్ చేసే మస్జిదుకు హాజరైనప్పుడు, ఆ సేవకుడు వారిని (నమాజ్ చేయించమని) ముందుకు పిలవగా, ఆయన అతనితో ఇలా అన్నారు: «నీ మస్జిద్ లో ఇమామత్ కు నీవే ఎక్కువ అర్హుడవు»[59]. [59] దీనిని షాఫియీ (అల్-ఉమ్) (1/185), అబ్దుర్రజ్జాక్ (అల్-ముసన్నఫ్) (2/399), మరియు బైహఖీ (3/126) (5531) ఉల్లేఖించారు. మరియు నవవీ గారు (అల్-ఖులాసా) (2/701) లో చెప్పారు: ఇస్నాదుహూ హసన్ అవ్ సహీహ్. మరియు అల్బానీ గారు (ఇర్వావుల్ గలీల్) (2/302) లో దీని ఇస్నాద్ ను హసన్ అని తెలిపారు.
మరియు ఎందుకంటే, అతని కంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం, అతనిపై అతిక్రమణ మరియు అతని మనస్తాపానికి కారణం అవుతుంది.
విచక్షణ గల బాలుని ఇమామతు విషయంలో భిన్నాభిప్రాయం ఉంది, కొందరు పండితులు అమ్ర్ బిన్' సలమ రజియల్లాహు అన్హు యొక్క హదీసు కారణంగా దీనిని అనుమతించారు. "ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో తన జాతి వారికి ఇమామత్ చేశారు, అప్పుడు ఆయన వయస్సు ఆరు లేదా ఏడు సంవత్సరాలు"[60]. [60] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (4302)
నఫిల్ నమాజ్ చేసే వ్యక్తి ఫర్జ్ నమాజ్ చేసే వారికి ఇమామత్ చేయడం సమ్మతమే. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారికి సంబంధించిన ఉదంతమే ఆధారం. ఆయన నబీ సల్లల్లాహు అలైహివ సల్లంతో ఇషా నమాజును చదివేవారు, తరువాత తిరిగి వెళ్లి తన తెగ ప్రజలకు అదే నమాజును చదివించేవారు[61]. [61] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (701) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (465) లో ఉల్లేఖించారు.
నాల్గవ అంశం: ఎవరి ఇమామత్ నిషిద్ధం (హరామ్):
క్రింది పరిస్థితులలో ఇమామత్ నిషిద్ధం:
1- స్త్రీ పురుషులకు ఇమామత్ వహించడం నిషిద్ధం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఈ సాధారణ సూక్తి దీనికి ఆధారం: [తమ వ్యవహారాల భాద్యతను ఒక స్త్రీకు అప్పచెప్పిన జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు} [62], ఎందుకంటే ఇమామత్ అనేది ఒక రకమైన నాయకత్వం. అంతేకాకుండా, సున్నత్ ప్రకారం స్త్రీలు వరుసలలో అందరికంటే వెనుక ఉండటమే అసలు నియమం. అబూ హురైరా రజియల్లాహు అన్హు నివేదించిన ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: (నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.” [63] ఇది ఆమె గౌరవాన్ని కాపాడటానికి మరియు పర్దా (మర్యాద) పాటించడానికి ఉద్దేశించబడింది. ఒకవేళ ఆమెను ఇమామత్కు ముందు నిలబెడితే, అది ఈ షరియా మూల సూత్రానికి విరుద్ధం అవుతుంది. ఈ విషయంపై ఇస్లామీయ పండితులందరూ ఏకాభిప్రాయం (ఇజ్మా) కలిగి ఉన్నారు. ఇమామ్ ఇబ్న్ హజ్మ్ (రహీమహుల్లా) ఇలా పేర్కొన్నారు: స్త్రీ అని తెలిసి కూడా ఆమె పురుషులకు ఇమామత్ వహిస్తే, ఆ పురుషుల నమాజ్ చెల్లదు అనే విషయంపై పండితులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు." ((64)) [62] దీనిని బుఖారీ అబూ బకరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (4425). [63] దీనిని ముస్లిం హదీథు సంఖ్య (440) లో ఉల్లేఖించారు. [64] మరాతిబ్ అల్ ఇజ్మా: (సఫా 27).
2- ఒకవేళ ఇమామ్ తాను అశుద్ధ స్థితిలో (వుజూ లేకుండా) లేదా తనపై అశుద్ధం (నజాసత్) ఉందని తెలిసి కూడా ఇమామత్ చేసి, నమాజు పూర్తయ్యే వరకు ముఖ్తదీలకు ఆ విషయం తెలియకపోతే వారి నమాజు చెల్లుతుంది. ఎందుకంటే ఈ విషయం ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడింది. «ఆయన జనాబత్ స్థితిలో ప్రజలకు నమాజ్ చేయించారు, ఆ తర్వాత ఆయన తిరిగి నమాజ్ చేశారు, కానీ వారిని తిరిగి చేయమని ఆజ్ఞాపించలేదు»[65]. [65] దీనిని దారఖుత్నీ తన సునన్ లో హదీసు సంఖ్య (1371) ఉల్లేఖించారు.
మరియు అబ్దుర్రహ్మాన్ బిన్ మహదీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ""దీనిపై ఏకాభిప్రాయం ఉంది: జునుబి (అపవిత్రతలో) ఉన్న ఇమామ్ పునరావృతం చేయాలి, కానీ ఇతరులు చేయరు. ఇందులో భేదాభిప్రాయం ఉన్నట్లు నాకు తెలియదు"[66]." [66] సునన్ అల్-దారఖుత్నీ: (2/ 188).
3- సూరతుల్ ఫాతిహా నోటికి రానివారు, లేదా దానిని సరిగ్గా పఠించలేనివారు, లేదా కలపకూడని అక్షరాలను కలిపి పఠించేవారు ఇమామత్ వహించడం నిషిద్ధం. ఉదాహరణకు, అల్లాహ్ తఆలా యొక్క ఈ క్రింది వాక్యంలో 'హా' ను 'రా' తో కలిపి చదవడం వంటివి: సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. [అల్ ఫాతిహ: 2] ఎందుకంటే అతను ఆ అక్షరాన్ని దానికి ఏమాత్రం పోలిక లేని లేదా సంబంధం లేని మరో అక్షరంతో కలిపి చదివాడు. అలాగే అక్షరాలను మార్చి పలికేవారు—ఉదాహరణకు 'రా' కు బదులుగా 'యా' అని పలకడం, లేదా అర్థం మారిపోయేలా తప్పుగా పఠించడం వంటివి చేస్తే, నమాజు యొక్క రుకున్ను నెరవేర్చడంలో అసమర్థుడు కావడం లేదా దానికి భంగం కలిగించడం వలన అతని ఇమామత్ చెల్లదు. కాని అతని లాంటి వారి కొరకు చెల్లుతుంది.
4- తన బిద్అత్ వలన కాఫిర్ గా మారిన బిద్అతీ యొక్క ఇమామత్; దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు: ఏమీ? విశ్వాసి అయినవాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు!) వారు సరిసమానులు కాలేరు. [అస్ సజ్దహ్ : 18], ఇక్కడ ఫాసిఖ్ అంటే కాఫిర్, ఆయతుల సందర్భాన్ని బట్టి ఇది స్పష్టమవుతుంది.
5- నియమిత ఇమామ్ ఉన్న మస్జిదులో, ఇతరులు అతని కంటే ముందు ఇమామత్ చేయడం నిషేధించబడింది, అతని అనుమతితో, లేదా అతను ఆలస్యం చేసి సమయం తక్కువగా ఉన్నప్పుడు తప్ప[67]. [67] చూడండి: అల్-అస్ఇల వల్-అజ్విబ అల్-ఫిఖియ్య లిస్సల్మాన్ (1/163).
ఐదవ విషయం:ఎవరి ఇమామత్ మక్రూహ్ (అవాంఛనీయమైనది):
ఈ క్రింది వారు ఇమామత్ వహించడం మక్రూహ్ (అవాంఛనీయమైనది):
1- లహ్హాన్: ఇతను ఖుర్ఆన్ పారాయణంలో, అర్థం మారిపోనంత వరకు, పఠనంలో తరచుగా వ్యాకరణ తప్పులు చేసే వ్యక్తి ఇమామత్ వహించడం మక్రూహ్. ఇది సూరహ్ అల్-ఫాతిహాలో కావచ్చు లేదా ఇతర సూరాలలో కావచ్చు. ఉదాహరణకు: అల్ హమ్దు లిల్లాహి లోని 'దాల్' అక్షరానికి పేష్ కు బదులుగా జబర్ కలిపి అల్ హమ్ద లిల్లాహి అని పలికడం. ఇలా పఠించినప్పుడు నమాజ్ చెల్లుతుంది కానీ, అతని ఇమామత్ మక్రూహ్ అవుతుంది. దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సూక్తి ఆధారంగా ఉంది: «ప్రజలకు అత్యంత ఎక్కువగా ఖురాను జ్ఞానంకలవాడు ఇమామతు వహించాలి.» [68] [68] దీనికి సంబంధించిన హదీసు వివరణ (తఖ్రీజ్) పైన పేర్కొనబడింది.
ఫాతిహా సూరా కాకుండా ఇతర పారాయణంలో పొరపాటున, అజ్ఞానం వల్ల లేదా నాలుక లోపం కారణంగా అర్థం మారిపోయే తప్పు జరిగితే, అతని ఇమామత్ కరాహత్ (అయిష్టం)తో పాటు చెల్లుతుంది. ఎందుకంటే ఫాతిహా సూరా కాకుండా ఇతరేతర పారాయణాన్ని అతను విడిచిపెట్టినా అతని ఇమామత్ చెల్లుతుంది కాబట్టి, అందులో తప్పుగా పఠించినా చెల్లుతుంది. అయితే, అతను ఉద్దేశపూర్వకంగా అలా చేస్తే అది చెల్లదు; ఎందుకంటే అతను తన నమాజుతో ఆటలాడుతున్నాడు.
2- చదివేటప్పుడు కొన్ని అక్షరాలను అనవసరంగా పునరావృతం చేసేవారు (ఉదాహరణకు 'ఫ' లేదా 'త' (تاء) వంటి అక్షరాలను నత్తిగా లేదా ఉచ్చారణ లోపం వల్ల పదే పదే పలకడం). ఇలా చేయడం వల్ల పఠనంలో అక్షరాల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి, అటువంటి వారు ఇమామత్ వహించడం మక్రూహ్ (అవాంఛనీయమైనది).
3 - ఫాసిఖ్ మరియు తన బిద్అత్ కారణంగా అవిశ్వాసి కాని బిద్అతీ[69]. [69] చూడండి: కష్షాఫ్ అల్ ఖినా: (1/475) మరియు దాని తర్వాత.
4- ప్రజలలో అధికులు ఒక వ్యక్తిని ధర్మబద్ధమైన కారణంతో ఇష్టపడకపోతే, అతను వారికి ఇమామత్ వహించడం మక్రూహ్. దీనికి అబూ ఉమామా రజియల్లాహు అన్హు నివేదించిన ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు ఆధారంగా ఉంది: «ముగ్గురి నమాజులు వారి చెవులను దాటవు: పారిపోయిన బానిస, తిరిగి వచ్చేంత వరకు. భర్త తనపై ఆగ్రహంతో ఉండగా రాత్రి గడిపిన స్త్రీ, మరియు తన సమూహ ప్రజలు ఇష్టపడని ఇమామ్» ((70)) [70] దీనిని తిర్మిజీ హదీసు నెంబరు (360) లో ఉల్లేఖించారు, మరియు ఈ హదీసు ఈ మార్గం ద్వారా హసన్ గరీబ్ అని అన్నారు.
ఇమామ్ తిర్మిజీ ఇలా తెలిపారు: తమను అసహ్యించుకునే ప్రజలకు ఒక వ్యక్తి ఇమామత్ చేయడాన్ని కొంతమంది ధర్మ పండితులు మక్రూహ్గా (అనుచితంగా) పరిగణించారు. ఇమామ్ గనక అన్యాయస్తుడు కాకపోతే, పాపం అతన్ని అసహ్యించుకున్న వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో అహ్మద్ మరియు ఇస్హాఖ్ (రహిమహుముల్లాహ్) ఇలా అన్నారు: "ఒకరు, ఇద్దరు, లేదా ముగ్గురు మాత్రమే (ఇమామ్ను) అసహ్యించుకుంటే, వారికి నమాజు చేయించడంలో ఎటువంటి దోషం లేదు, ప్రజలలో అధిక శాతం మంది అతన్ని అసహ్యించుకునేంత వరకు"[71]. [71] సుననె తిర్మిజీ: (2/ 192).
ఒకవేళ అతను నమాజులో సున్నత్ను అనుసరించడానికి శ్రద్ధ వహించడం, వారితో సున్నత్ సూరాలను పఠించడం, మరియు నిదానంగా నమాజు చదివించడం వంటి కారణాల వల్ల వారు అతనిని అసహ్యించుకుంటే, అతని ఇమామత్ మక్రూహ్ అవ్వదు; ఎందుకంటే వారు అతనిని అన్యాయంగా అసహ్యించుకున్నారు, కనుక వారి అసహ్యానికి ఏమాత్రం విలువ లేదు. వారు అతనిని అన్యాయంగా అసహ్యించుకుంటున్నప్పుడు, అతడు వారికి ఉపదేశించి, హితవు పలికి, వారి హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నించాలి; మరియు సున్నత్లో వచ్చిన దాని ప్రకారమే వారితో నమాజు చదివించాలి. వారి మధ్య సఖ్యతను నెలకొల్పాలనే అతని ఉద్దేశ్యంలోని నిజాయితీని అల్లాహ్ గ్రహిస్తే, అల్లాహ్ దానిని అతనికి సులభతరం చేస్తాడు[72]. [72] చూడండి: షర్హుల్ ముమ్తి అలా జాదుల్ ముస్తఖ్ని: (4/ 253).
ఆరవ విషయం: ముఖ్తదీల యెడల ఇమామ్ స్థానం
సున్నత్ ఏమిటంటే, ఇమామ్ ముఖ్తదీల కంటే ముందు నిలబడటం సున్నత్. వారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఇమామ్ వెనుక నిలబడాలి; ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజ్ కొరకు నిలబడినప్పుడు ఆయన ముందుకు వెళ్ళేవారు, మరియు ఆయన సహచరులు ఆయన వెనుక నిలబడేవారు, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి: జాబిర్ మరియు జబ్బార్ రజియల్లాహు అన్హుమ కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తుండగా వారిలో ఒకరు ఆయన కుడివైపు, మరొకరు ఆయన ఎడమవైపు నిలబడ్డారు. అప్పుడు ఆయన వారిద్దరి చేతులు పట్టుకొని, వారిని తన వెనుక నిలబెట్టారు. [73] [73] దీనిని ముస్లిం, జాబిర్ రదియల్లాహు అన్హు నుండి ఒక సుదీర్ఘ హదీథులో భాగంగా నమోదు చేసినారు, హదీథు సంఖ్య (3010).
ఒక్కడే పురుషుడు ఉన్నప్పుడు, అతను ఇమామ్కు కుడివైపున నిలబడాలి. దీనికి ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా నివేదించిన ఈ సంఘటన ఆధారంగా ఉంది: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయడానికి నిలబడ్డారు,నేను ఆయనకు ఎడమప్రక్కన నిల్చున్నాను,అప్పుడు ఆయన నా చెవి పట్టుకుని నన్ను తన కుడివైపునకు తిప్పి నిలబెట్టారు [74]. [74] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (6316) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (763) లో ఉల్లేఖించారు.
మరియు స్త్రీల వరుసలు పురుషుల వరుసల వెనుక ఉండాలి. దీనికి అనస్ రజియల్లాహు అన్హు నివేదించిన ఈ హదీసు ఆధారంగా ఉంది: "నేను మరియు అనాధబాలుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక వరుస కట్టాము, మరియు వృద్ధురాలు మా వెనుక నిలబడింది." [75] [75] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (380); ముస్లిం, హదీథు సంఖ్య (658) లో ఉల్లేఖించారు.
ఇమామ్ వరుసకు సరిగ్గా మధ్యలో నిలబడాలి, అల్లామా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "మస్జిదులలో ఇమామ్ మధ్యలో ఉండటం సున్నత్, ఇది ముస్లింలు అనుసరిస్తూ వస్తున్న ఆచరణాత్మక సున్నత్"[76]. [76] దీనిని షైఖ్ సయీద్ అల్-ఖహ్తానీ రహిమహుల్లాహ్ "అల్-ఇమామతు ఫిస్సలాత్" పుస్తకంలో (పుట 55) ఉల్లేఖించారు.
ఆయన రహిమహుల్లాహ్ ఇంకా ఇలా అన్నారు : "పంక్తి ఇమాముకు వెనకగా మధ్య నుండి ప్రారంభం కావాలి, మరియు ప్రతి పంక్తి యొక్క కుడి వైపు దాని ఎడమ వైపు కన్నా ఉత్తమమైనది. ముందున్న పంక్తి పూర్తి అయ్యేంత వరకు మరో పంక్తిని ప్రారంభించకూడదు."
ఏడవ అంశం: ఇమామ్ కంటే ముందే కదలికలు చేయడం
నమాజ్ చదివేవారు తన ఇమామ్ తర్వాతే నమాజ్ క్రియలను ప్రారంభించాలి, ఇమామ్ను అనుసరించడం మరియు ఆయన అడుగుజాడల్లో నడవడమే ముఖ్తదీ యొక్క బాధ్యత. అనుసరించేవాడు తన నాయకుడి కంటే ముందు వెళ్లకూడదు, లేదా ఆయనతో సమానంగా (ఏకకాలంలో) చేయకూడదు. బదులుగా, ఇమామ్ యొక్క కదలికలను గమనిస్తూ, ఆయన ఆ క్రియను పూర్తి చేసిన వెంటనే తాను కూడా అదే విధంగా చేయాలి. దీని అర్థం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమామ్కు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: «ఇమామ్ ను అనుసరించడానికి అతను నియమించబడతాడు కాబట్టి అతనికి వ్యతిరేఖంగా చేయకండి, అతను రుకూ చేసినప్పుడు మీరు రుకూ చేయండి, అతను ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అన్నప్పుడు మీరు ‘రబ్బనా లకల్ హమ్ద్’ అని చెప్పండి, అతను సజ్దా చేసినప్పుడు మీరు సజ్దా చేయండి, అతను కూర్చుని నమాజు చేయిస్తున్నప్పుడు మీరంతా కూడా కూర్చుని నమాజు ఆచరించండి, మరియు నమాజులో సఫ్ లను సరిదిద్దండి; ఎందుకంటే సఫ్ లను సరిదిద్దడం ఉత్తమ నమాజులో భాగం» [77] [77] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (722); ముస్లిం, హదీథు సంఖ్య (417) లో ఉల్లేఖించారు.
నమాజులోని అన్ని అర్కాన్లలో ఇమామ్ను అధిగమించడం నిషిద్ధం; అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నమాజు చేయించారు, నమాజు పూర్తి చేసిన తరువాత, ఆయన మా వైపు తిరిగి ఇలా సెలవిచ్చారు: «ఓ ప్రజలారా, నిశ్చయంగా నేను మీ ఇమామ్ ను, కాబట్టి రుకూలో, సజ్దాలో, ఖియామ్ లో లేదా నమాజు ముగించడంలో నా కంటే ముందుకు వెళ్ళకండి; ఎందుకంటే నేను మిమ్మల్ని నా ముందు మరియు నా వెనుక నుండి చూస్తాను» [78]. అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవరైనా ఇమామ్ కంటే ముందే (సజ్దా లేదా రుకూ నుండి) తన తలను పైకి ఎత్తినప్పుడు, అల్లాహ్ తన తలను గాడిద తలగా మారుస్తాడని లేదా తన రూపాన్ని గాడిద రూపంగా మారుస్తాడని భయపడరా?” ((79)) [78] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (426) లో ఉల్లేఖించారు. [79] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (691) మరియు ముస్లిం హదీసు సంఖ్య (427) లో ఉల్లేఖించారు.
ఎవరైనా తన ఇమామ్కు ముందుగా తక్బీరె తహ్రీమా పలికితే, అతని నమాజు చెల్లదు; ఎందుకంటే, దానిని ఇమామ్ తరువాత పలకాలనే షరతును అతను చేజార్చుకున్నాడు.
ఎనిమిదవ విషయం: ఇమామత్ మరియు జమాతు యొక్క వివిధ ఆదేశాలు
గతంలో తెలిపినవి కాకుండా ఇమామత్ మరియు జమాతుకు సంబంధించిన ఇతర ఆదేశాలు:
1- జ్ఞానవంతులు మరియు వివేకవంతులు ఇమాముకు సమీపంలో ఉండటం అభిలషణీయం: అందువల్ల, యుక్తవయస్కులైన, బుద్ధి మరియు శ్రేష్ఠత కలిగిన వారిని ఇమామ్ వెనుక ఆయనకు సమీపంగా నిలబెట్టాలి; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «మీలో నెమ్మదస్తులు, తెలివిగలవారు నాకు దగ్గరగా నిలబడాలి, పిదప వారు, పిమ్మట వారు.» [80] [80] దీనిని ముస్లిం అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి (హదీథు సంఖ్య: 432) నమోదు చేసినారు.
2- మొదటి వరుస పట్ల ఆసక్తి: నమాజు చేసేవారు మొదటి వరుసలో నిలబడటానికి ప్రయత్నించాలి మరియు దాని పట్ల ఆసక్తి చూపాలి. మరియు దాని నుండి వెనుకబడకుండా జాగ్రత్తపడాలి; అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులలో కొందరు వెనుకబడి ఉండటం చూసి, వారికి ఇలా సెలవిచ్చారు:
ముందుకు రండి, నన్ను అనుసరించండి, మీ వెనుకున్నవారు మిమ్మల్ని అనుసరిస్తారు, కొందరు ఎల్లప్పుడు వెనుకే ఉంటూ ఉంటారు చివరికి అల్లాహ్ అలాంటి వారిని వెనుకకు నెట్టివేస్తాడు. [81] అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:" ఒకవేళ ప్రజలు అజాన్ ఇవ్వడంలో, మొదటి వరుసలో నమాజ్ చదవడంలో ఎంతటి ఘనత ఉందో తెలిస్తే, ఆ తర్వాత దాని కోసం లాటరీ వేయటం తప్ప వేరే మార్గం దొరకకపోతే, వారు తప్పకుండా లాటరీ వేస్తారు. [82], మరియు భావం: «దాని కోసం నిశ్చయంగా లాటరీ వేసుకునేవారు» అనగా: నమాజులో మొదటి వరుసలో ఎవరు నిలబడాలో నిర్ణయించడానికి, వారు తమలో తాము లాటరీ వేసుకునేవారు. [81] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (438) లో ఉల్లేఖించారు. [82] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 615) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 437) నమోదు చేసినారు.
ఇక మహిళల విషయానికొస్తే, వారికి చివరి పంక్తులలో నిలబడటం ఉత్తమం. దీనికి ఆధారం హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, ఆయన ఇలా తెలిపారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.” [83]. ఈ ఆదేశం వారు ఎటువంటి తెర లేకుండా పురుషుల వెనుక నమాజు చదివేటప్పుడు వర్తిస్తుంది. ఒకవేళ వారు పురుషులకు కనపడకుండా తెరచాటున ఉన్న ప్రార్థనా స్థలంలో నమాజు చదివినట్లైతే, వారు మొదటి వరుసను, ఆపై తర్వాతి వరుసను పూర్తి చేయాలి[84]. [83] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (440) లో ఉల్లేఖించారు. [84] చూడండి: మజ్మూఊ ఫతావా ఇబ్నె బాజ్ (12/196).
3- ఇమామ్ సూరతుల్ ఫాతిహా పఠించడంలో తొందరపడకూడదు, ఇమామును అనుసరించే వారు కూడా దానిని పఠించడానికి వీలయ్యేలా నిదానంగా పఠించాలి[85]. [85] చూడండి: అల్-మిన్జార్ ఫీ బయాన్ కసీర్ మినల్ అఖ్తాఇష్-షాయిఆ లిసాలెహ్ ఆలష్-షేఖ్ పేజీ (53).
4- పంక్తి వెనుక ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజు చెల్లదు; వాబిసా బిన్ మాబద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి పంక్తి వెనుక ఒంటరిగా నమాజు చేయగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ అతనికి ఆ నమాజును పునరావృతం చేయమని ఆదేశించారు[86]. [86] తిర్మిజీ (230) దీనిని ఉల్లేఖించి, వాబిసా హదీసు ఒక హసన్ (ఉత్తమ) హదీసు అని పలికారు.
తొమ్మిదవ అంశం: ఇమామ్ ఆచరించవలసిన సున్నతులు
ఇమామత్ విషయంలో ఇమామ్ , దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్'ను అనుసరించాలి, మరియు ఈ సున్నత్'లలో కొన్ని:
1- నమాజును తేలికగా చేయాలి, మరియు ప్రజల పరిస్థితులను గమనించాలి. అంటే ఇమామ్ తన నమాజులో తొందరపడకుండా నిదానంగా ఉండాలి. అనుసరించేవారు నమాజు యొక్క అర్కాన్ మరియు వాజిబాత్లను పూర్తి చేయలేనంత వేగంగా ఇమామ్ నమాజ్ చేయడం తగదు. మరియు తన వెనుక నమాజ్ చేస్తున్న వారు తమ నమాజును పూర్తి చేసుకోగలిగేలా అతను తన పారాయణంలో కూడా నిదానంగా ఉండాలి. అబూ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ఇలా అన్నాడని ఉల్లేఖిస్తున్నారు: "ఓ దైవప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా, ఫలానా అతను మాకు నమాజు సుదీర్ఘంగా చేయిస్తున్న కారణంగా నేను ఉదయం నమాజులో (అంటే ఫజ్ర్ నమాజులో) పాల్గొనలేక పోతున్నాను. హితబోధ చేస్తున్నప్పుడు ఆ రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహించినంతగా నేను ఆయనను మరెప్పుడూ చూడలేదు. ఆ తర్వాత ఆయన ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా మీలో (ధర్మం పట్ల) విరక్తి పుట్టించే వారున్నారు. కాబట్టి, మీలో ఎవరైతే ప్రజలకు నమాజు చేయిస్తారో, వారు తేలికగా చేయించాలి; ఎందుకంటే వారిలో బలహీనులు, వృద్ధులు మరియు అవసరార్ధులు ఉంటారు»" [87] [87] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీసు నెంబరు (90)
2- నమాజ్ ప్రారంభించక ముందు పంక్తులను సరిచేయమని మరియు ఖాళీలను పూరించమని ఆదేశించాలి; ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా ఆచరించారు మరియు నమాజు చేసేవారికి దానిని ఆదేశించారు. నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాణాలను సరిచేస్తున్నట్లుగా మా పంక్తులను సరిచేసేవారు. మేము ఆ విషయాన్ని అర్థం చేసుకున్నామని ఆయన గ్రహించేంత వరకు (అలా చేసేవారు). ఒకరోజు ఆయన బయటికి వచ్చి నిలబడ్డారు. ఆయన అల్లాహు అక్బర్ అనబోయేంతలో, పంక్తి నుండి ఒక వ్యక్తి రొమ్ము భాగం బయటకు వచ్చి ఉండటాన్ని చూసి ఇలా అన్నారు: “అల్లాహ్ దాసులారా! మీరు మీ పంక్తులను తప్పకుండా తిన్నగా ఉంచుకోవాలి, లేకపోతే అల్లాహ్ మీ ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు”. ((88)) [88] ఈ హదీసును బుఖారీ (717) మరియు ముస్లిం (436) ఉల్లేఖించారు. మరియు పదాలు ముస్లింవి.
ఇమామ్ అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "అల్-ఖిదాహ్" అనగా చెక్కి, నునుపుగా చేసిన బాణపు కర్రలు. దీని అర్థం: వాటిని ఎంత శ్రద్ధగా సూటిగా చేస్తారంటే, వాటి తీవ్రమైన సూటితనం, సమత్వం కారణంగా, వాటితో ఇతర బాణాలను కూడా సరిచేయవచ్చు అన్నట్లుగా అవి తయారవుతాయి[89]. [89] నవవీ యొక్క షరహ్ సహీహ్ ముస్లిం: (4/ 157).
3- ముందుగా తొలి పంక్తిని, తర్వాత దాని వెనుక పంక్తిని భర్తీ చేయమని వారిని ఆదేశించాలి. ఏమైనా వెలితి ఉంటే అది చివరి పంక్తిలోనే ఉండాలి; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “దైవదూతలు తమ ప్రభువు దగ్గర ఏ విధంగా బారులు తీరి నిలబడతారో ఆ విధంగా మీరూ నిలబడరా?” అందుకు మేము, “దైవప్రవక్తా! దైవదూతలు తమ ప్రభువు దగ్గర ఎలా బారులు తీరి నిలబడతారు?” అని అడగగా, దానికి ఆయన ఇలా చెప్పారు: “తొలి పంక్తులను భర్తీ చేస్తారు, మరియు పంక్తిలో ఒకరితో ఒకరు కలిసిపోయి నిలబడతారు.” ((90)) [90] దీనిని ముస్లిం జాబిర్ బిన్ సమురహ్ రదియల్లాహు అన్హు హదీథు నుండి (హదీథు సంఖ్య: 430) నమోదు చేసినారు.
4- నమాజులో పఠించే విషయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా ఫజ్ర్ నమాజులో తివాలె ముఫస్సల్ (సుదీర్ఘమైన సూరాలు) నుండి, మగ్రిబ్ నమాజులో చిన్న సూరాల నుండి, మరియు ఇషా, జుహ్ర్, అస్ర్ నమాజులలో అవసతుల్ ముఫస్సల్ (మధ్యస్థ సూరాలు) నుండి పఠించేవారు. సులైమాన్ బిన్ యసార్, అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి ద్వారా ఇలా ఉల్లేఖించారు: నేను ఫలా వ్యక్తి వెనుక చదివిన నమాజును దైవప్రవక్త చదివించిన మాదిరి పొందాను, సులైమాన్ తెలిపారు: ఆయన జొహర్ యొక్క మొదటి రెండు రకాతులు పొడవుగా, చివరి రెండు రకాతులు చిన్నగా చదివించేవారు, అసర్ ను చిన్నదిగా చదివించేవారు, మగ్రిబ్ నమాజులో ‘కిసారే ముఫస్సల్’ ను పఠించే వారు, ఇషా నమాజులో ‘వసతె ముఫస్సల్’ ను పఠించే వారు, సుబహ్ నమాజులో ‘తివాలె ముఫస్సల్’ ను పఠించే వారు. [91] [91] దీనిని నసాయీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (982). అల్-హాఫిజ్ ‘బులూఘుల్ మరామ్’, హదీసు సంఖ్య (286)లో దీని ఇస్నాద్ సహీహ్ అని అన్నారు.
మరియు తివాలే ముఫస్సల్ (పెద్దవి): సూరతుల్ హుజురాత్ నుండి సూరతుల్ బురూజ్ వరకు, ఔసాత్ (మధ్యస్థమైనవి): సూరతుల్ బురూజ్ నుండి సూరతుల్ బయ్యినహ్ వరకు, మరియు ఖిసార్ (చిన్నవి): సూరతుల్ బయ్యినహ్ నుండి ఖుర్ఆన్ చివరి వరకు[92]. [92] చూడండి: మిర్ఖాతుల్-మఫాతీహ్ (2/ 700).
పదవ విషయం: ఇమామ్ యొక్క అర్హతలు మరియు లక్షణాలు
మస్జిద్ ఇమామ్, మస్జిద్ యొక్క మూలస్తంభం మరియు దాని శక్తిగా పరిగణించబడతాడు. అతని ద్వారానే మస్జిద్, దావా ప్రచారం చేయడంలో, సమాజానికి అవగాహన కల్పించడంలో మరియు ప్రజలకు వారి ధార్మిక విషయాలపై అవగాహన కల్పించడంలో తన సందేశాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి, ఇమామ్ ఒక జ్ఞాని, వివేకవంతుడు, దూరదృష్టి గలవాడు, ప్రజల ఆచారాలు మరియు వారి పరిస్థితుల గురించి తెలిసినవాడైతే, అతని ప్రభావం మస్జిద్ జమాఅత్పై మరియు మస్జిద్ ఉన్న ప్రాంతంలోని నివాసులపై మంచిగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. అతను వారికి బోధిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు మరియు వారిని ప్రతి మంచి మరియు సద్గుణం వైపు నడిపిస్తాడు.
ఇమామత్ యొక్క షరతులను పూర్తిచేసిన ఇమాములు ఈ విధంగానే ఉండేవారు. ఇస్లాం ప్రారంభంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇమామ్ గా ఉండేవారు, ఆ తర్వాత ఆయన ఖలీఫాయె రాషిదీన్లు, ఆ తర్వాత పాలకులు, నాయకులు, పండితులు మరియు ప్రముఖులు ఉండేవారు. ఇది సూచిస్తుంది ఏమంటే, ఈ బాధ్యతను చేపట్టే వ్యక్తి తప్పనిసరిగా ధర్మంలో, నైతికతలో, జ్ఞానంలో మరియు ప్రవర్తనలో అత్యున్నత స్థాయిలో ఉండాలి.
ప్రజల జీవితాల్లో ఇమామ్ పాత్ర ఎంత కీలకమో ఇక్కడ స్పష్టమవుతోంది. ఇమామ్ల సామర్థ్యం ఆయా సమాజాల అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇమామ్ శక్తివంతుడైతే సమాజం బాగుంటుంది, బలహీనుడైతే దాని ప్రభావం సమాజంపై ప్రతికూలంగా ఉంటుంది; ఎందుకంటే మస్జిద్ సమాజానికి మాటను ఆచరణతో ముడిపెట్టడం నేర్పిస్తుంది. ఒకవేళ ఇమామ్ అల్పజ్ఞాని అయినా, బుద్ధిహీనుడైనా లేదా చెడు నడవడిక, ప్రవర్తన కలవాడైనా, అతను ప్రయోజనం చేకూర్చకపోగా హాని కలిగిస్తాడు. మరియు నమాజీలను మంచి, పుణ్యం మరియు సత్ప్రవర్తన వైపు మార్గనిర్దేశం చేయడం ఇమామ్ యొక్క బాధ్యత అయినప్పుడు, అజ్ఞాని అయిన ఇమామ్ ఈ మహత్తరమైన బాధ్యతను నెరవేర్చడం చాలా కష్టం.
ఒక్కోసారి ఇమామ్ తన జ్ఞానం మరియు వ్యక్తిగత సామర్థ్యం పరంగా ఈ బాధ్యతకు అర్హత కలిగి ఉండవచ్చు, కానీ అతను తన పనితీరుపై ప్రభావం చూపే ఇతర పనులతో నిమగ్నమై ఉంటాడు. దాని కారణంగా, అతను నమాజ్ వేళలకు ఆలస్యంగా వస్తాడు, మరియు నమాజులలో పారాయణం చేసే సూరాలను లేదా ఆయతులను పునశ్చరణ చేసుకోవడానికి తగినంత సమయం దొరకదు; అందువల్ల, అతను కొన్ని నిర్దిష్ట సూరాలు లేదా ఆయతులతోనే నమాజ్ చేయిస్తూ, వాటిని దాటి ముందుకు వెళ్ళకపోవడాన్ని మనం గమనిస్తాము.
మరియు కొన్నిసార్లు అతను మనోవాంఛల, అజ్ఞానం, వివాదాల, లేదా గర్హనీయమైన అతివాదం యొక్క ఆధిపత్యానికి గురై; నిష్పాక్షికత, శిక్షణాత్మక మార్గదర్శకత్వం, మరియు వివేకంతో, మంచి ఉపదేశంతో చేసే దావత్ నుండి వైదొలగుతాడు.
నిశ్చయంగా ఈ ధర్మంలో మస్జిదుకు ఒక గొప్ప ప్రభావం ఉంది; ఎందుకంటే అది మార్గదర్శకపు దీపస్తంభం, దానిలో దాసుడు తన ప్రభువుతో అనుసంధానమవుతాడు, అతని విశ్వాసం బలపడుతుంది. మరియు తన సోదరులతో సమావేశమై, అందరూ కలిసి సద్గుణాలను వ్యాప్తి చేయడానికి మరియు దుర్గుణాలను ఎదుర్కోవడానికి సహకరించుకుంటాడు. ఈ కార్యాన్ని మస్జిద్ నెరవేర్చాలంటే, అల్లాహ్ దాని కొరకు ఒక ఇమామ్ను సిద్ధపరచాలి. ఈ గొప్ప పదవిని చేపట్టే ప్రతి ఒక్కరికీ అవసరమైన జ్ఞాన మరియు నైతిక అర్హతలు ఆ ఇమామ్లో ఉండాలి, మరియు అతను ఈ మహోన్నత బాధ్యత యొక్క విధులను నెరవేర్చగలగాలి.
ఇమామ్ యొక్క అత్యంత ముఖ్యమైన విజ్ఞాన అర్హతలు:
1- చేసే ప్రతి పనిని కేవలం అల్లాహ్ సంతృప్తి కోసమే చేయడం (ఇఖ్లాస్); తద్వారా అల్లాహ్ నుండి సహాయం, విజయం మరియు అంగీకారం లభిస్తాయి, అలాగే అల్లాహ్ వద్ద మరియు ప్రజల వద్ద గౌరవం, ప్రేమ పెరుగుతాయి.
2 - ప్రదర్శన మరియు గొప్పలు చెప్పుకోవడం నుండి దూరంగా ఉండాలి; ఎందుకంటే నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి, మరియు ప్రతి వ్యక్తికి అతను సంకల్పించుకున్నదే లభిస్తుంది. మరియు ఎవరైతే తనలో లేని దానితో గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడో, అల్లాహ్ అతడిని అవమానపరుస్తాడు.
3- అతను అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ను కంఠస్తం చేసిన హాఫిజ్ అయి ఉండాలి, లేదా దానిలో కొంత భాగాన్నైనా హిఫ్జ్ చేసి ఉండాలి. తాను హిఫ్జ్ చేసిన దానిని నిరంతరం పునశ్చరణ చేస్తూ ఉండాలి మరియు ఖుర్ఆన్ పారాయణం కొరకు ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి.
4 - రియాదుస్ సాలిహీన్, లేదా అల్-అర్బయీన్ అన్-నవవియ్యహ్, లేదా బులుఘుల్ మరామ్, లేదా ఇతర ప్రామాణికమైన హదీసు గ్రంధముల నుండి కొన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను కంఠస్థం చేయాలి.
5 - సరైన అఖీదాను, అంటే సలఫ్ సాలెహ్ యొక్క అఖీదాను అభ్యసించడం.
6 - ధార్మిక నియమాలపై ఫిఖ్ (ధర్మశాస్త్రం) నేర్చుకోవాలి, ముఖ్యంగా ఆరాధనల ఫిఖ్, వాటిలో అతి ముఖ్యమైనవి తహారత్, నమాజ్, జకాత్ మరియు ఉపవాసానికి సంబంధించినవి. అదే విధంగా వ్యవహారాల ఫిఖ్ కూడా నేర్చుకోవాలి; తద్వారా సంపాదన మరియు ఖర్చు యొక్క నియమాలను తెలుసుకొని, ప్రజలను మోసం, వంచన మరియు అన్యాయంగా ఇతరుల ధనాన్ని తీసుకోవడం నుండి హెచ్చరించాలి. అలాగే వారిని వృధా ఖర్చు, దుబారా, పిసినారితనం మరియు లోభత్వం నుండి కూడా హెచ్చరించాలి, అప్పుడు వారి ఆర్థిక లావాదేవీలన్నీ ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో ఉంటాయి.
7 - అల్లాహ్ తన సందేశహరునిపై అవతరింపజేసిన దాని అర్ధాలను తెలుసుకోవటానికి అరబీ భాషలో ప్రావీణ్యత సంపాదించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ అరబ్బుల భాషలో అవతరించింది.
8 - ప్రవక్త జీవిత చరిత్ర, ప్రవక్తగారి ఉన్నత గుణగణాలు మరియు పుణ్య పూర్వీకుల చరిత్రలను అధ్యయనం చేయాలి; ఎందుకంటే వాటిలో మంచి ఆదర్శం, ఉత్తమ మార్గదర్శకత్వం, ప్రయోజనకరమైన విజ్ఞాన సంపద మరియు ఉన్నతమైన ఇస్లామీయ సంస్కృతి ఉన్నాయి.
9- తన దేశంలోని పండితులను మరియు సరైన అఖీదా (విశ్వాసం), జ్ఞానం, వివేకం కలిగి ఉన్న ఇతర ప్రసిద్ధ పండితులను గుర్తించి ఉండాలి; తన ధార్మిక సందేహాల నివృత్తికి మరియు సమాజ సమస్యల పరిష్కారానికి వారిని సంప్రదించి, వారి మార్గదర్శకత్వాన్ని పొందాలి.
10 - ఇస్లామీయ సమూహాలు (ఫిరఖ్) మరియు వాటి అఖీదాలను (విశ్వాసాలను), వివిధ మేధోపరమైన ధోరణులను మరియు వాటి ఉద్దేశాలను, అలాగే విచ్ఛిన్నకర మతాలను మరియు వాటి లక్ష్యాలను గుర్తించి ఉండాలి; తద్వారా అల్లాహ్ గ్రంథం (ఖురాన్), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ మరియు నిష్పాక్షిక ముస్లిం పండితుల రచనల వెలుగులో వాటిని చర్చించి, వాటిలోని అసత్యాలను విమర్శిస్తూ, వాటి తప్పుడు మార్గాల పట్ల ప్రజలను హెచ్చరించగలగాలి.
11- వివిధ మీడియా మాధ్యమాలను మరియు వాటి మంచిచెడులను తెలుసుకోవాలి, అల్లాహ్ మార్గం వైపు ఆహ్వానించడంలో వాటి నుండి ఎలా ప్రయోజనం పొందాలో నేర్చుకోవాలి మరియు వాటిలో తన కొరకు, తన సమాజం కొరకు ఉన్న ప్రమాదాల నుండి జాగ్రత్త పడాలి.
మస్జిద్ ఇమామ్కు ఈ అర్హతలు ఉన్నప్పుడు, అది అల్లాహ్ తఆలా అనుమతితో ధర్మనిష్ఠ మరియు సమతుల్యతను కలిగిస్తుంది.
ప్రధానమైన నైతిక అంశాలు:
1) మస్జిద్ ఇమామ్ , ఆ మస్జిద్ జమాఅత్ కొరకు, మరియు ఆ ప్రాంతం నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చే వారి కొరకు ఒక ధర్మ ప్రచారకుడిగా మరియు బోధకుడిగా ఉండాలి. అతను తప్పనిసరిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక ఉత్తమమైన నమూనాగా తీసుకోవాలి; ఎందుకంటే ఆయనే ఉమ్మత్ మరియు నాయకుల కొరకు యోగ్యమైన నమూనా, శ్రేష్ఠమైన ఆదర్శం మరియు అత్యున్నత ఉదాహరణ. సర్వోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో! [ అహ్జాబ్: 21]
తాను మరియు తన మస్జిద్ కు వచ్చే ఆరాధకులను ప్రాపంచిక, రాజకీయ చర్చల నుండి దూరంగా ఉంచాలి మరియు మస్జిద్ ను కేవలం ధార్మిక జ్ఞానం మరియు ఆరాధనలకే పరిమితం చేయాలి.
2 - తాను స్వయంగా పరిశుభ్రమైనవాడై, క్రమశిక్షణ గలవాడై ఉండాలి. అలాగే మసీదు శుభ్రత, దానిలోని వస్తువులను సర్ది, క్రమబద్ధంగా ఉంచడం, దాని అనుబంధ నిర్మాణాలను సంరక్షించడం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఆ విషయంలో దుబారా ఖర్చుకు, మసీదు అలంకరణకు దూరంగా ఉండాలి.
3- గడ్డాన్ని పెంచుకోవటం మరియు మీసాలను కత్తిరించుకోవటం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను అనుసరిస్తూ, వస్త్రాలను చీలమండల క్రిందకు జారవిడచకుండా ఉంటూ, మంచి నడవడిక మరియు స్వరూపముతో, గౌరవం మరియు ప్రశాంతతతో ఉండాలి. మరియు గతించిన సలఫ్ సాలిహీన్ (సత్పురుషులైన పూర్వీకులు) - అల్లాహ్ వారిపై కరుణించుగాక - వారి మార్గాన్ని అనుసరించేవాడై ఉండాలి.
4- అతను సౌమ్యుడుగా, సహనశీలిగా, కరుణామయుడుగా ఉండాలి; ఎందుకంటే హదీసులో వచ్చినట్లుగా, మృదుత్వం ఏ విషయంలో ఉన్నా దానికి అలంకారంగా ఉంటుంది, అదే దాని నుండి తీసివేయబడితే అది లోపభూయిష్టంగా మారుతుంది; ఆయెషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరిలోనైతే మృదువైఖరి ఉంటుందో అతనికి అది అలంకారంగా ఉంటుంది అదే మృదుత్వం లేకపోతే అతనికి అది ఒక లోపంగా మిగిలిపోతుంది. [93] [93] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (2594) లో ఉల్లేఖించారు.
కాబట్టి మస్జిద్కు వచ్చేవారిలో ఒకరి నుండి ఏదైనా తప్పు జరిగితే, ఇమామ్ అతడిని గద్దించకూడదు; బదులుగా, అతనికి సున్నితంగా సలహా ఇవ్వాలి; మరియు మంచి పద్ధతిలో బోధించాలి. ముఆవియా బిన్ అల్ హకమ్ అస్సులమి రజియల్లాహు అన్హు కథనం: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో పాటుగా నమాజు చదువుతున్నాను, అప్పుడు జనుల్లో ఒకరు తుమ్మాడు,నేను ‘యర్హముకల్లాహ్’అని చెప్పాను,అప్పుడు ప్రజలంతా తమ చూపుల బాణాలను నా పై సారించారు,నేను‘ నా తల్లి నా పై దుఖిస్తే బాగుండు’మీరంతా అలా నన్ను ఎందుకు చూస్తున్నారు?అని అడిగాను దానికి వారు తమ చేతులను తొడలపై కొట్టసాగారు,వారు నన్ను నిశబ్దంగా ఉండమని సైగచేయడం చూసి నేను నిశబ్దం పాటించాను,దైవప్రవక్త నమాజు చదివించడం ముగిసాక ‘-నా తల్లిదండ్రులు ఆయన కొరకు త్యాగపడుగకా, ఆయన మాదిరి ‘అత్యుత్తమమైన రీతిలో భోదించే వారిని నేను ఇప్పటి వరకు చూడ లేదు ఇక చూడబోను, అల్లాహ్ సాక్షిగా ఆయన నన్ను బెదిరించలేదు (అంటే: ఆయన నన్ను అణచివేయలేదు, గద్దించలేదు), కొట్టలేదు మరియు దూషించలేదు,{నిశ్చయంగా ఈ నమాజు లో ప్రజలతో సంభాషించడం లాంటి వ్యర్థ విషయాలు చేయకూడదు,కేవలం తస్బీహ్,తక్బీర్ మరియు ఖుర్ఆన్ పారాయణం లాంటివి మాత్రమే చేయాలి} ((94)) [94] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (537) లో ఉల్లేఖించారు.
5- ఇమామ్ మృదుస్వభావిగా మరియు దయా హృదయుడిగా ఉండాలి; తద్వారా ప్రజలు ఆయన చుట్టూ చేరి, ఆయన చూపే ఆప్యాయత, సహాయం మరియు జ్ఞానం నుండి ప్రయోజనం పొందగలరు. అలాగే వారి కష్టసుఖాలలో మరియు అవసరాలలో వారికి అండగా నిలబడాలి. మస్జిద్ యొక్క లక్ష్యాలకు (ధార్మిక సేవలకు) సంబంధించిన విషయాలలో వారితో సంప్రదింపులు (మషూరా) జరపడం కూడా ఎంతో అవసరం.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వాటన్నింటిలోనూ అత్యున్నత స్థానంలో ఉండేవారు, ఆయన గురించి పరమ ప్రభువు ఈ విధంగా ప్రస్తుతించాడు: (ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. [ఆలి ఇమ్రాన్ : 159]
6- సహనము, నమ్మకమును మరియు తాను చెప్పేదానిలో సత్యాన్ని అలవర్చుకోవాలి, తద్వారా తన మస్జిద్ మరియు తన జమాఅత్ మధ్య ఇమామత్ గౌరవానికి అర్హత పొందుతాడు; నిశ్చయంగా సహనము మరియు నమ్మకము దాసుడిని ధర్మంలో ఇమామత్ స్థాయికి చేరవేస్తాయి, మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: మరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో! [అస్ సజదహ్ : 24]
7- అతను చెప్పే దానిలో సత్యవంతుడై ఉండాలి, అది శుక్రవారం ఖుత్బాలో అయినా, బోధన మరియు ఉపదేశ పాఠంలో అయినా, లేదా ప్రజలతో అతని మాటలలో అయినా సరే; తద్వారా అతను సత్యవంతులు, సన్మార్గం పొందినవారు మరియు విజయం సాధించినవారిలో చేరతాడు; ఎందుకంటే హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు» [95] [95] దీనిని బుఖారీ (6094), ముస్లిం (2607) ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.
మరియు అబద్ధం ఒక కీడు మరియు పీడ, మరియు అబద్ధాలలోకెల్లా అత్యంత ఘోరమైనది మహోన్నతుడైన అల్లాహ్ పై అబద్ధం పలకడం మరియు జ్ఞానం లేకుండా ఆయనపై పలకడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఇలా అను: "నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు. [అల్ ఆరాఫ్:33]
కావున ఈ గౌరవప్రదమైన ఆయత్ అత్యంత భయంకరమైన పాపాలను కనిష్ఠ స్థాయి నుండి గరిష్ఠ స్థాయి వరకు వరుసక్రమంలో పేర్కొన్నది. అందులో అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు ఆయన ధర్మశాస్త్రం (షరిఅత్) విషయంలో ఎటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడటం కూడా చేర్చబడింది.
మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమం పై అసత్యం పలకడం అత్యంత ఘోరమైన అబద్ధం మరియు అత్యంత నీచమైన పాపము, మరియు ఇది మహా పాపాలలో ఒకటి, దీనిని చేసిన వారికి నరకాగ్ని శిక్ష తప్పదని హెచ్చరించబడింది; అల్-ముగీరహ్ బిన్ షుఅబ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చెప్పగా విన్నాను: “నిశ్చయంగా నా గురించి అసత్యం పలకడం, ఇతరుల గురించి అసత్యం పలికినట్లు కాదు. ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి” [96] [96] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1291); ముస్లిం, హదీథు సంఖ్య (4) లో ఉల్లేఖించారు.
మంచి పనుల పట్ల ఆసక్తిని కలిగించడానికి లేదా చెడు నుండి హెచ్చరించడానికి సదుద్దేశంతో కూడినదైనప్పటికీ అబద్ధం చెప్పకుండా దూరంగా ఉండాలి. కొందరు ఉపన్యాసకులు చేసే విధంగా అసత్యాలు పలకడం అత్యంత హేయమైనది; దానిలో ఎటువంటి మేలు గానీ, మార్గదర్శకత్వం గానీ ఉండదు. అలా అబద్ధాలు చెప్పేవాడు పాపాత్ముడు అవుతాడే తప్ప పుణ్యానికి అర్హుడు కాడు, దోషిగా మిగిలిపోతాడే తప్ప ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేడు.
8- మాటను చేరవేయడంలో నమ్మకస్తుడిగా ఉండాలి, సమాచారముల నిజనిజాలను నిర్ధారించుకోవాలి, వదంతులను స్వీకరించడంలో తొందరపడకూడదు మరియు కేవలం విశ్వసనీయమైన మాటపైనే ఆధారపడాలి. మహోన్నతుడైన అల్లాహ్ తన ఈ వాక్కులో మనల్ని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి. [అల్ హుజ్'రాత్:6]
9- ప్రజల లోపాలను దాచిపెట్టడంలో అత్యంత శ్రద్ధ వహించాలి మరియు వారి రహస్యాలను గోప్యంగా ఉంచాలి. ఎవరైతే ఒక ముస్లిం లోపాన్ని దాచిపెడతారో, అల్లాహ్ వారి లోపాలను ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ దాచిపెడతాడు. ఎవరైతే ముస్లింల లోపాల వెనుక పడతారో, అల్లాహ్ వారి లోపాల వెనుక పడతాడు; చివరకు వారు తమ ఇంట్లో దాక్కున్నప్పటికీ అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రజిఅల్లాహు అన్హుమా) కథనం ప్రకారం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు. అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:" «ఓ కేవలం నాలుకతో విశ్వసించి, ఇంకా హృదయాలలో ఈమాన్ (విశ్వాసం) ప్రవేశించని ప్రజలారా! ముస్లింల గురించి చాడీలు (గీబత్) చెప్పకండి మరియు వారి లోపాల వెనుక పడకండి; ఎందుకంటే ఎవరైతే ఇతరుల లోపాల వెనుక పడతారో, అల్లాహ్ వారి లోపాల వెనుక పడతాడు. అల్లాహ్ ఎవరి లోపాలనైతే బయటపెట్టాలని నిశ్చయిస్తాడో, వారిని వారి స్వగృహంలోనే అవమానపరుస్తాడు.» [98] [97] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2442) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2580) లో ఉల్లేఖించారు. [98] అబూ దావుద్, హదీథు సంఖ్య (4880). ఈ అర్హతల కోసం, షేఖ్ సౌద్ బిన్ ముహమ్మద్ అల్-బషర్ రచించిన ‘మస్జిద్ ఇమామ్: అతని విజ్ఞానపరమైన మరియు నైతిక అర్హతలు’ అనే గ్రంథాన్ని చూడవచ్చు.
మూడవది: జుమా (శుక్రవారం) నమాజ్ మరియు దాని ఖుత్బాహ్ (ప్రసంగం)
మొదటి అంశం: జుమా (శుక్రవారం) నమాజ్
మొదటి విషయం: జుమా (శుక్రవారం) నమాజ్ యొక్క భావన మరియు దాని సమయం:
మొదట: జుమా (శుక్రవారం) నమాజ్ యొక్క భావన:
జుమా: వారం రోజులలోని ఒక రోజు, ఆ రోజున ఒక ప్రత్యేక నమాజు చేయబడుతుంది, అదే జుమా (శుక్రవారం) నమాజు [99]. [99] చూడండి: ముహమ్మద్ రవాస్ ఖల్అజీ మరియు ఇతరుల ముఅజమ్ లుగతిల్ ఫుఖహా: (పే: 166).
ఈ ఉమ్మత్కు జుమా (శుక్రవారం) రోజు వైపు అల్లాహ్ మార్గదర్శకత్వం చూపడం గొప్ప అనుగ్రహం; అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మనం (కాలక్రమంలో) అందరికంటే చివరగా వచ్చిన వారం, కానీ ప్రళయ దినమున అందరికంటే ముందు ఉంటాము. అయితే వారికి మనకంటే ముందే గ్రంథం ఇవ్వబడింది, మనకు వారి తర్వాత ఇవ్వబడింది. ఇది (శుక్రవారం) అల్లాహ్ వారిపై విధిగా నిర్ణయించిన రోజు, కానీ వారు దీని విషయంలో విభేదించారు. అల్లాహ్ మనకు దీని పట్ల సరైన మార్గదర్శకత్వం ప్రసాదించాడు. కావున ఈ విషయంలో ప్రజలందరూ మనల్ని అనుసరిస్తారు; యూదులు రేపు (శనివారం), క్రైస్తవులు ఎల్లుండి (ఆదివారం) అనుసరిస్తారు.» ((100)) [100] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (876); ముస్లిం, హదీథు సంఖ్య (855) లో ఉల్లేఖించారు.
సూర్యుడు ఉదయించే దినములలో శుక్రవారము ఉత్తమమైనది; అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «సూర్యుడు ఉదయించే రోజుల్లో అత్యంత శ్రేష్టమైనది శుక్రవారం. ఆ రోజే ఆదం (అలైహిస్సలాం) సృష్టించబడ్డారు, ఆ రోజే ఆయన స్వర్గంలో ప్రవేశపెట్టబడ్డారు మరియు ఆ రోజే ఆయన అక్కడ నుండి (భూమిపైకి) పంపబడ్డారు.» [101]. [101] ముస్లిం, హదీథు సంఖ్య (854).
మరియు ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం మధ్య జరిగిన పాపాలకు అవి ప్రాయశ్చిత్తం (కఫ్ఫారా) అవుతాయి; అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు) కథనం ప్రకారం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించేవారు: «ఘోరపాపాలకు పాల్పడకుండా ఉంటే, ఐదు పూటల నమాజులు, ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు మరియు ఒక రమదాన్ నుండి మరొక రమదాన్ వరకు ఇవి తమ మధ్య జరిగిన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతాయి.» [102] [102] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
జుమా నమాజు: ఇది ఒక స్వతంత్రమైన నమాజ్. ఇది రకాతుల సంఖ్యలో, బిగ్గరగా పఠించడంలో, ఖుత్బా (ప్రసంగం) ఉండటంలో మరియు దానికి పరిగణించబడే నిబంధనలలో (షరతులు) జుహ్ర్ నమాజ్ కంటే భిన్నంగా ఉంటుంది; అయితే సమయం విషయంలో మాత్రం జుహ్ర్ నమాజ్తో ఏకీభవిస్తుంది.
రెండవది: జుమా (శుక్రవారం) నమాజు సమయం:
జుమా నమాజు సమయం జుహ్ర్ నమాజు సమయమే. సూర్యుడు నడినెత్తి నుండి పశ్చిమం వైపు వాలిన తర్వాత నుండి, ఒక వస్తువు యొక్క నీడ దాని ఎత్తుకు సమానమయ్యే వరకు దీని సమయం ఉంటుంది. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యుడు వాలినప్పుడు జుమా నమాజు ఆచరించేవారు [103]. అనగా, సూర్యుడు పశ్చిమ దిశగా వాలి, ఆకాశ మధ్యం నుండి తొలగిపోవడం. ఇదే జుహ్ర్ నమాజు యొక్క సమయం. [103] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (904) లో ఉల్లేఖించారు.
రెండవది: జుమా (శుక్రవారం) నమాజ్ యొక్క ఆదేశం, మరియు అది ఎవరిపై అనివార్యమగును?
మొదట: జుమా (శుక్రవారం) నమాజ్ యొక్క ఆదేశం:
జుమా (శుక్రవారం) నమాజు ప్రతి పురుషునిపై వ్యక్తిగత విధి; ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది. [అల్ జుమఅ : 9] అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) తాము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి ఇలా అనగా విన్నాము అని ఉల్లేఖిస్తున్నారు: «ప్రజలు జుమా నమాజుకు ఎగనామం పెట్టడాన్ని మానుకోవాలి. లేకపోతే అల్లాహ్ వారి హృదయాలకు సీలు వేసేస్తాడు. ఫలితంగా వారు తప్పకుండా నిర్లక్ష్యం వహించే వారిలో చేరిపోతారు.» [104] [104] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (865) లో ఉల్లేఖించారు.
జుమా (శుక్రవారం) నమాజు వాజిబ్ (విధి) అనే విషయంపై ముస్లింల ఏకాభిప్రాయం (ఇజ్మా) ఉంది. ఇబ్నుల్ ముంధిర్ రహిమహుల్లాహు తఆలా ఇలా అన్నారు: "మరియు జుమా; స్వతంత్రులు, యుక్తవయస్సుకు చేరినవారు, నివాసితులు మరియు ఎటువంటి కారణం లేని వారిపై విధి అని వారు ఏకగ్రీవంగా అంగీకరించారు" [105]. [105] అల్-ఇజ్మా: (స 40).
రెండవది: అది ఎవరిపై విధి అవుతుంది?
ప్రతి ముస్లిం, పురుషుడు, స్వతంత్రుడు, యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిన, హాజరు కాగల సామర్థ్యం ఉన్న నివాసిపై జుమా తప్పనిసరి. కావున ఇది వీరిపై విధి కాదు: బానిస, స్త్రీ, బాలుడు, మతిస్థిమితం లేనివాడు, రోగి, లేదా ప్రయాణికుడు. దీనికి ఆధారం, తారిఖ్ ఇబ్న్ షిహాబ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించిన హదీసు, ఆయన ఇలా అన్నారు: «జుమ్మా నమాజ్ జమాఅత్తో కలిసి నిర్వహించడం ప్రతి ముస్లింపై తప్పనిసరి బాధ్యత. అయితే నలుగురికి మాత్రం దీని నుండి మినహాయింపు ఉంది: వారు ఎవరంటే ఒకరి ఆధీనంలో ఉన్న బానిస, స్త్రీ, బాలుడు మరియు రోగి.» ((106)) [106] అబూ దావుద్, హదీథు సంఖ్య (1067).
ఇక ప్రయాణికుడి విషయానికి వస్తే, అతనికి జుమా నమాజ్ తప్పనిసరి కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రయాణాలలో జుమా నమాజు చదివేవారు కాదు. ఆయన చేసిన హజ్లో అరఫా రోజు శుక్రవారం వచ్చింది, అయినప్పటికీ, ఆయన జుహ్ర్ నమాజు చదివి, దానితో అస్ర్ నమాజును కలిపి చదివారు.
ఇబ్నుల్ మున్దిర్ రహిమహుల్లాహు తఆలా ఈ విషయంపై ఉమ్మత్ యొక్క ఏకాభిప్రాయమును (ఇజ్మాను) ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు: "పసిపిల్లలపై మరియు స్త్రీలపై జుమా విధి కాదని ఏకాభిప్రాయం ఉంది... అలాగే, స్వతంత్రులు, యుక్తవయస్సుకు చేరినవారు, నివాసితులు మరియు ఎలాంటి కారణం లేని వారిపై జుమా విధి అని కూడా ఏకాభిప్రాయం ఉంది"[107]. [107] అల్-ఇజ్మా’: (స 40).
ఒకవేళ బానిస, స్త్రీ, బాలుడు, రోగి, లేదా ప్రయాణికుడు దీనికి హాజరైనట్లయితే, వారి నమాజు చెల్లుతుంది మరియు అది వారికి జొహర్ నమాజుకు సరిపోతుంది.
పశుగ్రాసం మరియు నీటి కోసం ఒక చోట నుండి మరొక చోటికి వలస వెళ్లే సంచార ప్రజలకు జుమా నమాజు తప్పనిసరి కాదు. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఈ సంచార ప్రజలు మదీనా చుట్టుపక్కల ఉండేవారు, అయినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జుమా చేయమని ఆజ్ఞాపించలేదు. ఇమామ్ అహ్మద్ ఇలా అన్నారు: పల్లె ప్రాంతాల వారిపై జుమా లేదు; ఎందుకంటే వారు తరలిపోతూ ఉంటారు. కావున దాని నుండి మినహాయింపునకు కారణం వారి తరలిపోవడమే. కాబట్టి ఎవరైతే స్థిరనివాసం కలిగి ఉండి, తన ఇష్టానుసారంగా తరలిపోడో, అతడు గ్రామస్తుల పరిధిలోకి వస్తాడు [108]. [108] మజ్మూఉల్ ఫతావా: (24/166).
జుమా ముగ్గురితో స్థాపించబడుతుంది: ఒకరు ఖుత్బా ఇచ్చేవారు, ఇద్దరు వినేవారు; ఎందుకంటే అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు: ...అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి... [అల్ జుమఅ: 9] ఇది సమూహము, మరియు సమూహం యొక్క కనీస సంఖ్య ముగ్గురు.
మూడవది: జుమా నమాజ్ యొక్క విధానం:
జుమా నమాజు రెండు రకాతులు, ఇందులో ఖిరాత్ బిగ్గరగా చేయబడుతుంది; ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేసేవారు, మరియు దీనిపై విద్వాంసుల ఏకాభిప్రాయం కూడా ఉంది. ఇబ్న్ హజ్మ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటారు: "షరతులకు అనుగుణంగా నిర్వహించబడిన జుమా నమాజు రెండు రకాతులని, వాటిలో బిగ్గరగా పఠించబడుతుందని ఏకాభిప్రాయం ఉంది [109]." [109] మరాతిబ్ అల్-ఇజ్మా: (సాద్ 33).
మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత సూరె ఆలా, రెండవ రకాతులో సూరె గాషియా పఠించడం సున్నత్; హజ్రత్ నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు ఈదులలో మరియు జుమాలో ‘సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా’ మరియు ‘హల్ అతాక హదీసుల్ గాషియా’ సూరాలను పఠించేవారు. [110] ముస్లిం, హదీథు సంఖ్య (878).
లేదా మొదటి రకాతులో ఫాతిహాతో పాటు సూరతుల్ జుముఆ, రెండవ రకాతులో ఫాతిహాతో పాటు సూరతుల్ మునాఫిఖూన్ చదువుతారు; ఇబ్న్ అబీ రాఫే ఉల్లేఖనం ప్రకారం: మర్వాన్ మక్కాకు వెళ్తూ, అబూ హురైరా (రజియల్లాహు అన్హు)ను మదీనాకు ప్రతినిధిగా నియమించాడు. అప్పుడు అబూ హురైరా (రజియల్లాహు అన్హు) మాకు జుముఆ నమాజు చేయించారు. ఆయన సూరతుల్ జుముఆ తర్వాత, చివరి రకాతులో: ఇజా జాఅకల్ మునాఫిఖూన్ పారాయణం చేశారు. ఉల్లేఖకుడు ఇలా అన్నారు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు) నమాజు ముగించాక నేను ఆయనను కలుసుకుని, "మీరు పారాయణం చేసిన ఈ రెండు సూరాలనే అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (రజియల్లాహు అన్హు) కూఫాలో పారాయణం చేసేవారు" అని అన్నాను. దానికి అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు: «మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజున ఆ రెండింటిని పఠించడం నేను విన్నాను» [111]. [111] ముస్లిం, హదీథు సంఖ్య (877).
నాల్గవది: జుమాను దేనితో పొందుతారు?
ఇమామ్ తోపాటు ఒక రకాతు పొందితే జుమాను పొందినట్లే; అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘ఎవరైతే జుమా యొక్క లేదా ఇతర నమాజుల యొక్క ఒక్క రకాతు పొందినా అతని నమాజు పూర్తయినట్లే’ [112] [112] దీనిని నసాయీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (557)
ఒకవేళ ఒకరకాతు కంటే కనిష్ట సమయం పొందితే అతను జుహర్ నమాజు చేయాలి [113]. [113] చూడండి: అల్ ముఘ్నీ లిఇబ్ని ఖుదామహ్: (2/ 231)
కాబట్టి, ఎవరికైతే జుమా నమాజులో ఒక రకాతు తప్పిపోయి, ఇమామ్ను రెండవ రకాతులో ఆయన రుకూ సమయంలో లేదా అంతకు ముందు పొందుతారో, వారు కేవలం ఒక రకాతు మాత్రమే పూర్తి చేయాలి, హదీసు ప్రకారం: ‘ఎవరైతే నమాజు యొక్క ఒక్క రకాతు పొందినా అతను పూర్తి నమాజును పొందుతాడు’ [114] [114] అబూ దావుద్, హదీథు సంఖ్య (893)
ఐదవది: జుమాలో వారించబడినవి
1) ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు మాట్లాడటం నిషేధించబడింది, అబూ హురైర రజియల్లాహు అన్హు నుండి ధృవీకరించబడిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు ఇందుకు ఆధారం: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు వ్యర్ధమైనపని చేసినవాడవు అవుతావు.” [115] అంటే: నీవు అనవసరమైన మాట (లగ్వ్) మాట్లాడావు. అది వ్యర్థమైన, తిరస్కరించబడిన మాట. మరియు నీ జుమా యొక్క పుణ్యం వ్యర్థమైపోయింది. [115] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 934) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 851) లో నమోదు చేసారు.
ఇమామ్ అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఈ హదీథులో ఖుత్బా సమయంలో అన్ని రకాల సంభాషణలు నిషిద్ధం. దీని ద్వారా ఇతర విషయాల గురించి కూడా హెచ్చరించబడింది; ఎందుకంటే, ‘నిశ్శబ్దంగా ఉండండి’ అని చెప్పడం వాస్తవానికి మంచిని ఆజ్ఞాపించడమే అయినప్పటికీ, దానిని (లగ్వ్) (పనికిమాలిన మాట) అని చెప్పబడింది. అలాంటప్పుడు, మిగిలిన సాధారణ సంభాషణలు నిషిద్ధం కావడానికి మరింత అర్హమైనవి"[116]. [116] షర్హు ముస్లిం (6/138)
మాట్లాడకూడదనే నిషేధంలో తుమ్మినవారికి జవాబివ్వడం, సలాంకు జవాబివ్వడం కూడా వస్తాయి. కాబట్టి ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు అలా చేయడం అనుమతించబడదు. అయితే, ఖతీబ్ ఖుత్బా ప్రారంభించడానికి ముందు మరియు రెండు ఖుత్బాల మధ్య విరామ సమయంలో మాట్లాడటంలో ఎలాంటి దోషం లేదు.
అయితే ఖతీబ్ తో ముఖ్తదీ మాట్లాడటంలో ఎలాంటి దోషం లేదు, అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: «ఒక వ్యక్తి జుమా రోజున మస్జిదులోకి దారుల్ ఖదా వైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: ఓ అల్లాహ్ ప్రవక్త! (వర్షాలు లేక) పశువులు నశించిపోతున్నాయి, దారులు మూసుకుపోయాయి. కావున మాకు వర్షం కురిపించమని అల్లాహ్ ను వేడుకోండి., అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులు పైకెత్తి (దుఆ చేశారు)...» [117]. [117] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 967) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 897) లో ఉల్లేఖించారు.
2- ఖుత్బా సమయంలో గులకరాళ్ళను తాకడం, తస్బీహ్ ఉపయోగించడం, లేదా మొబైల్ ఫోన్ తో నిమగ్నమవడం, మరియు అలాంటి వ్యర్థమైన పనులు చేయకూడదు; ఎందుకంటే అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే గులకరాళ్ళను తాకుతాడో, నిశ్చయంగా అతడు వ్యర్థమైన పనికి పాల్పడినట్లే.” [118]. అది ఎందుకంటే ఆటపాటలు (అల్-‘అబత్) అవగాహనను మరియు భయభక్తులను నిరోధిస్తుంది. [118] ముస్లిం, హదీథు సంఖ్య (857).
3) ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు ప్రజల మెడలపై నుండి దాటుకుంటూ వెళ్లడం నిషేధించబడింది, ఇందుకు ఆధారం అబ్దుల్లా బిన్ బుస్ర్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం: జుమా రోజున దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి ప్రజల మెడలు దాటుకుంటూ వచ్చాడు, అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: కూర్చో, నీవు ఇబ్బంది కలిగించేశావు. [119] [119] అబూ దావుద్, హదీథు సంఖ్య (1118).
ఎందుకంటే, ప్రజల మెడలను దాటుకుని వెళ్ళడంలో నమాజు ఆచరించేవారికి ఇబ్బంది కలుగుతుంది మరియు ఖుత్బా వినడంలో వారికి ఆటంకం ఏర్పడుతుంది. అయితే, ఇమామ్ తన స్థానానికి చేరుకోవడానికి అది తప్ప వేరే మార్గం లేనప్పుడు, అతను అలా దాటడంలో తప్పు లేదు. అదేవిధంగా, వుజూ వంటి తప్పనిసరి అవసరం కోసం, లేదా తన ముందున్న ఖాళీని పూరించడానికి లేదా అలాంటి కారణాల వల్ల దాటవలసి వచ్చిన వ్యక్తి విషయంలో కూడా తప్పు లేదు.
4- ఒక వ్యక్తిని, అతను ముందుగా చేరుకున్న స్థానం నుండి లేపి, ఆ స్థానంలో కూర్చోవటం నిషిద్ధం; జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: జుమా రోజున మీలో ఎవరూ కూడా తన సోదరుడిని లేపి, తిరిగి అతని స్థానంలో కూర్చోకూడదు, కానీ స్థలాన్ని విశాలం చేయాలి. ((120)) [120] ముస్లిం, హదీథు సంఖ్య (2178).
5- ఇద్దరి మధ్య విభజన కలిగించడం అసహ్యకరమైనది; అనగా వారి మధ్య కూర్చోవడం లేదా వారిని దాటి వెళ్ళడం; సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «ఎవరైతే శుక్రవారమునాడు గుసుల్ చేసి... ఆపై (మస్జిదుకు) వెళ్లి, అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరి వారిని విడదీయకుండా (అందరినీ దాటుకుంటూ వెళ్లకుండా), తనకు రాసిపెట్టినంత (నఫిల్) నమాజ్ చదివి, ఇమామ్ ప్రసంగం కోసం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా వింటారో, వారి ఆ శుక్రవారం నుండి తదుపరి శుక్రవారం మధ్య జరిగిన పాపాలు క్షమించబడతాయి.» [121] ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే వారికి ఈ క్షమాపణ లభించదని దీని ద్వారా తెలుస్తుంది. [121] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (910) లో ఉల్లేఖించారు.
ఆరవది: జుమా సున్నతులు:
1- జుమా రోజున ఫజర్ నమాజులో సూరతు సజ్దా మరియు సూరతుల్ ఇన్సాన్ పఠించడం సున్నత్; ఎందుకంటే మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దానిని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండేవారు. అబూ హురైర రజియాల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజున ఫజర్ నమాజులో అలీఫ్ లాం మీమ్, తన్జీలు సజ్ద మరియు ‘హల్ అతా అలల్ ఇంసాని‘ సూరాలు చదివేవారు[122]. [122] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (891) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (880) లో ఉల్లేఖించారు.
2- శుక్రవారం నాడు గుస్ల్ చేయడం ఇది సున్నతే ముఅక్కదా (బలమైన సున్నత్). హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో జుమా నమాజుకు వచ్చేవారు గుసుల్ (తలంటు స్నానం) చేసి రావాలి. [123]. దీనిని పాటించడం పట్ల శ్రద్ధ వహించాలి మరియు దీనిని వదిలిపెట్టకూడదు, ముఖ్యంగా శరీర దుర్వాసన ఉన్నవారు దీనిని తప్పనిసరిగా పాటించాలి. [123] ఈ హదీసును బుఖారీ (హదీథు సంఖ్య: 877) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 844) లో నమోదు చేసినారు.
జుమా గుస్లు సమయం ఫజ్ర్ ఉదయం నుండి ప్రారంభమవుతుంది. జనాబత్ గుస్లు, జుమా గుస్లుకు సరిపోతుంది; ఎందుకంటే జుమా గుస్లు యొక్క ఉద్దేశ్యం శరీరాన్ని శుభ్రపరచి, దుర్వాసనలను తొలగించడం. ఇది జనాబత్ గుస్లుతో కూడా నెరవేరుతుంది. అయితే, దాని పుణ్యం కూడా లభించడం కోసం, జనాబత్ గుస్లులో జుమా గుస్లును కూడా చేర్చాలని సంకల్పించడం ధర్మబద్ధమైనది.
3- సుగంధ ద్రవ్యాలు (అత్తరు) పూసుకోవడం, శుభ్రంగా ఉండటం మరియు శరీరంలోని అనవసరమైన వాటిని తొలగించడం సున్నత్; ఉదాహరణకు గోళ్లు కత్తిరించుకోవడం, మర్మ అవయవాల వెంట్రుకలు తొలగించుకోవడం, చంకలో వెంట్రుకలు తీసివేయడం మరియు మీసాలను కత్తిరించుకోవడం. సల్మాన్ ఫార్సీ (రజిఅల్లాహు అన్హు) కథనం ప్రకారందైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఎవరైతే శుక్రవారం రోజున గుస్లు స్నానం చేసి, తన శక్తిమేరకు పవిత్రతను పొంది, ఆపై తైలం లేదా పరిమళాన్ని పూసుకుని, తరువాత (మస్జిదుకు) వెళ్లి ఇద్దరి మధ్య దూరం కల్పించకుండా, తన కొరకు నిర్ణయించబడినంత నమాజు ఆచరించి, ఆ తర్వాత ఇమామ్ (ఖుత్బా కొరకు) వచ్చినప్పుడు మౌనంగా వింటాడో, అతని ఆ జుమా నుండి రాబోయే జుమా మధ్య గల పాపాలు క్షమించబడతాయి» [124] [124] దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (910).
అదే విధంగా ఈ రోజున మిస్వాక్ వాడకం కూడా తాకీదు చేయబడింది; హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని నేను సాక్ష్యమిస్తున్నాను: “యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.” [125] [125] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (880)
4- తన వద్ద ఉన్న బట్టలన్నింటిలో అత్యంత శ్రేష్టమైన (మంచి) బట్టలు ధరించడం సున్నత్; ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు ప్రకారం: "«ఆయన మస్జిద్ ద్వారం వద్ద ఒక పట్టు వస్త్రాన్ని చూసి, ఇలా అన్నారు: ఓ దైవప్రవక్తా, మీరు దీనిని కొనుగోలు చేసి, జుమా రోజున మరియు మీ వద్దకు ప్రతినిధులు వచ్చినప్పుడు ధరించవచ్చు కదా...»" ((126)) [126] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (886) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2068) లో ఉల్లేఖించారు.
5- శుక్రవారం రోజున మసీదుకు త్వరగా (సమయం కంటే ముందే) వెళ్లడం సున్నత్; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎంతో ప్రోత్సహించారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే శుక్రవారం నాడు జనాబత్ గుస్ల్ వలె - అనగా, జనాబత్ గుస్ల్ చేసే పద్ధతిలో - స్నానం చేసి, ఆ తర్వాత (మస్జిదుకు) వెళ్తాడో, అతడు ఒక ఒంటెను (అది ఒంటెల జాతికి చెందినది, మగదైనా లేదా ఆడదైనా సరే) ఖుర్బానీ చేసిన వానితో సమానం. మరియు ఎవరైతే రెండవ ఘడియలో వెళ్తాడో, అతడు ఒక ఆవును ఖుర్బానీ చేసిన వానితో సమానం. ఎవరైతే మూడవ ఘడియలో వెళ్తాడో, అతడు కొమ్ములు కలిగిన పొట్టేలును ఖుర్బానీ చేసిన వానితో సమానం. ఎవరైతే నాలుగవ ఘడియలో వెళ్తాడో, అతడు ఒక కోడిని ఖుర్బానీ చేసిన వానితో సమానం. మరియు ఎవరైతే ఐదవ ఘడియలో వెళ్తాడో, అతడు ఒక గుడ్డును దానం చేసిన వానితో సమానం. ఇక, ఇమామ్ బయటకు రాగానే, దైవదూతలు ప్రసంగం (ఖుత్బా) వినడానికి హాజరవుతారు.” ((127)) [127] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 881) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 850) లో ఉల్లేఖించారు.
6- శుక్రవారం రోజున ఇమాం ప్రసంగిస్తుండగా మస్జిద్ లోకి ప్రవేశించే వ్యక్తి, రెండు రకాతుల నమాజ్ ను సంక్షిప్తంగా నెరవేర్చేంత వరకు కూర్చోకూడదు. ఇది సున్నత్. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా సమయంలో ప్రవేశించిన వ్యక్తికి ఆ విధంగా చేయమని ఆదేశించారు. ఈ విషయమై జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు: శుక్రవారం రోజున, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తుండగా సులైక్ అల్-గతఫానీ వచ్చి కూర్చున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: «ఓ సులైక్, లేచి నిలబడి రెండు రకాతులు ఆచరించు, వాటిని సంక్షిప్తంగా ముగించు» ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవరైనా శుక్రవారము నాడు ఇమామ్ ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా వస్తే, అతడు రెండు రకాతులు ఆచరించాలి, వాటిని సంక్షిప్తంగా పూర్తి చేయాలి.” ((128)) [128] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (930) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (875) లో ఉల్లేఖించారు.
7 - జుముఅహ్ రోజున సూరతుల్ కహఫ్ పారాయణం చేయటం సున్నత్; అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే శుక్రవారం రోజున సూరహ్ అల్-కహఫ్ పఠిస్తారో, వారికి రెండు శుక్రవారాల మధ్య కాలమంతా ప్రకాశించేలా ఒక నూర్ (కాంతి) ప్రసాదించబడుతుంది [129]. [129] దీనిని అల్-హాకిమ్ అల్-ముస్తద్రక్ లో నమోదు చేసారు: (3392), మరియు ఈ హదీసు అబూ సయీద్ గారి ప్రసారంగా నిలిచిపోవడం వలన లోపభూయిష్టమైనది.
8- శుక్రవారం పగలు మరియు రాత్రి (గురువారం సూర్యాస్తమయం నుండి శుక్రవారం సూర్యాస్తమయం వరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎక్కువగా దరూద్ పఠించడం సున్నత్. ఔస్ బిన్ ఔస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీ రోజులలో అత్యంత శ్రేష్ఠమైన రోజు శుక్రవారం, కనుక మీరు ఆ రోజు అత్యధికంగా నాపై దరూద్ పంపండి; ఎందుకంటే మీరు పంపే దరూద్ నాకు చేరవేయబడుతుంది. ((130)) [130] అబూ దావుద్, హదీథు సంఖ్య (1531).
9- ఈ రోజున అధికంగా దుఆ చేయాలి, మరియు దుఆ అంగీకారమయ్యే ఘడియను అన్వేషించాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు గురించి పేర్కొంటూ ఇలా అన్నారు: శుక్రవారంలో ఒక సమయం (ఘడియ) ఉంది, ఏ ముస్లిం దాసుడైనా సరిగ్గా ఆ సమయంలో నమాజ్ స్థితిలో ఉండి అల్లాహ్ను ఏదైనా వేడుకుంటే, ఆయన దానిని అతనికి తప్పకుండా ప్రసాదిస్తారు. [131]. [131] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (935) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (852).
శుక్రవారం నాటి అన్ని గడియలలో దుఆ స్వీకరించబడుతుందని ఆశించవచ్చు, అయితే, వాటిలో అత్యంత ఆశాజనకమైన సమయం, శుక్రవారం నాడు ఇమామ్ ఖుత్బా కొరకు కూర్చున్నప్పటి నుండి నమాజ్ ముగిసే వరకు మధ్యలో ఉంటుంది, మరియు శుక్రవారం నాటి చివరి గడియ, మగ్రిబ్ నమాజ్ కొరకు వేచి కూర్చున్న వ్యక్తి విషయంలో, అతను మస్జిదులో ఉన్నా లేదా తన ఇంట్లో ఉన్నా సరే; ఎందుకంటే అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం నాటి ఘడియ గురించి ఇలా ప్రవచించారు: «ఇమామ్ కూర్చున్నప్పటి నుండి నమాజ్ పూర్తయ్యేంత వరకు» [132] [132] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (853) లో ఉల్లేఖించారు.
ఏడవది: జుమా సున్నతులు:
జుమా నమాజుకు ముందు నియమితమైన సున్నత్ రాతిబా లేదు. అయితే, జుమాకు వచ్చినవారు తన ఇష్టానుసారం రెండు, లేదా నాలుగు, లేదా ఆరు, లేదా అంతకంటే ఎక్కువ రకాతులు, ప్రతి రెండు రకాతులకు సలాం తిరుగుతూ నమాజ్ చేయవచ్చు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ప్రోత్సహించారు, సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినట్లుగా, ఆయన ఇలా అన్నారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: «ఎవరైతే శుక్రవారము నాడు తలస్నానం చేసి... ఆ తర్వాత (మస్జిదుకు) వెళ్లి ఇద్దరినీ విడదీయకుండా, తన కొరకు నిర్ణయించబడినంత నమాజు చేసి, ఆ తర్వాత ఇమాం (ప్రసంగానికి) వచ్చినప్పుడు నిశ్శబ్దంగా వింటాడో, అతనికి ఆ జుమాకు మరియు మరో జుమాకు మధ్య ఉన్న పాపాలు క్షమించబడతాయి» [133]. సహాబా రదిఅల్లాహు అన్హుం వారి ఆచరణ, మరియు సాధారణ నఫిల్ ఆరాధనలకై ప్రస్తావించబడిన విస్తృతమైన ఘనత. [133] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (910) లో ఉల్లేఖించారు.
ఇక సున్నతె రాతిబా అయితే జుమా నమాజు తరువాత ఉంటుంది; తన ఇంటిలో రెండు రకాతులు, లేదా మస్జిద్ లో నాలుగు రకాతులు ఆచరించాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా తర్వాత ఇంట్లో రెండు రకాతులు చేసేవారు. (134) అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్ చేసుకోవాలి. [135]. [134] దీనిని బుఖారీ (937), ముస్లిం (729) ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి ఉల్లేఖించారు. [135] ముస్లిం, హదీథు సంఖ్య (881).
జుమా సున్నత్ నమాజు మస్జిద్ లో పఠిస్తే నాలుగు రకాతులు, మరియు ఇంట్లో పఠిస్తే రెండు రకాతులు.
రెండవ అంశం: జుమా ఖుత్బహ్
మొదటి విషయం: జుమా ఖుత్బా:
ఇది జుమా నమాజుకు ముందు, ప్రజల సమూహం ముందు ఇవ్వబడే ఒక ప్రసంగం, ఇందులో అల్లాహ్ ను స్తుతించడం, ఆయనను కీర్తించడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాత్ మరియు సలాం పంపడం, ఉపదేశించడం మరియు జ్ఞాపకం చేయడం ఉంటాయి[136]. [136] చూడండి: ముఅజమ్ లుఘత్ అల్-ఫుఖహా (పే: 197), మరియు ఖుత్బతుల్ జుముఆ వ అహ్కాముహల్ ఫిఖ్హియ్య లిల్-హుజైలాన్ (పే: 22).
రెండవది: ఖుత్బా యొక్క హుక్మ్ (ఆదేశం):
ఖుత్బా జుమా నమాజుకు ఒక షరతు, అది లేకుండా నమాజు చెల్లుబాటు కాదు; ఎందుకంటే అల్లాహు తఆలా ప్రవచనం ఇలా ఉంది: ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి... [అల్ జుమఅ: 9] అల్లాహ్ స్మరణ (జిక్ర్) అంటే ఇక్కడ 'ఖుత్బా' అని వ్యాఖ్యానించబడింది [137]; ఒకవేళ ఖుత్బా తప్పనిసరి కాకపోయి ఉంటే, దాని కొరకు వెళ్ళడం కూడా తప్పనిసరి అయ్యేది కాదు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ ఖుత్బా ఇస్తూ ఉండేవారు మరియు దానిని ఎప్పుడూ వదిలిపెట్టలేదు; ఇది కూడా అది వాజిబ్ అనడానికి నిదర్శనం. [137] చూడండి: తబ్రీ వ్యాఖ్యానము (22/642).
ఇమాం ఇబ్నుల్ ఖుదామహ్ అల్ హంబలీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ""సారాంశం ఏమిటంటే, ఖుత్బా జుమాలో ఒక షరతు, అది లేకుండా జుమా చెల్లుబాటు కాదు"[138]." [138] అల్-ముఘ్నీ (2/224).
మూడవ విషయం: ఖుత్బా షరతులు
1- అవి రెండు ఖుత్బాలుగా ఉండాలి; ఎందుకంటే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ప్రామాణిక హదీసులో ఆయన ఇలా పలికారు: "మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రెండు ఖుత్బాలు ఇచ్చేవారు, వాటి మద్యలో కాసేపు కూర్చునేవారు" [139]. [139] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (928) లో ఉల్లేఖించారు.
2- శుక్రవారం నమాజు, దాని సమయం ప్రవేశించిన తర్వాతే జరగాలి. ఒకవేళ అది గానీ లేదా దానిలోని కొంత భాగం గానీ సమయానికి ముందే జరిగితే, అది చెల్లుబాటు కాదు.
3- సలాత్కు ముందు రెండు ఖుత్బాలు ఉండాలి; సాయీబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన హదీస్ ప్రకారం, ఆయన ఇలా అన్నారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ బక్ర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమా వారి కాలంలో, జుమా రోజున మొదటి అజాన్ ఇమామ్ మింబర్ మీద కూర్చున్నప్పుడు ఇవ్వబడేది." [140] మరియు ఇది నమాజుకు ముందు రెండు ఖుత్బాలు ఇవ్వబడతాయని స్పష్టంగా తెలుపుతుంది. [140] ఈ హదీసును బుఖారీ, హదీసు సంఖ్య (916) లో ఉల్లేఖించారు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి» [141], మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు ఖుత్బాల తర్వాత మాత్రమే నమాజు చేసేవారు, మరియు అల్ మర్దావి ఇలా అన్నారు: "ఆ రెండూ (అనగా: రెండు ఖుత్బాలు) నమాజ్కు ముందు ఉండాలనేది వివాదరహితమైన షరతు." [142]. [141] దీనిని బుఖారీ మాలిక్ బిన్ హువైరిథ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (631). [142] అల్ ఇన్సాఫ్ (2/ 389).
4- ఖుత్బా భాగాల మధ్య వరుస క్రమం పాటించడం, ఇమామ్ ఇబ్నె ఖుదామా (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఖుత్బా సరైనదిగా పరిగణించబడటానికి 'మువాలాతు' ఒక షరతు. ఒకవేళ సుదీర్ఘమైన సంభాషణతో గానీ, సుదీర్ఘమైన నిశ్శబ్దంతో గానీ, లేదా 'మువాలాతు'కు భంగం కలిగించే మరేదైనా కారణంతో దాని భాగాల మధ్య విరామం ఏర్పడితే, ఖుత్బాను మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాలి. విరామం సుదీర్ఘమైనదా లేదా సంక్షిప్తమైనదా అనేది సాధారణ ఆచరణపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఖుత్బా మరియు నమాజ్ మధ్య కూడా 'మువాలాతు' ఒక షరతు. ఒకవేళ తహారత్ (పవిత్రత) అవసరమైతే, దానిని పొంది, విరామం సుదీర్ఘం కానంత వరకు, ఆపిన చోటు నుండే తన ఖుత్బాను కొనసాగించవచ్చు"[143]. [143] అల్-ముఘ్నీ (2/230).
5- ఖుత్బాను బిగ్గరగా ఇవ్వాలి; ఎందుకంటే ఖుత్బా విధి మరియు జుమా చెల్లుబాటు కావడానికి ఒక షరతు. మరియు బిగ్గరగా ఇవ్వటం అనేది దానిని నెరవేర్చడానికి మరియు దాని ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఒక సాధనం, అది ఉపదేశం మరియు జ్ఞాపిక. దేనితో తప్ప ఒక విధి పూర్తి కాదో, అది కూడా విధే.
6- జుమా నమాజ్ నిర్వహించడానికి అవసరమైన కనీస సంఖ్యలో ముసల్లీలు (ప్రజలు) హాజరుకావడం. ఎందుకంటే ఖుత్బా అనేది 'జిక్ర్' (అల్లాహ్ స్మరణ), దాని కోసం వెళ్లడం తప్పనిసరి (వాజిబ్) చేయబడింది. కాబట్టి, నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఆ ఖుత్బాను వినడం కూడా అనివార్యం.
నాల్గవ విషయం: ఖుత్బాలోని అవసరమైన మూలాంశాలు (అర్కాన్):
1- అల్లాహ్ అజ్జ వ జల్ యొక్క స్తుతులను పలుకుతూ మరియు ఆయనను ప్రశంసిస్తూ ప్రారంభించడం; జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథ్ లో ఇలా ఉంది: «ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా ఖుత్బాలో అల్లాహ్ యొక్క స్తుతి ప్రశంసలు చేసి, ఆ తర్వాత ఇలా సెలవిచ్చేవారు...» హదీస్ [144]. [144] ముస్లిం, హదీథు సంఖ్య (867).
2- అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడాన్ని చేర్చడం; ఎందుకంటే ఖుత్బాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం సహాబా రజియల్లాహు అన్హుమ్ వద్ద ఒక ప్రసిద్ధమైన మరియు తెలిసిన విషయం [145]. [145] చూడండి: ఇబ్నుల్ ఖయ్యిం గారి జలాఉల్ అఫ్హాం, (పేజీ 371).
2- ఇది హితబోధనను మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల భయభీతి కలిగి ఉండాలని తాకీదును కలిగి ఉండటం; జాబిర్ బిన్ సమర రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు: «ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు ఖుత్బాలు ఇచ్చేవారు, వాటి మధ్యలో కూర్చునేవారు, ఖుర్ఆన్ చదివేవారు, మరియు ప్రజలకు హితబోధ చేసేవారు» [146]; ఎందుకనగా ఖుత్బా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. [146] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (862) లో ఉల్లేఖించారు.
4- ఖుర్ఆన్ నుండి ఏవైనా ఆయతులు చదవటం; జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: «దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు ఖుత్బాలు ఇచ్చేవారు, వాటి మద్యలో కూర్చునేవారు, ఖుర్ఆన్ పఠించేవారు మరియు ప్రజలకు హితబోధ చేసేవారు».
ఐదవ విషయం: ఖుత్బా యొక్క సున్నతులు:
1- మింబర్ పై లేదా ఎత్తైన ప్రదేశము పై నిలబడి ఖుత్బా ఇవ్వటం; "ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొరకు ఒక మింబర్ తయారు చేయబడింది, దానిపై వారు శుక్రవారము నాడు ఖుత్బా ఇచ్చారు" [147], అనేకమంది సహాబాల (రజియల్లాహు అన్హుమ్) యొక్క ప్రామాణిక కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ పై ఖుత్బా ఇచ్చేవారు[148], మరియు ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ ఈ విషయం సున్నత్ అనే దానిపై ఉన్న ఏకాభిప్రాయాన్ని (ఇజ్మా) ఉల్లేఖిస్తూ ఇలా అన్నారు: ""విద్వాంసులు ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం ఏమిటంటే, ఖుత్బా మెంబరుపై ఇవ్వటం అభిలషణీయం"[149]،" ఎందుకంటే దాని వలన సందేశం మరింత ప్రభావవంతంగా చేరుతుంది, మరియు ప్రజలు ఖతీబును చూసినప్పుడు, అతని హితబోధ వారిపై మరింత ప్రభావవంతంగా ఉంటుంది. [147] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2095) లో జాబిర్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు. [148] చూడండి: ఇర్వాఉల్ గలీల్ ఫీ తఖ్రీజి అహాదీథి మనారిస్సబీల్: (3/75) మరియు దాని తర్వాత. [149] అల్ మజ్మూఉ షరహుల్ ముహజ్జబ్: (4/527).
2- ఖతీబ్ నిలబడి ఖుత్బా ఇవ్వటం; ఎందుకంటే అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చారు: మరియు వారు వ్యాపారాన్ని గానీ లేదా వినోద క్రీడను గానీ చూసినప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలిపెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు... [అల్ జుమఅ : 11] అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిలబడి ప్రసంగించేవారు, తరువాత కూర్చునేవారు, ఆపై మీరు ఇప్పుడు చేస్తున్నట్లే నిలబడేవారు. [150]. [150] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (920); ముస్లిం, హదీథు సంఖ్య (861) లో ఉల్లేఖించారు.
3- ఖుత్బా ఇచ్చే వ్యక్తి జమాఅత్ వైపు అభిముఖమవ్వడం సున్నత్. అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజున మింబర్ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ కూర్చున్న వారికి సలాం చేసేవారు, ఆ తర్వాత మింబర్ పైకి ఎక్కి ప్రజల వైపు తిరిగి మళ్ళీ సలాం చేసేవారు.[151] [151] దీనిని బైహఖీ సుననుల్ కుబ్రాలో హదీసు సంఖ్య: (5742) ఉల్లేఖించారు.
అల్-హాఫిజ్ ఇబ్నె రజబ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు : "ఇమాం మస్జిద్లోని వారి వైపు ముఖం చేసి, ఖిబ్లా వైపు వీపు చేయడం అనేది సర్వసమ్మతమైన విషయం, మరియు ధార్మిక ప్రమాణాలు కూడా దీనిని సూచిస్తున్నాయి; ఎందుకంటే ప్రజలు తన మాటలను అర్థం చేసుకోగలగాలని ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఇదంతా సున్నత్. కాబట్టి ఒకవేళ ఇమాం దీనికి విరుద్ధంగా చేస్తే, అతను సున్నత్ కు విరుద్ధంగా చేసినవాడవుతాడు, అయినప్పటికీ అతని జుమా సరైనదే అవుతుంది"[152]. [152]ఇబ్నె రజబ్ యొక్క ఫత్హుల్ బారీ: (8/250).
4- ఖతీబ్ ప్రజల వైపు తిరిగినప్పుడు వారికి సలాం చేయటం సున్నత్, జాబిర్ రజియల్లాహు అన్హు హదీథు కారణంగా. «మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ ఎక్కినప్పుడు సలాం చేసేవారు»[153]. [153] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (1109) లో ఉల్లేఖించారు.
5- ముఅజ్జిన్ అజాన్ పూర్తి చేసే వరకు మెంబరు పై కూర్చోవటం. ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా సూక్తి: «మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రెండు ఖుత్బాలు ఇచ్చేవారు, ఆయన మెంబరుపైకి ఎక్కినప్పుడు ముఅజ్జిన్ (అజాన్) పూర్తి చేసేంత వరకు కూర్చునేవారు, తర్వాత నిలబడి ప్రసంగించేవారు, ఆపై ఏమీ మాట్లాడకుండా కూర్చుని, మళ్ళీ నిలబడి ప్రసంగించేవారు»[154]. దీనికి సాక్ష్యంగా అస్సాయిబ్ బిన్ యజీద్ రదియల్లాహు అన్హు వారి హదీథు ఉంది, అందులో ఆయన ఇలా అన్నారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూ బక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి కాలంలో, జుమా అజాన్ ఇమామ్ మింబర్ మీద కూర్చున్నప్పుడు మొదలయ్యేది [155]. [154] అబూ దావుద్, హదీథు సంఖ్య (1092). [155] దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (916).
6- తన శక్తి మేరకు ఖుత్బాలో స్వరాన్ని పెంచి (బిగ్గరగా) మాట్లాడటం; జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హుమా కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇచ్చినప్పుడు ఆయన కళ్లు ఎర్రబడేవి, స్వరం పెరిగేది మరియు ఆయనలో తీవ్రమైన ఆవేశం (గాంభీర్యం) కనిపించేది. సైన్యాన్ని హెచ్చరించే సేనానిలా ఆయన ఇలా అనేవారు: మీరు ఉదయాన్నే శత్రువుల దాడికి గురికావచ్చు లేదా సాయంత్రానికల్లా వారు మిమ్మల్ని ముట్టడించవచ్చు (అప్రమత్తంగా ఉండండి). [156]، (సబ్బహకుమ్) అంటే: సైన్యం మీపై ఉదయం పూట దాడి చేయవచ్చు అని అర్థం, మరియు (మస్సాకుమ్) అంటే: వారు సాయంత్రం వేళ మీ వద్దకు రావచ్చు అని అర్థం. ఎవరైనా ఇతరులను (రాబోయే ప్రమాదం గురించి) హెచ్చరించాలనుకున్నప్పుడు ఈ రెండు పదాలను ఉపయోగించవచ్చు. [156] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (867) లో ఉల్లేఖించారు.
7- రెండు ఖుత్బాల మధ్య కొంత సేపు కూర్చోవడం; ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసు ప్రకారం: «మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జుమా రోజున రెండు ఖుత్బాలు ఇచ్చేవారు, వాటి మద్యలో కాసేపు కూర్చునేవారు» [157]. [157] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (928) లో ఉల్లేఖించారు.
8- నమాజును సుదీర్ఘంగా చేస్తూ, రెండు ఖుత్బాలను కుదించడం, మరియు రెండవది మొదటి దాని కన్నా చిన్నదిగా ఉండటం సున్నతు. హజ్రత్ అమ్మార్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «నిశ్చయంగా ఒక వ్యక్తి నమాజు సుదీర్ఘంగా ఉండటం మరియు అతని ఖుత్బా సంక్షిప్తంగా (చిన్నదిగా) ఉండటం అనేది అతని విజ్ఞతకు నిదర్శనం. కావున, మీరు నమాజును సుదీర్ఘం చేయండి మరియు ఖుత్బాను సంక్షిప్తం చేయండి.» ((158)) [158] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (869) లో ఉల్లేఖించారు.
9- ముస్లింల యొక్క ధార్మిక మరియు ప్రాపంచిక శ్రేయస్సు కొరకు, మరియు వారి నాయకుల సన్మార్గం మరియు విజయం కొరకు దుఆ చేయడం సున్నత్; ఇమామ్ అన్-నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ముస్లింల నాయకులు (ఇమామ్లు) మరియు పాలకులు సన్మార్గంలో ఉండాలని, సత్యం వైపు నడవడానికి వారికి సహాయం అందాలని, వారు న్యాయంగా వ్యవహరించాలని మరియు ఇతర మంచి విషయాల కోసం దుఆ చేయడం, అలాగే ఇస్లామీయ సైన్యం కోసం దుఆ చేయడం అందరి ఏకాభిప్రాయం ప్రకారం ముస్తహబ్ (శ్రేష్టమైనది)[159]. [159] అల్ మజ్మూఉ షరహుల్ ముహజ్జబ్: (4/ 521).
ఇమాము జుమా ఖుత్బాలో దుఆ చేసేటప్పుడు ఇమామ్ తన చేతులు పైకి ఎత్తడం ధర్మసమ్మతం కాదు, ఒక్క 'ఇస్తిస్ఖా' (వర్షం కోసం చేసే ప్రత్యేక దుఆ) సమయంలో తప్ప. అయితే దుఆ చేస్తున్నప్పుడు చూపుడు వేలితో సంకేతం చేయడం ముస్తహబ్ (శ్రేష్టమైనది). ఉమారా బిన్ రువైబా (రదియల్లాహు అన్హు) గారు, బిషర్ బిన్ మర్వాన్ మింబర్ పై రెండు చేతులు ఎత్తి ఉండటం చూసి ఇలా అన్నారు: "అల్లాహ్ ఈ రెండు చేతులను విరూపం చేయుగాక; నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను, ఆయన (దుఆ చేసేటప్పుడు) తన చేతితో ఇలా చేయడం కంటే ఎక్కువగా చేసేవారు కాదు - అని చెబుతూ ఉమారా గారు తన చూపుడు వేలిని చూపించారు[160]." [160] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (874) లో ఉల్లేఖించారు.
10- ఎవరైతే ఖుత్బా ఇచ్చారో, వారే నమాజుకు కూడా ఇమామత్ వహించడం (నమాజ్ చదివించడం). ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా వాటిని నిర్వహించేవారు, అదే విధంగా ఆయన తరువాత వచ్చిన ఖలీఫాలు కూడా అదే మార్గాన్ని అనుసరించారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకరు ఖుత్బా ఇచ్చి, మరొకరు నమాజ్ చేయిస్తే అది సమ్మతమే[161]. [161] ఇబ్నె ఖుదామ యొక్క అల్ ముఘ్నీ: (2/ 228).
ఆరవ విషయం: జుమా ఖుత్బా తర్జుమా:
అరబీ భాష తెలియని లేదా అత్యధిక శాతం మందికి అరబీ రాని ప్రాంతాల్లో, ఖతీబ్ (ప్రసంగీకుడు) అక్కడి స్థానిక భాషలోనే ఖుత్బా ఇవ్వడం ధర్మసమ్మతం. దీనివల్ల ప్రజలు ఖుత్బాను అర్థం చేసుకోగలుగుతారు, దాని అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది మరియు అందులోని జ్ఞానం, హితబోధలు, జ్ఞాపికల ద్వారా వారు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా, జుమా ఖుత్బా కచ్చితంగా అరబీ భాషలోనే ఉండాలనే నిబంధనకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరబీలో ఖుత్బా ఇవ్వడానికి కారణం' అది ఆయన మాతృభాష మరియు ఆయన జాతి ప్రజల భాష కావడమే.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖుత్బాలను అనుసరిస్తూ మరియు ఈ విషయంలో ఉన్న భేదాభిప్రాయాల నుండి బయటపడటానికి, ఖతీబు అరబిక్ భాషలో ఖుత్బా ఇచ్చి, ఆ తర్వాత దానిని తన దేశ భాషలోకి అనువదించడం మరింత శ్రేష్ఠమైనది.
అనువాదం విషయంలో, శ్రోతలకు ఏది మరింత ప్రయోజనకరమో పరిగణనలోకి తీసుకోవాలి: ఖుత్బా (ప్రసంగం) యొక్క ప్రతి భాగం ముగిసిన వెంటనే అనువదించడమా, లేదా అరబిక్ భాషలో ప్రసంగం పూర్తిగా ముగిసిన తర్వాత, నమాజుకు ముందు అనువదించడమా.
అదేవిధంగా ఖుత్బాను తక్షణమే అనువదించి, ఆ అనువాదాన్ని ఒక ప్రసార కేంద్రం ద్వారా ప్రసారం చేయవచ్చు, మరియు అరబిక్ భాష తెలియని నమాజీలు రిసీవర్ల ద్వారా దాన్ని స్వీకరించవచ్చు. ఇలా చేయడం అనువాదకుడి వైపు నుండి గానీ లేదా వినేవారి వైపు నుండి గానీ నిషిద్ధమైన వ్యర్థ ప్రసంగంగా పరిగణించబడదు; ఎందుకంటే దీనిలో ప్రజా ప్రయోజనం ఉంది మరియు ఖుత్బా యొక్క ఉద్దేశ్యం నెరవేరుతుంది.
ఏడవ విషయం: ఖతీబ్ యొక్క అర్హతలు:
మస్జిద్ యొక్క ఖతీబ్ (ప్రసంగీకుడు) ఆ మస్జిదుకు వెన్నెముక మరియు బలం వంటివారు. మస్జిద్ తన లక్ష్యమైన ధర్మ ప్రచారం (దావా), సమాజంలో అవగాహన కల్పించడం మరియు ప్రజలకు వారి మతపరమైన విషయాలపై స్పష్టతనివ్వడం వంటి బాధ్యతలను ఆయన ద్వారానే నెరవేరుస్తుంది. కాబట్టి, ఒకవేళ ఖతీబు పండితుడు, వివేకవంతుడు, దూరదృష్టి గలవాడు, మరియు ప్రజల ఆచార వ్యవహారాలు మరియు పరిస్థితులు తెలిసినవాడైతే, అతని ప్రభావం మస్జిద్ జమాఅత్పై మరియు మస్జిద్ ఉన్న పరిసర ప్రాంత నివాసులపై ఎంతో మంచిగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది; అతను వారికి బోధిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు మరియు ప్రతీ మేలు మరియు సద్గుణం వైపు వారిని నడిపిస్తాడు.
ఖుత్బా యొక్క షరతులను పూర్తిచేసిన ఖతీబులు కూడా ఇలాగే ఉండేవారు. ఇస్లాం ఆరంభ కాలంలో స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖతీబుగా ఉండేవారు, ఆ తర్వాత ఆయన ఖులఫాయె రాషిదీన్, పిమ్మట అమీర్లు, సైన్యాధిపతులు, పండితులు మరియు ప్రముఖులు (ఈ బాధ్యతను నిర్వర్తించారు). దీనిని బట్టి, ఈ బాధ్యతను స్వీకరించే వ్యక్తి ధర్మం, నైతికత, జ్ఞానం మరియు నడవడికలో ఉన్నత స్థాయిలో ఉండటం తప్పనిసరి అని స్పష్టమవుతుంది.
దీని ద్వారా ప్రజల జీవితాల్లో ఈ బాధ్యత (ఖతీబ్ పదవి) ఎంత కీలకమైనదో స్పష్టమవుతోంది. ఖతీబ్ యొక్క సామర్థ్యం మరియు పటిష్టత ఆ సమాజంపై ప్రతిబింబిస్తుంది, అలాగే వారి బలహీనత కూడా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే, మాటను చేతలతో ఎలా జోడించాలో (చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండాలని) సమాజానికి నేర్పేది మసీదు మాత్రమే. ఒకవేళ ఖతీబ్ జ్ఞానంలో, లేదా వివేకంలో, లేదా వ్యక్తిత్వంలో బలహీనుడైతే, లేదా దుష్ప్రవర్తన మరియు చెడు నడవడిక కలవాడైతే, అతను హాని చేస్తాడే తప్ప ప్రయోజనం చేకూర్చడు. మరియు నమాజీలను మేలు, పుణ్యం మరియు సత్ప్రవర్తన వైపు నడిపించడం ఖతీబ్ యొక్క విధి అయినప్పుడు, అజ్ఞాని అయిన ఖతీబ్ ఈ మహత్తరమైన బాధ్యతను నెరవేర్చడం చాలా కష్టం.
ఒక ఖతీబులో జ్ఞానం మరియు వ్యక్తిగత సామర్థ్యం పరంగా ఈ బాధ్యతకు కావలసిన అర్హతలు ఉండవచ్చు, కానీ అతను తన పనితీరు స్థాయిని ప్రభావితం చేసే ఇతర పనులతో నిమగ్నమై ఉంటాడు.
అలాగే, అతనికి సందర్భానుసారంగా ఖుత్బాను సిద్ధం చేయడానికి కూడా తగినంత సమయం లభించకపోవచ్చు. అందువల్ల, ఇబ్న్ ఖయ్యిం అల్-జౌజియ్య రహిమహుల్లాహ్ చెప్పినట్లుగా, అతను ప్రజల ముందుకు సమర్పించే ఖుత్బా హృదయంలో అల్లాహ్ పట్ల ఈమాన్ ను, ఆయన తౌహీద్ ను, ఆయన గురించిన ప్రత్యేక జ్ఞానాన్ని, ఆయన దినాల గురించిన జ్ఞాపకాన్ని ఏమాత్రం కలిగించదు; అలాగే మనసులను ఆయన ప్రేమ మరియు ఆయనను కలుసుకోవాలనే ఆకాంక్ష వైపు ప్రేరేపించదు[162]. [162] జాద్ అల్ మఆద్ ఫీ హది ఖైరిల్ ఇబాద్: (1/ 409).
మరియు అతను మనోవాంఛలకు, అజ్ఞానానికి, వివాదాలకు, లేదా గర్హనీయమైన అతివాదానికి లోబడినప్పుడు, అతను నిష్పాక్షికత, శిక్షణాత్మక మార్గదర్శకత్వం, మరియు వివేకం, మంచి ఉపదేశంతో ఆహ్వానించడం నుండి వైదొలగిపోతాడు.
నిశ్చయంగా ఈ ఇస్లాం ధర్మంలో మస్జిద్కు ఒక గొప్ప పాత్ర ఉంది; ఎందుకంటే అది సన్మార్గానికి ఒక దీపస్తంభం, దానిలో దాసుడు తన ప్రభువుతో సంబంధం ఏర్పరుచుకుంటాడు, అతని విశ్వాసం బలపడుతుంది, మరియు తన సోదరులతో కలిసి సద్గుణాన్ని వ్యాప్తి చేయడానికి, దుర్గుణాన్ని నిర్మూలించడానికి సహకరించుకుంటాడు. ఈ గొప్ప పదవిని చేపట్టి, ఈ గౌరవప్రదమైన విధి యొక్క బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తికి అవసరమైన జ్ఞానపరమైన మరియు నైతిక లక్షణాలున్న ఇమామ్ను అల్లాహ్ దాని కోసం సిద్ధం చేస్తే తప్ప, మస్జిద్ ఆ కార్యాన్ని నెరవేర్చలేదు.
ఖతీబుకు ఉండవలసిన ముఖ్యమైన జ్ఞానపరమైన అర్హతలు:
1 - అల్లాహ్ కొరకు కర్మలో చిత్తశుద్ధి కలిగి ఉండటం; దాని వలన ఆ కర్మ అల్లాహ్ వద్ద మరియు ప్రజల వద్ద సమర్థించబడినదిగా, విజయం చేకూర్చబడినదిగా, స్వీకరించబడినదిగా మరియు ప్రియమైనదిగా అవుతుంది.
2 - ప్రదర్శన మరియు డాంబికములకు దూరంగా ఉండాలి; ఎందుకంటే నిశ్చయంగా ఆచరణలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి, మరియు ప్రతి వ్యక్తికి అతను సంకల్పించినదే లభిస్తుంది. మరియు ఎవరైతే తనలో లేని దానితో గొప్పలు చెప్పుకుంటాడో, అల్లాహ్ అతన్ని పరాభవానికి గురిచేస్తాడు.
3 - అల్లాహ్ గ్రంథాన్ని కంఠస్తం చేసినవారై ఉండాలి, లేదా దానిలో కొంత భాగాన్నయినా కంఠస్తం చేసి ఉండాలి. తాను కంఠస్తం చేసిన దానిని నిరంతరం పునశ్చరణ చేయాలి, మరియు ఖుర్ఆన్ పఠనం కోసం ప్రతిరోజూ ఒక భాగాన్ని కేటాయించుకోవాలి.
4 - రియాదుస్ సాలిహీన్, లేదా అల్ అర్బయీన్ అన్-నవవియ్య, లేదా బులూఘుల్ మరామ్, లేదా ఇతర ప్రామాణికమైన హదీసు గ్రంథాల నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని హదీసులను కంఠస్థం చేయటం.
5 - సరైన అఖీదాను నేర్చుకోవటం, అదే సలఫ్ సాలిహీన్ యొక్క అఖీదా.
6 - ధార్మిక శాసనాలపై అవగాహన (ఫిఖ్హ్) ను, ప్రత్యేకించి ఆరాధనలకు సంబంధించిన నియమాలను - వాటిలో ముఖ్యంగా పవిత్రత, నమాజ్, జకాత్, మరియు సౌమ్ (ఉపవాసం) - అలాగే వ్యాపార లావాదేవీల నియమాలను నేర్చుకోవాలి; తద్వారా సంపాదన మరియు ఖర్చుల నియమాలను తెలుసుకుని, ప్రజలను మోసం, వంచన, అన్యాయంగా ప్రజల ధనాన్ని తీసుకోవడం, అలాగే వృధా, దుబారా, పిసినారితనం మరియు లోభితనం నుండి హెచ్చరించాలి, దీనివల్ల వారి ఆర్థిక వ్యవహారాలు ఖుర్ఆన్ మరియు సున్నత్ కు అనుగుణంగా ఉంటాయి.
7 - అల్లాహ్ తన సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేసిన దాని భావాలను తెలుసుకోవటానికి, అరబీ భాషలో ప్రావీణ్యం సంపాదించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ అరబ్బుల భాషలో అవతరించింది.
8 - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను, ఆయన మహనీయ గుణగణాలను, మరియు సలఫ్ సాలెహీన్ (పుణ్య పూర్వీకుల) జీవిత చరిత్రలను చదవడం; ఎందుకంటే వాటిలో అనుసరించదగ్గ ఉత్తమ ఆదర్శాలు, గొప్ప విద్యా సంపద మరియు అత్యున్నతమైన ఇస్లామీయ సంస్కృతి దాగి ఉన్నాయి.
9- తన దేశంలోని పండితులను, అలాగే నిర్మలమైన విశ్వాసం, జ్ఞానం మరియు వివేకానికి పేరుగాంచిన, జ్ఞానములో పరిపక్వత చెందిన ఇతర ఙ్ఞానవంతులను కూడా తెలుసుకోవాలి. ధర్మపరమైన విషయాలలోనూ, తన సమాజంలోని సమస్యల పరిష్కారంలోనూ తనకు అవసరమైన ప్రతి దాని కొరకు వారిని ఆశ్రయించాలి.
10 - ఇస్లామీయ వర్గాలు మరియు వారి విశ్వాసాలు, సైద్ధాంతిక ధోరణులు మరియు వాటి ఉద్దేశ్యాలు, వినాశకరమైన సిద్ధాంతాలు మరియు వాటి లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథం, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ మరియు ప్రామాణిక ముస్లిం పండితులు వ్రాసిన వాటి వెలుగులో వాటితో చర్చించి, వాటిలోని అసత్యాన్ని విమర్శించి, మరియు వాటిలోని అన్యాయానికి వ్యతిరేకంగా హెచ్చరించడానికి వీలవుతుంది.
11- ముస్లింల ప్రస్తుత స్థితిగతులు, వారి బలహీనతలు మరియు శత్రువులు వారిపై సాధిస్తున్న ఆధిపత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండటం. ఇదంతా వారు అల్లాహ్ చూపిన సరైన రుజుమార్గం (సిరాతుల్ ముస్తఖీమ్) నుండి దూరం కావడం వల్ల, అల్లాహ్ పై విశ్వాసం (ఈమాన్) బలహీనపడటం వల్ల మరియు ఆయన షరియత్ పట్ల విధేయత తగ్గడం వల్ల జరుగుతోందని గ్రహించాలి. కావున, ముస్లింలకు వారి దీన్ (పరలోకం) మరియు దునియా (ప్రపంచం) రెండింటిలోనూ ప్రయోజనం చేకూర్చే విషయాలను నేర్పడానికి ఖతీబ్ కృషి చేయాలి.
12- వివిధ ప్రసార మాధ్యమాలను, వాటిలోని ప్రయోజనాలు మరియు నష్టాలను తెలుసుకొని, అల్లాహ్ వైపునకు ఆహ్వానించడంలో వాటి నుండి ఎలా ప్రయోజనం పొందాలో నేర్చుకోవాలి, మరియు వాటిలో తన కొరకు, తన సమాజం కొరకు ఉన్న ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి.
మరియు జుమా ఖతీబులో ఈ అంశాలు సమకూరినప్పుడు, అల్లాహ్ తఆలా అనుమతితో సక్రమత మరియు సమతుల్యం ఏర్పడతాయి.
అత్యంత ముఖ్యమైన నైతిక మూలస్తంభాలు:
1- మస్జిద్ ఖతీబు, ఆ మస్జిద్ జమాఅత్కు మరియు ఆ పరిసర ప్రాంతం నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి మస్జిద్కు విచ్చేసే వారందరికీ ఒక ధర్మ ప్రచారకుడిగా మరియు బోధకుడిగా ఉండాలి. కావున, అతను తప్పనిసరిగా అల్లాహ్ యొక్క సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఆదర్శంగా తీసుకోవాలి; ఎందుకంటే ఆయనే ఉమ్మత్కు మరియు నాయకులకు సదాదర్శం, శ్రేష్ఠమైన మాదిరి మరియు సర్వోన్నత ఉదాహరణ. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో! [ అహ్జాబ్: 21]
అతను తనను, మరియు తన మస్జిదుకు వచ్చేవారిని ప్రాపంచిక, రాజకీయ సంభాషణల నుండి దూరంగా ఉంచాలి మరియు మస్జిదును కేవలం జ్ఞానం మరియు ఆరాధన కొరకు మాత్రమే పరిమితం చేయాలి.
2- స్వయంగా శుభ్రమైనవాడై, క్రమబద్ధమైనవాడై ఉండాలి, అలాగే మసీదును శుభ్రంగా ఉంచడం, దాని సామాగ్రిని సర్ది క్రమబద్ధపరచడం, మరియు దాని సౌకర్యాల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలి, ఇంకా ఆ విషయంలో వృథాకు మరియు మసీదు అలంకరణకు దూరంగా ఉండాలి.
3- మంచి ప్రవర్తన మరియు నడవడిక కలిగి ఉండాలి; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను అనుసరిస్తూ గడ్డాన్ని పెంచుకోవాలి మరియు మీసాలను కత్తిరించుకోవాలి. చీలమండలాల క్రింద వస్త్రాలను ధరించడాన్ని విడిచిపెట్టాలి. గౌరవం మరియు ప్రశాంతతను అలవర్చుకోవాలి మరియు గతించిన సత్పురుషులైన పూర్వీకుల (సలఫ్ సాలెహ్) - రహిమహుముల్లాహ్ - మార్గాన్ని అనుసరించాలి.
4- సౌమ్యుడుగా, సహనశీలిగా, కరుణామయుడుగా ఉండాలి; ఎందుకంటే సౌమ్యత ఏ విషయంలో ఉన్నా దానిని అలంకరిస్తుంది, ఏ విషయం నుండి తొలగించబడినా దానిని లోపభూయిష్టం చేస్తుంది, హదీసులో వచ్చినట్లుగా; ఆయెషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మృదుత్వం ఏ విషయంలో ఉన్నా, దానిని అలంకృతం చేస్తుంది. మరియు ఏ విషయం నుండి అయినా అది తొలగించబడితే, అది లోపభూయిష్టం అవుతుంది. ((163)) [163] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు సంఖ్య: (2594).
మస్జిద్ కు వచ్చేవారిలో ఎవరి నుండైనా ఏదైనా తప్పు జరిగితే, ఖతీబు అతనిని గద్దించకూడదు. బదులుగా, అతనికి మృదువుగా ఉపదేశించాలి మరియు ఉత్తమ రీతిలో బోధించాలి. ముఆవియా బిన్ అల్ హకమ్ అస్సులమి రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో పాటుగా నమాజు చదువుతున్నాను,అప్పుడు జనుల్లో ఒకరు తుమ్మాడు,నేను ‘యర్హముకల్లాహ్’అని చెప్పాను,అప్పుడు ప్రజలంతా తమ చూపుల బాణాలను నా పై సారించారు,నేను‘ నా తల్లి నా పై దుఖిస్తే బాగుండు’మీరంతా అలా నన్ను ఎందుకు చూస్తున్నారు?అని అడిగాను దానికి వారు తమ చేతులను తొడలపై కొట్టసాగారు,వారు నన్ను నిశబ్దంగా ఉండమని సైగచేయడం చూసి నేను నిశబ్దం పాటించాను, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నమాజు ముగించాక,- నా తల్లిదండ్రులు ఆయనకు అంకితం, ఆయన మాదిరి అత్యుత్తమమైన రీతిలో బోధించే వారిని నేను ఆయనకు ముందుగానీ, ఆ తరువాతగానీ ఎన్నడూ చూడలేదు,అల్లాహ్ సాక్షిగా! ఆయన నన్ను కసురుకోలేదు, కొట్టలేదు మరియు తిట్టలేదు. ఆయన కేవలం ఇలా అన్నారు:«నిశ్చయంగా ఈ నమాజు లో ప్రజలతో సంభాషించడం లాంటి వ్యర్థ విషయాలు చేయకూడదు,కేవలం తస్బీహ్,తక్బీర్ మరియు ఖుర్ఆన్ పారాయణం లాంటివి మాత్రమే చేయాలి» ((164)) [164] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు సంఖ్య: (537).
5- మృదువైన హృదయం, సౌమ్య స్వభావం కలిగి ఉండాలి; తద్వారా ప్రజలు తన చుట్టూ చేరి, తన కరుణ, సహాయం, మరియు జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు. వారి కష్టనష్టాలలో మరియు అవసరాలలో వారికి అండగా నిలవాలి. ఇంకా మస్జిద్కు సంబంధించిన విషయాలలో వారితో సంప్రదింపులు జరపాలి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటన్నిటిలోనూ అత్యున్నత స్థానంలో ఉండేవారు, ఆయన గురించి సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు: (ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. [ఆలి ఇమ్రాన్ : 159]
6- తన మస్జిద్లో మరియు తన సంఘంలో ఇమామత్ గౌరవానికి అర్హత పొందేందుకు సహనం మరియు నమ్మకాన్ని కలిగి ఉండాలి; ఎందుకంటే సహనం మరియు నమ్మకం ఒక దాసుడిని ధర్మంలో ఇమామత్ స్థాయికి చేర్చుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో! [అస్ సజదహ్ : 24]
7- అతను చెప్పే మాటలలో నిజాయితీగా ఉండాలి, అది జుమా ఖుత్బాలో అయినా, విద్యాబోధన మరియు ఉపదేశ పాఠంలో అయినా, లేదా ప్రజలతో జరిపే సంభాషణలో అయినా; తద్వారా అతను సత్యసంధులు, సన్మార్గం పొందినవారు మరియు సాఫల్యం పొందినవారిలో చేరతాడు; ఎందుకంటే ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత సత్కార్యాల వైపు దారితీస్తుంది, మరియు సత్కార్యాలు స్వర్గానికి దారితీస్తాయి. ఒక మనిషి ఎల్లప్పుడూ సత్యమే పలుకుతూ, సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. అబద్ధం నుండి జాగ్రత్తగా ఉండండి; నిశ్చయంగా అబద్ధం పాపాచారానికి దారితీస్తుంది, మరియు పాపాచారం నరకానికి దారితీస్తుంది. ఒక మనిషి ఎల్లప్పుడూ అబద్ధమే పలుకుతూ, అబద్ధాన్నే అన్వేషిస్తూ ఉంటాడు, చివరకు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు» ((165)) [165] దీనిని బుఖారీ (6094), ముస్లిం (2607) నమోదు చేసినారు, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.
అబద్ధం అనేది ఒక చెడు మరియు ఆపద. అన్ని అబద్ధాల కంటే అత్యంత ఘోరమైనది అల్లాహ్ పై అబద్ధాలు చెప్పడం మరియు ఎటువంటి జ్ఞానం లేకుండా ఆయన గురించి మాట్లాడటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఇలా అను: "నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు. [అల్ ఆరాఫ్: 33]
ఈ పవిత్రమైన ఆయత్ (వచనం) అత్యంత ఘోరమైన పాపాలను ఒకచోట చేర్చింది. ఇది చిన్న స్థాయి నుండి ప్రారంభించి క్రమంగా అత్యున్నత స్థాయి పాపం వరకు వివరించింది. ఆ క్రమంలో అన్నిటికంటే పెద్ద పాపం ఏమిటంటే అల్లాహ్ యొక్క పేర్లు (అస్మా), ఆయన గుణగణాలు (సిఫాత్) మరియు ఆయన షరియత్ (ధర్మ శాస్త్రం) విషయంలో ఎటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడటం.
మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై అసత్యం పలకడం అత్యంత ఘోరమైన అబద్ధము మరియు అత్యంత నీచమైన పాపము. ఇది ఆ మహా పాపములలో ఒకటి, దానికి పాల్పడిన వారికి నరకాగ్ని గురించి హెచ్చరించబడింది; అల్-ముఘీరా బిన్ షుఅబా రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చెప్పగా విన్నాను: “నిశ్చయంగా నా గురించి అసత్యం పలకడం, ఇతరుల గురించి అసత్యం పలికినట్లు కాదు. ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి” ((166)) [166] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1291); ముస్లిం, హదీథు సంఖ్య (4) లో ఉల్లేఖించారు.
మంచి పట్ల ప్రోత్సహించడానికి మరియు చెడు నుండి భయపెట్టడానికి సదుద్దేశ్యంతోనైనా సరే, కొంతమంది ప్రబోధకులు చేసే విధంగా అసత్యం పలకడం నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే అది ఒక చెడ్డ పని, దానిలో ఎలాంటి మేలు గానీ మార్గదర్శకత్వం గానీ లేదు. దానిని పలికిన వాడు పాపభరితుడు అవుతాడు కానీ పుణ్యం పొందలేడు, మరియు లాభం పొందని పాపాత్ముడుగా మిగిలిపోతాడు.
8- మాటను చేరవేయడంలో నమ్మకస్థుడుగా ఉండాలి, సమాచారముల నిజనిజాలను నిర్ధారించుకోవాలి, వదంతులను స్వీకరించడంలో తొందరపడకూడదు, మరియు కేవలం విశ్వసనీయమైన మాటపై మాత్రమే ఆధారపడాలి. అల్లాహ్ తఆలా తన వాక్కులో మనకు ఈ విధంగా ఆదేశించాడు: ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి. [అల్ హుజరాత్ : 6]
9- ప్రజల లోపాలను కప్పిపుచ్చడంలో (దాచడంలో) అత్యంత శ్రద్ధ వహించాలి మరియు వారి రహస్యాలను కాపాడాలి. ఎవరైతే ఒక ముస్లిం సోదరుని లోపాలను కప్పిపుచ్చుతారో, అల్లాహ్ వారి లోపాలను ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ కప్పిపుచ్చుతాడు. ఎవరైతే ముస్లింల వ్యక్తిగత విషయాలను లేదా లోపాలను వెతకడానికి ప్రయత్నిస్తారో, అల్లాహ్ వారి లోపాలను బహిర్గతం చేస్తాడు చివరికి వారు తమ ఇంట్లోని గదిలో దాక్కున్నా సరే అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు.; అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, నిశ్చయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: «ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు.» అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఓ కేవలం నాలుకతో విశ్వసించి, ఇంకా హృదయంలో ఈమాన్ (విశ్వాసం) స్థిరపడని ప్రజలారా! ముస్లింల గురించి చాడీలు చెప్పకండి (గీబత్ చేయకండి) మరియు వారి లోపాలను వెతకకండి. ఎవరైతే వారి లోపాలను వెతుకుతారో, అల్లాహ్ వారి లోపాలను వెలికితీస్తాడు. అల్లాహ్ ఎవరి లోపాలను వెలికితీస్తాడో, వారిని తన సొంత ఇంట్లోనే అవమానపరుస్తాడు (బహిర్గతం చేస్తాడు).» ((168)) [167] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 2442) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 2580) లో ఉల్లేఖించారు. [168] ఈ హదీసును అబూ దావుద్, హదీథు సంఖ్య (4880) లో ఉల్లేఖించారు.
ఎనిమిదవ విషయం: ఖుత్బా మరియు ఖతీబు యొక్క నియమాలు:
1- జుమా ఖుత్బా ఏ వ్యక్తి, పార్టీ, సంస్థ లేదా మరేదైనా దాని ప్రచార సాధనంగా మారకూడదు. అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన దీన్ (ధర్మం) కొరకు, ఆయన దావత్ (సందేశం) ను చేరవేయడానికి మరియు ఆయన కలీమా (వాక్యం) ను ఉన్నతపరచడానికి మాత్రమే అయి ఉండాలి. సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్ జిన్ను :18]
ఖతీబ్ ఖుత్బాను వినేవారికి భారంగా మరియు విసుగు కలిగించేంతగా పొడిగించకూడదు; అలాగే, దాని అంశానికి భంగం కలిగించి, దానిని అసంపూర్తిగా వదిలేసేంతగా సంక్షిప్తం కూడా చేయకూడదు.
మూడవది: ఖతీబ్ ఖుత్బా ఇచ్చేటప్పుడు శ్రోతల గ్రహణశక్తిని పరిగణనలోకి తీసుకోవాలి. అతను సామాన్య ప్రజలతో వారి బుద్ధి స్థాయికి అనుగుణంగా, వారి గ్రహణశక్తికి అందని భాషా పదాలను విడిచిపెట్టి మాట్లాడాలి. అతను మధ్యస్థులతో మధ్యస్థంగా, మరియు మేధావులతో ఉన్నత స్థాయిలో ప్రసంగించాలి. ఈ విధంగా అతను అన్ని వర్గాల ప్రజలతో, ప్రతి విషయాన్ని దాని సరైన స్థానంలో ఉంచే వివేకవంతునిగా ఉండాలి. మరియు అన్ని పరిస్థితులలోనూ, తన ప్రసంగంలోని ప్రతి నిరర్థకమైన అలంకారం నుండి దూరంగా ఉండాలి.
4- శత్రుత్వం మరియు ద్వేషాన్ని రేకెత్తించే వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి; ఎందుకనగా ఖతీబు యొక్క ప్రాథమిక కర్తవ్యం ప్రజలకు బోధించడం, సత్యంపై వారి హృదయాలను ఏకం చేయడం, మరియు వారి మధ్య విభేదాలకు గల కారణాలను తొలగించడం.
5- ప్రాస కోసం తాపత్రయపడకుండా మరియు అతిగా లోతుగా వెళ్ళకుండా, ప్రయోజనకరమైన భావాలను అత్యంత స్పష్టమైన మరియు సంక్షిప్తమైన పదాలతో తెలియజేయడమే అతని ప్రధాన ఉద్దేశ్యం.
6- అసహ్యకరమైన మరియు కృత్రిమమైన అనుకరణకు, మరియు ప్రసిద్ధ ఖతీబ్ల వ్యక్తిత్వాలను అనుకరించడానికి దూరంగా ఉండాలి; ఎందుకంటే అది మనస్సులలో అసౌకర్యం మరియు అసంతృప్తిని కలిగిస్తుంది[169]. [169] చూడండి: 'జుమా ఖుత్బా శైలి', అబ్దుల్లా బిన్ దైఫుల్లాహ్ అర్-రహీలీ: (పేజీ: 12, 20, 22), మరియు 'విజయవంతమైన ఖతీబుగా మారడానికి యాభై సలహాలు', అమీర్ బిన్ ముహమ్మద్ అల్-మదరి (పేజీ: 33, 73, 87).
తొమ్మిదవ అంశం: ఖుత్బా యొక్క ఉద్దేశ్యం మరియు దాని లక్ష్యాలు:
జుమా ఖుత్బా ఈ క్రింది ఉద్దేశ్యాలను సాధించే లక్ష్యంతో ఉండాలి: من
1- తౌహీదు యొక్క మూలసూత్రాలు, దాని ప్రాధాన్యత మరియు దాని ఘనతను వివరించడం, మరియు షిర్క్ (బహుదైవారాధనల) యొక్క అన్ని రకాలు, రూపాలు మరియు సాధనాల నుండి హెచ్చరించడం.
2- మహోన్నతుడైన అల్లాహ్, పరలోకంలోని ఆయన విచారణ మరియు ప్రతిఫలం, మరియు హృదయాలకు జీవం పోసే దైవిక భావనల గురించి హితబోధన చేయటం, మంచి వైపు ఆహ్వానించడం, మంచిని ఆజ్ఞాపించటం మరియు చెడును ఖండించటం.
3- ముస్లింలకు అల్లాహ్ గ్రంథం మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నత్ నుండి వారి ధర్మం యొక్క వాస్తవాలను బోధించి వారికి అవగాహన కల్పించడం, మరియు నైతికత, మర్యాదలు అతివాదం మరియు నిర్లక్ష్యం నుండి సురక్షితంగా ఉండేలా శ్రద్ధ వహించడం.
4- ఇస్లాం గురించిన తప్పుడు భావనలను సరిదిద్దటం, మరియు ప్రజల మనసులను గందరగోళ పరచడానికి దాని విరోధులు రేకెత్తించే సందేహాలు మరియు అసత్యాలను, వాగ్వాదాలు మరియు దూషణలకు దూరంగా ఉంటూ, ఒప్పించే మరియు వివేకవంతమైన శైలిలో ఖండించటం.
5- అల్లాహ్ సమాజం కొరకు ఇష్టపడి, ఆ సమాజం ధర్మంగా స్వీకరించిన అసలైన ప్రణాళిక అయిన సరైన ఇస్లాంను, దానిలోని పరిపూర్ణత, సమతుల్యత, లోతు మరియు సానుకూలత వంటి లక్షణాలను స్పష్టం చేస్తూ అందించడం ద్వారా, వినాశనకరమైన మరియు తప్పుదోవ పట్టించే ఆలోచనలను ఎదుర్కోవడం.
6- ఖుత్బాను ప్రజల వాస్తవ జీవితానికి అనుసంధానించాలి; సమాజంలోని రుగ్మతలకు చికిత్స చేయడం మరియు దాని సమస్యలకు మహోన్నతమైన ఇస్లామీయ షరియా నుండి పరిష్కారాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించాలి. దీనితో పాటు, అఖీదా (ఇస్లామీయ విశ్వాసం) మరియు దానిని చక్కదిద్దడం, ఇస్లాం మరియు ఈమాన్ యొక్క మూలస్తంభాలు, ముస్లిం స్త్రీ మరియు కుటుంబ వ్యవహారాలు, మరియు ప్రజలకు అత్యవసరమైన ఇతర విషయాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
7- శ్రోతల మదిలో మెదులుతూ, వాటికి సంబంధించి మార్గనిర్దేశం చేసే జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించే, రమదాన్, హజ్ వంటి, సంవత్సరం పొడవునా పునరావృతమయ్యే వివిధ సందర్భాలను పరిగణనలోకి తీసుకోవడం.
8- ముస్లింల మధ్య ఇస్లామీయ సోదరభావ భావనను స్థిరపరచడం, మరియు ముస్లింలను విభజించే జాతి, మత, ప్రాంతీయ మరియు ఇతర పక్షపాతాలు, వేర్పాటువాద ధోరణులను ప్రతిఘటించడం.
పదవ విషయం: ఖుత్బాను సిద్ధం చేసే విధానం:
ఖతీబు తన ఖుత్బాను నైపుణ్యంతో సిద్ధం చేసుకోవాలి, అలాగే ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి:
ఖుత్బా సాధారణంగా మూడు భాగాలను కలిగి ఉంటుంది: పరిచయం, విషయం మరియు ముగింపు. ఇవి రాసేటప్పుడు లేదా ప్రసంగించేటప్పుడు స్పష్టంగా పేర్కొనబడని అంశాలు; అవి పరస్పరం అనుసంధానించబడిన, పొందికైనవి కూడా. వాటి మధ్య అనుసంధానం యొక్క శ్రేష్ఠత, ఖతీబు యొక్క సామర్థ్యం, అతని విస్తారమైన జ్ఞానం మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది; తద్వారా ఖుత్బా యొక్క భాగాలు క్రమబద్ధంగా అమర్చబడి, దాని నిర్మాణం పటిష్టంగా ఉంటుంది.
ఈ క్రమబద్ధత మరియు పటిష్టత, అర్థాలను స్పష్టంగా మరియు ఉద్దేశ్యాలను తేటతెల్లంగా చేసి, ప్రసంగీకుడు తన శ్రోతల నుండి శ్రద్ధాయుతమైన ఆలకింపును, మరియు సభికుల నుండి సంపూర్ణ ఏకాగ్రతను పొందేలా నిర్ధారిస్తుంది.
పీఠిక : ప్రసంగీకుడు తన పీఠిక మరియు ప్రారంభం పట్ల శ్రద్ధ వహించాలి, ఖుత్బా యొక్క ఉద్దేశ్యాన్ని శ్రోతలకు సూచించే ప్రారంభ వాక్యాలను ఉపయోగించాలి, ఇది వారి శ్రద్ధను ఆకర్షించి, హృదయాలను సిద్ధపరుస్తుంది. ఇది హెచ్చరించే లేదా ప్రోత్సహించే ఖుర్’ఆన్ ఆయతుల ద్వారా లేదా ప్రవక్త ఉపదేశాలలోని కొన్ని సారవంతమైన వివేక వచనాల ద్వారా కావచ్చును. ప్రారంభ వాక్యాలే ప్రసంగీకుడు తన శ్రోతల ముందు మొట్టమొదటగా వినిపించేవి, కావున, అతను చక్కని ప్రారంభంతో వారిని ఆకట్టుకోగలిగితే, వారు అతని ఖుత్బాలోని మిగిలిన భాగాన్ని పూర్తి ఉత్సాహముతో మరియు చురుకుదనముతో అనుసరించగలరు.
ప్రసంగం యొక్క ఆరంభంలో వక్త యొక్క ఉద్దేశ్యాన్ని సూచించేది ఉండాలి, మరియు జుమా ఖుత్బా అల్లాహ్ స్తోత్రము, ఆయన ప్రశంసలు, రెండు సాక్ష్యాలు మరియు అల్లాహ్ సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) పై సలాత్ మరియు సలాములతో ప్రారంభించబడుతుందనేది తెలిసిన విషయమైనందున, ఈ పదాల యొక్క ఉత్తమ ఎంపికలోనే ఖుత్బా యొక్క విషయం మరియు దాని ఉద్దేశ్యం ఇమిడి ఉండాలి.
విషయం: ఇది ఖుత్బా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ ప్రస్తావించబోయే అంశం, సమాజంలో చర్చనీయాంశమై, ప్రజలు దానిపై స్పష్టమైన వివరణ కోసం ఎదురుచూస్తున్న సమకాలీన సమస్య అయినట్లయితే, ఖుత్బా ప్రారంభంలోనే 'నేను మీతో ఫలానా విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను...' అని చెప్పి విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం సముచితంగా ఉంటుంది.
ఒకవేళ ఒక విషయం సున్నితమైనది లేదా ప్రజలలో విభజనను కలిగించేది అయితే, దానిని నేరుగా ప్రస్తావించడం తగకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఖతీబ్ ఆ విషయంలోకి క్రమంగా ప్రవేశించి, పరోక్షంగా చర్చించాలి. రెచ్చగొట్టడం మరియు విభజనలకు దూరంగా ఉంటూ, శ్రోతలను ఒక తార్కిక క్రమంలో నడిపి, మితంగా, సమతుల్యంగా తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ విధంగా, ఒకవేళ మనసులు ఆ విషయం పట్ల విముఖంగా ఉన్నా, లేదా అది వాటికి పరిచయం లేనిదైనా, వాటిని సిద్ధపరిచే తన లక్ష్యాన్ని ఖతీబ్ సాధిస్తాడు.
ఖుత్బా యొక్క అంశం సాధారణంగా వివరణ మరియు ప్రమాణం అనే రెండు ప్రాథమిక స్తంభాలపై ఆధారపడి ఉంటుంది.
వివరణ: చర్చించబడుతున్న విషయం యొక్క నిర్వచనాన్ని, దాని గుణాలను, లక్షణాలను మరియు ప్రయోజనాలను పేర్కొనడంలో ఉంటుంది.
ఇక ప్రమాణాల విషయానికి వస్తే: ఒక అంశానికి బలం చేకూర్చడానికి తరచుగా ఆధారాలు, ప్రమాణాలు మరియు రుజువులు అవసరమవుతాయి. అవి సాధారణంగా ఖుర్ఆను, సున్నతు మరియు సలఫ్ల యొక్క వాక్కుల నుండి ఉంటాయి. అలాగే ఖియాస్ మరియు గుణపాఠం కోసం కొన్ని వాస్తవాలను మరియు సంఘటనలను ఉదహరించడం, ఇంకా సందర్భానికి మరియు విషయానికి అనుగుణంగా ధర్మనిష్ఠ, ఇమామత్, పౌరుషం, నిరాడంబరత, ధైర్యం మరియు దైవభీతితో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇమామ్లు మరియు వారిలోని జ్ఞానుల నుండి ఉల్లేఖించడం కూడా ఈ విషయంలో ప్రయోజనం చేకూరుస్తుంది.
ఖుత్బా ముగింపు: ఖతీబ్ తన విషయాన్ని ప్రదర్శించిన తర్వాత, తన ఆలోచనలను సమీకరించి, అంశాన్ని విభిన్నమైన పదజాలంతో, సంక్షిప్త పద్ధతిలో సంగ్రహించే ఒక తగిన ముగింపుతో తన ఖుత్బాను ముగించడం మంచిది. ఎందుకంటే, ఈ సందర్భంలో పొడిగించడం విసుగును తెచ్చి, ఆలోచనలను చెదరగొడుతుంది.
దానిలో కొత్త ఆలోచనలు మరియు కొత్త ఆధారాలు ఉండకూడదు; ఎందుకంటే, అప్పుడు అది ముగింపు కాకుండా, ఖుత్బా {ప్రసంగం} యొక్క ఒక భాగం మరియు దాని పొడిగింపుగా మాత్రమే ఉంటుంది.
ముగింపు దాని వ్యక్తీకరణలో మరియు ప్రభావంలో శక్తివంతంగా ఉండాలి, ఎందుకంటే అదే వినేవాడి చెవిన పడి, అతని మనస్సులో నిలిచిపోయే చివరి విషయం. ఒకవేళ దాని నిర్మాణం బలహీనంగా, సమర్పణ నీరసంగా ఉంటే, ఖుత్బా యొక్క ప్రయోజనం పోతుంది.
ముగింపు గతంలో ప్రస్తావించని, ప్రసంగం యొక్క అంశాన్ని ప్రోత్సాహం లేదా హెచ్చరిక లేదా నిదర్శనం మరియు రుజువు రూపంలో సంగ్రహించే ఖుర్’ఆన్ ఆయతులుగా ఉండవచ్చు, లేదా ఖుర్’ఆన్ ఆయతులు ఇచ్చే ప్రయోజనాన్నే చేకూర్చే ఒక ప్రవక్త హదీసుగా ఉండవచ్చు, లేదా ఖుత్బాలోని అంశాలను భిన్నమైన శైలిలో, సమగ్రంగా, స్పష్టంగా మరియు బలమైన ప్రభావం చూపే విధంగా పునశ్చరణ చేయడంగా కూడా ఉండవచ్చు.
ఖతీబు శ్రద్ధ వహించవలసిన రెండు విషయాలు ఉన్నాయి, అవి: విషయ ఏకత్వం, నూతనత్వం మరియు మార్పు.
విషయ ఏకాగ్రత: ఒకే విషయానికి పరిమితం కావాలి, దాని అంశాలు పూర్తిచేయబడాలి, దాని పదాలు మెరుగుపరచబడాలి మరియు దాని చర్చ లోతుగా చేయబడాలి; ఎందుకంటే ఒకే సందర్భంలో విషయాలు శాఖలుగా విడిపోవడం మరియు సమస్యలు అనేకం కావడం మనస్సులను చెదరగొడుతుంది, ఒకదానికొకటి మరిపిస్తుంది, మరియు విసుగు పుట్టించే దీర్ఘతకు, మసకబారిన చిత్రణకు మరియు ఉపరితల చర్చకు దారితీస్తుంది.
నూతనత్వం మరియు మార్పు: అంటే, అతని ప్రసంగాలు పునరావృతమయ్యే విషయాలకే పరిమితం కాకుండా, షరీఅత్లోని తౌహీద్, ఇబాదాత్లు, ముఆమలాత్, అఖ్లాఖ్ మరియు ఇతర అన్ని విషయాలను చేర్చే విధంగా అతను తన అంశాలలో వైవిధ్యాన్ని పాటించాలి.
మరియు తన శైలి మరియు ప్రసంగ పద్ధతిలో ఒకే ధోరణికి కట్టుబడి ఉండకుండా, కొన్నిసార్లు ప్రశ్నాత్మకంగా, మరికొన్నిసార్లు వివరణాత్మకంగా, ఉపమానాలు చెబుతూ, వివేకాలను మరియు రహస్యాలను అన్వేషిస్తూ, అదే సమయంలో ప్రజలపై ఈ మార్పుల ప్రభావానికి అనుగుణంగా సమాజ వాస్తవికతతో మమేకమవుతూ, వారి అవసరాలను గ్రహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేసి, అవగాహన కల్పించాలి[170]. [170] చూడండి: డాక్టర్ సాలిహ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ హుమైద్ రచించిన మన్హజ్ ఫీ ఇఅదాద్ ఖుత్బతిల్ జుముఅహ్: (పేజీ 22) మరియు ఆ తర్వాతవి.
నాలుగవ అధ్యాయం: మస్జిదుల ఆదేశాలు
మొదటి అంశం: మస్జిద్ యొక్క నిర్వచనం
షరియా ప్రకారం మస్జిద్: అనగా ఫర్జ్ చేయబడిన ఐదు పూటల నమాజులు, జుమా మరియు ఇతర నమాజులు నిలపబడే ప్రదేశం, మరియు అందులో అజాన్ ఇవ్వబడుతుంది. ఇది మహోన్నతుడైన అల్లాహ్ కు సజ్దా చేసే ప్రదేశం కాబట్టి దీనికి మస్జిద్ అని పేరు పెట్టబడింది.
మస్జిద్ మరియు ముసల్లా మధ్య భేదం
మస్జిద్ అనేది శాశ్వతంగా విధి నమాజుల కొరకు ప్రత్యేకించబడి, దాని కొరకు వఖ్ఫ్ చేయబడిన ప్రదేశం. అయితే ముసల్లా అనేది తాత్కాలిక నమాజు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రదేశం; ఉదాహరణకు పాఠశాలలు, సంస్థలు, కంపెనీలు, ప్రయాణ మార్గాలు మొదలైన వాటిలోని ప్రార్థనా స్థలాలు. అది ఐదు పూటల నమాజుల కొరకు వఖ్ఫ్ చేయబడదు. ముసల్లాలో ప్రవేశించినప్పుడు తహియ్యతుల్ మస్జిద్ ఆచరించడం సున్నత్ కాదు, అది కేవలం మస్జిద్లో ప్రవేశించినప్పుడు మాత్రమే సున్నత్.
రెండవ అంశం : మస్జిదును నిర్మించడం మరియు దాని ఘనత
మస్జిదులు భూమిపై ఉన్న అత్యంత శ్రేష్ఠమైన మరియు గౌరవప్రదమైన ప్రదేశాలు, వాటిలో అత్యుత్తమ ఆరాధన అయిన నమాజ్ నిలపబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు. ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు. [నూర్: 36-37]
మరియు అల్లాహ్ తఆలా మస్జిదులకు గౌరవాన్ని, ఘనతను చేకూర్చడం కోసం వాటిని తనకు ఆపాదించుకున్నాడు. మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: మరియు అల్లాహ్ మస్జిద్ లలో ఆయన నామస్మరణం నిషేధించి ... [అల్ బఖర: 114]، అల్లాహ్ సెలవిచ్చాడు: మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్ జిన్ను :18]
అందువల్ల షరిఅహ్ వాటి ఇంద్రియ, నైతిక నిర్మాణం మరియు అభివృద్ధిని ప్రోత్సహించింది. అందులో నుంచి: అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు! [తౌబా : 18]
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:" ఎవరైతే అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఒక మస్జిదును నిర్మిస్తారో, అల్లాహ్ స్వర్గంలో అతనికి అలాంటిదే నిర్మిస్తాడు. ((171)) [171] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 450) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 533) లో ఉల్లేఖించారు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:" «ఎవరైతే అల్లాహ్ కోసం ఒక పిట్ట తన గుడ్లను దాచుకోవడానికి చేసుకునే గూడంత లేదా అంతకంటే చిన్నదైన మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు» ((172)) [172] దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు: (738), మరియు అల్-బూసిరి «అజ్-జవాయిద్» (1/94) లో చెప్పారు: ఈ ఇస్నాద్ సహీహ్.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనము: «ఒక పక్షి తన గుడ్ల కోసం నేలను గోకి చేసుకునే చిన్న గూడంత పరిమాణం అంతటిదైనా సరే» అంటే, ఆడ పక్షి తన గుడ్ల కోసం నేలపై ఏర్పాటు చేసుకునే స్థలం. ఇక్కడ దాని చిన్న పరిమాణాన్ని అతిశయించి చెప్పడం ఉద్దేశించబడింది, తద్వారా ఎవరూ తాను నిర్మించిన మస్జిదును, అది అత్యంత చిన్నదైనా సరే హీనంగా చూడకూడదు.
మస్జిదు నిర్మాణంలో ఒక ఇటుక లేదా మట్టితో పాలుపంచుకున్నా, లేదా స్వయంగా పనిచేసినా, లేదా పనివారికి జీతాలు చెల్లించినా, మరియు ఒక వ్యక్తి తన ప్రాణంతో లేదా ధనంతో మస్జిదు నిర్మాణానికి సహాయపడ్డాడని చెప్పబడే ఇలాంటి ఇతర పనులు కూడా దీని పరిధిలోకి వస్తాయి; దీనికి ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తూ చేసినదై ఉండాలి. ఆ ప్రతిఫలం ఏమిటంటే, అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో దానిలాంటి లేదా దానికంటే విశాలమైన గృహాన్ని నిర్మిస్తాడు. ఎందుకంటే స్వర్గంలోని గృహాన్ని ఈ ప్రపంచంలోని వాటితో పోల్చలేము, ఆ రెండిటి మధ్య ఎలాంటి పోలికా ఉండదు. ఈ విషయం, అల్లాహ్ ఎవరికైతే సమృద్ధిని ప్రసాదించాడో అటువంటి వారిని పుణ్యకార్యాలలో ముందుకు సాగడానికి, ఈ జీవితంలోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా వారు తమ పరలోకం కోసం పంపిన దానికి ప్రతిఫలంగా, తమ ప్రభువు వద్ద బహు రెట్లు అధికంగా పుణ్యఫలాన్ని పొందుతారు[173]. [173] చూడండి: «ఫుసూల్ వ మసాయిల్ తతఅల్లఖు బిల్-మసాజిద్» షైఖ్ ఇబ్న్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ (పేజీ: 14).
మూడవది: మస్జిదుల నిర్మాణం మరియు దాని ఘనత
విస్తృత అర్థంలో మస్జిదుల ఆబాదీకరణ (నిర్మాణం మరియు నిర్వహణ) అనేది భౌతిక మరియు ఆధ్యాత్మిక అనే రెండు రకాలను కలిగి ఉంటుంది. అవి: మస్జిదులను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం, వాటిలో దీపాలను ఏర్పాటు చేయడం, తివాచీలు పరచడం, వాటికి సేవ చేయడం, వాటిని శుభ్రం చేయడం, వాటిలో అల్లాహ్ను ఆరాధించడం, వాటి కొరకు ఇమాములను మరియు ముఅజ్జిన్లను నియమించడం, వాటిలో ధార్మిక జ్ఞాన సభలను ఏర్పాటు చేయడం - అనగా ఖుర్ఆన్, ఫిఖ్హ్, తఫ్సీర్, హదీసు మరియు ఇతర ప్రయోజనకరమైన విద్యలను బోధించడం; వాటిలో పనిచేసే వారి కొరకు జీవనోపాధిని ఏర్పాటు చేయడం, వాటి ప్రయోజనార్థం వక్ఫ్ చేయడం, ఉదాహరణకు వాటిలోని ఇమామ్, ముఅజ్జిన్, ఉపాధ్యాయుడు మరియు విజ్ఞాన విద్యార్థుల కొరకు నివాస గృహాలను వక్ఫ్ చేయడం, వుజూఖానాలు నిర్మించడం మరియు వాటికి సంబంధించిన ఇతర ప్రయోజనకరమైన పనులను చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు! [తౌబా : 18]
ఈ పవిత్ర ఆయతు, మస్జిదులలో నమాజు చేస్తూ, వాటిని శుభ్రపరుస్తూ, వాటిలో శిథిలమైన వాటికి మరమ్మత్తులు చేయడం ద్వారా మస్జిదులకు సేవ చేసే వారి విశ్వాసాన్ని ధృవపరుస్తోంది.[174] [174] చూడండి: అల్-మష్రూఅ వల్-మమ్నూఅ ఫిల్-మస్జిద్ - ముహమ్మద్ అల్-అర్ఫజ్ (పేజీ 9).
నాలుగవ అంశం: మస్జిదులను పవిత్రంగా ఉంచడం మరియు వాటిని మురికిమలినాల నుండి రక్షించుట.
మస్జిదులు ఆరాధన మరియు విధేయత ద్వారా మహోన్నతుడైన అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందే స్థలాలు కాబట్టి, వాటిని పరిశుభ్రంగా, అందంగా మరియు సౌందర్యంగా ఉంచడానికి గాను మలినాలు, అశుద్ధాలు మరియు వ్యర్థాల నుండి కాపాడి, సంరక్షించాలని ఆజ్ఞాపించబడింది.
షైఖ్ ఇబ్ను స'అది' రహిమహుల్లాహ్ ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఇలా పలికారు: అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు. [నూర్: 36] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని... ఇవి మస్జిదులకు సంబంధించిన సమగ్ర ఆదేశాలు: వాటి గౌరవాన్ని ఉన్నతపరచడంలో ఇవి చేరి ఉన్నాయి: వాటిని నిర్మించడం; వాటిని ఊడ్చి, మలినాలు మరియు హానికరమైన వస్తువుల నుండి శుభ్రం చేయడం; మలినాల పట్ల జాగ్రత్త వహించని మానసిక రోగుల నుండి, చిన్న పిల్లల నుండి మరియు అవిశ్వాసుల నుండి వాటిని రక్షించడం; ఇంకా వాటిలో వ్యర్థమైన సంభాషణలు జరగకుండా, అల్లాహ్ ధ్యానం (జిక్ర్) కాకుండా ఇతర కారణాల వల్ల స్వరాలు పెంచకుండా వాటిని సంరక్షించడం[175]. [175] తఫ్సీర్ సఅదీ (పేజీ: 569).
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక నల్లజాతి మహిళ మస్జిద్ శుభ్రం చేసే వారు (అంటే, ఊడ్చేవారు). దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతకాలం ఆమెను చూడకపోయేసరికి, ఆమె గురించి అడిగారు. వారు చెప్పారు: ఆమె మరణించింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?” అని ఆయన అన్నారు. వారు ఆమె విషయాన్ని తేలికగా తీసుకున్నట్లు అనిపించింది. దానికాయన, “నాకు ఆమె సమాధి ఎక్కడుందో చూపించండి” అని కోరారు. వారు ఆయనకు సమాధిని చూపించగా, ఆయన ఆమె కొరకు జనాజా నమాజు చేశారు. తరువాత ఇలా అన్నారు: “నిస్సందేహంగా ఈ సమాధులు వాటిలో వున్న వారికొరకు చీకటితో నిండి ఉన్నాయి. నేను వాటి దగ్గర నమాజు చేసినప్పుడు అల్లాహ్ వారికి వెలుతురును ప్రసాదిస్తాడు.” ((176)) [176] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (460) మరియు ముస్లిం హదీసు సంఖ్య (956)లో ఉల్లేఖించారు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మేము మస్జిద్లో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా, ఒక ఎడారివాసి వచ్చి మస్జిద్లో నిలబడి మూత్రవిసర్జన చేయసాగాడు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, “ఆగిపో, ఆగిపో” అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అతడిని ఆపకండి - అంటే: అతడిని (మూత్రవిసర్జన నుండి) అడ్డుకోకండి - అతడిని వదిలేయండి." దానితో వారు అతడు మూత్రవిసర్జన చేసేంత వరకు అతడిని వదిలి వేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని తన దగ్గరకు పిలిచి, అతనితో ఇలా అన్నారు: “వాస్తవానికి ఈ మస్జిదులు మలవిసర్జన మరియు మూత్రవిసర్జనల కొరకు అనుకూలమైన ప్రదేశాలు కావు. ఇవి కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు మరియు ఖుర్’ఆన్ పఠనం కొరకు మాత్రమే.” ఆయన ప్రజలలో ఒకరిని ఒక బక్కెట్టు నీళ్ళు తెచ్చి అతనిపై పోయమని ఆదేశించినారు [177]. [177] ఈ హదీసును బుఖారీ (హదీథు సంఖ్య: 219) సంక్షిప్తంగా, మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 285) లో ఉల్లేఖించారు.
మూత్రం మరియు దాని వంటి మాలిన్యాల నుండి మస్జిదులను రక్షించాలనే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు, ఎందుకంటే వాటి పరిశుద్ధత తప్పనిసరి షరతు. కావున మస్జిదులు, వాటిలోని చాపలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న ప్రాంగణాలు, పైకప్పులు మొదలైనవాటిని అన్ని రకాల మాలిన్యాల నుండి కాపాడాలి మరియు వాటిలో అలాంటిదేదైనా పడినప్పుడు శుభ్రపరచాలి.
అదేవిధంగా, శ్లేష్మం, చీముడు, ఉమ్మి, రక్తం, మరియు చీము వంటి మాలిన్యాల నుండి దానిని శుభ్రపరచడం గురించి కూడా చెప్పబడింది. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఖిబ్లా వైపు కఫం ఉండటం చూశారు. అది ఆయనకు తీవ్ర అసహనం కలిగించింది, ఆ ప్రభావం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. పిదప ఆయన లేచి స్వయంగా తన చేతితో దాన్ని గీకి శుభ్రపరిచి, ఇలా అన్నారు: మీరు నమాజు కై నిలబడినప్పుడు మీ ప్రభువుతో సంభాషిస్తూ ఉంటారు, లేదా అతనికి మరియు ఖిబ్లా కి మధ్య ప్రభువు ఉంటాడు. కనుక ఎట్టి పరిస్థితిలో ఖిబ్లా వైపునకు ఉమ్మకూడదు, కానీ ఎడమవైపుకు లేదా తన పాదాల కింద ఉమ్మవచ్చు. పిదప తన దుప్పటి యొక్క ఒక కోన బాగాన్ని తీసుకుని, అందులో ఉమ్మి దాన్ని అటుఇటు రుద్ది, “లేదా ఇలా చెయ్యాలి” అని అన్నారు. ((178)) [178] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 405) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 551) నమోదు చేసినారు.
మస్జిదులో ఉమ్మివేయడం మరియు శ్లేష్మం వేయడాన్ని నిషేధిస్తూ అనేక హదీసులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిలో ఖిబ్లా వైపు లేదా కుడి వైపుకు ఉమ్మివేయడం నిషేధించబడింది, అయితే ఎడమ వైపు లేదా ఎడమ పాదం కింద ఉమ్మివేసి, పిమ్మట దానిని పాదంతో రుద్దడానికి అనుమతి ఇవ్వబడింది. నిస్సందేహంగా ఉమ్మి మరియు శ్లేష్మం స్వభావరీత్యా అసహ్యకరమైనవి. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు ఖిబ్లా వైపు ఉమ్మిని చూసినప్పుడు, ఆయనకు ఆగ్రహం కలిగి ఆయన ముఖవచ్చస్సు మారిపోయింది. పిమ్మట ఆయన త్వరపడి దానిని గీసివేసి, ఆ స్థానంలో ఖలూఖ్ (సుగంధ ద్రవ్యం) లేదా కుంకుమపువ్వును పూశారు.
తెలిసిన విషయమేమిటంటే, ఒకవేళ మస్జిద్ మట్టితో నిర్మించబడి ఉంటే, దానిని తుడిచివేయడం సులభం. మరియు నేల మట్టితో కూడినది కావడం వలన, దానిలో పడిన అశుద్ధాన్ని పూడ్చివేయడం లేదా ఆ కలుషితమైన మట్టిని తొలగించడం సాధ్యమవుతుంది.
ఈ కాలంలోని మస్జిదులు సాధారణంగా శుభ్రమైన తివాచీలతో మరియు ఫ్లోరింగ్తో కప్పబడి ఉన్నాయి, వీటిపై మురికి, అపరిశుభ్రత, శ్లేష్మం, రక్తం మరియు చీము వంటి వాటి ప్రభావం పడుతుంది మరియు వాటి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల, తివాచీలపై గానీ, గోడలపై గానీ, లేదా టైల్స్పై గానీ, మస్జిదులలోని నేలపై ఉమ్మివేయడం ఖచ్చితంగా నివారించబడాలి. ఎవరికైనా ఉమ్మి లేదా శ్లేష్మం వస్తే, వారు దాని కోసం బయటకు వెళ్ళాలి, లేదా చేతిరుమాలులో ఉమ్మివేసి దానిని బయటకు తీసుకువెళ్ళాలి, లేదా హదీసులో ప్రస్తావించిన విధంగా తన వస్త్రం యొక్క ఒక చివరలో ఉమ్మివేసి దాన్ని మడతపెట్టాలి. తద్వారా మస్జిద్ శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంటుంది.
ఆయషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం: బస్తీల్లో వాడల్లో మస్జిదులు నిర్మించి వాటిని పరిశుబ్రంగా ఉంచుతూ సుగంధపరిమలాలతో నింపాలని ఆదేశించారు. సుఫ్యాన్ ఇలా తెలిపారు: బస్తీల్లో వాడల్లో మస్జిదులు నిర్మించడం అనగా: తెగల మధ్య అని భావం[179]. [179] దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు: (594), మరియు దీని గురించి «ఫుసూల్ వ మసాయిల్ తతఅల్లఖు బిల్-మసాజిద్» (పేజీ: 27) లో చూడండి.
ఐదవ అంశము: సమాధిపై మస్జిదును నిర్మించడం లేదా మస్జిదులో సమాధిని చేర్చడం
సమాధిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ, అతని సమాధిపై మస్జిదు నిర్మించడం అనుమతించబడదు; ఎందుకంటే దీని నుండి వారించబడింది. షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: సమాధిపై మస్జిదు నిర్మించరాదని ఇమాములు ఏకగ్రీవంగా అంగీకరించారు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా మీకు పూర్వం గతించినవారు సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారించాను”.
మస్జిద్లో మృతుడిని ఖననం చేయడానికి అనుమతి లేదు, ఒకవేళ ఖననానికి ముందు మస్జిద్ ఉన్నట్లయితే దానిని మార్చాలి: సమాధిని చదును చేయాలి, లేదా అది కొత్తది అయితే దానిని త్రవ్వి తీయాలి.
ఒకవేళ మస్జిద్ సమాధి తర్వాత నిర్మించబడితే: అయితే మస్జిద్ను తొలగించాలి, లేదా సమాధి ఆకారాన్ని తొలగించాలి. సమాధిపై ఉన్న మస్జిద్లో ఫర్జ్ గానీ, నఫిల్ గానీ నమాజు చదవకూడదు; ఎందుకంటే అది నిషేధించబడింది[180]. [180] మజ్మూఉల్ ఫతావా (22/194).
షేఖుల్ ఇస్లాం రహిమహుల్లాహ్ పేర్కొన్న ఆధారాలు కాకుండా దీనికి మరొక ఆధారం: ఆయిషా మరియు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ ఇద్దరూ ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై మరణం ఆవహించినప్పుడు (అంటే: మృత్యువు ఆయన వద్దకు వచ్చినప్పుడు), ఆయన తన ముఖంపై దుప్పటి కప్పుకోసాగారు. దానితో ఊపిరాడనంత ఇబ్బందిగా అనిపించినప్పుడు, దానిని తన ముఖంపై నుండి తొలగించేవారు. ఆ స్థితిలోనే ఉండి ఆయన ఇలా అన్నారు: యూదులపై మరియు క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు. వారు చేసినటువంటి పని నుండి హెచ్చరించబడుతుంది [181]. [181] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 435) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 531) నమోదు చేసినారు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరణ సమయంలో ఉన్నప్పుడు స్పష్టం చేశారు: అల్లాహ్, యూదులను మరియు క్రైస్తవులను శపించాడు, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు. మరియు ఇది పూర్వపు అవిశ్వాసుల పద్ధతి అని కూడా వివరించారు. ఇదంతా తన ఉమ్మత్ను వారిని అనుసరించకుండా హెచ్చరించడానికి, మరియు అల్లాహ్తో షిర్క్ చేసే మరియు ఆయనను తప్ప ఇతరులను ఆరాధించే మార్గాన్ని మూసివేయడానికే.
విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ఉమ్మే హబీబ మరియు ఉమ్మే సల్మా హబషాలో తాము చూసిన ఒక చర్చి గురించి, అందులోని చిత్రాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించారు, అప్పుడు ఆయన ఇలా అన్నారు: "వారిలోని పుణ్యాత్ములు చనిపోయినప్పుడు, వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి, వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు; ప్రళయదినాన అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు". ((182)) [182] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (427) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (528) లో ఉల్లేఖించారు.
ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, తాను కోలుకోలేని అనారోగ్యంతో ఉన్న సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: యూదులపై మరియు క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు. ఆ సమస్య ఒక వేళ లేకుంటే ప్రవక్త సమాధిని కూడా ఖాళీ గా ఉంచేవారు, దాన్ని కూడా మస్జిద్ చేసేస్తారేమో అన్న భయం తో అలా చేయడం జరిగింది [183]. [183] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 1390) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 529) లో ఉల్లేఖించారు.
ఆరవ అంశం : మస్జిదుల అలంకరణ యొక్క ఆదేశం
మస్జిదులను అలంకరించడం మరియు వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం తగదు, వాస్తవానికి ఇమామ్ బుఖారీ, అబ్దుల్లాహ్ ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమ ఇలా చెప్పినట్లు ఉల్లేఖించారు: “యూదులు మరియు క్రైస్తవులు అలంకరించిన విధంగానే, మీరు కూడా వాటిని తప్పక అలంకరిస్తారు.”
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “వారు వాటి గురించి గొప్పలు చెప్పుకుంటారు, కానీ వాటిని చాలా కొద్దిగా మాత్రమే వినియోగిస్తారు.”
ఉమర్ రజియల్లాహు అన్హు మస్జిదులను నిర్మించమని ఆదేశించి ఇలా చెప్పారు: “ప్రజలకు వర్షం నుండి ఆశ్రయం కల్పించండి, దానికి ఎరుపు లేదా పసుపు రంగులు వేయకండి; అలా చేస్తే మీరు ప్రజలను పరీక్షకు గురిచేసినవారవుతారు”[184]. [184] అల్ బుఖారీ ఈ ఆధారాలను తన ‘సహీహ్’లో నిశ్చయార్థక రూపంలో ముఅల్లఖ్గా పేర్కొన్నారు (1/96-97).
ఈ కాలంలో మస్జిదుల విషయంలో గొప్పలకు పోవడం ఎక్కువైంది, మరియు ప్రజలు వాటిని అలంకరించడంలో మరియు వాటిపై అధికంగా ఖర్చు చేయడంలో దుబారాకు పాల్పడ్డారు. నివాస గృహాలు మరియు ఇళ్ళు నిర్మించబడినట్లయితే, మస్జిదులను కూడా నిర్మించడం అనుమతించబడుతుందని షేఖులు ఫత్వా ఇచ్చారు, తద్వారా ఇళ్ళు మరియు నివాసాలతో పోలిస్తే మస్జిదులు వికారంగా మరియు అందంగా కనిపించకుండా ఉంటాయి. అయితే, అలంకరణ, రంగులు వేయడం మరియు వన్నెలు అద్దకం చేయడంలో దుబారా మరియు అతిగా వ్యవహరించడం వంటివి ఉండకూడదు. అలాగే అనవసరమైన పింగాణీ, టైల్స్, తివాచీల వంటి వాటిపై చేసే ఖర్చులో వైవిధ్యాన్ని ప్రదర్శించకూడదు. అత్యల్ప నిర్మాణం అవసరమైన మస్జిదులు ఉన్నాయని గమనించాలి, కాబట్టి ఆ ధనాన్ని అటువంటి మస్జిదుల నిర్మాణం కోసం ఖర్చు చేయాలి.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో మస్జిదు మట్టి ఇటుకలతో నిర్మించబడింది, దాని పైకప్పు ఖర్జూరపు కొమ్మలతో, మరియు దాని స్తంభాలు ఖర్జూరపు కర్రలతో ఉండేవి. అబూబకర్ రజియల్లాహు అన్హు దానిలో ఏమీ జోడించలేదు. ఉమర్ రజియల్లాహు అన్హు దానిలో చేర్పులు చేసి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంనాటి నిర్మాణంపైనే మట్టి ఇటుకలతో, ఖర్జూరపు కొమ్మలతో దానిని పునర్నిర్మించారు మరియు దాని స్తంభాలను తిరిగి కర్రలతోనే పునఃస్థాపించారు. ఆ తరువాత, ఉస్మాన్ రజియల్లాహు అన్హు దానిని మార్చి, దానిలో చాలా ఎక్కువగా చేర్పులు చేశారు, మరియు దాని గోడను చెక్కిన రాళ్లతో మరియు సున్నంతో నిర్మించి, దాని స్తంభాలను చెక్కిన రాళ్లతో మరియు పైకప్పును టేకుచెక్కతో నిర్మించారు [185]. [185] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (446).
అల్లామా అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఉస్మాన్ రజియల్లాహు అన్హు చర్య, చెక్కిన రాళ్లతో, మంచి కలపతో, మరియు సున్నంతో, అంటే గోడకు రంగు వేయడంతో మస్జిదును మెరుగుపరచడాన్ని సూచిస్తుంది, అలా చేయడంలో తప్పు లేదు. సలఫ్ (పూర్వీకుల) జీవితం శ్రేష్ఠమైనది మరియు ఉత్తమమైనది అయినప్పటికీ, ప్రజలు తమ నివాసాలను మెరుగుపరుచుకుని, పాత కట్టడాల పట్ల విముఖత చూపినప్పుడు, మస్జిదును దాని పాత స్థితిలో వదిలివేయడం వారిని నమాజు నుండి మరియు మస్జిదులలో సమావేశమవడం నుండి దూరం చేసే అవకాశం ఉంటే, మస్జిదుల పట్ల వారిని ప్రోత్సహించడానికి ఉథ్మాన్ రజియల్లాహు అన్హు చేసినట్లే చేయడంలో తప్పు లేదు. అయితే ప్రగల్భాల కోసం అయితే కాదు. మరియు మస్జిదులో లిఖించడం అయిష్టమైనది, కాబట్టి అది సాధారణంగా ఉండటమే శ్రేష్ఠమైనది[186]. [186] అల్-ఖహ్తానీ రచించిన «అల్-మసాజిద్» (పుట: 71) నుండి ఉల్లేఖించబడింది.
ఏడవ అంశం: మస్జిదులో అవిశ్వాసి ప్రవేశంపై తీర్పు
ముస్లింలు ఏ అవిశ్వాసినైనా మస్జిద్ అల్ హరామ్ మరియు దాని చుట్టూ ఉన్న పూర్తి హరమ్ పరిధిలోకి ప్రవేశించనీయడం నిషిద్ధం; దీనికి ఆధారం అల్లాహ్ త'ఆలా చెప్పిన ఈ మాట: ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్). కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు... [తౌబా: 28] అయితే ఇతర మస్జిదులలో, వారు షరీఅత్ పరమైన ఉద్దేశ్యం కోసం ప్రవేశిస్తే అందులో ఎలాంటి తప్పు లేదు. ఉదాహరణకు, ఇస్లాం గురించి అడగడానికి, లేదా మస్జిదుకు లేదా ముస్లింల ప్రయోజనాలకు సంబంధించిన పని మీద, లేదా ప్రసంగం వినడానికి, లేదా మస్జిదు లోపల ఉన్న నీళ్ళు త్రాగడం వంటి అనుమతించబడిన కార్యాల కోసం ప్రవేశించడం. ఇటువంటి పరిస్థితులలో అది అనుమతించబడినదే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుమామా బిన్ అసాల్ ను మస్జిదు స్తంభానికి కట్టివేసారు. దీనిని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక సైనికదళాన్ని నజ్డ్ వైపుకు పంపారు, బనూ హనీఫా కు చెందిన ఒకవ్యక్తిని తీసుకు రావడం జరిగింది, అతని పేరు సుమామా బిన్ అసాల్, అతన్ని జనులు మస్జిద్లో ఒక స్తంభానికి కట్టివేశారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతని వద్దకి వచ్చారు, అతనితో ‘ఓ సుమామా! నీ వద్ద ఏముంది?’ అని అడిగారు, దానికి అతను బదులిస్తూ – ‘నా వద్ద మేలుతో నిండిన విషయాలు ఉన్నాయి ఓ ముహమ్మద్!, ఒకవేళ మీరు నన్ను చంపితే ప్రతీకారం తీర్చుకోబడే వ్యక్తిని(గౌరవప్రదవ్యక్తి) చంపినవరావుతారు, ఒకవేళ మీరు దయచూపితే ఒక కృతజ్ఞుడీ పై దయ చూపుతారు, ఒకవేళ మీరు ధనాన్ని కోరితే అడగండి, అడిగినమొత్తం మీకు లబిస్తుంది’, మరుసటి రోజు వరకు అతన్ని విడిచిపెట్టారు…[187]. ముత్తఫఖున్ అలైహి[187].
నజ్రాన్ ప్రతినిధి బృందం మస్జిద్ లో ప్రవేశించింది, వారు క్రైస్తవులు[188]. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నప్పుడు జిమామ్ బిన్ సాలబా ఆయన వద్దకు ప్రవేశించారు. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం: మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదులో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, అనంతరం వారికి ఇలా అన్నాడు: “మీలో ముహమ్మద్ ఎవరు?” ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము ఇలా అన్నాము: “ఇదిగో తెల్లని మేని ఛాయతో, ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే.” అప్పుడు ఆ వ్యక్తి ఆయనతో, “అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో, “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక నా పట్ల మనసులో ఏమీ అనుకోవద్దు” అన్నాడు. దానికి ఆయన, “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు... ఆ తర్వాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని విశ్వసిస్తున్నాను. నేను నా వెనుక ఉన్న నా జాతి వారి ప్రతినిధిని. నేను జిమామ్ ఇబ్న్ సాలబా, బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు. [189] [188] ముత్తఫఖున్ అలైహి. [189] బుఖారి ఉల్లేఖనం. మరియు చూడండి: మజ్మూ ఫతావా వ మఖాలాత్ ఇబ్నె బాజ్, 8వ సంపుటం, "అవిశ్వాసులు మస్జిదులలో ప్రవేశించే తీర్పు", మరియు ఫతావా అల్లజ్నతు దాయిమా 6/276.
ముఅజ్జిన్, ఇమాం, ప్రసంగీకుడు మరియు మస్జిద్ల ఆదేశాలకు అవసరమైన విషయాల గురించి మేము సమర్పించగలిగినది ఇది. మరియు మేము ముఅజ్జిన్, ఇమాం మరియు ప్రసంగీకునికి ఘనమైన, మహోన్నతుడైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండమని, ధర్మజ్ఞానాన్ని సంపాదించడం మరియు దానిని వ్యాప్తి చేయడంలో కృషి చేయమని, మరియు దాని పట్ల శ్రద్ధ వహించమని ఉపదేశిస్తున్నాము.
మరియు అల్లాహ్ మాత్రమే సౌభాగ్య ప్రదాత. ఓ అల్లాహ్, మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక. మరియు మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ ప్రశంసలు.
ముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ కొరకు కొన్ని ప్రయోజనకరమైన మూలాలు.
అజాన్ మరియు ఇఖామత్, డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్-ఖహ్తానీ, ప్రచురణకర్త: మత్బా సఫీర్, రియాద్.
నమాజులో ఇమామత్ మరియు ఇమామును అనుసరించటం యొక్క ఆదేశాలు, డా. అబ్దుల్ ముహ్సిన్ అల్-మునీఫ్.
ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో నమాజులో ఇమామత్, సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ.
జుమా ఖుత్బహ్ శైలి, రచన: అబ్దుల్లాహ్ బిన్ దైఫుల్లాహ్ అర్-రుహైలీ, ప్రచురణ: ఇస్లామీయ వ్యవహారాలు, దావా మరియు ఇర్షాద్ మంత్రిత్వ శాఖ, సౌదీ అరేబియా సామ్రాజ్యం.
నమాజులో ఇమామత్ - ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో భావన, శ్రేష్ఠతలు, రకాలు, మర్యాదలు, ఆదేశాలు, డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ, ప్రచురణకర్త: మతబఅ సఫీర్, రియాద్.
జుమా ఖుత్బాలు మరియు ఖతీబ్ ల బాధ్యతలు, సంకలనం: మజ్లిస్ అద్-దావహ్ వల్-ఇర్షాద్, ఇస్లామీయ వ్యవహారాల, ప్రచార మరియు మార్గదర్శక మంత్రిత్వ శాఖ, సౌదీ అరేబియా సామ్రాజ్యం.
ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో జుమా ఖుత్బహ్, రచన: అబ్దుర్రహ్మాన్ బిన్ ముహమ్మద్ అల్-హమద్, ప్రచురణ: ఇస్లామీయ వ్యవహారాల, దావత్ మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ, సౌదీ అరేబియా సామ్రాజ్యం.
జుమా ఖుత్బహ్ మరియు దాని ఫిఖ్ ఆదేశాలు, రచన: అబ్దుల్ అజీజ్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ హుజైలాన్, ప్రచురణకర్తలు: ఇస్లామీయ వ్యవహారాలు, దఃవా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ, ఇస్లామీయ పరిశోధనలు మరియు అధ్యయనాల కేంద్రం.
జుమా ఖుత్బహ్ మరియు ఉమ్మత్ శిక్షణలో దాని పాత్ర, రచన: అబ్దుల్ గనీ అహ్మద్ జబ్ర్ మజ్హర్, ప్రచురణకర్తలు: ఇస్లామీయ వ్యవహారాలు, దావత్ మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ, సౌదీ అరేబియా సామ్రాజ్యం.
విజయవంతమైన ఖతీబుగా కావడానికి యాభై ఒక్క హితబోధలు, అమీర్ బిన్ ముహమ్మద్ అల్-మదరి గారి రచన, ఇది సౌదీ అరేబియా సామ్రాజ్యం, ఇస్లామీయ వ్యవహారాలు, దావత్ మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ వారి వెబ్సైట్లో ప్రచురించబడినది.
జుమా నమాజు - భావన, షరతులు, ఘనతలు, ప్రత్యేకతలు, మర్యాదలు, ఆదేశాలు - ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో, డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్-ఖహ్తానీ, ప్రచురణకర్తలు: మత్బఅ సఫీర్, రియాద్.
జుమా మింబర్ అమానత్ మరియు బాధ్యత, అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ హుమైద్, ప్రచురణకర్త: విజారత్ అష్-షుఊన్ అల్-ఇస్లామియ్య వద్-దావా వల్-ఇర్షాద్, అల్-మమ్లక అల్-అరబియా అస్-సౌదియ్య.
జుమా ఖుత్బహ్ తయారీ విధానం, రచన: డాక్టర్ సాలెహ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ హుమైద్, ప్రచురణకర్తలు: ఇస్లామీయ వ్యవహారాల, దావా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ, సౌదీ అరేబియా సామ్రాజ్యం.
షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ సాలిహ్ అల్ ఫౌజాన్ గారి రసాయిల్ లిల్ అఇమ్మ వల్ ముఅజ్జినీన్, దార్ ఇబ్న్ అల్ జౌజి.
మస్జిదుల ఇమాములు, ముజ్జిన్లు మరియు అనుసరించే వారి కొరకు, షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ జారుల్లాహ్ అల్-జారుల్లాహ్ గారి రిసాల.
కువైట్ ధర్మశాస్త్ర ఎన్సైక్లోపీడియా, ఖుత్బా, ఇమామత్, అజాన్ మరియు మసీదుల అధ్యాయాలు.