من الأحكام الفقهية في الطهارة والصلاة والجنائز
جمع المؤلف في هذا المؤلف ما تيسر كتابته مختصرًا من الأحكام الفقهية في أبواب الطهارة والصلاة والجنائز، معتمدًا فيه على ما جاء في كتاب الله تعالى وما صح عن رسول الله صلى الله عليه وسلم.
పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు)
ఫజీలతుష్షేఖ్ అల్లామా
ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ గారి రచన
అల్లాహ్ ఆయనను, ఆయన తల్లిదండ్రులను, ముస్లింలను మన్నించుగాక
తొలి పలుకులు
ఇన్నల్ హమ్ద లిల్లాహి నహ్మదుహు, వ నస్తయీనుహు, వనస్తగ్ఫిరుహు, వనతూబు ఇలైహి, వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వమిన్ సయ్యిఆతి అఅ్ మాలినా, మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్ లిల్ ఫలా హాదియలహు. వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్దహు లా షరీక లహ్, వ అష్హదు అన్న ముహమ్మదన్ అ'బ్దుహు వ రసూలుహ్, సల్లల్లాహు అలైహి వ సల్లమ్, వ అ'లా ఆలిహీ వ అస్హాబిహీ వ మన్ తబి'అహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ వ సల్లమ తస్లీమన్ అమ్మా బాద్:
ఆరాధన రెండు ప్రాథమిక విషయాలపై ఆధారపడితే తప్ప పూర్తి కాదు మరియు ఆమోదించబడదు. అవి: ఇఖ్లాస్ అంటే మన ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ ప్రీతి కోసమే అయి ఉండాలి, ఏ ఇతర ఉద్దేశ్యం ఉండకూడదు. మరియు మన ఆరాధనలు మరియు పద్ధతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ కు అనుగుణంగా ఉండాలి. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: {మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని.} [అల్ బయ్యిన: 5] అల్లాహ్ కొరకు (ఇఖ్లాస్) నిష్కాపట్యత: అంటే తన ఆచరణల ద్వారా అల్లాహ్ తఆలా యొక్క ప్రీతిని మరియు ఆయన ఆదేశాన్ని నెరవేర్చాలని ఉద్దేశించడం. అల్లాహ్ ప్రవక్తను అనుసరించడం: అంటే తన ఆచరణను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన దానిపై ఆధారపడి చేయడం, అందులో ఏదీ కలపకుండా లేదా దాని నుండి ఏదీ తొలగించకుండా ఉండటం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ను తెలుసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ఈ కారణంగానే, ఒక వ్యక్తి తన ఆరాధనలన్నీ అల్లాహ్ గ్రంథం ఖుర్ఆన్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ఆధారంగా చేసేలా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా అతను స్పష్టమైన అవగాహనతో అల్లాహ్ను ఆరాధించవచ్చు, తన ఆరాధనలో తాను నడుస్తున్న మార్గం యొక్క భద్రత పట్ల శాంతితో ఉండవచ్చు, తన పనులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నాయకుడని మరియు తాను ఆయనకు అనుచరుడిని అని గుర్తుంచుకోవచ్చు. దీనివల్ల అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల తన ప్రేమ మరింత పెరుగుతుంది, మరియు ఈ ఆచరణ ద్వారా అల్లాహ్ తఆలాకు సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తాడు. {మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని..."} [అల్ బయ్యినహ్: 5]
ఒక విషయం గమనించాలి కొన్ని ఆరాధనలు, ముఖ్యంగా తరచుగా చేసేవి ఉదాహరణకు, వుజూ, గుసుల్, మరియు నమాజ్ వివిధ పద్ధతులలో ఆచరించబడతాయి.
ఇందులో ఉన్న విజ్ఞత (హిక్మత్) – అల్లాహ్కే బాగా తెలుసు – అనేక కోణాల నుండి చూడవచ్చు:
మొదటిది: దాసుడికి సులభతరం చేయటం; ఈ రకాలలో (ఆరాధనల పద్ధతులలో) అతను ఎంచుకోవడానికి వీలు కల్పించడం, మరియు ఏ రకాన్ని ఎంచుకుని చేసినా, అది ప్రవక్తను అనుసరించినట్లే అవుతుంది.
రెండవది: ఒకే రకమైన దానిపై నిరంతరం ఉండటం వల్ల కలిగే విసుగు మరియు అలసటను నివారించడం.
మూడవది: ఆరాధనను నెరవేర్చడంలో హృదయం యొక్క చలనం మరియు చురుకుదనం; ఎందుకంటే ఒకే రకమైన ఆచరణను కొనసాగిస్తే అది అలవాటుగా మారుతుంది, అందువల్ల మీరు దానిని కొనసాగిస్తే అది తెలియకుండానే చెప్పడం లేదా చేయడం జరుగుతుంది. కానీ ఒక రకమైన ఆచరణ నుండి మరొక రకానికి మారితే, హృదయం చలనం చెందుతుంది, మరియు అల్లాహ్ తాలా యొక్క ఆరాధనను సాధించడంలో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుసరణలో చురుకుదనం పెరుగుతుంది.
ఈ రకమైన ఆరాధనల విషయంలో పండితులు (అల్లాహ్ వారికపై కరుణ చూపుగాక) భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు: ఒకే విధమైన ఆరాధనలో కొనసాగడం ఉత్తమమా, అందులో సమగ్రమైనది లేదా సరిఅయినది లేదా దానికి సమానమైనదాన్ని ఎంచుకోవడం ఉత్తమమా? లేదా ఒకసారి ఒక పద్ధతిని, మరోసారి మరొక పద్ధతిని ఆచరించడం ఉత్తమమా?
"రాజెహ్" బలమైన అభిప్రాయం ఏమిటంటే: ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, ఒకసారి ఒక పద్ధతిని, మరోసారి మరొక పద్ధతిని ఆచరించడం. ఇలా చేయడం వల్ల ఆ రెండు రకాల పనులను చేసినట్లవుతుంది, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం పూర్తవుతుంది. అయితే, ఒక పద్ధతి ఒక నిర్దిష్ట పరిస్థితికి మాత్రమే సరిపోయేదైతే, ఆ నిర్దిష్ట పద్ధతికి మాత్రమే కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు, ప్రమాద సమయంలో చేసే నమాజ్ లోని కొన్ని పద్ధతులు.
వివిధ పద్ధతులలో వివరించబడిన మరియు ఈ సూత్రం కిందకు వచ్చే వాటిలో కొన్ని: పరిశుద్ధత యొక్క కొన్ని నియమాలు, నమాజ్ యొక్క భంగిమలు మరియు దానిలోని మాటలు.
తహారత్, నమాజ్ మరియు జనాజా సంబంధిత అధ్యాయాలలో లభించిన కొన్ని ధార్మిక నియమాలను సంక్షిప్తంగా వ్రాయడం లేదా సమీక్షించడం జరిగింది. ఇది అల్లాహ్ గ్రంథం ఖుర్ఆన్ లో ఉన్నది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా ధృవీకరించబడిన వాటిపై ఆధారపడి ఉంది.
మేము అల్లాహ్ తఆలాను వేడుకుంటున్నాము మా కార్యం కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఉండాలని, ఆయన షరీఅతుకు అనుగుణంగా, ఆయన సృష్టికి ఉపయోగకరంగా ఉండాలని. నిశ్చయంగా ఆయన దాత మరియు ఉదార స్వభావి.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సమస్త స్తోత్రములు, అల్లాహ్ తన దాసుడు మరియు దూత, మన ప్రవక్త ముహమ్మద్పై, ఆయన కుటుంబ సభ్యులందరిపై, ఆయన సహచరులందరిపై మరియు వారికి దయతో ప్రళయ దినం వరకు అడుగడుగునా అనుసరించిన వారిపై శాంతిని, శుభాలను మరియు దీవెనలను కురిపించుగాక.
ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ గారి రచన
మొదటి ఆధ్యాయం: (తహారత్) పరిశుద్ధత
వుజూ
గుస్ల్
తయమ్ముమ్
మోజోళ్ల (సాక్సుల) పై మసహ్ చేయటం.
తలపాగల (అమామాల)పై మసహ్ చేయటం.
కట్టిన కట్టు పై మసహ్ చేయటం
వుదూ
వుజూ: ఇది అల్లాహ్ ఆరాధన కోసం నాలుగు నిర్దిష్ట అవయవాలను ఒక ప్రత్యేక పద్ధతిలో కడగడం.
మరియు ఇది నమాజ్ చేయాలనుకునే ప్రతి "ముహ్దిస్" చిన్న అశుద్ధికి లోనైన వ్యక్తి పై విధి. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వసించినవారులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి.} [అల్ మాయిదా: 6]
మరియు ఇది దాని (నమాజ్ యొక్క) చెల్లుబాటుకు మరియు ఆమోదానికి షరతు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీలో ఎవరైనా అశుద్ధి (హదస్) స్థితిలో ఉన్నప్పుడు, వుదూ చేసుకోనంతవరకు అల్లాహ్ అతని నమాజ్ను అంగీకరించడు.» దీనిని అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి బుఖారీ మరియు ఇతరులు ఉల్లేఖించారు [1]. [1] దీనిని బుఖారీ కితాబుల్ హియల్ లో ఉల్లేఖించారు, బాబు ఫీ సలాతి హదీసు సంఖ్య (6954), మరియు ముస్లిం కితాబుల్ తహారత్ లో ఉల్లేఖించారు, బాబు వజూబ్ తహారత్ లిస్సలాతి హదీసు సంఖ్య (225).
వుజూ యొక్క ఘనత గురించి వచ్చిన వాటిలో నుంచి:
ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «మీలో ఎవరైనా వుజూను సంపూర్ణంగా చేసి, ఆపై ఇలా పలికితే: 'అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్నా ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు' (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడని, మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన రసూల్ అని నేను సాక్ష్యం పలికెదను), అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయి, వాటిలో దేని గుండా అయినా ప్రవేశించవచ్చు.» [2]. [2] ఈ హదీసును ముస్లిం తన కితాబ్ అత్-తహారాలో, బాబ్ అద్-దిక్రుల్-ముస్తహబ్బు అక్వబల్ వుజూలో, హదీసు సంఖ్య (234) లో ఉల్లేఖించారు. అయితే «అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన, వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్», అనే పదం ముస్లిం ఉల్లేఖించిన దానిలో లేదు. ఈ భాగాన్ని తిర్మిజి తన కితాబ్ అత్-తహారా బాబ్ ఫీమా యుఖాలు బ'అ్దల్ వుజూలో, హదీసు సంఖ్య (55) లో ఉల్లేఖించారు.
ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: «ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.» దీనిని ముస్లిం ఉల్లేఖించారు [3]. [3] ఈ హదీసును ముస్లిం కితాబుత్తహారా, బాబు ఖురూజిల్ ఖతాయా మఅ మాఇల్ వుజూ, హదీసు నంబర్ (245) లో ఉల్లేఖించారు.
అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వుజూ చేయడం, మస్జిద్ కు అధికంగా కాలినడకన వెళ్ళడం, ఒక నమాజు నుండి మరొక నమాజు వరకు వేచియుండటం పాపాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాయి [4]. [4] దీనిని అబూ యాలా (1/379) హదీసు నెంబరు (488), బజ్జార్ (2/161) హదీసు నెంబరు (528), మరియు హాకిమ్ తన «ముస్తద్రక్» లో (1/132) ఉల్లేఖించారు.
* వుజూ చేసే విధానం:
1 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే అశుద్ది (హదస్) ను తొలగించుటకు లేదా నమాజు వంటి ఆరాధనల కొరకు వుజూ చేయుటకు సంకల్పం చేయాలి; ఎందుకంటే అల్లాహ్ అజ్జ వజల్ కు మన హృదయాలలోని విషయాలను తెలుసు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వుజూలో, నమాజులో, లేదా తన ఆరాధనలలో దేనిలోనూ సంకల్పాన్ని నోటితో పలకలేదు.
2- తరువాత "బిస్మిల్లాహ్" అని పలకాలి.
3- ఆపై తన రెండు అరచేతులను మూడు సార్లు కడగాలి.
4- ఆపై, మూడు దోసిళ్ళ నీటితో మూడు సార్లు నోరు పుక్కిలించి, ముక్కులోకి నీళ్ళు పీల్చుకుని, ముక్కును శుభ్రం చేసుకోవాలి.
5 - ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి. ముఖం యొక్క పరిమితి: సాధారణంగా తల వెంట్రుకలు మొదలయ్యే చోట నుండి గడ్డం మరియు ముంగురుల వరకు పొడవుగా, మరియు ఒక చెవి నుండి మరొక చెవి వరకు వెడల్పుగా ఉంటుంది.
6- ఆ తరువాత కుడి చేతిని, ఆ తరువాత ఎడమ చేతిని, వేళ్ళ చివరి నుండి మోచేతుల వరకు మూడు సార్లు కడగాలి, మరియు మోచేతులు కూడా కడగడంలో చేర్చబడతాయి.
7- ఆపై తన రెండు చేతులతో ఒకసారి తన తలను మసహ్ చేయాలి. చేతులను తడి చేసుకుని, తన తల ముందు భాగం నుండి ప్రారంభించి, మెడ వెనుక భాగం వరకు తీసుకువెళ్లి, ఆపై మళ్ళీ ప్రారంభించిన చోటుకు తిరిగి తీసుకురావాలి, తలకు మసహ్ చేయాల్సిన ప్రాంతం ముఖం యొక్క పైభాగం నుండి (జుట్టు మొదలయ్యే చోటు నుండి) మెడ పైభాగం వెనుక వరకు, మరియు కుడి చెవి నుండి ఎడమ చెవి మధ్య వరకు.
8- తరువాత తన చేతులతో చెవుల మసహ్ ఒకసారి చేయాలి, మరియు తన చూపుడు వేలును చెవుల రంధ్రాలలోకి దూర్చాలి, మరియు తన బొటన వేళ్ళతో చెవుల బాహ్య భాగముపై మసహ్ చేయాలి.
9- ఆపై తన కుడి పాదాన్ని, ఎడమ పాదాన్ని, కాలి వేళ్ల చివరల నుండి చీలమండలాల వరకు మూడు సార్లు కడగాలి. చీలమండలాలు కూడా కడగడంలో చేర్చబడతాయి. అవి కాలి కింది భాగంలో (పిక్క కింద) వెనకకు పొడుచుకు వచ్చిన రెండు ఎముకలు.
మూడు సార్లు కడగవలసిన వాటిని ఒకసారి మాత్రమే కడగుటకు మరియు రెండు సార్లు కడగుటకు కూడా అనుమతించబడుతుంది.
గుస్ల్
గుస్ల్: శరీరమంతటినీ శుభ్రపరచడం ద్వారా అల్లాహ్ తఆలాను ఆరాధించడం. ఇది జనాబత్ (లైంగిక అశుద్ధి) లేదా గుస్ల్ను తప్పనిసరి చేసే ఇతర కారణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది విధి. అల్లాహ్ తఆలా యొక్క వాక్కు: {ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి.} [అల్ మాయిదా: 6]
* గుసుల్ చేసే విధానం:
1 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే పెద్ద అశుద్ధిని (హదసె అక్బర్) తొలగించడానికి లేదా గుసుల్ చేయడానికి సంకల్పం చేసుకోవాలి, ఉదాహరణకు జుమా నమాజు కొరకు.
2- తరువాత "బిస్మిల్లాహ్" అని పలకాలి.
3- ఆపై తన రెండు అరచేతులను మూడు సార్లు కడగాలి.
4 - ఆపై తన మర్మాంగమును శుభ్రంగా కడగాలి.
5 - ఆపై, నమాజ్ కోసం వుజూ చేసుకున్నట్లే, పూర్తి వుజూ చేసుకోవాలి.
6- ఆపై తన తలను కడగాలి. నీటిని తీసుకుని, తన జుట్టు మూలాల్లోకి చేతి వేళ్లతో నీరు చేరేలా చూసుకోవాలి. ఆ తర్వాత, తలపై మూడు సార్లు నీటిని పోసుకోవాలి.
7- ఆపై తన పూర్తి శరీరాన్ని కడగాలి.
మీరు మీ శరీరంలో ఎక్కడైనా విరిగిన భాగం లేదా గాయం ఉన్నట్లయితే, దానిపై ఒక కట్టు, రక్షణ కవచం ఉంచి, దాని క్రింద ఉన్న భాగాన్ని కడగడం కష్టమైతే, దానిపై మసహ్ చేయవచ్చు; కవచం కారణంగా కడగడం సాధ్యం కానప్పుడు, దానిపై మసహ్ చేయడం సరిపోతుంది. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: {కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.} [అత్తగాబున్: 16] ఇది ఒక అత్యవసర మసహ్, కాబట్టి దాని అవసరానికి అనుగుణంగా స్థలం మరియు కాలం పరిమితముగా ఉండాలి, అవసరానికి మించి మసహ్ చేయకూడదు. విరిగిన ఎముక లేదా గాయం నయం అయినప్పుడు, దానిని తొలగించాలి.
శరీరంలో ఏదైనా భాగంలో విరిగిన లేదా గాయమైనా, గుస్ల్ చేయటం హాని కలిగిస్తే, మరియు దానిపై ఏదైనా అడ్డంకం లేకపోతే; గుస్ల్ స్థానంలో నీటితో మసహ్ చేయాలి, మసహ్ వలన కూడా హాని కలిగితే; దాని కోసం తయ్యమ్ముమ్ చేయాలి. అల్లాహ్ తఆలా ఇలా అన్నాడు: {కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.} [అత్తగాబున్: 16] మరియు అల్లాహ్ వాక్కు: {...ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు మరియు ధర్మం విషయంలో మీ పై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు...} [హజ్జ్: 78]
ఈ మసహ్ అది కట్టుపై అయినా లేదా అనారోగ్యంతో ఉన్న అవయవంపై చేసినా గుస్ల్ స్థానాన్ని భర్తీ చేస్తుంది, అందువల్ల ఇది తహారత్ (పవిత్రత) ను పూర్తి చేస్తుంది, మరియు అడ్డంకి తొలగిన తర్వాత ఆ భాగాన్ని తిరిగి కడగాల్సిన అవసరం లేదు.
తన శరీరంలోని కొంత భాగానికి సరిపడే నీరు లభించినప్పుడు, దానిని వాడి, మిగిలిన భాగానికి తయమ్ముమ్ చేసుకోవాలి.
తయమ్ముమ్
తయమ్ముమ్: ఇది అల్లాహ్ తఆలా పట్ల భక్తి భావంతో మట్టిని ఉపయోగించి పరిశుద్ధతను పొందడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాన్ని వాడటం వలన వ్యాధి లేదా ఇతర కారణాల వలన హాని కలిగే పరిస్థితుల్లో, మట్టితో ముఖం మరియు చేతులకు మసహ్ చేయడం.
ఇది (తయ్యమ్ముమ్) చిన్న అశుద్ధి (హదసె అస్గర్) లేదా పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) నుండి నీటితో చేసే శుద్ధికి ప్రత్యామ్నాయం. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వసించినవారులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను కడుక్కోండి...} ఇంకా అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో – నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్’ చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!} [అల్ మాయిదా: 6]
మరియు తయమ్ముమ్ ద్వారా పొందే పరిశుభ్రత పూర్తి పరిశుభ్రత, అది నీరు లభించేంత వరకు (లేదా నీటిని ఉపయోగించగలిగేంత వరకు) అశుద్ధిని తొలగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ తఆలా వాక్కు ఇలా ఉంది: {...కానీ మిమ్మల్ని పరిశుద్ధ పరచాలన్నది ఆయన అభిలాష...} [అల్ మాయిదా: 6] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «నా కొరకు భూమి మస్జిద్ (సాష్టాంగ స్థలం) గా, పరిశుద్ధత పొందే స్థలంగా చేయబడింది, మరియు నా అనుచరసమాజంలో ఏ వ్యక్తి అయినా నమాజు సమయానికి చేరుకుంటే, అతను నమాజు చేయాలి.» దీనిని బుఖారీ ఉల్లేఖించారు[5], మరియు తహూర్ (పరిశుద్ధత సాధనం) అంటే: దాని ద్వారా తహారతు (పరిశుద్ధత) పొందబడేది. [5] దీనిని బుఖారీ కితాబుల్ తయమ్మమ్ లో ఉల్లేఖించారు, బాబు అల్లాహ్ యొక్క వాక్యం:...మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి...﴾, హదీసు సంఖ్య (335). మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో జాబిర్ రజియల్లాహు అన్హు హదీసు నుండి హదీసు సంఖ్య (521).
దీనిపై ఆధారపడి, ఒకవేళ నఫిల్ నమాజ్ కోసం తయమ్ముమ్ చేసుకుంటే, ఆ తయమ్ముమ్ ద్వారా ఫర్ద్ నమమాజ్ కూడా చేయవచ్చు. నమాజు సమయం ప్రారంభమయ్యే ముందు తయమ్ముమ్ చేయవచ్చు, మరియు ఆ సమయం ముగిసినా అది రద్దు కాదు. ఒకవేళ చిన్న అశుద్ధత కోసం తయమ్ముమ్ చేస్తే, అది మరో అశుద్ధత వల్ల మాత్రమే రద్దు అవుతుంది. ఒకవేళ పెద్ద అశుద్ధత కోసం తయమ్ముమ్ చేస్తే, అది మరో పెద్ద అశుద్ధత వల్ల మాత్రమే రద్దు అవుతుంది.
అయితే, తయమ్ముమ్ అడ్డంకి తొలగిపోవడం వల్ల రద్దు అవుతుంది. కాబట్టి, నీరు లభించినప్పుడు అతని తయ్యమ్ముమ్ రద్దు అవుతుంది. అలాగే, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు కూడా అతని తయ్యమ్ముమ్ రద్దు అవుతుంది. ఇది చిన్న అశుద్ధి కోసం చేసినా లేదా పెద్ద అశుద్ధి కోసం చేసినా ఒకటే. అప్పుడు అతను గతంలో ఏ చిన్న అశుద్ధి కోసం తయ్యమ్ముమ్ చేశాడో, దాని కోసం వుజూ చేసుకోవాలి. మరియు గతంలో ఏ పెద్ద అశుద్ధి కోసం తయమ్ముమ్ చేశాడో, దాని కోసం గుసుల్ చేసుకోవాలి.
ప్రతీ భూభాగం తయమ్ముమ్ చేసుకోవడానికి సరైనది, అది ఇసుక, రాళ్ళు లేదా మట్టి అయినా సరే, మరియు దానికి సంబంధించిన గోడ వంటి వాటితో కూడా తయమ్ముమ్ చేసుకోవచ్చు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «నా కొరకు భూమి మస్జిద్ (సాష్టాంగ స్థలం) గా, పరిశుద్ధత పొందే స్థలంగా చేయబడింది» [6], [6] దీని యొక్క నివేదన గతంలోనే వివరించబడింది..
అబూ జుహైమ్ బిన్ హారిస్ బిన్ సిమ్మహ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: «మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి సలాం చేశాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ప్రతిస్పందించలేదు. ఆయన ఒక గోడవద్దకు వెళ్లి తన ముఖం మరియు చేతులను తుడుచుకొని, ఆ తరువాత ఆ వ్యక్తికి సలాం తిరిగి పలికారు.». దీనిని బుఖారీ ఉల్లేఖించారు[7]. [7] దీనిని బుఖారీ కితాబుత్ తయ్యముమ్ లో ఉల్లేఖించారు, బాబు తయ్యముమ్ ఫిల్ హజర్ ఇజాలమ్ యజిద్ అల్ మా, హదీసు సంఖ్య (337), మరియు ముస్లిం కితాబుల్ హాయిజ్ లో ఉల్లేఖించారు, బాబు తయ్యముమ్, హదీసు సంఖ్య (369).
* తయమ్ముమ్ చేసే విధానం:
మనస్సులో నమాజ్ లేదా తయ్యమ్ముమ్ను అనుమతించే ఇతర కార్యకలాపాల కోసం అశుద్ధిని తొలగించాలని సంకల్పించుకోవాలి. ఆ తర్వాత "బిస్మిల్లాహ్" అని పలకాలి. ఆపై తన రెండు అరచేతులతో భూమిని ఒక్కసారి కొట్టాలి. ఆ చేతులతో తన ముఖము పై మరియు రెండు చేతులపై మసహ్ చేయాలి.
మోజోళ్ల (సాక్సుల) పై మసహ్ చేయటం.
అల్ ఖుఫ్ఫైన్ అంటే: చర్మం మరియు అలాంటి వాటితో తయారు చేసి పాదాలకు తొడిగే మేజోళ్ళు.
జవారిబ్ అంటే: కాటన్ మరియు అటువంటి వాటితో తయారు చేయబడినవి, మరియు అవి అష్షరాబ్ పేరుతో పిలవబడుతాయి.
మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేయుట యొక్క ఆదేశం:
మేజోళ్ళ పై మసహ్ చేయడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి వచ్చిన సున్నత్ (సాంప్రదాయం). కాబట్టి, వాటిని ధరించినవారు పాదాలను కడగడానికి వాటిని తీసివేయడం కంటే వాటిపై మసహ్ చేయడం ఉత్తమం.
దీనికి ఆధారం: ముగీరహ్ బిన్ షుఅబహ్ రజియల్లాహు అన్హు యొక్క హదీసు, ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: నేను నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వుదూ చేస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన మేజోళ్లు విప్పదీయడానికి ప్రయత్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ‘వాటిని వదిలేయి. నేను పరిశుద్ధ స్థితిలో ఉండగా ధరించాను' అని పలికి వాటిపై కేవలం మసహ్ చేశారు. [8] దీన్ని బుఖారీ వుజూ పుస్తకంలో, ఇజా అదఖల రిజలైహి వహుమా తాహిరతాన్ అనే అధ్యాయం ,హదీసు నెంబరు (206) లో, ముస్లిం తహారత్ పుస్తకంలో, మసహ్ ఆల్ ఖుఫైన్ అనే అధ్యాయంలో, హదీసు నెంబరు (274/79) లో ఉల్లేఖించారు.
మేజోళ్ళపై మసహ్ చేయుట యొక్క షరియతుబద్ధత అల్లాహ్ యొక్క గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో నిరూపితమై ఉంది.
అల్లాహ్ యొక్క గ్రంథం విషయానికొస్తే, ఆయన తానే ఇలా సెలవిచ్చెను: ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి...} [అల్ మాయిదా: 6] ఇంకా, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు మీ కాళ్ళను} ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహీహ్ (ప్రామాణికమైన) అయిన ఏడు ఖిరాఅత్ లలో నుంచి రెండు ఖిరాఅత్ లు (పఠన పద్ధతులు) ఉన్నాయి.
వాటిలో ఒకటి: అల్లాహ్ యొక్క వాక్యం "వ అర్జులకుమ్ (మరియు మీ పాదాలను)" అనేది "వుజూహకుమ్ (మీ ముఖాలను)" అనే పదానికి ఆత్ఫ్ (కలపడం)గా ఉంది. దీని అర్థం, పాదాలు కడగబడాలి అని.
రెండవ పద్ధతి: "వ అర్జులికుమ్ (మరియు మీ పాదాలపై)" అనేది "బి రుఊసికుమ్ (మీ తలలపై)" అనే పదానికి జర్ర్ (కలపడం)గా ఉంది. దీని అర్థం, పాదాలపై మసహ్ చేయాలి (తడపాలి) అని [9]. [9] నసబ్ పఠనాన్ని నాఫె, ఇబ్నె ఆమిర్, హఫ్స్ అనీ ఆసిమ్ మరియు కిసాయీ పఠించారు, మరియు జర్ పఠనాన్ని ఇబ్నె కసీర్, అబూ అమ్ర్, షుబా అనీ ఆసిమ్ మరియు హమ్జా పఠించారు, ఇది 'అల్-కష్ఫ్ అన్ వుజూహ్ అల్-ఖిరాఆత్ అస్-సబ్అ్' (1/406) లో ఉంది.
సున్నత్ ప్రకారం కాళ్ళు మసహ్ చేయబడతాయా లేక కడగబడతాయా అనేది స్పష్టమైంది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కాళ్ళు బహిర్గతంగా ఉన్నప్పుడు వాటిని కడిగేవారు, మరియు అవి మోజోళ్ళతో కప్పబడి ఉన్నప్పుడు వాటిపై మసహ్ చేసేవారు.
మసహ్ చేయాలి అనడానికి సున్నత్ యొక్క నిదర్శనం విషయానికి వస్తే, ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ముతవాతిర్ (నిరంతరాయంగా బహుళ మూలాల నుండి వచ్చిన) సున్నత్ ఉంది. ఇమామ్ అహ్మద్ (అల్లాహ్ ఆయనకు కరుణ చూపుగాక) ఇలా అన్నారు: «మసహ్ గురించి నా హృదయంలో ఏ సందేహమూ లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల నుండి దీని గురించి నలభై హదీసులు ఉన్నాయి».
ఓ నజ్మ్ (ఛందస్సు)లో పేర్కొనబడినదాంట్లో భాగంగా, నాజిమ్ (కవి) చెప్పిన పదాలు ఇవే[10]:
తవాతుర్ స్థాయిలో వచ్చే హదీసులు: «ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో» *** మరియు «ఎవరైతే అల్లాహ్ కోసం ఒక ఇల్లు నిర్మించి, ప్రతిఫలాన్ని ఆశిస్తాడో»
మరియు అల్లాహ్ను చూడటం, సిఫారసు, మరియు హౌజ్ *** మరియు మేజోళ్లపై మసహ్ చేయడం, ఇవి కొన్ని [10] ఈ నజ్మ్ తావుది ఇబ్ను సౌదా రచించినది; ఆయన సహీహ్ బుఖారీ పై తన హాషియహ్ (1/125) లో ఈ నజ్మ్ను పేర్కొన్నారు.
* మేజోళ్ల (సాక్సుల) పై మసహ్ చేయుటకు సంబంధించిన షరతులు:
మేజోళ్ల (సాక్సుల) పై మసహ్ చేయడానికి నాలుగు షరతులు కలవు:
మొదటి షరతు: తహారతు (పరిశుద్ధ) స్థితిలో వాటిని (మేజోళ్ళను) తొడిగి ఉండాలి, మరియు దీనికి ఆధారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముగీరహ్ బిన్ షుఅబా కు చెప్పిన మాట: «వాటిని వదిలేయి. నేను పరిశుద్ధ స్థితిలో ఉండగా ధరించాను» 11]. [11] దీని తఖ్రీజ్ ముందు (పుట: 180) లో వచ్చింది.
రెండవ షరతు: మేజోళ్ళు లేదా పాదకూసములు పరిశుభ్రంగా ఉండాలి. అవి అశుద్ధంగా ఉంటే వాటిపై మసహ్ చేయడం అనుమతించబడదు. దీనికి ఆధారం: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు తన అనుయాయులతో నమాజు చేస్తుండగా, ఆయన చెప్పులు ధరించి ఉన్నారు, నమాజు మధ్యలో వాటిని తొలగించారు, ఎందుకంటే జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనకు వాటిలో మాలిన్యం లేక అశుద్దవస్తువు ఉందని తెలియజేశారు. ఇది అపవిత్రమైన దానిలో నమాజ్ చేయడం అనుమతించబడదని సూచిస్తుంది. ఎందుకంటే, అపవిత్రమైన వస్తువును నీటితో తుడిచినట్లయితే, తుడిచేది అపవిత్రమవుతుంది, కాబట్టి అది శుద్ధిచేసేదిగా పరిగణించబడదు. [12] దీనిని అబూ దావూద్ కితాబుస్సలాత్ లో ఉల్లేఖించారు, బాబు అస్సలాత్ ఫిన్నాల్ హదీసు సంఖ్య (650), మరియు అహ్మద్ 3/20 అబూ సయీద్ రజియల్లాహు అన్హు హదీసు నుండి.
మూడవ షరతు: మసహ్ చేయడం చిన్న అశుద్ధతలో మాత్రమే ఉండాలి, పెద్ద అశుద్ధత (జనాబత్) లేదా గుస్ల్ తప్పనిసరి చేసే పరిస్థితిలో కాదు. దీనికి ఆధారం: సఫ్వాన్ బిన్ అస్సాల్ రజియల్లాహు అన్హు చెప్పిన హదీసు: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మాకు ఆదేశించారు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక్క జనాబాత్ అశుద్దవస్తా వస్తే తప్పా, మిగతా ఏ అవసరాలకి మలమూత్ర విసర్జనకి నిద్రించి లేసినందుకు మేజోళ్ళు మూడు రోజులు మరియు రాత్రులవరకు తీయాల్సిన అవసరం లేదు. మసహ్ చేయుట చిన్న హదస్ స్థితిలో మాత్రమే అనుమతించబడినది, పెద్ద హదస్ స్థితిలో మసహ్ చేయుటకు అనుమతి లేదు; మనం ప్రస్తావించిన ఈ హదీసు ప్రకారం. [13] దీన్ని తిర్మిజీ కితాబుత్ తహార, బాబ్ మస్హ్ అలల్ ఖుఫ్ఫైన్, నెంబరు (96) లో, మరియు నసాయీ కితాబుత్ తహార, బాబ్ తవ్కీత్ ఫీ మస్హ్ అలల్ ఖుఫ్ఫైన్, నెంబరు (127) లో, మరియు ఇబ్ను మాజా కితాబుత్ తహార, బాబ్ వుజూ మిన్ నౌమ్, నెంబరు (478) లో, మరియు అహ్మద్ (4/239) ఉల్లేఖించారు.
నాలుగవ షరతు: మసహ్ చేయడం షరియత్ నిర్దేశించిన సమయంలో ఉండాలి. అది నివాసికి ఒక పగలు మరియు ఒక రాత్రి, మరియు ప్రయాణీకుడికి మూడు పగళ్లు మరియు వాటి రాత్రులు. అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం, అయన ఇలా అన్నారు: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నివాసి కొరకు ఒక రోజు మరియు రాత్రి, మరియు ప్రయాణికుడి కొరకు మూడు రోజులు మరియు రాత్రులు మేజోళ్ళు తుడవడానికి అనుమతించారు. దీనిని ముస్లిం ఉల్లేఖించారు [14]. [14] దీనిని ముస్లిం ఉల్లేఖించారు తహారత్ పుస్తకంలో, మోజోళ్ళ పై మసహ్ చేయడంలో సమయ పరిమితి అధ్యాయంలో, హదీసు నెంబరు (276).
ఈ వ్యవధి మొదటి సారి మసహ్ చేసిన తర్వాత ప్రారంభమవుతుంది మరియు నివాసికి ఇరవై నాలుగు గంటలు, ప్రయాణికుడికి డెబ్బై రెండు గంటలు ముగుస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మంగళవారం ఫజర్ నమాజ్ కోసం తహారత్ చేసుకున్నాడు మరియు బుధవారం రాత్రి ఇషా నమాజ్ వరకు తహారత్ లో ఉన్నాడు, మరియు నిద్రపోయాడు, తరువాత బుధవారం ఫజర్ నమాజ్ కోసం లేచి, సూర్యోదయం సమయ ప్రకారం ఉదయం ఐదు గంటలకు మసహ్ చేశాడు; అప్పుడు ఆ వ్యవధి బుధవారం ఉదయం ఐదు గంటల నుండి గురువారం ఉదయం ఐదు గంటల వరకు ప్రారంభమవుతుంది. ఒకవేళ గురువారం ఉదయం ఐదు గంటల ముందు మసహ్ చేసినట్లయితే, అతను ఆ మసహ్ తో గురువారం ఫజ్ర్ నమాజు చేసుకోవచ్చు, మరియు తన పరిశుద్ధిగా ఉన్నంతవరకు ఇతర నమాజులు కూడా చేసుకోవచ్చు; ఎందుకంటే, వుజూ కాలపరిమితి పూర్తయినప్పుడు భంగం కాదు అని పండితుల అభిప్రాయం, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధికి కాలపరిమితి విధించలేదు, కానీ మసహ్ కు మాత్రమే విధించారు. కాబట్టి కాలపరిమితి పూర్తయినప్పుడు మసహ్ చేయకూడదు, కానీ అతను పరిశుద్ధిలో ఉన్నట్లయితే, అతని పరిశుద్ధి కొనసాగుతుంది; ఎందుకంటే ఈ పరిశుద్ధి శాస్త్రీయ ఆధారంతో స్థిరపడింది, మరియు శాస్త్రీయ ఆధారంతో స్థిరపడినది శాస్త్రీయ ఆధారంతోనే తొలగించబడుతుంది, మరియు మసహ్ కాలపరిమితి పూర్తయినప్పుడు వుజూ భంగం అవుతుందని ఎలాంటి ఆధారం లేదు, మరియు అసలు పరిశుద్ధి కొనసాగుతుందని, అది తొలగించబడినట్లు స్పష్టంగా తెలియకపోతే. ఇవి మోజోళ్ళపై మసహ్ చేయడానికి అవసరమైన షరతులు, మరియు కొన్ని ఇతర షరతులు కూడా కొన్ని పండితులు పేర్కొన్నారు, వాటిలో కొన్ని పరిశీలన అవసరం.
మేజోళ్ళు, తలపాగాలు మరియు కట్టు (గాయంపై కట్టేది) వాటి మసహ్ గురించి ప్రశ్నలు
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సమస్త స్తోత్రములు. మా ప్రవక్త ముహమ్మద్పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు వారిని సద్భావనతో అనుసరించిన వారిపై శాంతి మరియు శుభాలు కురియుగాక.
తరువాత; మేజోళ్లు, తలపాగాలు మరియు కట్టు (గాయంపై కట్టేది) వాటి మసహ్ గురించి ప్రశ్నలకు నేను ఇచ్చిన సమాధానాలను విన్నాను. అవి రికార్డర్ నుండి నేను ఇచ్చిన సమాధానానికి అనుగుణంగా ఉన్నాయి. వాటిలో కొద్దిగా మార్పులు చేర్చాను, మరియు వాటిని ముద్రించడానికి అనుమతి ఇచ్చాను, కానీ ముద్రణలో శ్రద్ధ వహించాలి మరియు ముద్రణ హక్కులను తనకు లేదా ఇతరులకు కట్టిపెట్టకూడదు.
నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను అల్లాహ్ అందరికీ విజయాన్ని మరియు అంగీకారాన్ని ప్రసాదించుగాక.
దీని రచయిత అలా అన్నారు.
ముహమ్మద్ అస్సాలిహ్ అల్ ఉసైమీన్
19/5/1410 హి
మేజోళ్ల పై మసహ్ చేయుట
ప్రశ్న (1): కొంతమంది (ఫుఖహా) ధర్మ కర్తలు పెట్టిన షరతు ఏమిటంటే అవి (మేజోళ్ళు) ఫర్జ్ స్థలాన్నికప్పి ఉంచాలి అనేది ఎంతవరకు సరైనది?
జవాబు: ఈ షరతు సరైనది కాదు, ఎందుకంటే దీనికి ఎటువంటి రుజువు లేదు. ఖుఫ్ (సాక్సులు) లేదా జురాబ్ (మేజోళ్ళు) అనే పేరు ఉన్నంతవరకు, వాటిపై మసహ్ చేయడం అనుమతించబడుతుంది. ఎందుకంటే సున్నత్ ఖుఫ్ ల పై మసహ్ చేయడానికి అనుమతించింది. మరియు షరియత్ ఏదైతే నిరపేక్షంగా అనుమతించిందో, షరియత్ నుండి ఒక స్పష్టమైన ఆధారం లేదా పరిమితిని స్పష్టపరిచే షరియా నియమం లేనంతవరకు ఎవరూ దానిని పరిమితం చేయకూడదు.
దీనిని ఆధారంగా తీసుకుంటే, చిరిగిన మేజోళ్ళపై మసహ్ చేయుటకు అనుమతి ఉంది, అలాగే పలుచని మేజోళ్ళపై కూడా మసహ్ చేయుటకు అనుమతి ఉంది; ఎందుకంటే మేజోళ్ళ ఉద్దేశం చర్మాన్ని కప్పడం కాదు, మేజోళ్ళ ఉద్దేశం కాళ్ళకు వెచ్చదనాన్ని మరియు ప్రయోజనాన్ని అందించడం.
కాలు మేజోళ్ళ పై (ఖుఫ్పై) తుడుచుకోవడానికి అనుమతి ఇవ్వబడింది, ఎందుకంటే వాటిని తీసివేయడం కష్టంతో కూడుకున్నది. ఈ విషయంలో తేలికపాటి సాక్సులు మరియు మందపాటి సాక్సుల మధ్య, లేదా చిరిగిపోయిన సాక్సులు మరియు పాడైపోని సాక్సుల మధ్య తేడా లేదు. ముఖ్యం ఏమిటంటే, ఖుఫ్ అనే పేరు చెల్లుబాటులో ఉన్నంత వరకు, దానిపై తుడుచుకోవడం అనుమతించబడుతుంది.
ప్రశ్న (2): ఒక వ్యక్తి తయమ్ముమ్ చేసి, ఆపై “ఖుఫ్ఫైన్” మేజోళ్ళు ధరించాడు. నీరు లభించినప్పుడు అతను అవి ధరించినప్పుడు తహారతులో ఉన్నాడనే విషయం తెలిసి ఉండగా అతను మేజోళ్ళ పై మసహ్ చేయడం అనుమతించబడుతుందా?
జవాబు: తయ్యముమ్ ద్వారా పొందిన శుభ్రతతో మేజోళ్ళపై మసహ్ చేయుటకు అనుమతి లేదు; ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘నేను పరిశుద్ధ స్థితిలో ఉండగా వాటిని ధరించాను’ [15], తయమ్ముమ్ యొక్క తహారతు పాదాలకు సంబంధించదు, అది ముఖం మరియు చేతులకు మాత్రమే సంబంధించినది. [15] దీని తఖ్రీజ్ (పుట: 180)లో ముందే పేర్కొనబడింది.
దీని ఆధారంగా, ఒక వ్యక్తికి నీరు లేకపోయినా, లేదా అనారోగ్యం కారణంగా వుదూ కోసం నీటిని ఉపయోగించలేకపోయినా, అతను మేజోళ్ళ ను పరిశుభ్రత లేకుండానే ధరించవచ్చు. అతనికి నీరు లభించే వరకు, లేదా అతని అనారోగ్యం నయమయ్యే వరకు - ఎటువంటి సమయ పరిమితి లేకుండా - అవి అతనిపైనే ఉంటాయి. ఎందుకంటే కాలికి తయమ్ముమ్ ద్వారా పొందిన శుభ్రతతో సంబంధం లేదు.
ప్రశ్న (3): నియ్యత్ అనేది తప్పనిసరా, అంటే: ఒకవేళ (షురాబ్ లేదా కనాదిర్) సాక్సులు లేదా బూట్లు ధరించినప్పుడు వాటిపై మసహ్ చేయాలని సంకల్పించుకోవాలా? అలాగే, తను స్థానికుడుగా మసహ్ చేస్తున్నాడో, లేక ప్రయాణికుడుగా మసహ్ చేస్తున్నాడో అనే నియ్యతూ అవసరమా? లేక ఇది తప్పనిసరి కాదా?
జవాబు: ఇక్కడ సంకల్పం తప్పనిసరి కాదు; ఎందుకంటే ఇది కేవలం ఉనికి పై ఆధారపడి ఉన్న పని, కాబట్టి దీనికి సంకల్పం అవసరం లేదు, ఉదాహరణకు, ఒక వ్యక్తి దుస్తులు ధరించినప్పుడు, అతను నమాజులో తన గోప్య భాగాన్ని కప్పుకోవాలని సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు, అలాగే మేజోల్లు ధరించడానికి కూడా సంకల్పం అవసరం లేదు, మరియు కాల వ్యవధి సంకల్పం కూడా అవసరం లేదు; కానీ ఒకవేళ ప్రయాణికుడైతే; అతనికి మూడు రోజులు మరియు రాత్రులు ఉంటాయి, సంకల్పం చేసుకున్నా లేదా చేయకపోయినా, మరియు నివాసితుడైతే; అతనికి ఒక రోజు మరియు రాత్రి ఉంటుంది, సంకల్పం చేసుకున్నా లేదా చేయకపోయినా.
ప్రశ్న (4): ఎంత దూరం లేదా ప్రయాణం ఉంటే, మేజోళ్ళ పై మూడు రోజులు రాత్రులతో కలిపి మసహ్ చేయడం అనుమతించబడుతుంది?
జవాబు: నమాజును కుదించడానికి (ఖసర్ చేయడానికి) అనుమతించబడిన ప్రయాణమే, మేజోళ్ళ పై (సాక్సులపై) మసహ్ చేయడానికి మూడు రాత్రులతో సహా మూడు రోజుల పాటు అనుమతించబడే ప్రయాణం. ఎందుకంటే మనం ఇంతకు ముందు పేర్కొన్న సఫ్వాన్ బిన్ అస్సాల్ హదీసులో ఇలా ఉంది: «ఇదా కున్నా సఫ్రన్» [16], మేము ప్రయాణంలో ఉన్నప్పుడు. ప్రయాణికుడిగా ఉన్నంత కాలం మరియు నమాజు కుదించుకుంటున్నప్పుడు, అతను మూడు రోజులు మేజోళ్లపై మసహ్ చేసుకోవచ్చు. [16] దీని తఖ్రీజ్ (పుట: 20)లో పేర్కొనబడింది.
ప్రశ్న (5): ఒక ప్రయాణికుడు చేరినపుడు లేదా ఒక స్థానికుడు ప్రయాణానికి బయలుదేరినపుడు — అయితే వారు ఇప్పటికే మసహ్ చేయడం ప్రారంభించి ఉంటే — అప్పుడు వారి మసహ్ వ్యవధిని ఎలా లెక్కించాలి?
జవాబు: ఒక వ్యక్తి మసహ్ను స్థానికుడిగా ప్రారంభించి తరువాత ప్రయాణానికి బయలుదేరితే — రాజిహ్ (బలమైన) అభిప్రాయం ప్రకారం — అతను ముసాఫిర్ (ప్రయాణికుడు) కి అనుమతించబడిన వ్యవధి మేరకు మసహ్ కొనసాగించవచ్చు. అలాగే, ఒక వ్యక్తి మసహ్ను ప్రయాణికుడిగా ప్రారంభించి తరువాత నివాస స్థలానికి చేరితే — అతను ముఖీమ్ (స్థానికుడు)కి అనుమతించబడిన వ్యవధిని పూర్తి చేయాలి. ఇదే రాజిహ్ (బలమైన) అభిప్రాయం.
కొంతమంది ఉలమా ఇలా పేర్కొన్నారు: ఎవరైనా నివాస స్థలంలో మసహ్ ప్రారంభించి తరువాత ప్రయాణం చేస్తే, అతను స్థానికుడిగా మసహ్ వ్యవధినే పూర్తి చేయాలి. కానీ మేము మొదట చెప్పినదే రాజిహ్ (బలమైన) అభిప్రాయం. ఎందుకంటే ఈ వ్యక్తికి మసహ్ వ్యవధిలో కొంత భాగం మిగిలి ఉంది మరియు ఆలోపే అతను ప్రయాణించాడు. కాబట్టి అతను మూడు రోజులు మసహ్ చేసే ప్రయాణికులలో ఒకడిగా పరిగణించవచ్చు.
ప్రశ్న (6): ఒక వ్యక్తి మసహ్ ప్రారంభించిన సమయం మరియు ప్రారంభమే తాను చేశానో లేదో అనే విషయంలో సందేహంలో పడితే, అతను ఏమి చేయాలి?
జవాబు: ఈ పరిస్థితిలో అతను నిశ్చయంపై ఆధారపడాలి. అంటే, అతనికి సందేహం ఉంటే — ఉదాహరణకు: తాను జుహ్ర్ నమాజు కోసం మసహ్ చేశానో, లేక అసర్ కోసం మసహ్ చేశానో అనే విషయంలో — అయితే అసర్ నమాజు నుంచే మసహ్ వ్యవధి ప్రారంభమైంది అని పరిగణించాలి. ఎందుకంటే అసలు విధానం ఏమిటంటే: మసహ్ చేయకపోవడమే (అంటే మసహ్ జరిగింది అని నిర్ధారణ ఉండకపోతే, అది జరిగినట్లుగా పరిగణించరు).
ఈ నియమానికి రుజువు ఏమిటంటే "అసలు స్థితిలో ఉన్నది అలాగే ఉంటుంది" మరియు "లేనిది లేనట్లే" అనేది - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక వ్యక్తి గురించి ఫిర్యాదు చేయబడింది, అతను తన నమాజులో ఏదో (అపానవాయువు) బయటపడినట్లు ఊహించుకునేవాడు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: "శబ్దం విన్నంతవరకు లేదా వాసన పసిగట్టినంతవరకు అతను నమాజు నుండి వెనుదిరగవద్దు." [17]. [17] అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి హదీస్ నుండి సేకరించబడినది: బుఖారీ: వూదు పుస్తకంలో, "సందేహం ఉన్నంతవరకు, నిశ్చయించుకునే వరకు వుజూ చేయకూడదు" అనే అధ్యాయంలో, హదీసు సంఖ్య (137). ముస్లిం: హైజ్ (నెలసరి) పుస్తకంలో, "పరిశుభ్రత గురించి నిశ్చయించుకున్న తర్వాత, అశుభ్రత గురించి సందేహించేవాడు తన పరిశుభ్రతతో నమాజ్ చేసుకోవచ్చు అనడానికి నిదర్శనం" అనే అధ్యాయంలో, హదీసు సంఖ్య (361).
ప్రశ్న (7): ఒక వ్యక్తి మసహ్ గడువు ముగిసిన తర్వాత మసహ్ చేసి, ఆ తరువాత నమాజు ఆచరించాడు, అతని నమాజు యొక్క ఆదేశం ఏమిటి?
జవాబు: మసహ్ యొక్క నిర్దిష్ట వ్యవధి ముగిసిన తర్వాత -నివాసి అయినా, ప్రయాణికుడైనా - మసహ్ చేసినట్లయితే, ఆ తహారతుతో చేసిన నమాజు చెల్లదు; ఎందుకంటే మసహ్ యొక్క వ్యవధి ముగిసింది కాబట్టి అతని వుదూ చెల్లదు; అందువల్ల అతను తిరిగి పూర్తిగా వుజూ చేసుకోవాలి, అందులో తన కాళ్ళను కడగాలి, మరియు కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ వుజూలో మసహ్ చేసిన తర్వాత చేసిన అన్ని నమాజులను తిరిగి చేయాలి.
ప్రశ్న (8): ఒక వ్యక్తి వుదూ స్థితిలో ఉన్నప్పుడు మేజోళ్ళు తొలగించి, వుదూ భంగమవక ముందు వాటిని తిరిగి ధరించినట్లయితే, వాటిపై మసహ్ చేయుటకు అనుమతి ఉన్నదా?
జవాబు: ఒకవేళ షుర్రాబ్ (మేజోళ్ళు) తొలగించి, తిరిగి వాటిని ధరించినట్లయితే, మరియు అతడు వుదూ స్థితిలో ఉన్నట్లయితే, అంటే: వాటిని తొడిగిన తర్వాత వుదూ భంగపడకపోతే - అతడు వాటిని తిరిగి ధరించడంలో ఎటువంటి హానీ లేదు, మరియు వుదూ చేసినప్పుడు వాటిపై మసహ్ చేయవచ్చు.
ఒకవేళ ఈ వుదూ మసహ్ ద్వారా శుభ్రత పొందినట్లయితే, అతను మేజోళ్ళను తొలగించి తిరిగి ధరించి వాటిపై మసహ్ చేయడానికి అనుమతి లేదు. ఎందుకంటే వాటిని ధరించడానికి ముందు నీటితో పరిపూర్ణ వుదూ చేయవలసిన అవసరం ఉంది. ఇది మసహ్ ద్వారా పొందిన శుభ్రత మాత్రమే. ఇస్లామియా పండితుల అభిప్రాయం నుండి ఇది స్పష్టంగా తెలుస్తుంది.
అయితే, పండితులలో ఎవరైనా ఇలా చెప్పి ఉంటే: ఒకవేళ అతను శుద్ధి (తహారత్) తో మళ్ళీ ధరిస్తే - అది మసహ్ ద్వారా పొందిన శుద్ధి అయినప్పటికీ - కాలపరిమితి ఉన్నంతవరకు అతను మసహ్ చేసుకోవచ్చు, అప్పుడు ఆ అభిప్రాయం చాలా బలమైనదిగా ఉండేది. కానీ, నేను అలాంటి అభిప్రాయాన్ని ఎవరూ చెప్పినట్లు తెలుసుకోలేదు. నేను ఈ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడటానికి కారణం, అలాంటి అభిప్రాయాన్ని నేను చూడకపోవడమే. ఒకవేళ పండితులలో ఎవరైనా అలా చెప్పి ఉంటే, నా దృష్టిలో అది సరైనదే అవుతుంది. ఎందుకంటే మసహ్ ద్వారా పొందిన శుద్ధి ఒక పూర్తి శుద్ధి. కనుక ఇలా అనాలి: అతను స్నానం ద్వారా పొందిన శుద్ధితో ధరించిన దానిపై మసహ్ కొరకు అనుమతించబడినప్పుడు, మసహ్ ద్వారా పొందిన శుద్ధితో ధరించిన దానిపై కూడా తుడుచుకోవాలి. అయితే, నేను ఈ అభిప్రాయాన్ని చెప్పిన వారిని ఎవరినీ చూడలేదు.
ప్రశ్న (9): అలాంటప్పుడు, ఖుఫ్లను (మోజోళ్ళ)ను తీసివేయడం మసహ్ ను రద్దు చేసే వాటిలో ఒకటి అని మనం చెప్పలేమా?
జవాబు: ఖుఫ్లను (మేజోళ్ళను) తీసివేస్తే, అతని తహారత్ (పరిశుభ్రత) రద్దు కాదు, కానీ వాటిపై అతను చేసుకున్న మసహ్ రద్దు అవుతుంది. ఒకవేళ అతను వాటిని మళ్ళీ ధరించి, ఆ తర్వాత అతని వుజూ చెడిపోతే, అతను ఖుఫ్లను తీసివేసి, తన కాళ్ళను కడుక్కోవడం తప్పనిసరి.
ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామియా పండితుల అభిప్రాయం ప్రకారం, ఖుఫ్లను (మేజోళ్ళను) ధరించేటప్పుడు నీటితో శుద్ధి చేసుకున్న (కాళ్ళను కడుక్కున్న) తర్వాతే ధరించాలి.
ప్రశ్న (10): ఒక వ్యక్తి మొదటిసారి కనాదిర్ (బూట్లు) పై మసహ్ చేశాడు. రెండవసారి అతను కనాదిర్ను తీసివేసి, షుర్రాబ్ (సాక్సులు) పై మసహ్ చేశాడు. అతని మసహ్ చేయడం చెల్లుతుందా, లేదా కాళ్ళను కడుక్కోవడం తప్పనిసరి అవుతుందా?
జవాబు: దీనిలో విభేదం ఉంది, కొందరు పండితులు మేజోళ్ళ - పైభాగం లేదా దిగువభాగం - మసహ్ చేసినప్పుడు ఆ మసహ్ చెల్లుబాటు అవుతుందని, రెండవదానికి మారడం అవసరం లేదని భావిస్తారు.
వారిలో కొందరు ఇలా అన్నారు, కాలపరిమితి ఉన్నంతవరకు రెండవదానికి మారడం అనుమతించబడుతుంది. ఉదాహరణకు: ఒకవేళ అతను కనాదిర్ (బూట్లు) పై తుడుచుకుని, ఆపై వాటిని తీసివేసి, వూజు చేసుకోవాలనుకుంటే, బలమైన అభిప్రాయం ప్రకారం, అతను జవారిబ్ (సాక్సులు) పై తుడుచుకోవచ్చు. అదేవిధంగా, అతను జవారిబ్ పై తుడుచుకుని, ఆపై వాటిపై మరో జవారిబ్ లేదా కనాదిర్ ధరించి, పైదానిపై తుడుచుకుంటే, బలమైన అభిప్రాయం ప్రకారం, కాలపరిమితి ఉన్నంతవరకు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, కాలపరిమితి మొదటి దానిపై తుడుచుకున్నప్పటి నుండి లెక్కించబడుతుంది, రెండవ దానిపై తుడుచుకున్నప్పటి నుండి కాదు.
ప్రశ్న (11): ప్రజలు తరచుగా సరైన మసహ్ చేయడం మరియు మసహ్ చేసే స్థలం గురించి అడుగుతారు.
మసహ్ చేసే విధానం: తన చేతిని కాలి వేళ్ళ చివర్ల నుండి పిక్కల వరకు మాత్రమే ఆనించాలి. అంటే, తుడుచుకోవలసినది ఖుఫ్ (సాక్స్/పాదరక్ష) పై భాగం. తుడుచుకోవడం రెండు చేతులతో, రెండు కాళ్ళపై ఒకేసారి జరగాలి. అనగా, కుడి చేయి కుడి కాలిని, ఎడమ చేయి ఎడమ కాలిని ఒకే క్షణంలో తుడుచుకోవాలి, చెవులను తుడుచుకున్నట్లుగా. ఇది సున్నత్ (ప్రవక్త సంప్రదాయం) యొక్క స్పష్టమైన విధానం; ముగీరా బిన్ షుబా (రజియల్లాహు అన్హు) గారు చెప్పిన ప్రకారం: "ఆయన ఆ రెండింటిపై (ఖుఫ్లపై) మసహ్ చేసుకున్నారు." [18] "ఆయన కుడి కాలి నుండి ప్రారంభించారు" అని చెప్పలేదు, బదులుగా "ఆయన వాటి రెండింటిపై తుడుచుకున్నారు" అని అన్నారు. కాబట్టి సున్నత్ (ప్రవక్త సంప్రదాయం) యొక్క స్పష్టమైన విధానం ఇదే. అవును, ఒకవేళ ఒక చేయి పనిచేయకపోతే, కుడి చేతితో ఎడమ చేతికి ముందు ప్రారంభించవచ్చు. [18] దీని తఖ్రీజ్ ముందే (పుట: 180) వద్ద పేర్కొనబడింది.
అనేక మంది తమ రెండు చేతులతో కుడి పాదంపై మరియు రెండు చేతులతో ఎడమ పాదంపై మసహ్ చేస్తారు, ఇది నాకు తెలిసినంత వరకు సరైన పద్ధతి కాదు. పండితులు చెబుతున్నారు: కుడి చేతితో కుడి పాదంపై మరియు ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి.
ప్రశ్న (12): మేము కొంతమంది వ్యక్తులను క్రింద మరియు పైభాగం మసహ్ చేస్తూ చూశాము, అయితే వారి మసహ్ యొక్క ఇస్లామీయ ధర్మాదేశం ఏమిటి? మరియు వారి నమాజు యొక్క ధర్మాదేశం ఏమిటి?
జవాబు: వారి నమాజు సరైనదే, మరియు వారి వుదూ (శుభ్రత) కూడా సరైనదే. అయితే, క్రింది నుండి తుడుచుకోవడం సున్నత్ (ప్రవక్త సంప్రదాయం) కాదని వారికి గుర్తు చేయబడాలి. అలీ బిన్ అబి తాలిబ్ రజియల్లాహు అన్హు నుండి వచ్చిన హదీసులో ఇలా ఉంది: ఒకవేళ ధర్మం మేధాశక్తి పై ఆధారపడి ఉంటే మేజోళ్ళ మసహ్ పై భాగానికి బదులు దాని క్రింది భాగాన జరిగి ఉండేది, నిశ్చయంగా నేను మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిని మేజోళ్లపై బయటి భాగాన మసహ్ చేయడం చూశాను. [19]، ఇది హదీసు కేవలం పై భాగంపై మాత్రమే మసహ్ చేయడం ఇస్లాం ప్రకారం సరైన విధానం అని సూచిస్తుంది. [19] దీనిని అబూ దావూద్ కితాబుత్ తహారాలో, "మసహ్ చేసే విధానం ఎలా?" అనే అధ్యాయంలో, హదీస్ సంఖ్య (162) లో ఉల్లేఖించారు.
ప్రశ్న (13): ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి ఈ మాటకు ఎలా మార్గనిర్దేశం చేయబడుతుంది? "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్-మాయిదా తర్వాత మసహ్ చేయలేదు." [20] అలీ రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది: "గ్రంథం ఖుఫ్లను అధిగమించింది." [21]? [20] దీన్ని ఇమామ్ అహ్మద్ తన «ముస్నద్» (1/323) లో ఉల్లేఖించారు. [21] దీన్ని ఇబ్నె అబీ షైబా ముసన్నఫ్ (1/186) లో ఉల్లేఖించారు. మరియు బైహఖీ అల్-సుననుల్-కుబ్రా (1/272) చూడండి.
జవాబు: ఈ వాక్యాలు వారికి సంబంధించినవి అవునా కాదా నాకు తెలియదు. అయితే, దీనికి ముందు నేను పేర్కొన్నట్లుగా, అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మసహ్ గురించిన హదీసులను ఉల్లేఖించిన వారిలో ఒకరు. అతను ప్రవక్త మరణానంతరం కూడా వాటిని వివరించారు మరియు ప్రవక్త వాటికి కాలపరిమితిని (సమయాన్ని) నిర్ణయించారని స్పష్టం చేశారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం కూడా మసహ్ యొక్క తీర్పు చెల్లుబాటులో ఉందని ఆయన భావించినట్లు సూచిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం మస్హ్ నియమం రద్దు కావడం అసాధ్యం. [22] దీని తఖ్రీజ్ ముందే (పుట: 21)లో పేర్కొనబడినది.
ప్రశ్న (14): ఖుఫ్లపై (మేజోళ్ళపై) తుడుచుకునే నియమాలు మహిళలకు కూడా పురుషులకు వర్తించినట్లే వర్తిస్తాయా? ఈ విషయంలో ఏదైనా తేడా ఉందా?
సమాధానం: ఈ విషయంలో పురుషులు మరియు స్త్రీల మధ్య ఎలాంటి తేడా లేదు. ఒక సూత్రం తెలుసుకోవాలి, అది ఏమిటంటే: "పురుషుల విషయంలో స్థిరమైనది స్త్రీల విషయంలో కూడా స్థిరమైనది, మరియు స్త్రీల విషయంలో స్థిరమైనది పురుషుల విషయంలో కూడా స్థిరమైనది, కానీ వారి మధ్య వ్యత్యాసాన్ని సూచించే రుజువు ఉంటే తప్ప.
ప్రశ్న (15): తన కాలును గోకడానికి, లేదా చిన్న రాయి వంటి దానిని తన కాలు నుండి తొలగించడానికి సాక్సులను పూర్తిగా లేదా కొంత భాగాన్ని తీసివేయడం యొక్క ఆదేశం ఏమిటి?
సమాధానం: చేతులను పాదకూసముల (జోవారిబ్) క్రిందనుండి చొప్పించినప్పుడు; అందులో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాటిని తొలగించినప్పుడు; పరిశీలించాలి: ఒకవేళ కొంత భాగం మాత్రమే తొలగించినట్లయితే; అది హాని చేయదు, కానీ ఎక్కువ భాగం, అంటే ఎక్కువ పాదం కనిపించేలా తొలగించినట్లయితే; భవిష్యత్తులో వాటిపై మసహ్ చేయుట రద్దు అవుతుంది.
ప్రశ్న (16): సామాన్య ప్రజల్లో ఒక ప్రాచుర్యం ఉంది — వారు ఖుఫ్లపై ఐదు నమాజులుకుమాత్రమే మసహ్ చేస్తారు, తరువాత తిరిగి మళ్ళీ మసహ్ను ప్రారంభిస్తారు.
జవాబు: అవును, సామాన్య ప్రజలలో ఇది ప్రచారంలో ఉంది. కేవలం ఐదు పూటల నమాజులకు మాత్రమే మసహ్ చేసుకుంటారు, కానీ ఇది సరైనది కాదు. వాస్తవానికి, కాలపరిమితి ఒక పగలు మరియు ఒక రాత్రి. అంటే, అతను ఐదు పూటల నమాజులు చేసినా లేదా అంతకంటే ఎక్కువ చేసినా, ఒక పగలు మరియు ఒక రాత్రి వరకు మసహ్ చేసుకోవడానికి అతనికి అనుమతి ఉంది.
మనం ఇంతకు ముందు పేర్కొన్నట్లు, కాలవ్యవధి మసహ్ చేసినప్పటి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి పది లేదా అంతకంటే ఎక్కువ నమాజులు చేయవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి సోమవారం ఫజ్ర్ నమాజు కోసం ఖుఫ్లను ధరించి, మంగళవారం రాత్రి నిద్రపోయే వరకు అదే శుభ్రతతో (తహారత్తో) ఉన్నాడు. తర్వాత మంగళవారం ఫజ్ర్ నమాజు కోసం మొదటిసారి ఖుఫ్లపై మసహ్ చేసుకున్నాడు, అప్పుడు అతనికి బుధవారం ఫజ్ర్ నమాజు వరకు మసహ్ చేసుకోవటానికి అనుమతి ఉంది. ఇక్కడ అతను సోమవారం ఫజ్ర్, జుహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులను ఖుఫ్లతో చేశాడు, అయితే ఈ కాలమంతా లెక్కలోకి రాదు, ఎందుకంటే ఇది మసహ్ చేసుకోవటానికి ముందు జరిగింది. అలాగే అతను మంగళవారం ఫజ్ర్ నమాజుకు మసహ్ చేసుకున్నాడు, జుహర్ నమాజుకు మసహ్ చేసుకున్నాడు, అస్ర్ నమాజుకు మసహ్ చేసుకున్నాడు, మగ్రిబ్ నమాజుకు మసహ్ చేసుకున్నాడు, ఇషా నమాజుకు మసహ్ చేసుకున్నాడు. అదేవిధంగా, కాలవ్యవధి ముగియకముందే మసహ్ చేసుకుంటే, బుధవారం నమాజు కోసం కూడామసహ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మంగళవారం ఫజ్ర్ నమాజు కోసం అతను ఉదయం 5 గంటలకు మసహ్ చేసుకున్నాడు. బుధవారం ఉదయం 4:45 గంటలకు మసహ్ చేసుకున్నాడు, మరియు గురువారం రాత్రి ఇషా నమాజు చేసే వరకు అదే శుభ్రతతో ఉన్నాడు. ఈ సందర్భంలో, అతను బుధవారం ఫజ్ర్, జుహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులను అదే వుజూతో చేయవచ్చు. అంటే, అతను సోమవారం ఫజ్ర్ నమాజు కోసం ఖుఫ్లు ధరించినప్పటి నుండి, పదిహేను నమాజులు చేసి ఉంటాడు. ఎందుకంటే అతను సోమవారం ఫజ్ర్ నమాజు కోసం వాటిని ధరించి, అదే శుభ్రతతో ఉన్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు మాత్రమే మసహ్ చేసుకున్నాడు, మరియు బుధవారం ఉదయం 4:45 గంటలకు తుడుచుకున్నాడు, మరియు ఇషా నమాజు చేసే వరకు శుభ్రతతో ఉన్నాడు. కాబట్టి అతను పదిహేను నమాజులు చేసి ఉంటాడు.
ప్రశ్న (17): ఒక వ్యక్తి వుజూ చేసి, ఖుఫ్ఫైన్ పై మసహ్ చేసిన తరువాత, మసహ్ సమయం లోపల, ఉదాహరణకు అసర్ నమాజు ముందు ఖుఫ్ఫైన్ ను తీసివేస్తే, అతను నమాజు చేయగలడా మరియు అతని నమాజు సరి అయినదా, లేదా ఖుఫ్ఫైన్ తీసివేయడం వలన అతని వుజూ భంగమవుతుందా?
సమాధానం: ఇబ్నె తైమియ్యా మరియు మరికొంతమంది ఉలమా రహిమహుల్లాహ్ వారి అభిప్రాయం ప్రకారం, ఖుఫ్ తొలగించడం వలన వుజూ భంగం కాదు. ఒకవేళ ఖుఫ్ తొలగించినా, అతను తహారతులో ఉన్నట్లయితే మరియు ఖుఫ్ పై మసహ్ చేసినట్లయితే, అతని వుజూ భంగం కాదు. ఎందుకంటే ఖుఫ్ పై మసహ్ చేయడం ద్వారా అతని తహారతు షరీఅతు ఆధారంగా సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఖుఫ్ తొలగించినా, ఈ షరీఅతు ఆధారంగా ఉన్న తహారతు ఎటువంటి షరీఅతు ఆధారంలేకుండా భంగం కాదు. ఖుఫ్ లేదా మేజోళ్ళను తొలగించడం వలన వుజూ భంగం అవుతుందని ఎటువంటి ఋజువు లేదు. అందువలన అతని వుజూ కొనసాగుతుంది. కానీ, తరువాత ఖుఫ్ తిరిగి తొడిగి, భవిష్యత్తులో మసహ్ చేయాలని అనుకుంటే, అది అనుమతించబడదు, నాకు తెలిసినంతవరకు పండితుల అభిప్రాయం ఇది. [23] అల్ ఫురూఅ్ 1/218.
తలపాగా (అమామా) పై మసాహ్ చేయటం
ప్రశ్న (18): తలపాగా (అమామా) పై మసాహ్ చేయుటకు అనుమతి ఉన్నదా? దాని పరిమితులు ఏమిటి?
సమాధానం: అమామా పై మసాహ్ చేయడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ సున్నతులో వచ్చినది. అందువలన అమామా పై మసాహ్ చేయడం అనుమతించబడింది. అమామా మొత్తం లేదా ఎక్కువ భాగం పై మసాహ్ చేయవచ్చు. అలాగే తలలో కనిపించే భాగం ఉదాహరణకు నుదుట, తల పక్క భాగం మరియు చెవులపై మసాహ్ చేయడం కూడా సున్నతుగా చెప్పబడింది.
ప్రశ్న (19): తలపాగా (అమామా) పరిధిలోకి పురుషుల షిమాగ్ మరియు మహిళల తల కప్పు (హిజాబ్/స్కార్ఫ్) వస్తాయా?
సమాధానం: పురుషుల షిమాగ్ మరియు టోపీ అమామా (తలపాగా) పరిధిలోకి రావు. అయితే, శీతాకాలంలో తలను, చెవులను పూర్తిగా కప్పి, కింద మెడ చుట్టూ కూడా చుట్టుకునే కుబ్బ (టోపీ) వంటి వాటి విషయంలో, అది తలపాగాతో సమానం. ఎందుకంటే దానిని తీసివేయడం కష్టం కాబట్టి, దానిపై చేయవచ్చు.
మహిళల విషయానికొస్తే, ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ మతంలోని ప్రసిద్ధ అభిప్రాయం ప్రకారం, వారు తమ ఖిమార్(తలను కప్పుకునే వస్త్రాల) పై తుడుచుకోవచ్చు, అవి వారి గొంతుల కింద కట్టి ఉన్నట్లయితే. ఇది కొంతమంది సహాబా మహిళల నుండి అల్లాహ్ వారిపై ప్రసన్నుడగుగాక, ఉల్లేఖించబడినందున అలా చేయవచ్చు. [24] అల్ ఇన్సాఫ్ మఅల్ ముక్నిఅ్ వష్శరహ్ అల్ కబీర్ (సంపుటం1/పేజీ 387), వమున్తహా అల్ ఇరాదాత్ మఅ్ షరహ్ అల్ బహూతీ (సంపుటం1/పేజీ 122).
ప్రశ్న (20): టోపీ (తర్బూష్) తలపైన ఉంటుంది, దానికి మెడతో సంబంధం లేదు, దానిపై మసహ్ చేయాలా?
సమాధానం: తర్బూష్ (టోపీ)ని తీసివేయడం కష్టం కానట్లయితే, దానిపై తుడుచుకోవడం (మసహ్) అనుమతించబడదు. ఎందుకంటే కొన్ని రకాలుగా ఇది సాధారణ టోపీ (తాకియా) ని పోలి ఉంటుంది. అసలు సూత్రం ఏమిటంటే, తలపై తుడుచుకోవడం తప్పనిసరి, అది తుడుచుకోవడానికి అనుమతించబడిన వాటిలో ఒకటి అని స్పష్టంగా తెలిసే వరకు.
జబీరా (గాయం మీద కట్టే పట్టీ)పై మసహ్ చేయడం
ప్రశ్న (21): గాయంపై కట్టు కట్టినప్పుడు మరియు దానితో సమానమైన వాటిపై మసహ్ యొక్క ఆదేశం ఏమిటి? ఖుర్ఆన్ మరియు సున్నత్ నుండి దాని చట్టబద్ధతకు ఆధారం ఏమిటి?
సమాధానం: మొదట, జబీరా అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి.
జబీరహ్: అనే పదానికి మూలంలో ఎముక విరిగినప్పుడు దాన్ని కట్టేది అని అర్థం. అయితే, ఫిఖ్ ఇస్లామియా ధర్మశాస్త్ర పండితుల పరిభాషలో, పరిశుభ్రత (వుజూ లేదా గుస్ల్) చేయాల్సిన ప్రదేశంలో అవసరం నిమిత్తం ఉంచబడేది అని అర్థం. వీటికి ఉదాహరణలు: విరిగిన ఎముకపై వేసే ప్లాస్టర్ (జిప్సం), గాయంపై వేసే బ్యాండేజ్ (లేదా వెన్నునొప్పిపై వేసే పట్టీ), లేదా అలాంటివేమైనా. కాబట్టి, ఈ జబీరాపై మసహ్ చేయడం, దాన్ని కడగడానికి బదులుగా సరిపోతుంది.
కాబట్టి, వూదు చేసుకునే వ్యక్తి చేతిపై గాయానికి ఒక పట్టీ ఉంటే, అది అవసరమైనదైతే, అతను దాన్ని కడగడానికి బదులు దానిపై మసహ్ చేసుకోవచ్చు. ఈ శుభ్రత పూర్తిగా పరిగణించబడుతుంది. అంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఈ పట్టీని లేదా లేపనాన్ని తీసివేసినా, అతని శుభ్రత అలాగే ఉంటుంది, అది రద్దు కాదు. ఎందుకంటే ఈ శుభ్రత షరియత్ (ఇస్లామిక్ చట్టం) ప్రకారం పూర్తయింది, మరియు లేపనాన్ని తీసివేయడం శుభ్రతను రద్దు చేస్తుందని ఎటువంటి ఆధారమూ లేదు.
జబీరా (గాయాల పై వేసే పట్టీ) విషయంలో వ్యతిరేకతలేని ప్రామాణిక ఆధారం లేదు. ఇందులో కొందరు పండితులు అనుసరించిన బలహీనమైన హదీసులు మాత్రమే ఉన్నాయి. అయితే, కొంతమంది పండితులు ఈ బలహీనమైన హదీసులన్నింటినీ కలిపితే అవి సాక్ష్యంగా పరిగణించబడే స్థాయికి చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు.
ఇస్లామీయ పండితులలో కొంతమంది, ఈ హదీసుల బలహీనత కారణంగా, వాటిపై ఆధారపడలేమని అన్నారు. ఈ పండితులు కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు: కొందరు, జబీరా (కట్టు) ఉన్న భాగాన్ని శుభ్రం చేయడం రద్దు అవుతుందని అన్నారు, ఎందుకంటే ఆ వ్యక్తి దానిని చేయలేడు కాబట్టి. మరికొందరు, దాని కోసం తయమ్ముమ్ చేయాలి తప్ప, దానిపై మసహ్ చేయకూడదు అని అన్నారు.
కానీ హదీసుల ప్రస్తావన లేకుండా నియమాలకు సమీపంగా ఉన్న అభిప్రాయమేమిటంటే, అతడు మసహ్ చేయాలి, ఈ మసహ్ తయమ్ముమ్ అవసరాన్ని తొలగిస్తుంది, కాబట్టి తయమ్ముమ్ అవసరం లేదు. ఈ సందర్భంలో మనం చెప్పేది ఏమిటంటే, తహారత్ (వూజు/గుస్ల్) అవయవాలలో ఏదైనా గాయం ఉంటే, దానికి కొన్ని స్థాయులు (పరిస్థితులు) ఉన్నాయి:
మొదటి స్థాయి: గాయం బహిర్గతమై ఉండి, దానిని కడగడం వల్ల ఎటువంటి హాని కలగకపోతే, ఈ స్థితిలో దానిని కడగడం తప్పనిసరి.
రెండవ స్థాయి: గాయం బహిర్గతమై ఉండి, దానిని కడగడం వల్ల హాని కలుగుతుంది, కానీ మసహ్ చేయడం వల్ల హాని కలగదు అనుకుంటే, ఈ స్థాయిలో కడగకుండా మసహ్ చేయడం తప్పనిసరి.
మూడవ స్థాయి: గాయం బహిర్గతమై ఉండి, దానిని కడగడం మరియు మసహ్ చేయడం రెండూ హానికరం అయినట్లయితే, ఈ స్థితిలో ఆ భాగం కోసం తయమ్ముమ్ చేయాలి.
నాలుగవ స్థాయి: గాయం పట్టీ, లేపనం (లేదా అలాంటిదేదైనా) తో కప్పబడి ఉండి, ఆ పట్టీ అవసరమైనదైతే, ఈ పరిస్థితిలో అతను ఆ కప్పబడిన దానిపై మసహ్ చేయాలి. ఇది ఆ అవయవాన్ని కడగడానికి బదులుగా సరిపోతుంది.
ప్రశ్న (22): ఒకవేళ గాయంపై కట్టిన కట్టు (జబీరా) అవసరం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, దానిపై మసహ్ చేయడానికి ఏమైనా షరతులు ఉన్నాయా?
జవాబు: జబీరా (గాయంపై కట్టిన కట్టు)పై కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మసహ్ చేయాలి. కాబట్టి, దానిని దాని అవసరాన్ని బట్టి మాత్రమే అంచనా వేయాలి. అవసరం అంటే నొప్పి లేదా గాయం ఉన్న ప్రదేశం మాత్రమే కాదు, ఆ జబీరాను లేదా ఆ పట్టీని స్థిరీకరించడానికి అవసరమైనదంతా అవసరం పరిధిలోకి వస్తుంది.
ప్రశ్న (23): "జబీరా" (గాయంపై కట్టిన కట్టు) అర్థంలో గాయానికి చుట్టే వస్త్రాలు (లఫాయిఫ్) అంటే గాజుగుడ్డ (షాష్) వంటివి వస్తాయా?
జవాబు: అవును, ఇది వర్తిస్తుంది. అయితే గమనించవలసినది ఏమిటంటే, జబీరా (పట్టీలు) మేజోళ్ళపై మసహ్ చేయడం లాగా ఒక నిర్దిష్ట కాలపరిమితి కలిగి ఉండదు. అవసరం ఉన్నంతకాలం వాటిపై మసహ్ చేయవచ్చు. అలాగే, చిన్న అశుద్ధత మరియు పెద్ద అశుద్ధత సమయంలో కూడా వాటిపై మసహ్ చేయవచ్చు, ఇది మేజోళ్ళకు భిన్నంగా ఉంటుంది. గుస్ల్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా వాటిపై మసహ్ చేయవచ్చు, వుజూ సమయంలో మసహ్ చేసినట్లే.
ప్రశ్న (24): జబీరా (గాయం మీద కట్టే పట్టీ) పై మసహ్ చేసే విధానం ఏమిటి? దానిని పూర్తిగా తుడవాలా, లేక కొంత భాగం మాత్రమే మసహ్ చేయాలా? దయచేసి విశదీకరించండి.
జవాబు: అవును, మొత్తం కట్టును కప్పి తుడుచుకోవాలి. ఎందుకంటే, ఒక సాధారణ సూత్రం ఏమిటంటే, సున్నత్ భిన్నంగా పేర్కొననంతవరకు, ప్రత్యామ్నాయం (బదల్) అసలైన దాని (ముబ్దల్) నియమాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ తుడుచుకోవడం కడగడానికి ప్రత్యామ్నాయం. అవయవాన్ని పూర్తిగా కడగడం తప్పనిసరి అయినట్లే, తుడుచుకోవడం కూడా జబీరా (కట్టు) మొత్తాన్ని కవర్ చేయడం తప్పనిసరి. ఖుఫ్లపై (పాదరక్షలపై) తుడుచుకోవడం ఒక వెసులుబాటు, మరియు దానిలో కొంత భాగాన్ని తుడుచుకుంటే సరిపోతుందని సున్నత్ ద్వారా నిరూపించబడింది.
రెండవ అధ్యాయం: నమాజు
నమాజ్ ప్రాముఖ్యత మరియు విశిష్టత
నమాజు విధానం
సహూ సజ్దా
ఖుర్ఆన్ పఠన సాష్టాంగం
ప్రయాణికుడి నమాజు, మరియు ఉపవాసం
వ్యాధి, మరియు వ్యాధిగ్రస్తుడు గమనించవలసిన విషయాలు.
వ్యాధిగ్రస్తులు తహారతు,నమాజు,ఉపవాసము ఎలా చేయాలి?
సలాతుత్తతవ్వు: (స్వచ్ఛందంగా చేసే సున్నతు, నఫిల్ వంటి అదనపు నమాజులు).
నిషిద్ధ సమయాలు
నమాజు విడిచిపెట్టే వాడి ఆదేశము
తౌబా (పశ్చాత్తాపము)
నమాజు
*నమాజు నిర్వచనం:
ఇది నిలబడటం, కూర్చోవడం, రుకూ చేయడం మరియు సజ్దా చేయడం ద్వారా ప్రత్యేకమైన జిక్ర్ లతో కూడిన విధానంలో మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధించడం. నమాజ్లోకి ప్రవేశించే ముందు, కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలి. అవి: పవిత్రత, శరీర గోపనీయ భాగాలు కప్పుకోవడం, నమాజ్ సమయం ప్రవేశించడం మొదలైనవి.
నమాజ్ ప్రాముఖ్యత మరియు ఘనత:
నమాజు: ఇది ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో రెండవది, మరియు షహాదతైన్ (రెండు సాక్ష్యాలు) తరువాత అత్యంత ముఖ్యమైన మూలస్తంభం. దాని విధిని తిరస్కరించినవాడు కాఫిర్ అవుతాడు; ఎందుకంటే అతను అల్లాహ్, అతని ప్రవక్త మరియు ముస్లిముల ఐక్యాభిప్రాయాన్ని తిరస్కరించినవాడవుతాడు.
అయితే, నమాజ్ విధిత్వాన్ని అంగీకరించి, దాని పట్ల నిర్లక్ష్యం వహించి, నమాజ్ చేయని వారి తీర్పు విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో బలమైన అభిప్రాయం ఏమిటంటే: అతను ఇస్లాం పరిధి నుండి బయటపడే అవిశ్వాసం (కుఫ్ర్) చేసినవాడు.
నమాజు అనేది దాసుడు మరియు అతని ప్రభువు మధ్య ఒక అనుసంధానం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «మీరు నమాజు చేస్తూ ఉంటే మీ ప్రభువుతో రహస్యంగా మాట్లాడుతున్నట్లే.» [25] హదీసె ఖుదుసీ లో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: «నేను నమాజును నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది. దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నా దాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.»[26]. [25] దీనిని బుఖారీ కితాబుల్ మవాఖీత్ అస్సలాత్ లో ఉల్లేఖించారు, బాబు ముసల్లీ యునాజీ రబ్బహు అజ్జవజల్ హదీసు సంఖ్య (531), మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో బాబు నహీ అనిల్ బిసాఖ్ ఫీల్ మస్జిద్ హదీసు సంఖ్య (551) అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. [26] ముస్లిం కితాబ్ అస్సలాత్ లో, బాబ్ వాజిబు ఖిరాఅతు ఫాతిహా, హదీసు నెంబరు (395/38) లో అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.
నమాజ్ అనేది ఆరాధనల ఉద్యానవనం, ఇందులో ప్రతి రకమైన ఆనందకరమైన జత ఉంటుంది: తక్బీర్ (అల్లాహు అక్బర్ అని పలకడం)తో నమాజ్ ప్రారంభమవుతుంది; నిలబడి, నమాజ్ చేసేవారు అల్లాహ్ వాక్కును (ఖురాన్) పఠిస్తారు; రుకూలో ప్రభువును మహిమపరుస్తారు; రుకూ నుండి లేచినప్పుడు అల్లాహ్ ను ప్రశంసిస్తారు; సజ్దా లో అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ, ఆయనకు దుఆలు (ప్రార్థనలు) చేస్తూ వేడుకుంటారు; కూర్చుని దుఆలు మరియు తషహుద్ (ప్రవక్తపై దరూద్) పఠిస్తారు; మరియు తస్లీమ్ (శాంతి వచనం పలకడం)తో నమాజ్ ముగిస్తారు.
నమాజ్ ముఖ్యమైన విషయాలలో సహాయం చేస్తుంది, మరియు అది అసభ్యతలను, చెడు పనుల నుంచి ఆపుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు మీరు సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి...} [అల్ బఖర: 45] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది...} [అల్-అన్'కబూత్: 45]
మరియు నమాజు విశ్వాసులకు వారి సమాధులలో మరియు తీర్పు దినమున వారికి కాంతి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: ‘నమాజు (నూర్) కాంతి’ [27], ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఎవరైతే దానిని (నమాజ్ను) పాటిస్తారో; అది వారికి పునరుత్థాన దినాన ; వెలుగుగా, రుజువుగా, మరియు మోక్షంగా ఉంటుంది.»[28]. [27] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, పుస్తకం: తహారత్, అధ్యాయం: వుజూ యొక్క ప్రాముఖ్యత, హదీసు నెంబరు 223, హజ్రత్ అబూ మాలిక్ అష్అరీ రజియల్లాహు అన్హు కథనం. [28] దీనిని ఇమామ్ అహ్మద్ తన «ముస్నద్» (2/169) లో అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా యొక్క హదీసులో ఉల్లేఖించారు.
నమాజు విశ్వాసుల ఆనందం, వారి కళ్ళకు చల్లదనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: «నా కంటి చలువ నమాజ్లో ఉంచబడింది»[29]. [29] దీనిని నసాయీ తన పుస్తకంలో 'అషరతు నిసా', 'బాబ్ హుబ్బు న్నిసా' లో హదీసు నెంబరు (3392) ఉల్లేఖించారు, మరియు అహ్మద్ 3/128 అనస్ రదియల్లాహు అన్హు యొక్క హదీసు నుండి ఉల్లేఖించారు.
నమాజు ద్వారా పాపాలు తుడిచివేయబడతాయి, చెడు కర్మలు క్షమించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అందులో అతను ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే అతని ఒంటిపై మురికి, మాలి న్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి?” అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి సహచరులు, "ఎలాంటి మురికి, మాలిన్యాలు మిగిలి ఉండవండీ?” అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: “ఐదుపూటల నమాజు సంగతి కూడా అంతే, అల్లాహ్ వాటి ద్వారా పాపాలను తుడిచివేస్తాడు»[30]. [30] దీనిని బుఖారీ కితాబ్ మవాఖీత్ సలాత్ లో ఉల్లేఖించారు, బాబు సలావాత్ ఖమ్స్ కఫారత్ హదీసు సంఖ్య (528), మరియు ముస్లిం కితాబ్ మసాజిద్ లో ఉల్లేఖించారు, బాబు మషీ ఇల సలాత్ తుమ్హా బిహి ఖతాయా హదీసు సంఖ్య (667) అబూ హురైరా రజియల్లాహు అన్హు హదీసు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఘోరపాపాలకు పాల్పడకుండా ఉంటే, ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు గల కాలం, వాటి మధ్య జరిగే (చిన్నచిన్న) పాపాలకు పరిహారాలు.»[31]. [31] దీనిని ముస్లిం తమ తహారతు గ్రంథంలో, ఐదు పూటల నమాజులు మరియు జుమా నుండి జుమా వరకు గల పాపాలను తుడిచివేయడం అనే అధ్యాయంలో, హదీసు నెంబరు (233) అబూహురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ద్వారా ఉల్లేఖించారు.
«సామూహికంగా చేసే నమాజ్ ఒంటరిగా చేసే నమాజ్ కంటే ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది.». ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు[32]. [32] దీనిని బుఖారీ కితాబుల్ ఆజాన్ లో బాబు ఫజ్లుజ్జమాఅహ్ హదీసు సంఖ్య (645) లో ఉల్లేఖించారు. మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో బాబు ఫజ్లుస్సలాతుజ్జమాఅహ్ హదీసు సంఖ్య (650) లో ఉల్లేఖించారు.
ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా సెలవిచ్చారు: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ని కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. మరియు ఎవరయితే తమ ఇంటి దగ్గర చక్కగా పరిశుద్ధతనొంది (వుజూ లేదా గుసుల్ చేసి) అల్లాహ్ గృహాల్లో ఏదయినా ఒక గృహానికి వెళ్తారో, వారు వేసే ప్రతి అడుగులో ఒక పుణ్యాన్ని పొందుతారు, మరియు ఒక స్థాయిని పెంచుతారు, మరియు ఒక పాపాన్ని తుడిచిపెడ్తారు. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్ లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది.[33] [33] ముస్లిం సహీహ్ లోని "కితాబ్ అల్-మసాజిద్" లో, "బాబ్ సలాత్ అల్-జమాఅహ్ మిన్ సునన్ అల్-హుదా" భాగం, హదీస్ నంబర్ (654) లో ఉల్లేఖించారు.
నమాజులో ఖుషూ' (అణకువ కలిగి ఉండటం) మరియు దానిని కాపాడుకోవడం విజయానికి మరియు స్వర్గాలలో ప్రవేశానికి కారణమవుతాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. 1 వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు 2 వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు 3 వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు 4 వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు 5 అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు 6 కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు 7 వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు 8 వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు 9 ఇలాంటి వారే వారసులు 10 (స్వర్గంలోని) ఫిర్దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు 11} [అల్ ముమినూన్: 1-11]
నమాజ్ ఆమోదించబడటానికి రెండు ప్రాథమిక షరతులు ఉన్నాయి: అందులో అల్లాహ్ తఆలా పట్ల నిష్కాపట్యత (ఇఖ్లాస్) కలిగి ఉండటం, సున్నత్ (ప్రవక్త బోధనలు) ప్రకారం దానిని నిర్వర్తించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించారో.»[34], ఇంకా ఇలా ప్రవచించారు: «మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి»[35] [34] దీనిని బుఖారీ కితాబు బద్'ఉల్' వహీ లో అధ్యాయం కైఫ కాన బద్'ఉల్' వహీ హదీసు సంఖ్య (1) లో ఉల్లేఖించారు. మరియు దీనిని ముస్లిం కితాబుల్ ఇమారత్ లో అధ్యాయం ఖౌలుహు సల్లల్లాహు అలైహి వసల్లం: «ఇన్నమా అల్ ఆమాలు బిన్నియ్యాత్» హదీసు సంఖ్య (1907) లో ఉల్లేఖించారు, ఇది ఉమర్ బిన్ ఖతాబ్ రజియల్లాహు అన్హు హదీసు నుండి. [35] దీన్ని బుఖారీ ఫీ కితాబుల్ అజాన్, బాబ్ అజాన్ లిల్ ముసాఫిర్ ఇజా కానూ జమాఅహ్, హదీసు నెంబరు (631) మాలిక్ బిన్ హువైరిత్ రజియల్లాహు అన్హు యొక్క హదీసు.
నమాజు విధానం:
ఈ షరతులు పూర్తయిన తరువాత నమాజు చేయటానికి సిద్ధమైతే, ఈ క్రింది వాటిని చేయాలి:
1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ నమాజు చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
3- తక్బీరతుల్ ఇహ్రామ్ పలుకుతూ, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలకాలి, మరియు తన రెండు చేతులను భుజాల ఎత్తులో లేదా చెవి కొనల వరకు, లేదా వాటి కొసల వరకు పైకి లేపాలి.
4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
5 - తర్వాత ఇస్తిఫ్తాహ్ దుఆ చదవాలి: «అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబుల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ» [36]. "ఓ అల్లాహ్! తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాల నుండి అంతే దూరం ఉంచు. ఓ అల్లాహ్! మురికి నుండి తెల్లని వస్త్రాన్ని శుభ్రం చేసినట్లుగా నా పాపాల నుండి నన్ను శుభ్రం చేయి. ఓ అల్లాహ్! నీరు, మంచు మరియు వడగండ్లతో నా పాపాలను కడిగివేయి." 36] ఇది బుఖారీ సహీహ్ లోని "కితాబ్ అల్-అజాన్" లో, "బాబ్ మా యఖూలు బఅద్ అత్-తక్బీర్" భాగంలో, హదీస్ నంబర్ (744) కింద, మరియు ముస్లిం సహీహ్ లోని "కితాబ్ అల్-మసాజిద్" లో, "బాబ్ మా యఖూలు బైన్ తక్బీరత్ అల్-ఇహ్రామ్ వ అల్-కిరాఆహ్" భాగంలో, హదీస్ నంబర్ (598) కింద అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి నివేదించబడింది.
6 - లేదా ఇలా పలకండి: "సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక." [37] ఓ అల్లాహ్! నీవు పరిశుద్ధుడవు. స్తోత్రములు కూడా నీకే చెల్లును నీ పేరు ఎంతో శుభప్రదమయినది. నీ గొప్పతనము ఎంతో ఉన్నతమయినది నీవు తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. [37] ఇది అబూ దావూద్ తన 'కితాబ్ అస్-సలాహ్' లో, 'బాబ్ మన్ రా అల్ ఇస్తిఫ్తాహ్ బి "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక"' లో, హదీస్ నంబర్ (775), మరియు తిర్మిజి తన 'కితాబ్ అస్-సలాహ్' లో, 'బాబ్ మా యకూలు ఇంద ఇఫ్తితాహ్ అస్-సలాహ్', హదీస్ నంబర్ (242), మరియు నసాయి తన 'కితాబ్ అల్ ఇఫ్తితాహ్' లో, 'బాబ్ నౌ అఖర్ మిన్ అల్ ధిక్ర్ బైన ఇఫ్తితాహ్ అస్-సలాహ్ వ బైన అల్ ఖిరాఅ', హదీస్ నంబర్ (900), మరియు ఇబ్ను మాజా తన 'కితాబ్ ఇఖామత్ అస్-సలాహ్' లో, 'బాబ్ ఇఫ్తితాహ్ అస్-సలాహ్', హదీస్ నంబర్ (804), మరియు అహ్మద్ (3/ 50) అబూ సయీద్ రజియల్లాహు అన్హు యొక్క హదీస్ నుండి ఉల్లేఖించారు. మరియు అబూ దావూద్ పూర్వపు స్థలంలో, హదీస్ నంబర్ (776), మరియు తిర్మిధీ పూర్వపు స్థలంలో, హదీస్ నంబర్ (243), మరియు ఇబ్ను మాజా పూర్వపు స్థలంలో, హదీస్ నంబర్ (806) ఆయిషా రజియల్లాహు అన్హా యొక్క హదీస్ నుండి ఉల్లేఖించారు. మరియు ముస్లిం తన 'కితాబ్ అస్-సలాహ్' లో, 'బాబ్ హుజ్జతు మన్ ఖాల్: లా యజ్హరు బి అల్ బస్మలహ్', హదీస్ నంబర్ (399) ఉమర్ బిన్ ఖతాబ్ రజియల్లాహు అన్హు యొక్క ఆచరణ నుండి మౌఖూఫ్ గా ఉల్లేఖించారు, మరియు దాని సనద్ లో ఒక లోపం ఉంది.
7- తర్వాత తఅవ్వూజ్ చదవాలి: ఇలా పఠించాలి: "అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్." అర్థం: "శపించబడిన షైతాన్ నుండి అల్లాహ్ తో శరణు కోరుతున్నాను."
8 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించ వలెను. {అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (1) ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు (2) అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు (3) ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని 4 మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము (5) మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు (6) నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు) (7)} [అల్ ఫాతిహ: 1-7], ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను.
9 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. మరియు ఫజ్ర్ నమాజ్ లో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయ వలెను.
10 - ఆపై రుకూ చేయాలి – అంటే అల్లాహ్ను కీర్తిస్తూ తన వీపును వంచాలి – మరియు రుకూ చేసేటప్పుడు (అల్లాహు అక్బర్) అని తక్బీర్ చెప్పాలి. మరియు తన చేతులను భుజాల వరకు పైకి లేపాలి. సున్నత్ ఏమిటంటే: తన వీపును నిటారుగా ఉంచి, తలను వీపుకు సమానంగా ఉంచాలి, మరియు వేళ్ళను విడదీసి తన చేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకోవాలి.
11 - రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు) అని పలక వలెను, ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: "ఓ అల్లాహ్! మా ప్రభూ! నీవు పవిత్రుడవు, నీ స్తోత్రాలతో (నిన్ను కీర్తిస్తున్నాను). ఓ అల్లాహ్! నన్ను క్షమించు"[38]. "సుబ్బూహ్, ఖుద్దూసస్, రబ్బుల్ మలాఇకతి వర్-రూహ్." అర్థం: "అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు, దైవదూతలకు మరియు రూహ్ (జిబ్రీల్)కు ప్రభువు" [39]. మంచిది. [38] దీనిని బుఖారీ హదీసు నెంబరు (761), ముస్లిం హదీసు నెంబరు (484) లో ఉల్లేఖించారు. [39] దీన్ని ముస్లిం హదీసు నెంబరు (487), అబూదావూద్ హదీసు నెంబరు (872) ఉల్లేఖించారు.
12 - ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలకాలి.
13 - మఖ్తదీ (అనుసరించేవాడు) సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అనీ పలకరాదు, బదులుగా రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి) అనీ పలక వలెను.
14 - ఆపై లేచిన తర్వాత ఇలా పఠించాలి: "రబ్బనా వ లకల్ హమ్ద్, మిల్అస్సమావాతి, వ మిల్అల్ అర్ది, వ మిల్అ మా షి’త మిన్ షైఇన్ బఅ్దు." అర్థం: "భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండి- పోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా!." [40], "ఘనతలకు, పొగడ్తలకు అధిపతి అయిన, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవైనవాడా!. మేమందరమూ నీకే దాసులం. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఇచ్చేవాడూ లేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు [41]. ఇది కూడా జోడిస్తే మంచిది. [40] దీనిని ముస్లిం హదీసు నెంబరు 471, అబూదావూద్ హదీసు నెంబరు 760 లో ఉల్లేఖించారు. [41] దీన్ని ముస్లిం హదీసు నెంబరు (477), అబూదావుద్ హదీసు నెంబరు (847) ఉల్లేఖించారు.
15 - "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, అల్లాహ్ పట్ల వినమ్రతతో మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయాలి: నుదురు మరియు ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచాలి.
16 - సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది: "ఓ అల్లాహ్! మా ప్రభూ! నీవు పవిత్రుడవు, నీ స్తోత్రాలతో (నిన్ను కీర్తిస్తున్నాను). ఓ అల్లాహ్! నన్ను క్షమించు"[42]. "సుబ్బూహ్, ఖుద్దూసస్, రబ్బుల్ మలాఇకతి వర్-రూహ్." అర్థం: "అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు, దైవదూతలకు మరియు రూహ్ (జిబ్రీల్)కు ప్రభువు" [43]. మంచిది. [42] దీనిని బుఖారీ హదీసు నెంబరు 761, ముస్లిం హదీసు నెంబరు 484 లో ఉల్లేఖించారు. [43] దీన్ని ముస్లిం హదీసు నెంబరు (487),అబూదావూద్ హదీసు నెంబరు (872) ఉల్లేఖించారు.
17 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకి లేపాలి.
18 - తర్వాత అతను రెండు సజ్దాల మధ్య తన ఎడమ పాదంపై కూర్చోవాలి, తన కుడి పాదాన్ని నిటారుగా ఉంచాలి. తన కుడి చేతిని కుడి తొడ అంచున, మోకాలికి దగ్గరగా ఉంచి, అందులో చిటికెన వేలును మరియు పక్కన ఉన్న వేలును మూసి ఉంచాలి, మరియు చూపుడు వేలు పైకి లేపి, దుఆ చేసేటప్పుడు దానిని కదపాలి. బొటనవేలు చివరిని మధ్యవేలి చివరతో కలిపి ఒక వలయం (రింగు) లాగా చేయాలి. తన ఎడమ చేతిని వేళ్ళు నిటారుగా చాచి, ఎడమ తొడ అంచున, మోకాలికి దగ్గరగా ఉంచాలి.
19 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయాలి. రబ్బిగ్ఫిర్లీ, వర్హమ్నీ, వహ్దినీ, వర్జుఖ్నీ, వజ్బుర్నీ, వఆఫినీ [44]. "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు మార్గదర్శకత్వం చేయి, నాకు జీవనోపాధిని ప్రసాదించు, నా లోపాలను సరిచేయి, మరియు నాకు క్షేమాన్ని ప్రసాదించు." [44] దీనిని ముస్లిం హదీసు నెంబరు (2697), మరియు అబూదావుద్ హదీసు నెంబరు (850) లో ఉల్లేఖించారు.
20 - అల్లాహు అక్బర్ అని పలుకుతూ, మొదటి సజ్దాలో చేసినట్లుగానే అల్లాహు పట్ల వినమ్రతతో రెండవ సజ్దా చేయాలి.
21 - ఆపై రెండవ సజ్దా నుండి "అల్లాహు అక్బర్" అని చెబుతూ లేవాలి. ఆ తర్వాత మొదటి రకాత్లో చేసిన విధంగానే రెండవ రకాత్ను కూడా చేయాలి, అంటే చెప్పే దుఆలు మరియు చేసే క్రియలు అన్నీ మొదటి రకాత్లో ఉన్నట్లే ఉంటాయి. అయితే, రెండవ రకాత్లో ఇస్తిఫ్తా దుఆ (ప్రారంభ దుఆ) చదవకూడదు.
22 - రెండవ రకాత్ ముగిసిన తర్వాత "అల్లాహు అక్బర్" అని చెబుతూ కూర్చోవాలి. రెండు సజ్దాల మధ్య ఎలా కూర్చుంటాడో సరిగ్గా అదే విధంగా కూర్చోవాలి.
23 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను: «అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అఊధు బిల్లాహి మిన్ అథాబి జహన్నమ్, వ మిన్ అథాబి అల్-ఖబ్ర్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ ఫిత్నతిల్ మసీహ్ అల్-దజ్జాల్.»
24- ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను.
25 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
26 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల నమాజు చేస్తున్నట్లయితే, మొదటి తషహుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.
27 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, లేచి నిలబడ వలెను.
28 - తర్వాత, అతను తన నమాజ్లో మిగిలిన రకాత్లను రెండవ రకాత్ చేసిన విధంగానే పూర్తి చేయాలి, అయితే ఈ రకాత్లలో ఫాతిహా సూరాను మాత్రమే పఠించాలి (అదనపు సూరాలు చదవనవసరం లేదు).
29 - తర్వాత, అతను తవర్రుక్ భంగిమలో కూర్చోవాలి, అంటే తన కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, తన ఎడమ పాదాన్ని కుడి మోకాలి కింద నుండి బయటకు తీసి, తన పిరుదులను నేలపై స్థిరంగా ఉంచాలి. తన చేతులను, మొదటి తషహుద్లో ఉంచిన విధంగానే, తన తొడలపై ఉంచాలి.
30- ఈ కూర్చున్న స్థితిలో పూర్తి తషహుద్ పఠించాలి.
31 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
* నమాజ్లో మక్రూహ్ (అవాంఛనీయ) విషయాలు:
1- నమాజ్లో తల లేదా చూపును పక్కకు తిప్పడం మక్రూహ్. అయితే, చూపును ఆకాశం వైపు పైకి లేపడం హరామ్ (నిషిద్ధం).
2- నమాజులో అనవసరమైన కదలికలు మరియు ఆడుకోవడం అవాంఛనీయం.
3- నమాజ్లో పరధ్యానాన్ని కలిగించే వస్తువులను, అనగా బరువైన వస్తువులను లేదా దృష్టిని ఆకర్షించే రంగురంగుల వస్తువులను వెంట తెచ్చుకోవడం అవాంఛనీయం.
4- నమాజులో (తఖస్సుర్) అంటే చేతిని నడుముపై ఉంచడం అవాంఛనీయం.
* నమాజు భంగపరిచే విషయాలు:
1- ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం వలన నమాజ్ భంగం అవుతుంది, అది కొద్దిగా మాట్లాడినా సరే.
2- పూర్తి శరీరం ఖిబ్లా వైపు నుండి తిప్పడం వలన నమాజు భంగం అవుతుంది.
3- మలద్వారం నుండి వాయువు బయటకు రావడం వలన, మరియు వుజూ లేదా గుసుల్ అవసరమయ్యే అన్ని విషయాల వలన నమాజు భంగం అవుతుంది.
4 - అవసరం లేకుండా ఎక్కువ మరియు నిరంతర కదలికలు నమాజ్ను భంగం చేస్తాయి.
5- నవ్వటం వలన నమాజు భంగమవుతుంది, అది కొద్దిగా నవ్వినా సరే.
6- రుకూ, సజ్దా, ఖియామ్ (నిలబడటం) లేదా ఖుఊద్ (కూర్చోవడం) వంటి వాటిని ఉద్దేశపూర్వకంగా నమాజ్లో ఎక్కువ చేసినట్లయితే, నమాజ్ భంగం అవుతుంది.
7 - ఇమామ్ కంటే ముందు ఉద్దేశపూర్వకంగా వెళ్ళడం వలన నమాజ్ భంగమవుతుంది.
8- నమాజ్ను రద్దు చేసే విషయాలలో మరొకటి: శరీరాన్ని చూపే (పారదర్శకమైన) వస్త్రాలతో నమాజ్ చేయడం. (తరువాతి ప్రశ్న సమాధానంలో ఇది స్పష్టంగా వివరించబడింది).
ఫజీలతుష్షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్, దయచేసి ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలరా:
చాలా మంది ప్రజలు పలుచని వస్త్రాలతో నమాజ్ చేస్తున్నారు, అవి వారి చర్మాన్ని చూపిస్తాయి. ఈ వస్త్రాల క్రింద వారు తొడల మధ్య భాగం దాటని చిన్న నిక్కర్లను ధరిస్తారు. ఫలితంగా, దుస్తుల వెనుక నుండి తొడల మధ్య భాగం కనిపిస్తుంది. ఇలాంటి వారి నమాజ్ యొక్క ఆదేశం (హుక్మ్) ఏమిటి?
వ అలైకుముస్సలాము వ రహ్మతుల్లాహి వబరకాతుహు.
పలుచని వస్త్రాలతో, కేవలం చిన్న నిక్కర్లతో నమాజ్ చేసే వారి ఆదేశం (హుక్మ్) గురించి అడిగారు. చర్మాన్ని చూపే పారదర్శక వస్త్రాలు శరీర భాగాలను కప్పినట్లుగా పరిగణించబడవు, అవి ఉన్నా లేనట్లే. దీని ఆధారంగా, అత్యంత ప్రామాణికమైన పండితుల అభిప్రాయం ప్రకారం వారి నమాజ్ చెల్లదు. ఇమామ్ అహ్మద్ (అల్లాహ్ ఆయనపై కరుణ చూపుగాక) మరియు ఇదే ప్రసిద్ధి చెందిన అభిప్రాయం. నమాజ్ చేసే పురుషులు బొడ్డు నుండి మోకాలి కింది భాగం వరకు కప్పుకోవడం తప్పనిసరి, అల్లాహ్ ఆదేశాన్ని పాటించడానికి ఇది కనీస అవసరం. {ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి...} [అల్ ఆరాఫ్: 31] [45] ఇది అల్-ఇన్సాఫ్ మఅ అల్-ముక్ని వ అష్-షర్హ్ అల్-కబీర్ (3/200) లో, అలాగే ముంతహా అల్-ఇరాదాత్ మఅ షర్హ్ అల్-బహూతి (1/298) లో పేర్కొనబడింది.
వారిపై విధిగా ఉన్నవి రెండు విషయాలు: బొడ్డు నుండి మోకాళ్ల వరకు కప్పే ప్యాంటు (సరావీల్) ధరించాలి. లేదా, ఈ పొట్టి ప్యాంట్ల (నిక్కర్ల) పైన, చర్మాన్ని చూపించని దట్టమైన వస్త్రాన్ని ధరించాలి.
ఈ ప్రశ్నలో పేర్కొన్న చర్య తప్పు మరియు ప్రమాదకరమైనది. అలాంటి వారు అల్లాహ్ తఆలాతో పశ్చాత్తాపపడి, తమ నమాజ్లో కప్పబడవలసిన భాగాలను పూర్తిగా కప్పుకోవడం పట్ల శ్రద్ధ వహించాలి..
అల్లాహ్ తఆలా మాకు మరియు మా ముస్లిం సోదరులకు ఆయనకు నచ్చిన మరియు ఆయనను సంతోషపరిచే మార్గాన్ని, విజయాన్ని ప్రసాదించుగాక! నిశ్చయంగా, ఆయన అత్యంత దయామయుడు, ఉదారవంతుడు.
దీనిని రచించినది
ముహమ్మద్ అస్సాలిహ్ అల్ ఉసైమీన్
హిజ్రీ 1408 రమజాన్ 5 వ తేదీలో.
ఫర్జ్ నమాజు నుండి సలాం పలికిన తరువాత చేయు అజ్కార్(స్మరణలు)
ఇలా పఠించాలి:
"అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్." నేను అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటున్నాను, నేను అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటున్నాను, నేను అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటున్నాను. "అల్లాహుమ్మ అంతస్సలాము, వ మినకస్సలాము, తబారక్త యా జల్-జలాలి వల్-ఇక్రామ్." ఓ అల్లాహ్ నీవు శాంతి ప్రధాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా సకల శుభాలు కలవాడవు నీవే [46]. [46] దీనిని ముస్లిం హదీసు నెంబరు (591), అబూదావూద్ హదీసు నెంబరు (1512) లో ఉల్లేఖించారు.
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వలా న'ఆబుదు ఇల్లాహ్ ఇయ్యాహు, లహున్నేమతు వలహుల్ ఫద్'ల్, వ లహుస్సనాఉల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన వ లౌ కరిహల్ కాఫిరూన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేది లేదు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే) [47]. [47] ముస్లిం హదీసు నెంబరు (594),నసాయీ హదీసు నెంబరు (1340)లో ఉల్లేఖించారు.
అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. ఓ అల్లాహ్! నీవు ఎవరికైనా ప్రసాదిస్తే దానిని నివారించేవారు ఎవరూ లేరు, నీవు ఎవరికైనా ఇవ్వకుంటే వారికి ప్రసాదించే వారు ఎవరూ లేరు, ఏ గొప్పవాని గొప్పతనం నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్ని చేకూర్చదు [48]. [48]దీనిని బుఖారీ హదీసు నెంబరు 6862,ముస్లిం హదీసు నెంబరు 593 లో ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ విషయములో వచ్చిన తస్బీహ్, తహ్మీద్ మరియు తక్బీర్ ను పాటించుటకు శ్రద్ధ వహించాలి. ఇవి అనేక విధాలుగా నిరూపితమై ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఒక విధంగా, మరికొన్నిసార్లు మరో విధంగా పఠించడం ఉత్తమం.
మొదట: సుబహానుల్లాహ్ అని ముప్పై మూడు సార్లు, అల్హమ్దు లిల్లాహ్ అని ముప్పై మూడు సార్లు, అల్లాహు అక్బర్ అని ముప్పై మూడు సార్లు, చెప్పి, చివరగా ఇలా పఠించాలి: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలన్నీ ఆయనకే చెందుతాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు [49]. [49] దీనిని ముస్లిం కితాబుల్ మసాజిద్ లో ఉల్లేఖించారు, బాబు ఇస్తిహ్బాబుజ్జిక్ర్ బఅదస్సలాత్ హదీసు సంఖ్య (597), అబూహురైరా ఉల్లేఖనం.
రెండవది: సుబహానల్లాహ్ ముప్పై మూడు సార్లు, అల్హమ్దు లిల్లాహ్ ముప్పై మూడు సార్లు, అల్లాహు అక్బర్ ముప్పై నాలుగు సార్లు [50]. [50] దీనిని ముస్లిం కితాబుల్ మసాజీద్ లో ఉల్లేఖించారు, బాబు ఇస్తిహ్బాబ్ అల్ జిక్ర్ బాద సలాహ్, హదీసు సంఖ్య (596), కాబ్ బిన్ ఉజ్రా రదియల్లాహు అన్హు యొక్క హదీసు.
మూడవది: సుబహానల్లాహ్ (అల్లాహ్ పరిశుద్ధుడు) అని పది సార్లు, అల్హమ్దు లిల్లాహ్ (సర్వస్తోత్రాలు అల్లాహ్ కే చెందును) అని పది సార్లు, అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు) అని పది సార్లు పలకాలి [51]. [51] దీనిని బుఖారీ “కితాబుద్ దువాత్”లో, నమాజు తరువాత దుఆ పఠించుట అనే అధ్యాయంలో, హదీసు నెంబరు 6329లో అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క హదీసు ద్వారా ఉల్లేఖించారు. అలాగే దీనిని అబూదావూద్ “కితాబుల్ అదబ్”లో, నిద్రకు ముందు సుబ్హానల్లాహ్ పఠించుట అనే అధ్యాయంలో, హదీసు నెంబరు 5065లో, మరియు తిర్మిజీ “కితాబుద్ దువాత్”లో, నిద్రకు ముందు సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హందులిల్లాహ్ పఠించుట అనే అధ్యాయంలో, హదీసు నెంబరు 3410లో, మరియు నసాయీ “కితాబుస్సహ్వ్”లో, నమాజు ముగిసిన తరువాత సుబ్హానల్లాహ్ పఠించుట అనే అధ్యాయంలో, హదీసు నెంబరు 1349లో, మరియు అహ్మద్ 2/160లో అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు ద్వారా ఉల్లేఖించారు.
నాలుగవది: "సుబ్హానల్లాహ్, వల్హమ్దులిల్లాహ్, వలాఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్" అని ఇరవై ఐదు సార్లు పలకడం.[52]. [52] దీనిని తిర్మిజీ “కితాబుద్ దావాత్”లో నిద్రకు ముందు సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హందులిల్లాహ్ గురించి వచ్చిన హదీసుల బాబ్ లో హదీసు నెంబరు 3413లో ఉల్లేఖించారు, మరియు నసాయీ “కితాబుస్సహ్వ్”లో సుబ్హానల్లాహ్ సంఖ్య గురించి మరో రకమైన బాబ్ లో హదీసు నెంబరు 1351లో, మరియు అహ్మద్ 5/184లో జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు యొక్క హదీసు. అలాగే దీనిని నసాయీ “కితాబుస్సహ్వ్”లో సుబ్హానల్లాహ్ సంఖ్య గురించి మరో రకమైన బాబ్ లో హదీసు నెంబరు 1352లో ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు.
ఇంకా ఆయతుల్ కుర్సీ కూడా పఠించాలి, అలాగే "ఖుల్ హువల్లాహు అహద్" (ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.) 1 [అల్ ఇఖ్లాస్: 1] మరియు "ఖుల్ అఊజు బి రబ్బిల్ ఫలఖ్" (ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను) 1 [అల్ ఫలఖ్: 1] మరియు "ఖుల్ అఊజు బి రబ్బిన్ నాస్" (ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!)1 [అన్నాస్: 1]
సహూ సజ్దా ఆదేశాలు
సహూ సజ్దా కు మూడు కారణాలు ఉన్నాయి – అవి: ఏదైనా ఎక్కువ చేయడం, ఏదైనా తక్కువ చేయడం, లేదా సందేహం
ఎక్కువ చేయడం:
ఉదాహరణకు: ఒక వ్యక్తి తన నమాజులో అదనంగా రుకూ చేయడం, అంటే ఒక రకాతులో రెండు రుకూ చేయడం, లేదా సజ్దా చేయడం అంటే మూడు సజ్దాలు చేయడం, లేదా నిలబడడం అంటే నాలుగు రకాతుల నమాజులో ఐదవ రకాతుకు నిలబడడం. తర్వాత గుర్తుకు వస్తే, అతను వెంటనే వెనక్కి తిరిగి సరిదిద్దుకోవాలి.
కాబట్టి ఈ కారణంగా సహూ సజ్దాలు సలాం తరువాత చేయాలి. మీరు తషహుద్ చదివి, సలాం చేసి, ఆ తర్వాత రెండు సజ్దాలు చేసి, మళ్ళీ సలాం చేయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఐదు రకాతులు నమాజ్ చేసి, సలాం చేసిన తర్వాత ప్రజలు గుర్తు చేసినప్పుడు, ఆయన సలాం చేసిన తర్వాత సజ్దా చేశారు. [53] [53] దీన్ని బుఖారీ కితాబుస్సలాత్ లో ఉల్లేఖించారు, బాబు మాజా ఫిల్ ఖిబ్లహ్ హదీసు సంఖ్య (404). మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో ఉల్లేఖించారు, బాబు సాహు ఫిస్ సలాత్ వ సుజూద్ లహు హదీసు సంఖ్య (572) ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు యొక్క హదీసు.
మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ సలాం తరువాత సజ్దా చేశారు అని చెప్పబడదు, ఎందుకంటే ఆయనకు సలాం తరువాత మాత్రమే తెలిసింది, ఇది నిజమే, కానీ మేము ఇలా అంటాము: ఒకవేళ తీర్పు (హుక్మ్) ఆయన చేసిన దానికి భిన్నంగా ఉండి ఉంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి ఇలా చెప్పేవారు: "మీరు సలాం చేయడానికి ముందు అదనంగా ఏదైనా చేసినట్లు తెలిస్తే, సలాం చేయడానికి ముందే సజ్దా చేయండి.". కాబట్టి ఆయన ఉన్నదాన్ని అంగీకరించినందున, నమాజ్లో అదనంగా ఏదైనా చేసినప్పుడు సజ్దా సహూ సలాం చేసిన తర్వాత ఉంటుందని అర్థం అవుతుంది.
దీనికి రుజువుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం జుహర్ లేదా అసర్ నమాజ్ లో రెండు రకాతుల తర్వాత సలాం చేసినప్పుడు, ప్రజలు ఆయనకు గుర్తు చేశారు. అప్పుడు ఆయన తన నమాజ్ను పూర్తి చేసి, సలాం చేసి, ఆపై రెండు సజ్దాలు చేసి, మళ్లీ సలాం చేశారు [54]. నమాజ్ మధ్యలో సలాం చేయడం ఒక అదనపు క్రియ, కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం దానికి బదులుగా సలాం చేసిన తర్వాత సజ్దా చేశారు. [54] దీనిని బుఖారీ తన "కితాబుస్-సలాత్" (నమాజ్ గ్రంథం) లోని "బాబ్ తష్బీక్ అల్-అసాబిఅ్ ఫిల్ మస్జిద్" అనే అధ్యాయంలో, హదీస్ నంబర్ (482) గా నమోదు చేశారు. అలాగే ముస్లిం తన "కితాబు అల్-మసాజిద్" లోని "బాబ్ అస్-సహ్వ్ ఫీ అస్-సలాత్ వ అస్-సుజూద్ లహు" అనే అధ్యాయంలో, హదీస్ నంబర్ (573) గా అబూ హురైరా (అల్లాహ్ ఆయనను సంతోషపరచుగాక) గారి నుండి నమోదు చేశారు. అదేవిధంగా, ముస్లిం మునుపటి ప్రదేశంలో, హదీస్ నంబర్ (574) గా ఇమ్రాన్ బిన్ హుసైన్ (అల్లాహ్ వారిని సంతోషపరచుగాక) గారి నుండి నమోదు చేశారు, అయితే ఆయన "మూడు రకాతుల తర్వాత సలాం చేశారు" అని పేర్కొన్నారు.
ఇది ఆచార ప్రకారం అవసరమైన విధంగా ఉన్నట్లే, ఆలోచన ప్రకారం కూడా అవసరమైన విధంగా ఉంది. ఒకవేళ నమాజులో అదనంగా చేసుకుంటే, మరియు సలాం చేయడానికి ముందు సహూ సజ్దాలు చేయాలని చెప్పినట్లయితే, నమాజులో రెండురెండు అదనపు అంశాలు అవుతాయి. ఒకవేళ సలాం తరువాత సహూ సజ్దాలు చేయాలని చెప్పినట్లయితే, నమాజులో ఒకే ఒక అదనపు అంశం ఉంటుంది, అది పొరపాటున జరిగింది.
తక్కువ చేయడం:
ఇది సలాం చెప్పడానికి ముందు చేసే సజ్దా దీనికి ఉదాహరణ: మొదటి తషహుద్లో కూర్చోవడం మరచిపోయినా, లేదా సజ్దాలో 'సుబ్హాన రబ్బియల్ అలా' చెప్పడం మరచిపోయినా, లేదా రుకూలో 'సుబ్హాన రబ్బియల్ అజీమ్' చెప్పడం మరచిపోయినా, అప్పుడు సలాం చెప్పడానికి ముందే సజ్దా చేయాలి. ఎందుకంటే, ఈ విధిని వదిలివేయడం వలన నమాజ్ అసంపూర్ణంగా మారింది. కాబట్టి, నామాజును విడిచిపెట్టే ముందు లోపాన్ని సరిదిద్దడానికి, సలాం చెప్పడానికి ముందే సజ్దా సహూ చేయాలి.
దీనికి రుజువుగా అబ్దుల్లాహ్ ఇబ్నె బుహైనహ్ గారి హదీసు ఇలా ఉంది: ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు జోహర్ నమాజ్ చేయిస్తున్నారు. రెండు రకాతుల తర్వాత కూర్చోకుండానే నిలబడ్డారు. నమాజ్ చివరికొచ్చిన తర్వాత, ప్రజలు ఆయన సలాం కోసం ఎదురుచూస్తుండగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న స్థితిలోనే తక్బీర్ చెప్పి, రెండు సజ్దాలు (సజ్దా సహు) చేసి, ఆ తర్వాత సలాం తో ముగించారు.[55] [55] దీనిని బుఖారీ కితాబుల్ ఆజాన్ లో అధ్యాయం మన్ లమ్ యర తషహుదల్ అవ్వల్ వాజిబన్ హదీసు సంఖ్య (829) లో ఉల్లేఖించారు. మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో అధ్యాయం సహు ఫిస్ సలాత్ వ సుజూద్ లహు హదీసు సంఖ్య (570) లో ఉల్లేఖించారు.
ఎక్కువ అయ్యిందా లేదా తక్కువ అయ్యిందా అనే దానిపై సందేహం:
ఒకవేళ ఎవరైనా నమాజ్లో నాలుగు రకాతులు చేశానా లేక మూడు రకాతులే చేశానా అని సందేహిస్తే, అప్పుడు రెండు పరిస్థితులు ఉంటాయి:
మొదటి పరిస్థితి: ఒకవేళ మీరు నమాజ్లో రకాతుల సంఖ్య గురించి సందేహిస్తున్నప్పుడు, మీకు ఎక్కువయ్యాయో లేదా తక్కువయ్యాయో అనే దానిపై ఒక బలమైన నమ్మకం ఏర్పడితే, అప్పుడు మీరు మీ బలమైన నమ్మకం ప్రకారమే వ్యవహరించాలి. ఈ సందర్భంలో, మీరు సలాం చెప్పిన తర్వాత సహూ సజ్దా చేయాలి. ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు హదీసులో ఇలా ఉంది: «మీలో ఎవరికైనా నమాజులో సందేహం కలిగి ఉంటే, సరైనదాన్ని ఎంచుకోవాలి ఆపై దానిని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పి, రెండు సజ్దాలు చేయాలి.» ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాగే చెప్పారు, లేదా ఇదే అర్థంలో చెప్పారు.[56]. [56] దీన్ని బుఖారీ కితాబుస్ సలాత్ లో ఉల్లేఖించారు, బాబు తవజ్జుహ్ ఇలల్ ఖిబ్లా హైసు కాన, హదీసు సంఖ్య (401), మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో ఉల్లేఖించారు, బాబు సహు ఫీ సలాత్ వ సుజూద్ లహు, హదీసు సంఖ్య (572) ఇబ్నె మసూద్ రజియల్లాహు అన్హు యొక్క హదీసు.
రెండవ పరిస్థితి: ఒకవేళ మీరు నమాజ్లో రకాతుల సంఖ్య గురించి సందేహిస్తున్నప్పుడు, ఎక్కువయ్యాయో లేదా తక్కువయ్యాయో అనే దానిపై మీకు ఏ వైపునా స్పష్టమైన లేదా బలమైన నమ్మకం లేకపోతే, అప్పుడు మీరు ఖచ్చితమైనది అంటే తక్కువ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ తర్వాత, దానిపై ఆధారపడి నమాజ్ను పూర్తి చేయాలి. అనంతరం, మీరు సలాం చెప్పడానికి ముందే రెండు సజ్దాలు చేయాలి. ఇదే నబి సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులో పేర్కొనబడింది. [57] దీనిని ముస్లిం మసాజిద్ పుస్తకంలో, నమాజులో సహూ సజ్దా గురించి అధ్యాయంలో, హదీసు నెంబరు (571) అబూ సయీద్ రదియల్లాహు అన్హు యొక్క హదీసు నుండి ఉల్లేఖించారు.
* సహూ సజ్దా యొక్క ఆదేశాలలో కొన్ని:
1- ఒక వ్యక్తి తన నమాజు పూర్తిగా ముగియకముందే ఉద్దేశపూర్వకంగా సలాం చెప్పినట్లయితే, అతని నమాజు భంగము అవుతుంది.
2- ఒక వ్యక్తి తన నమాజులో కావాలని నిల్చోవడం, కూర్చోవడం, రుకూ చేయడం లేదా సజ్దా చేయడం ఎక్కువ చేస్తే, అతని నమాజు భంగం అవుతుంది.
3- ఒక వ్యక్తి నమాజులోని ఒక మూల స్తంభాన్ని వదిలిపెడితే, అది తక్బీరే తహ్రీమా అయితే; అతనికి నమాజు లేదు, అది ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టినా లేదా మర్చిపోయి విడిచిపెట్టినా అతని నమాజ్ చెల్లదు. ఎందుకంటే; ఎందుకంటే అతని నమాజు ప్రారంభించబడలేదు. కానీ వదిలిన మూల స్తంభం తక్బీరే తహ్రీమా కాకుండా వేరేది అయ్యుండి, దానిని ఉద్దేశపూర్వకంగా విడిచిపెడితే; అతని నమాజు భంగం అవుతుంది.
4- నమాజ్లోని విధులలో (వాజిబాత్) ఒక దానిని ఉద్దేశపూర్వకంగా విడిచిపెడితే, అతని నమాజు భంగం అవుతుంది.
5- సలాం తరువాత సహూ సజ్దా చేస్తే; దాని తరువాత మరల తప్పనిసరిగా సలాం తిరగాలి.
* సహూ సజ్దా యొక్క ఆదేశాల సారాంశం:
విషయం/ 1- నమాజు పూర్తయ్యే ముందు సలాం చెప్పడం.
ఒకవేళ నమాజ్ పూర్తి కాకముందే పొరపాటున సలాం చెబితే
ఎక్కువ సమయం గడిచిన తర్వాత గుర్తు వచ్చినప్పుడు, నమాజును తిరిగి ప్రారంభించాలి.
ఒకవేళ కొద్ది సమయం తరువాత - ఐదు నిమిషాల వంటి - గుర్తు వస్తే, అతను తన నమాజును పూర్తి చేసి, సలాం చేయాలి.
సజ్దా చేసే స్థలము/ సహూ సజ్దా (రెండు సజ్దాలు) సలాం చెప్పిన తర్వాత చేయాలి, ఆపై మళ్ళీ ఒకసారి సలాం చెప్పాలి.
****
విషయం/2 - నమాజులో అదనంగా ఏదన్నా చేర్చటం
నమాజ్ చేస్తున్నప్పుడు ఒకరు నిలబడటం, కూర్చోవడం, రుకూ చేయడం, లేదా సజ్దా చేయడం వంటివి అదనంగా చేస్తే,
ఒకవేళ నమాజ్లో అదనంగా ఏదైనా చేసిన తర్వాత ఆ పొరపాటును గుర్తుచేసుకుంటే, అతనికి సజ్దా సహూ చేయడం తప్ప వేరే ఏమీ చేయవలసిన అవసరం లేదు.
ఒకవేళ నమాజ్లో అదనపు చర్య చేస్తున్న మధ్యలో తన పొరపాటును గుర్తుచేసుకుంటే, అతను వెంటనే ఆ అదనపు చర్య నుండి వెనక్కి తగ్గాలి
సహూ సజ్దా చేసే స్థలం/ సలాం తరువాత సహూ సజ్దా చేసి, రెండవసారి సలాం చెయ్యాలి.
****
విషయం/3 - మూల స్తంభాలను (అర్కాన్) విడిచిపెట్టడం నమాజ్లోని అర్కాన్లలో తక్బీర్ తహ్రీమా కాకుండా వేరే దానిని మరచిపోయి విడిచిపెడితే:
అతను తరువాతి రకాత్ లోని స్థలానికి చేరుకున్నప్పుడు, అతను వదిలిన రకాత్ రద్దు అవుతుంది, మరియు తరువాతి రకాత్ దాని స్థానంలో నిలుస్తుంది.
ఒకవేళ లోపించిన రకాత్ తర్వాత దాని తర్వాతి రకాత్ యొక్క స్థానానికి చేరుకోకముందే గుర్తుకొస్తే, అతను తప్పనిసరిగా లోపించిన మూల స్తంభం ఉన్న స్థానానికి తిరిగి వెళ్ళాలి. ఆపై, దానిని మరియు దాని తర్వాత చేయవలసిన వాటిని పూర్తి చేయాలి. రెండు సందర్భాలలోనూ అతను తప్పనిసరిగా సజ్దా సహూ చేయాలి. మరియు దాని స్థానం: సలాం చెప్పిన తర్వాత.
****
విషయం / 4 - నమాజులో సందేహం కలిగిన సందర్భంలో
నమాజ్లో రకాతుల సంఖ్య గురించి సందేహం వచ్చినప్పుడు – అంటే, రెండు రకాతులు చేశారా లేదా మూడు రకాతులే చేశారా అని సందేహిస్తే – రెండు పరిస్థితులలో ఒకటి ఉంటుంది:
మొదటి పరిస్థితి: రెండు విషయాలలో ఏదో ఒకటి అతనికి స్పష్టంగా ఉంటే, అతను ఆ స్పష్టమైనదానిని అనుసరించి తన నమాజును పూర్తిచేసి, ఆపై సలాం చేయాలి.
రెండవ పరిస్థితి: రెండు విషయాలలో ఏదీ వాస్తవమైనదో ఖచ్చితంగా తెలియకపోతే; అతను నిశ్చయంగా నమ్మిన విషయాన్ని పాటించాలి, ఇది తక్కువ సంఖ్యయే అవుతుంది, ఆపై దానిని పూర్తిచేయాలి.
సహూ సజ్దా స్థానం/ మొదటి సందర్భంలో సలాం తరువాత సహూ సజ్దా చేయవలెను.
సలాం చేయకముందు రెండవ సందర్భంలో సహూ సజ్దా చేయవలెను.
****
విషయం / 5 - తొలితషహ్హుద్ను మర్చిపోయి విడిచిన సందర్భంలో
వాజిబ్ల యొక్క ఆదేశం, మొదటి తషహుద్ యొక్క ఆదేశం వలెనే ఉంటుంది.
ఒకవేళ మీరు మొదటి తషహుద్లో కూర్చోవడం మర్చిపోయి, పూర్తిగా నిలబడిన తర్వాత మీకు ఆ పొరపాటు గుర్తుకొస్తే, అప్పుడు మీరు మీ నమాజ్ను కొనసాగించాలి మరియు తషహుద్ కోసం తిరిగి కూర్చోకూడదు.
ఒకవేళ మీరు మొదటి తషహుద్లో కూర్చోవడం మర్చిపోయి, దాని కోసం నిలబడటం ప్రారంభించిన తర్వాత, కానీ పూర్తిగా నిలబడకముందే మీకు పొరపాటు గుర్తుకొస్తే, అప్పుడు మీరు తిరిగి కూర్చుని, తషహుద్ చదివి, మీ నమాజ్ను పూర్తి చేయాలి.
ఒకవేళ మీరు మొదటి తషహుద్ను మరచిపోయి, మీ తొడలు కాళ్ళపై నుండి పైకి లేవకముందే మీకు గుర్తుకొస్తే, అప్పుడు మీరు కూర్చున్న స్థితిలోనే ఉండి, తషహుద్ చదివి, మీ నమాజ్ను పూర్తి చేయాలి. ఈ సందర్భంలో, సహూ సజ్దా చేయనవసరం లేదు, ఎందుకంటే మీ వల్ల అదనంగా ఏమీ జరగలేదు మరియు లోపం కూడా సంభవించలేదు.
సహూ సజ్దా స్థానం/ సలాం ముందు సహూ సజ్దా చేయాలి.
ఖుర్ఆన్ పఠన సాష్టాంగం
కారణం: ఒక వ్యక్తి ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు సజ్దా ఉన్న ఆయత్ వద్దకు వచ్చినప్పుడు ఈ సజ్దా చేస్తారు. ఖురాన్లో సజ్దా ఆయతులు గుర్తించబడినవి, మరియు ముస్హాఫ్ లలో అంచున గుర్తించబడ్డాయి, కాబట్టి ఒక వ్యక్తి సజ్దా వాక్యం పఠించినప్పుడు; అల్లాహ్ కొరకు సజ్డా చేయడం అతనిపై ఖచ్చితంగా నొక్కి చెప్పబడినది. కొంతమంది పండితులు ఖుర్ఆన్ పఠన సాష్టాంగం తప్పనిసరి అని చెప్పారు. కానీ సరైనది: అది తప్పనిసరి కాదు; ఎందుకంటే అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఒక జుమా రోజు ఖుత్బా ఇస్తూ, సూరహ్ అన్ నహ్ల్లోని సజ్దా ఆయత్ను పఠించి, సాష్టాంగం చేశారు. ఆ తర్వాత, మరో శుక్రవారం అదే ఆయత్ను పఠించారు, కానీ సాష్టాంగం చేయలేదు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ మనపై ఈ ఖుర్ఆన్ పఠన సాష్టాంగం విధిగా చేయలేదు, మనం కోరుకుంటే తప్ప. [58] ఇక్కడ ఇస్తిస్నా మున్ఖతీ ఉంది, అంటే, ఆయన మాటైన 'ఇల్లా అన్ నషా' (మనం కోరుకుంటే తప్ప) యొక్క అర్థం: 'కానీ మనం కోరుకుంటే, సజ్డా చేస్తాము.' 'ఇల్లా అన్ నషా' అంటే 'అది మనపై విధించిన విధి' అని కాదు; ఎందుకంటే విధులు కోరికపై ఆధారపడి ఉండవు. మరియు ఉమర్ రజియల్లాహు అన్హు ఈ పనిని సహాబాల సమక్షంలో చేశారు, మరియు దానిని ఎవరూ ఖండించలేదు. సహాబాలు రజియల్లాహు అన్హుమ్ ఏదైనా తప్పు జరిగితే దానిని ఖండించాలనే ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ, ఈ గొప్ప సమావేశంలో ఖలీఫా రాషిద్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి వెలువడిన ఈ విషయం పట్ల సహాబాల ఆమోదం తిలావత్ సాష్టాంగం విధి కాదని సూచిస్తుంది, మరియు ఇదే సరైన అభిప్రాయం. ఒక వ్యక్తి నమాజ్లో ఉన్నా లేదా నమాజ్లో లేకపోయినా (ఈ నియమం వర్తిస్తుంది)." [58] దీనిని బుఖారీ కితాబు సుజూదిల్ ఖుర్ఆన్ లో ఉల్లేఖించారు, బాబు మన్ రా అన్నల్లాహ్ అజ్జవజల్ల లమ్ యూజిబిస్ సుజూద్, హదీసు సంఖ్య (1077).
ఖుర్ఆన్ పఠన సాష్టాంగం విధానం:
తక్బీర్ పలికి, నమాజు సజ్దా లాగా ఏడు శరీర భాగములపై సజ్దా చేయాలి. 'సుబ్హాన రబ్బియల్ ఆలా', 'సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక, అల్లాహుమ్మ అఘ్ఫిర్లీ' అని పలకాలి. మరియు ఈ ప్రసిద్ధ దుఆ చేయాలి: ఓ అల్లాహ్! నీ కోసమే నేను సజ్జా చేసాను, నిన్నే విశ్వసించాను, నీ మీదే ఆధారపడ్డాను. నా ముఖము దానిని సృష్టించిన అల్లాహ్ కు సజ్జా చేసినది. ఆయనే దానిని తన శక్తి, మహిమ ద్వారా వినే శక్తిని, చూసే శక్తిని ప్రసాదించాడు. ఓ అల్లాహ్! ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నాకు ప్రతిఫలాన్ని వ్రాసిపెట్టు, దీని ద్వారా నా పాపముల భారాన్ని తొలగించు, దాన్ని నా కొరకు పుణ్యాల రాశిగా చేయుము. మరియు నీ దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి స్వీకరించినట్లు నా నుండి కూడా స్వీకరించు [59]. ఆ తర్వాత తక్బీర్ చెప్పకుండా, సలాం చెప్పకుండా నిలబడాలి. [59] దీనిని ముస్లిం హదీసు నెంబరు 771, అబూదావూద్ హదీసు నెంబరు 760 లో ఉల్లేఖించారు.
అయితే, నమాజ్లో సజ్దా చేసేటప్పుడు, సజ్దా చేసేటప్పుడు తక్బీర్ చెప్పాలి మరియు సజ్దా నుండి లేచేటప్పుడు కూడా తక్బీర్ చెప్పాలి. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేసే విధానాన్ని వర్ణించిన వారందరూ, ఆయన ప్రతిసారీ పైకి లేచినప్పుడు మరియు కిందికి వంగినప్పుడు తక్బీర్ చెప్పేవారని పేర్కొన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్లో తిలావత్ సజ్డా చేసేవారు, దీనికి హదీసు నుండి ఆధారం ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజ్లో పఠించారు: ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు! [అల్ ఇన్షిఖాఖ్: 1] ఈ సూరాలో సజ్దా ఆయత్ వచ్చినప్పుడు ఆయన సాష్టాంగం చేశారు.[61]. [60] దీనిని బుఖారీ కితాబుల్ అజాన్ లో ఉల్లేఖించారు, బాబు ఇత్తిమాముత్ తక్బీర్ ఫీ రుకూఅ్ హదీసు సంఖ్య (785), మరియు ముస్లిం కితాబుస్సలాత్ లో, బాబు ఇథ్బాతుత్ తక్బీర్ ఫీ కుల్లి ఖఫ్ద్ వ రఫ్అ్ హదీసు సంఖ్య (392) అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క హదీసు. [61] దీన్ని బుఖారీ కితాబుల్ ఆజాన్ లో అధ్యాయం పఠనం ఫీల్ ఇషా బిస్సజ్దహ్ హదీసు సంఖ్య (768) లో ఉల్లేఖించారు. మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ అధ్యాయం సజ్దతుత్తిలావతి హదీసు సంఖ్య (578) లో ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం నమాజులో తక్బీర్ చెప్పే విధానాన్ని వివరిస్తున్న వారు సజ్దా తిలావత్ విషయంలో మినహాయింపు ఇవ్వరు, ఇది నమాజులో చేసే తిలావత్ సాష్టాంగం, నమాజులోని సాధారణ సాష్టాంగాల వలెనే, సజ్దా చేసేటప్పుడు మరియు సజ్దా నుండి లేచేటప్పుడు తక్బీర్ చెప్పాలని సూచిస్తుంది.
తిలావత్ సాష్టాంగం మీరు పఠించిన ఆఖరి ఆయత్ లో ఉన్నా లేదా మీ పఠనం మధ్యలో ఉన్నా తేడా లేదు. మీరు సజ్దా చేసేటప్పుడు తక్బీర్ చెప్పాలి మరియు సాష్టాంగం నుండి పైకి లేచేటప్పుడు కూడా తక్బీర్ చెప్పాలి. ఆ తర్వాత, మీరు రుకూ' చేయడానికి వెళ్లేటప్పుడు కూడా రుకూ' కోసం తక్బీర్ చెప్పాలి. రెండు తక్బీర్లు (సజ్దా నుండి లేచిన తర్వాత ఒకటి, రుకూ'కు వెళ్లేటప్పుడు మరొకటి) ఒకదాని వెంట ఒకటి వచ్చినా అది ఎటువంటి నష్టం కలిగించదు, ఎందుకంటే వాటికి గల కారణాలు వేరు వేరు.
కొంతమంది వ్యక్తులు నమాజులో సజ్దా ఆయతు చదివినప్పుడు సజ్దా చేస్తారు, సజ్దా కోసం తక్బీర్ చెబుతారు కానీ లేచేటప్పుడు తక్బీర్ చెప్పరు, దీని గురించి నాకు ఎలాంటి ఆధారం తెలియదు. సజ్దా తిలావత్ నుండి లేచేటప్పుడు తక్బీర్ చెప్పడం పై ఉన్న విభేదం కేవలం నమాజు వెలుపల చేసే సజ్దా కోసం మాత్రమే ఉంది. కానీ నమాజులో సజ్దా చేస్తే అది నమాజులోని సజ్దా యొక్క హుక్మ్ పొందుతుంది, అంటే సజ్దా చేసినప్పుడు తక్బీర్ చెప్పాలి, సజ్దా నుండి లేచినప్పుడు కూడా తక్బీర్ చెప్పాలి.
ప్రయాణికుడి నమాజు, మరియు ఉపవాసం
ప్రయాణికుడి నమాజు రెండు రకాతులు, తన ఊరిని విడిచి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చేవరకు; ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం: మొదటగా నమాజు విధించబడినప్పుడు, అది రెండు రకాతులుగా విధించబడింది. ప్రయాణం లో నమాజు రెండు రకాతులుగా కొనసాగించబడింది, మరియు నివాసంలో నమాజు పూర్తిగా (నాలుగు రకాతులుగా) ఆచరించబడింది. మరొక హదీసులో ఇలా ఉంది: "మరియు నివాసంలో చేసే నమాజ్కు రకాతులు పెంచబడ్డాయి." [63]. [62] దీన్ని బుఖారీ కితాబుత్ తక్సీర్ , బాబు యక్సుర్ ఇజా ఖరజ మిన్ మౌదిహి, హదీసు సంఖ్య (1090). మరియు ముస్లిం కితాబ్ సలాత్ ముసాఫిరీన్ వ ఖస్రుహా, హదీసు సంఖ్య (685/3) లో ఉల్లేఖించారు. [63] దీనిని బుఖారీ కితాబుస్సలాత్ లో ఉల్లేఖించారు, బాబు కైఫ ఫురిదత్ సలాత్ ఫీ ఇస్రా? హదీసు సంఖ్య (350), మరియు ముస్లిం కితాబుస్సలాత్ ముసాఫిరీన్ వ ఖస్రుహా, హదీసు సంఖ్య (685/1) లో ఉల్లేఖించారు.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. అప్పుడు ఆయన మేము మదీనాకు తిరిగి వచ్చేవరకు రెండు రకాతులు, రెండు రకాతులుగానే నమాజ్ చేశారు."[64] [64] దీన్ని బుఖారీ కితాబుత్ తక్సీర్ లో ఉల్లేఖించారు, బాబు మాజా ఫీ తక్సీర్ హదీసు సంఖ్య (1081), మరియు ముస్లిం కితాబ్ సలాత్ ముసాఫిరీన్ వ ఖస్రుహా హదీసు సంఖ్య (693) లో ఉల్లేఖించారు.
కానీ ఇమామ్ తో కలిసి నమాజు చేస్తే, నాలుగు రకాతులు పూర్తి చేయాలి, మొదటి నుండి నమాజు పొందినా లేదా దాని కొంత మిస్ అయినా; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ ప్రవచనం ప్రకారం: «మీరు ఇఖామత్ వినినప్పుడు నమాజు వైపు నడవండి, మీపై ప్రశాంతత మరియు గంభీరత ఉండాలి, తొందరపడకండి, మీరు ఏ మేరకు చేరుకున్నారో ఆ మేరకు నమాజు చేయండి, మిగతా భాగాన్ని పూర్తి చేసుకోండి»[65] ‘మా అద్రక్తుం ఫసల్లూ, వమా ఫాతకుం ఫఅతిమ్మూ’ అన్న ఉల్లేఖనం ప్రయాణికులకు మరియు ఇమామ్ వెనుక నాలుగు రకాతులు చదివే ఇతరులకు కూడా వర్తిస్తుంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ను ఇలా ప్రశ్నించారు: "ప్రయాణికుడు ఒంటరిగా నమాజ్ చేస్తే రెండు రకాతులు, నివాసంలో ఉన్న ఇమామ్ వెనుక నమాజ్ చేస్తే నాలుగు రకాతులు ఎందుకు చేయాలి?" అప్పుడుఆయన ఇలా సమాధానం ఇచ్చారు: «ఇది సున్నత్ (ప్రవక్త విధానం)»[66]. [65] దీన్ని బుఖారీ కితాబుల్ అజాన్ లో ఉల్లేఖించారు, బాబు లా యస్అ ఫిల సలాత్ హదీసు సంఖ్య (636), మరియు బాబు కవ్లుర్ రజుల్ ఫాతతనస్సలాత్ హదీసు సంఖ్య (635). మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో ఉల్లేఖించారు, బాబు ఇస్తిహ్బాబ్ ఇతియానిస్సలాత్ బివకారిన్ వ సకీనతిన్ హదీసు సంఖ్య (602) (603). హదీసు అబూ హురైరా మరియు అబూ ఖతాదా రదియల్లాహు అన్హుమా నుండి, ఇది అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క హదీసు పదాలు. [66] దీన్ని ఇమామ్ అహ్మద్ ముస్నద్ లో (1/216) ఉల్లేఖించారు.
ప్రయాణికుడికి సామూహిక నమాజ్ మినహాయించబడదు. ఎందుకంటే అల్లాహ్ తఆలా యుద్ధ సమయంలో కూడా దానిని ఆజ్ఞాపించాడు, ఇలా అన్నాడు: {(ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి....} [నిసా:102] ఆయతు.
దీని ప్రకారం, ఒక ప్రయాణికుడు తన సొంత ఊరు కాకుండా వేరే ఊరిలో ఉన్నప్పుడు, అజాన్ పిలుపు విన్నట్లయితే, అతను మస్జిద్లో సామూహిక నమాజుకు హాజరు కావడం తప్పనిసరి అవుతుంది. అయితే, అతను మస్జిద్కు చాలా దూరంలో ఉన్నా లేదా తన సహచరులను కోల్పోయే భయం ఉన్నా మినహాయింపు ఉంటుంది. సామూహిక నమాజుకు అజాన్ లేదా ఇఖామత్ విన్న వారికి అది తప్పనిసరి అని సూచించే సామాన్య ఆధారాలన్నిటినీ బట్టి ఈ నియమం ఏర్పడింది.
ప్రయాణికుడు నఫిల్ నమాజులు ఆచరించవచ్చు; అయితే, జుహర్, మగ్రిబ్ మరియు ఇషా యొక్క అర్రవాతిబ్ సున్నతు నమాజులు మినహాయించబడతాయి. అతను విత్ర్, ఖియాముల్ లైల్ (రాత్రి చేసే తహజ్జుద్ నమాజులు), సలాతు అద్దుహా (సూర్యోదయం తరువాత నుండి మిట్టమధ్యాహ్నం లోపు చేసే సున్నతు నమాజులు), రెండు రకాతుల ఫజరు సున్నతు మరియు ఇతర నఫిల్ నమాజులు, అర్రవాతిబ్ మినహాయించబడినవి, ఆచరించవచ్చు.
నమాజులను కలపడం; ఒకవేళ ప్రయాణికుడు ప్రయాణంలో ఉంటే, అతను జొహర్, అస్ర్ నమాజులను, మరియు మగ్రిబ్, ఇషా నమాజులను కలిపి చదవడం ఉత్తమం. ఇది జమ్' తఖ్దీమ్ (ముందుగానే కలపడం) లేదా జమ్' తఅఖీర్ (ఆలస్యంగా కలపడం) ఏదైనా కావచ్చు, అతనికి ఏది సులభమైతే అది ఎంచుకోవచ్చు. ఏది సులభమైతే, అది ఉత్తమం. ఒకవేళ ప్రయాణికుడు ఒకచోట ఆగి ఉంటే, నమాజులను కలపకపోవడం ఉత్తమం. అయితే, అతను కలిపి చదివినా తప్పు లేదు, ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రెండు పద్ధతులు కూడా సక్రమంగా ఉన్నాయని నిరూపించబడింది.
ప్రయాణికుడు రమజాను మాసంలో ఉపవాసం ఆచరించవచ్చు; అయితే ఉపవాసం ఆచరించడం ఉత్తమం. కానీ ఉపవాసం వదిలివేస్తే తప్పు లేదు. వదిలివేసిన ఉపవాస దినములను పూర్తి చేయాలి. ఉపవాసం వదిలివేయడం సులభంగా ఉంటే, ఉపవాసం వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే అల్లాహ్ తన అనుగ్రహాలను (సడలింపులను) ఉపయోగించుకోవడాన్ని ఇష్టపడతాడు. మరియు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కు స్తుతులు.
దీన్ని రచించినారు: ముహమ్మద్ సాలిహ్ అల్ ఉసైమీన్
5/12/1409 హి
విమానంలో ప్రయాణించే వ్యక్తి నమాజు ఎలా చేయాలి?
1- విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, మీరు మీ సీటులో కూర్చొని నఫిల్ నమాజ్ చేసుకోవచ్చు. ఈ నమాజు విమానం ఏ దిశలో ఉంటే అదే దిశలో చేసుకోవచ్చు. రుకూ' మరియు సజ్దాల కోసం తలవంచడం (ఇషారా) ద్వారా సూచించాలి, సజ్దా కోసం రుకూ' కంటే కొంచెం ఎక్కువగా తలవంచాలి.
2 - విమానంలో ఫర్ద్ నమాజు చేయకూడదు, ఒకవేళ అతను మొత్తం నమాజు సమయంలో ఖిబ్లా వైపుకు తిరగ గలిగితే మరియు రుకూ, సజ్దా, ఖియామ్ మరియు కూర్చుని చేయగలిగితే తప్ప.
3- ఒకవేళ అది సాధ్యం కాకపోతే, అతను దిగేవరకు నమాజు వాయిదా వేయాలి, ఆ తరువాత నేలపై నమాజు చేయాలి. ఒకవేళ దిగే ముందు సమయం దాటిపోతుందనే భయం ఉంటే, అది రెండవ సమయానికి వాయిదా వేయాలి, ఉదాహరణకు, జుహర్ మరియు అసర్, మగ్రిబ్ మరియు ఇషా వంటి వాటిని కలిపి చదవవచ్చు. ఒకవేళ రెండవ సమయం కూడా దాటిపోతుందనే భయం ఉంటే, సమయం దాటకముందే విమానంలోనే రెండు నమాజులు చదవాలి, మరియు నమాజు యొక్క షరతులు, రుక్నులు మరియు వాజిబాత్ ను శక్తిమేరకు చేయాలి.
(ఉదాహరణకు) మీరు ప్రయాణిస్తున్న విమానం సూర్యుడు అస్తమించడానికి కొద్దిసేపు ముందు బయలుదేరింది, ఆపై విమానం గాలిలో ఉండగానే సూర్యుడు అస్తమించాడు (మగ్రిబ్ నమాజ్ సమయం వచ్చింది). ఈ పరిస్థితిలో, మీరు విమానం దిగిన తరువాత నెలపై నమాజ్ చేసే వరకు మగ్రిబ్ నమాజ్ చేయకూడదు. ఒకవేళ విమానం దిగేలోపు మగ్రిబ్ నమాజ్ సమయం దాటిపోతుందని మీకు భయం ఉంటే, మీరు ఆ నమాజ్ను ఇషా నమాజ్ సమయం వరకు ఆలస్యం చేయవచ్చు. విమానం దిగిన తర్వాత, మీరు మగ్రిబ్ మరియు ఇషా నమాజులను జమ్' తఅఖీర్ (అంటే, ఇషా సమయంలో రెండూ కలిపి) చదువుకోవచ్చు. ఒకవేళ ఇషా సమయం పోయే భయం ఉంటే -అది అర్ధరాత్రి సమయం; సమయం ఆయ్యే ముందు విమానంలోనే ఇషా మరియు మగ్రిబ్ నమాజులను చదవాలి.
4- విమానంలో ఫర్ద్ నమాజు ఎలా చేయాలి: నిలబడి, ఖిబ్లా వైపు తిరిగి, తక్బీరె తహ్రిమా పలికి, సూరె ఫాతిహా మరియు దాని ముందు లేదా తరువాత ఖుర్ఆన్ నుండి ఏదైనా పఠించాలి. అనంతరం, రుకూ' చేయాలి, రుకూ' నుండి లేచి నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత సజ్దా చేయాలి, సజ్దా నుండి లేచి ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ తర్వాత రెండవ సజ్దా చేయాలి. మీ నమాజులోని మిగిలిన రకాతులలో కూడా ఇదే విధంగా చేయాలి.
ఒకవేళ అతనికి సజ్దా చేయగలిగే శక్తి లేకపోతే అతను కూర్చుని సజ్దా కొరకు సైగలు చేయాలి, మరియు అతనికి ఖిబ్లా దిశ తెలియకపోతే మరియు విశ్వసనీయంగా చెప్పగలిగే ఎవరూ లేకపోతే, అతను తన శక్తి మేరకు ప్రయత్నించి, తన ప్రయత్నం ద్వారా నిర్ణయించిన దిశలో నమాజు ఆచరించాలి.
5- విమానంలో ప్రయాణించే వ్యక్తికి నమాజ్ కుదించి చదివే వెసులుబాటు ఉంది. కాబట్టి, ఇతర ప్రయాణికుల మాదిరిగానే, నాలుగు రకాతుల నమాజులను రెండు రకాతులుగా చదువుకోవచ్చు.
విమానంలో ప్రయాణించే వారు హజ్ మరియు ఉమ్రా'లో ఇహ్రామ్ లోకి ఎలా ప్రవేశిస్తారు?
1- మీరు మీ ఇంటి వద్ద స్నానం చేయవచ్చు మరియు మీ సాధారణ దుస్తులలోనే ఉండవచ్చు. మీరు కోరుకుంటే, అక్కడే ఇహ్రామ్ వస్త్రాలను ధరించవచ్చు.
2- మీ విమానం మీఖాత్ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అంతకు ముందు ఇహ్రామ్ వస్త్రాలు ధరించకపోతే, అప్పుడు వాటిని ధరించాలి.
3- విమానం మీఖాత్కు సరిగ్గా చేరుకున్నప్పుడు, మీరు హజ్ లేదా ఉమ్రా చేయాలనే నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలి. ఆ తర్వాత, మీరు సంకల్పించిన హజ్ లేదా ఉమ్రా కోసం తల్బియాను పఠించాలి.
4- ఒకవేళ మీరు మీఖాత్ దగ్గరకు చేరుకునే ముందు, అజాగ్రత్తగా ఉండటం లేదా మర్చిపోవడం వంటి వాటి నుండి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తగా ఇహ్రామ్ ధరిస్తే, అది అనుమతించబడుతుంది.
ఈ విషయాలను ముహమ్మద్ సాలిహ్ అల్ ఉసైమీన్ రచించారు.
2/5/1409 హి లో మరియు సర్వస్తోత్రాలు ప్రశంసలు అల్లాహ్ కు మాత్రమే అంకితం ఆయనే సమస్త లోకాలకు ప్రభువు!
వ్యాధి, మరియు వ్యాధిగ్రస్తుడు గమనించవలసిన విషయాలు.
వ్యాధి: ఆరోగ్యం క్షీణించడం మరియు శరీరం దాని సాధారణ, సహజ సమతుల్యతను కోల్పోవడం.
వ్యాధిగ్రస్తుడు గమనించ వలసిన కొన్ని విషయాలు:
1- సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దీనిని నిర్ణయించాడు. ఆయనే సృష్టికర్త మరియు సర్వాధికారి. ఈ విశ్వాసం అతనికి శాంతిని, సంతృప్తిని మరియు విధేయతను ఇస్తుంది.
2) వ్యాధిగ్రస్తుడు తాను అనుభవిస్తున్న కష్టం ముందే వ్రాయబడిందని మరియు వ్రాయబడిన దాన్ని మార్చడం సాధ్యం కాదని దృఢంగా విశ్వసించాలి.
3- వ్యాధిగ్రస్తుడు తన వ్యాధిపై సహనం వహించాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు సహనం వహించండి; నిశ్చయంగా, అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.} [అల్-అన్'ఫాల్: 46]
4 - తన హృదయాన్ని తన ప్రభువుతో అనుసంధానం చేసుకోవాలి, మరియు ఆయన తరపు నుండి ఉపశమనం కోసం నిరీక్షించాలి; హదీస్ ఖుద్సీలో ఇలా చెప్పబడింది: నా దాసుడు నా పట్ల ఎలా ఊహించుకుంటాడో నేనూ అతని పట్ల అలాగే ఉంటాను [67], ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్కు: తెలుసుకోండి, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది, మరియు కఠినం పాటు సులభం కూడా ఉంటుంది. [67] దీనిని బుఖారీ కితాబుత్తౌహీద్ లో ఉల్లేఖించారు, బాబు ఖౌలుల్లాహి తఆలా: వయు హజ్జిరుకుముల్లాహు నఫ్సహ్ హదీసు సంఖ్య (7405), మరియు ముస్లిం కితాబుజ్జిక్ర్ వద్దుఆ లో ఉల్లేఖించారు, బాబు హస్సు అలా జిక్రిల్లాహి తఆలా హదీసు సంఖ్య (2675) అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క హదీసు. [68] దీనిని ఇమామ్ అహ్మద్ తన «ముస్నద్» (1/307) లో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు నుండి ఉల్లేఖించారు.
5 - వ్యాధిగ్రస్తుడు తన ఖాళీ సమయాన్ని అల్లాహ్ను ఎక్కువగా స్మరించుకోవడానికి, ఖుర్ఆన్ పఠించడానికి, పశ్చాత్తాపం మరియు క్షమాపణ వేడుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలి.
6- వ్యాధిగ్రస్తుడు తన వ్యాధి గురించి ఎవరికీ ఫిర్యాదు చేయకూడదు, కేవలం దానిని దూరం చేయగల శక్తిగల తన సృష్టికర్త (అల్లాహ్) కు మాత్రమే ఫిర్యాదు చేయాలి. అయితే, ఫిర్యాదు చేసే ఉద్దేశ్యం లేకుండా, కేవలం సమాచారం ఇచ్చే ఉద్దేశ్యంతో తన వ్యాధి గురించి ఇతరులకు తెలియజేయడంలో తప్పు లేదు.
7-వ్యాధిగ్రస్తుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తనపై అల్లాహ్ ప్రసాదించిన ఆరోగ్యం అనే గొప్ప అనుగ్రహం యొక్క విలువను తెలుసుకోవాలి. దీని ద్వారా అతను తన వ్యాధిగ్రస్తులైన సోదరుల పట్ల కరుణ చూపాలి.
8- వ్యాధి ద్వారా అల్లాహ్ పాపాలను తొలగిస్తాడని మరియు చెడు కర్మలను తుడిచివేస్తాడని వ్యాధిగ్రస్తుడు తెలుసుకోవాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ఏ ముస్లింకు వ్యాధి లేదా మరేదైనా హాని కలిగినా, అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను ప్రక్షాళిస్తాడు, చెట్టు తన ఆకులను రాల్చినట్లుగా."[69]، ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ముస్లింకు ఏ ఆపద సంభవించినా, దాని ద్వారా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు. [70]. అంటే అతని తప్పులు. [69] దీనిని బుఖారీ ఉల్లేఖించారు, కితాబుల్ మరజా, అధ్యాయం 'వజఉల్ యద్ అలల్ మరీజ్', హదీసు నెంబరు 5660, ముస్లిం ఉల్లేఖనం, కితాబుల్ బర్ వ సిలా, అధ్యాయం 'సవాబ్ అల్ ముమిన్ ఫీమా యుసీబుహు', హదీసు నెంబరు 2571, ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు యొక్క హదీసు. [70] దీనిని బుఖారీ ఉల్లేఖించారు 'మరజ్ పుస్తకం,ఆద్యాయం-మరజ్ కఫారా గురించి, హదీసు నెంబరు 5640,ముస్లిం ఉల్లేఖించారు 'బిర్ మరియు సిలా పుస్తకం,ఆద్యాయం-ముమిన్ కు కలిగే ప్రతిఫలం, హదీసు నెంబరు 2572,అయిషా రజియల్లాహు అన్హా హదీసు నుండి.
వ్యాధిగ్రస్తుడు శుద్ధి (తహారత్) ఎలా పొందాలి?
1- వ్యాధిగ్రస్తుడు నీటితో శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. అంటే, చిన్న అశుభ్రత నుండి వుజూ' చేయాలి, మరియు పెద్ద అశుభ్రత నుండి గుసుల్ చేయాలి.
ఒకవేళ అతను నీటితో శుద్ధి చేసుకోలేకపోతే; అతని అసమర్థత వల్ల గానీ, లేదా వ్యాధి మరింత పెరిగే భయం వల్ల గానీ, లేదా కోలుకోవడం ఆలస్యం అవుతుందనే భయం వల్ల గానీ; అప్పుడు అతను తయమ్ముమ్ చేసుకోవాలి.
3 - తయమ్ముమ్ విధానం: తయమ్ముమ్ చేయడానికి, మీరు మీ రెండు చేతులతో శుభ్రమైన నేలపై ఒకసారి కొట్టాలి. ఆ తర్వాత, ఆ చేతులతో మీ మొత్తం ముఖాన్ని తుడవాలి, ఆపై మీ రెండు అరచేతులను ఒకదానికొకటి తుడవాలి.
4- ఒకవేళ వ్యాధిగ్రస్తుడు స్వయంగా శుద్ధి చేసుకోలేకపోతే, మరొక వ్యక్తి అతనికి వుజూ' చేయించవచ్చు లేదా తయమ్ముమ్ చేయించవచ్చు.
5- ఒకవేళ శుద్ధి చేసుకోవాల్సిన అవయవాలలో ఏదైనా గాయం ఉంటే, ముందుగా దానిని నీటితో కడగాలి. అయితే, గాయంపై నీటితో కడగడం హానికరం అనిపిస్తే, దానిపై మసహ్ చేయాలి అంటే, మీ చేతిని నీటితో తడిపి, ఆ గాయంపై తట్టాలి. ఒకవేళ తట్టడం కూడా హానికరం అనిపిస్తే, అప్పుడు ఆ గాయం ఉన్న భాగానికి బదులుగా తయమ్ముమ్ చేసుకోవాలి.
6- మీ శరీరంలో ఏదైనా అవయవం విరిగి, దానిపై గుడ్డతో కట్టు కట్టినా లేదా ప్లాస్టర్ (జిబ్సం) వేసినా, దానిని నీటితో కడగడానికి బదులుగా దానిపై నీటితో తడపాలి. దీనికి తయమ్ముమ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే తడపడం అనేది కడగడానికి కడగడానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
7 - గోడ లేదా ఇతర పరిశుభ్రమైన దుమ్ము ఉన్న వస్తువుపై తయమ్ముమ్ చేయవచ్చు, అయితే గోడకు భూమికి సంబంధం లేని పదార్థంతో (ఉదాహరణకు, పెయింట్) పూత పూసి ఉంటే, దానిపై దుమ్ము ఉన్నప్పుడు తప్ప తయమ్ముమ్ చేయకూడదు.
8- నేలపై లేదా గోడపై లేదా మరేదైనా ధూళి ఉన్న వస్తువుపై తయమ్ముమ్ చేయటం సాధ్యం కానప్పుడు; ఒక పాత్రలో లేదా గుడ్డలో మట్టిని ఉంచి, దానితో తయమ్ముమ్ చేసుకోవటం లో ఎటువంటి అభ్యంతరం లేదు.
9- ఒక నమాజ్ కొరకు తయమ్ముమ్ చేసినప్పుడు, తదుపరి నమాజ్ సమయం వచ్చే వరకు పరిశుద్ధతలో ఉంటే, మొదటి తయమ్ముమ్ తోనే ఆ నమాజ్ చేయవచ్చు, రెండవ నమాజ్ కొరకు తయమ్ముమ్ పునరావృతం చేయవలసిన అవసరం లేదు; ఎందుకంటే అతను పరిశుద్ధతలోనే ఉన్నాడు, దానిని భంగం చేసే ఏదీ లేదు. అదేవిధంగా, ఒకవేళ అతను జనాబత్ (పెద్ద అశుభ్రత) కోసం తయమ్ముమ్ చేసుకుంటే, మళ్ళీ జనాబత్ సంభవించే వరకు దానికి మళ్ళీ తయమ్ముమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మధ్య కాలంలో చిన్న అశుభ్రత సంభవిస్తే, అప్పుడు దాని కోసం తయమ్ముమ్ చేసుకోవాలి.
10- వ్యాధిగ్రస్తుడు తన శరీరాన్ని అశుభ్రతల (నజాసాత్) నుండి శుభ్రపరచుకోవడం తప్పనిసరి. అయితే, ఒకవేళ అతను అలా చేయలేకపోతే, అతను ఉన్న స్థితిలోనే నమాజ్ చేయవచ్చు. అతని నమాజ్ చెల్లుతుంది మరియు అతను దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
11- వ్యాధిగ్రస్తుడు శుభ్రమైన వస్త్రాలతో నమాజ్ చేయడం తప్పనిసరి. ఒకవేళ అతని వస్త్రాలపై ఏదైనా అశుభ్రత (నజాసాత్) పడితే, వాటిని శుభ్రం చేయడం లేదా శుభ్రమైన వస్త్రాలతో మార్చుకోవడం తప్పనిసరి. అయితే, అది సాధ్యం కాకపోతే, అతను ఉన్న స్థితిలోనే నమాజ్ చేసుకోవచ్చు. అతని నమాజ్ చెల్లుతుంది మరియు అతను దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
12- వ్యాధిగ్రస్తుడు శుభ్రమైన ప్రదేశంలో నమాజ్ చేయడం తప్పనిసరి. ఒకవేళ అతను నమాజ్ చేసే స్థలం అశుభ్రమైతే (నజాసాత్ ఉంటే), దానిని శుభ్రం చేయడం లేదా శుభ్రమైన దానితో మార్చడం తప్పనిసరి. లేదా దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరచి నమాజ్ చేసుకోవచ్చు. అయితే, ఇది కూడా సాధ్యం కాకపోతే, అతను ఉన్న స్థితిలోనే నమాజ్ చేసుకోవచ్చు. అతని నమాజ్ చెల్లుతుంది మరియు అతను దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
13- వ్యాధిగ్రస్తుడు పరిశుద్ధత పొందలేకపోవడం కారణంగా నమాజ్ను దాని సమయం నుండి ఆలస్యం చేయకూడదు. బదులుగా, అతను తనకు సాధ్యమైనంత మేరకు శుద్ధి చేసుకోవాలి, ఆపై నమాజ్ను దాని సమయానికి చదవాలి. అతని శరీరంపై, వస్త్రాలపై లేదా నమాజ్ చేసే ప్రదేశంలో ఏదైనా అశుభ్రత (నజాసత్) ఉన్నా, దానిని తొలగించలేకపోతే కూడా ఈ నియమం వర్తిస్తుంది. అల్లాహ్ (తా'ఆలా) ఇలా సెలవిచ్చాడు: {కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి...} [అత్తగాబున్: 16]
దీనిని అల్లాహ్ పట్ల నిస్సహాయుడైన ముహమ్మద్ అస్సాలిహ్ అల్ ఉసైమీన్ రచించారు.
9/1/1403 హి లో
రోగి నమాజు ఎలా చేయాలి?
1 - రోగి ఫర్జ్ నమాజు ఖచ్చితంగా నిలబడి చేయాలి, అది వంగి అయినా కావచ్చు లేదా గోడ లేదా కర్ర వంటి ఆధారాన్ని ఉపయోగించి చేయవచ్చు.
2- ఒకవేళ నిలబడటం సాధ్యంకాకపోతే కూర్చుని నమాజ్ ఆచరించవచ్చు, మరియు ఖియామ్ మరియు రుకూ స్థలంలో ముస్తహబుగా ముక్కోణంగా కూర్చోవడం ఉత్తమం.
3- ఒకవేళ రోగి కూర్చొని కూడా నమాజ్ చేయలేకపోతే, అతను పక్కకు తిరిగి పడుకొని నమాజ్ చేయాలి. ఈ స్థితిలో ఖిబ్లా వైపు తిరిగి ఉండటం ముఖ్యం, మరియు కుడి పక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఖిబ్లా వైపు తిరగడం కూడా సాధ్యం కాకపోతే, అతను ఏ దిశలో ఉంటే ఆ దిశలోనే నమాజ్ చేయవచ్చు. అతని నమాజ్ చెల్లుతుంది మరియు అతను దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
4- ఒకవేళ రోగి తన పక్కకు తిరిగి కూడా నమాజ్ చేయలేకపోతే, అతను వెల్లకిలా పడుకొని నమాజ్ చేయాలి. ఈ స్థితిలో అతని కాళ్లు ఖిబ్లా వైపు ఉండాలి. ఒకవేళ కాళ్లు ఖిబ్లా వైపు పెట్టడం సాధ్యం కాకపోతే, అతను ఉన్న దిశలోనే నమాజ్ చేసుకోవచ్చు. అతని నమాజ్ చెల్లుతుంది మరియు అతను దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
5 - రోగి తన నమాజులో రుకూ మరియు సజ్దా చేయవలసి ఉంటుంది, ఒకవేళ అతనికి వీటిని చేయగలిగే శక్తి లేకపోతే తలతో సైగలు చేయాలి, మరియు సజ్దా రుకూ కంటే దిగువగా ఉండాలి, ఒకవేళ అతనికి రుకూ చేయగలిగే శక్తి ఉండి సజ్దా చేయలేకపోతే రుకూ సమయంలో రుకూ చేయాలి, మరియు సజ్దా కొరకు సైగ చేయాలి, ఒకవేళ అతనికి సజ్దా చేయగలిగే శక్తి ఉండి రుకూ చేయలేకపోతే సజ్దా సమయంలో సజ్దా చేయాలి, మరియు రుకూ కొరకు సైగ చేయాలి.
6 - ఒకవేళ రోగి రుకూ' మరియు సజ్దాల కోసం తన తలతో కూడా సూచించలేకపోతే, అప్పుడు తన కళ్ళతో సూచించాలి. రుకూ' కోసం కొద్దిగా కళ్ళు మూసుకోవాలి, మరియు సజ్దా కోసం మరింత ఎక్కువగా కళ్ళు మూసుకోవాలి. అయితే, కొందరు రోగులు వేలితో సూచించినట్లుగా వేలితో సూచించడం సరైనది కాదు. దీనికి ఖుర్ఆన్, సున్నత్ నుండి గానీ, పండితుల అభిప్రాయాల నుండి గానీ ఎటువంటి ఆధారం నాకు తెలియదు.
7- ఒకవేళ రోగి తల ఊపడం ద్వారా లేదా కనుసైగ ద్వారా కూడా రుకూ' మరియు సజ్దాలను సూచించలేకపోతే, అతను తన హృదయంతో నమాజ్ చేయాలి. అతను తక్బీర్ చెప్పి, ఖుర్ఆన్ పఠించి, తన హృదయంలోనే రుకూ', సజ్దా, నిలబడటం మరియు కూర్చోవడం లను సంకల్పించాలి. ప్రతి వ్యక్తికి అతను సంకల్పించినదే దక్కుతుంది.
8- రోగి ప్రతి నమాజును దాని సమయములోనే ఆచరించాలి, మరియు దానిలో అవసరమైనంత మేరకు చేయగలిగినంత చేయాలి. ప్రతి నమాజును దాని సమయములో ఆచరించడం కష్టంగా ఉంటే, అతనికి జుహర్ మరియు అసర్, మరియు మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి ఆచరించవచ్చు. ఇది ముందుగా కలిపి ఆచరించడం ద్వారా అసర్ ను జుహర్ కు మరియు ఇషా ను మగ్రిబ్ కు ముందుగా చేయవచ్చు లేదా ఆలస్యంగా కలిపి ఆచరించడం ద్వారా జుహర్ ను అసర్ కు మరియు మగ్రిబ్ ను ఇషా కు ఆలస్యంగా చేయవచ్చు, ఇది అతనికి సౌలభ్యంగా ఉండే విధంగా. అయితే ఫజర్ నమాజు ముందు లేదా తరువాత కలిపి చేయబడదు.
9- ఒకవేళ రోగి తన స్వదేశం కాకుండా ఇతర ప్రదేశంలో చికిత్స పొందుతూ ప్రయాణంలో ఉంటే, అతను నాలుగు రకాతుల నమాజును ఖసర్ చేయవచ్చు. అందువల్ల, అతను జుహర్, అసర్ మరియు ఇషా నమాజులను రెండు రకాతులుగా చదవాలి, తన స్వదేశానికి తిరిగి వచ్చే వరకు, అతని ప్రయాణం ఎంతకాలం అయినా సరే.
రోగి ఉపవాసం ఎలా ఉండాలి?
1- రోగి కొరకు ఉపవాసం విషయంలో మూడు స్థితులు ఉన్నాయి:
మొదటి పరిస్థితి: ఉపవాసం అతనికి కష్టంగా లేకుండా ఉండాలి, అతనికి హాని కలిగించకూడదు; అందువల్ల అతనిపై ఉపవాసం విధి అవుతుంది.
రెండవ పరిస్థితి: ఉపవాసం అతనికి కష్టంగా ఉంటే; అతనికి ఉపవాసం మానుకోవడం మంచిది; ఎందుకంటే అతను అల్లాహ్ ఇచ్చిన వెసులుబాటును అంగీకరించనట్లే అవుతుంది.
మూడవ పరిస్థితి: ఉపవాసం అతనికి హాని కలిగిస్తే; అతనికి ఉపవాసం నిషేధించబడుతుంది, అతను ఉపవాసం ఉండటం ద్వారా పాపం చేసినవాడవుతాడు ; అల్లాహ్ యొక్క వాక్కు ప్రకారం: {మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు.} [అన్ నిసా: 29] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "నీవు నీ ప్రాణంపై కూడా హక్కును కలిగి ఉన్నావు." ముత్తఫఖున్ అలైహి ఫీ హదీస్ తవీల్ [71]. [71] దీన్ని బుఖారీ కితాబుత్ తహజ్జుద్ లో హదీసు సంఖ్య (1153) మరియు ముస్లిం కితాబుస్సౌమ్ లో బాబు నహ్యి అన సౌమిద్దహ్ర్ హదీసు సంఖ్య (1159/182-186) అబ్దుల్లా ఇబ్ను అమ్ర్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు నుండి ఉల్లేఖించారు.
2- వ్యాధిగ్రస్తుడికి అల్లాహ్ త'ఆలా ద్వారా ఆరోగ్యం లభించిన తర్వాత, అతను తప్పకుండా తాను వదిలివేసిన ఉపవాసాలను పూర్తి చేయాలి. వాటిని తదుపరి రమదాన్ వచ్చే వరకు ఆలస్యం చేయకూడదు.
3- ఒకవేళ రోగికి తన వ్యాధి నయం అవుతుందని ఆశ లేకపోతే (అంటే, అది దీర్ఘకాలిక వ్యాధి, నయం కానిది అయితే) మరియు భవిష్యత్తులో ఉపవాసాలను పూర్తి చేయడం సాధ్యం కాకపోతే, అతను రమదాన్లో ప్రతి రోజుకు బదులుగా ఒక పేదవాడికి అన్నం పెట్టాలి. అంటే, నెలలోని రోజుల సంఖ్యకు అనుగుణంగా, ప్రతిరోజు ఒక పేదవానికి భోజనం పెట్టవచ్చు లేదా నెల చివరి రోజున పేదవారికి భోజనం పెట్టవచ్చు. లేదా ప్రతి పది రోజులకు పది పేదవారికి భోజనం పెట్టవచ్చు.
4- ఒకవేళ రోగి రమదాన్ తర్వాత నయం అయి, ఉపవాసాలు ఉండటానికి శక్తి ఉన్నప్పటికీ, వాటిని పూర్తి చేయకుండానే మరణిస్తే, అతని సంరక్షకుడు అతని తరపున ఆ ఉపవాసాలను ఉండాలి. అతని సంరక్షకుడు అలా చేయకపోతే, అతని ఆస్తి నుండి ప్రతిరోజు ఒక పేదవాడికి భోజనం పెట్టాలి. అతని సంరక్షకుడు స్వచ్ఛందంగా భోజనం పెట్టినా; ఎటువంటి అభ్యంతరం లేదు.
సలాతుత్తతవ్వు: (స్వచ్ఛందంగా చేసే సున్నతు, నఫిల్ వంటి అదనపు నమాజులు).
*వాటి ఘనత:
అల్లాహ్ సుబ్హానహూ వత'ఆలా దాసుల పట్ల కనబరిచిన ఒక కారుణ్యం ఏంటంటే: ఆయన ప్రతి రకమైన (ఫర్జ్) తప్పనిసరి ఆరాధన కోసం దానికి సంబంధించిన ఐచ్ఛిక ఆరాధనను ఏర్పాటు చేశాడు.నమాజ్ కోసం, దానిని పోలిన ఐచ్ఛిక నమాజులు (సున్నత్ నమాజులు) ఉన్నాయి. జకాత్ కోసం, దానిని పోలిన ఐచ్ఛిక దానధర్మాలు (సదఖాలు) ఉన్నాయి. ఉపవాసం కోసం, దానిని పోలిన ఐచ్ఛిక ఉపవాసాలు ఉన్నాయి. అలాగే హజ్ కు కూడా ఐచ్ఛిక రూపాలు ఉన్నాయి ఇది అల్లాహ్ తన దాసుల పట్ల చూపిన గొప్ప కారణ్యం. ఎందుకంటే: దీని ద్వారా వారు పుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చు మరియు అల్లాహ్కు మరింత దగ్గరవ్వచ్చు. అంతేకాకుండా, తప్పనిసరి ఆరాధనలలో సంభవించిన లోపాలను పూడ్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రళయదినాన, ఐచ్ఛిక ఆరాధనల ద్వారా తప్పనిసరి ఆరాధనలు పరిపూర్ణం చేయబడతాయి.
నమాజులో ఉన్న నఫిల్ (స్వచ్ఛంద) నమాజులు:
1. ఫర్జ్ నమాజులతో పాటుగా చదివే (రవాతిబ్) సున్నత్ నమాజులు:
ఇవి: జుహర్ నమాజ్ సమయం ప్రవేశించిన తర్వాత, ఫర్జ్ నమాజ్కు ముందు రెండు సలామ్లతో నాలుగు రకాతులు. నమాజ్ సమయం రాకముందు ఈ సున్నత్ చదవకూడదు. జుహర్ ఫర్జ్ నమాజ్ తర్వాత రెండు రకాతులు. మొత్తంగా, ఇవి జుహర్కు సంబంధించిన ఆరు రకాతుల సున్నత్ నమాజులు. అస్ర్ నమాజ్కు సున్నత్ లేదు. మగ్రిబ్ ఫర్జ్ నమాజ్ తర్వాత రెండు రకాతులు. ఇషా ఫర్జ్ నమాజ్ తర్వాత రెండు రకాతులు. ఫజర్ ఫర్జ్ నమాజ్కు ముందు రెండు రకాతులు.
ఫజ్ర్కు ముందు ఉండే రెండు రకాతులు ప్రత్యేకమైనవిగా ఉంటాయి:
ఆ రెండును వ్యక్తి తేలికపాటి రీతిలో చేయడం ఉత్తమమైనదిగా ఉంటుంది.
మరియు వాటిలో ఇవి చదవాలి {ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! 1} [కాఫిరూన్: 1] మొదటి రకాతులో, మరియు {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. 1} [అల్ ఇఖ్లాస్:1] రెండవ రకాత్ లో, లేదా ఈ ఆయతు ద్వారా అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు: {(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను...} [అల్ బఖర :136] సూరె బఖరా లోని ఆయతు మొదటి రకాతులో, {ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి...} [ఆల్ ఇమ్రాన్: 64] సూరతు ఆలె ఇమ్రాన్ లోని ఆయతు రెండవ రకాతులో.
ఇంకా, ఫజ్ర్కు సంబంధించిన ఈ రెండు రకాతులు (రాతిబతుల్ ఫజ్ర్) నివాసంలోనూ, ప్రయాణంలోనూ కూడా ا చేయబడతాయి.
దానిలో గొప్ప ఘనత ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఫజర్ యొక్క రెండు రకతుల సున్నత్ ప్రపంచం మరియు దానిలోని దానికంటే ఎంతో మేలైనది» [72]. [72] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, పుస్తకంలో 'సలాత్ అల్ ముసాఫిరీన్', అధ్యాయం 'ఫజర్ సున్నత రకాతుల ప్రాముఖ్యత', హదీసు నెంబరు 725, హదీసు 'ఆయిషా రజియల్లాహు అన్హా' నుండి.
2- నఫిల్ (స్వచ్ఛంద) నమాజులలో నుంచి: విత్ర్ నమాజు:
విత్ర్ నమాజు నఫిల్ నమాజుల్లో అత్యంత బలమైనదిగా పరిగణించబడుతుంది. కొంతమంది ఉల్మా దీనిని వాజిబ్ అని కూడా పేర్కొన్నారు. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ దీని గురించి ఇలా తెలిపారు: "ఎవరైతే విత్ర్ నమాజ్ను వదిలివేస్తారో, అతను చెడ్డవాడు. అతని సాక్ష్యాన్ని అంగీకరించకూడదు." [73] [73] చూడండి: మసాయిలుల్ ఇమామ్ అహ్మద్, ఆయన కుమారుడు అబుల్ ఫద్ల్ యొక్క రివాయత్, (పుట:53) సంఖ్య (159) త. తారిఖ్ ఇవజుల్లా.
రాత్రి నమాజు వితర్ తో ముగుస్తుంది. ఎవరికైతే రాత్రి చివరిభాగంలో మేల్కొనలేననే భయం కలిగితే అతను నిద్రకు ముందే వితర్ చదువుకోవాలి. మరెవరైతే రాత్రి చివరిభాగంలో మేల్కొని నమాజు చేయాలని ఆశిస్తారో వారు తమ నఫిల్ ముగించిన తరువాత రాత్రి చివరిభాగంలో వితర్ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: «మీరు విత్ర్ నమాజును రాత్రిపూట చివరి నమాజుగా చేసుకోండి.»[74]. [74] దీనిని బుఖారీ కితాబుల్ విత్ర్ లో ఉల్లేఖించారు, బాబు లియజ్అల్ ఆఖిర సలాతిహి విత్రన్ హదీసు సంఖ్య (998), మరియు ముస్లిం కితాబుల్ సలాతుల్ ముసాఫిరీన్ లో ఉల్లేఖించారు, బాబు సలాతుల్ లైల్ మథ్నా మథ్నా హదీసు సంఖ్య (751) ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా యొక్క హదీసు.
విత్ర్ నమాజులో కనిష్ఠంగా ఒక రకాత్ ఉండాలి. గరిష్ఠంగా పదకొండు రకాతులు వరకూ ఉండవచ్చు. కనీస పరిపూర్ణత (అద్నల్ కామిల్) అంటే — మూడు రకాతులు చేయడం.
ఒకవేళ అతడు వితర్ మూడు రకాతులు చదివితే; అతడు తన ఇష్టానుసారం, ఒక తషహుద్ తో వరుసగా చదవవచ్చు, లేదా రెండు రకాతులు చదివి సలాం చెప్పి, తరువాత ఒక రకాతు చదవవచ్చు.
వితర్ నమాజు మర్చిపోతే లేదా నిద్రపోతే, దాన్ని పగలు సరిసంఖ్యలో చదవాలి, వితర్ గా కాదు. ఒకవేళ ఆయన మూడు వితర్ చేయడం అలవాటు అయితే, నాలుగు రకాతులు చదవాలి. ఐదు వితర్ చేయడం అలవాటు అయితే, ఆరు రకాతులు చదవాలి. ఎందుకంటే సాహీహ్ హదీసులో ఉంది: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర లేదా నొప్పి వల్ల రాత్రి తహజ్జుదు చేయలేకపోతే, పగలు పన్నెండు రకాతులు చదివేవారు.[75] [75] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, పుస్తకం: సలాత్ అల్-ముసాఫిరీన్, బాబ్: జామియ్ సలాత్ అల్-లైల్, హదీసు నెంబరు 746, హదీసు: ఆయిషా రజియల్లాహు అన్హా.
3- వాటిలో ఒకటి: సూర్యోదయం తర్వాత చదివే నమాజు (చాష్త్ నమాజు) :
జుహా (చాష్త్) నమాజు యొక్క కనిష్ఠ సంఖ్య రెండు రకాతులు, గరిష్ఠానికి పరిమితి లేదు; ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహా నమాజులో నాలుగు రకాతులు చేసేవారు మరియు అల్లాహ్ కోరినప్పుడు పెంచికూడా చేసేవారు. [76] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, కితాబు సలాతిల్-ముసాఫిరీన్, బాబు ఇస్తిహబాబి సలాతిజ్-జుహా, హదీసు నెంబరు 719, హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా.
దాని సమయం: సూర్యుడు (ఉదయించిన తర్వాత) ఒక ఈటె ఎత్తుకు పైకి వచ్చినప్పటి నుండి అంటే, సూర్యోదయం అయిన సుమారు పదిహేను నిమిషాల తర్వాత మొదలవుతుంది. - ఇది జవాల్ (మధ్యాహ్న సమయం) ప్రవేశించడానికి కొద్దిసేపటి ముందు వరకు, అనగా సూర్యుడు నడినెత్తి నుండి వాలడానికి సుమారు పది నిమిషాల ముందు లేదా దానికి దగ్గరగా ముగుస్తుంది.
జుహా నమాజ్ యొక్క చట్టబద్ధతకు ఆధారం: అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన హదీస్. ఆయన ఇలా అన్నారు: «నా మిత్రుడు (అంటే దైవప్రవక్త) సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాల గురించి హితోపదేశం చేశారు: ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం పాటించమని, చాష్త్ వేళ రెండు రకాతుల నమాజు చేయమని, నిద్రపోయే ముందు విత్ర్ నమాజు చేసుకోవమని.»[77] [77] దీనిని బుఖారీ కితాబుల్ తతవ్వు లో ఉల్లేఖించారు, బాబు సలాతుల్ జుహా ఫీ హదర్, హదీసు సంఖ్య (1178). మరియు ముస్లిం కితాబుల్ సలాతుల్ ముసాఫిరీన్ లో ఉల్లేఖించారు, బాబు ఇస్తిహ్బాబ్ సలాతుల్ జుహా, హదీసు సంఖ్య (721).
అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «మీలోని ప్రతి ఒక్క రిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ఉదయం పూట ఒక సదఖా (సత్కార్యం) చేయటం తప్పనిసరి. అయితే ప్రతి తస్బీహ్ పలుకు (సుబహానల్లాహ్ అనడం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తహ్మీద్ పలుకు (అల్ హమ్దులిల్లాహ్ అనడమూ) ఒక సత్కార్యమే. ప్రతి తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం) కూడా ఒక సత్కార్యమే. ప్రతి తక్బీర్ (అల్లాహు అక్బర్ అనడమూ) ఒక సత్కార్యమే. మంచిని గురించి ఆజ్ఞాపించడం సత్కార్యం. అలాగే చెడు నుంచి వారించడమూ సత్కార్యమే. అయితే సూర్యోదయం తరువాత మనిషి చేసే రెండు రకాతుల నమాజు వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాగలదు.»[78] [78] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, పుస్తకం: ప్రయాణికుల ప్రార్థన, అధ్యాయం: జుహా నమాజు ప్రాధాన్యత, హదీసు నెంబరు 720.
నిషిద్ధ సమయాలు
ఇవి షరీఅతు పరంగా నిషేధించబడిన సమయాలు, అంటే: ఏ కారణం లేని సాధారణ నఫిల్ నమాజులు.
నిషిద్ధ సమయాలు మూడు:
మొదటి నిషేధిత సమయం: ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యుడు ఒక ఈటె ఎత్తుకు పైకి వచ్చేవరకు. అంటే, సూర్యోదయం అయిన సుమారు పావుగంట తర్వాత వరకు. ఇక్కడ ఫజ్ర్ నమాజ్ అంటే ప్రతి వ్యక్తి స్వయంగా చదివిన నమాజ్ ను పరిగణనలోకి తీసుకోవాలి మస్జిద్లో జమాత్ నమాజ్ సమయాన్ని కాదు.
రెండవ నిషేధిత సమయం: మధ్యాహ్నపు నడిబొడ్డున సూర్యుడు నడినెత్తిపై నిలబడి ఉన్నప్పటి నుండి సూర్యుడు పడమర వైపు వాలే వరకు (జవాల్). ఇది సాధారణంగా మధ్యాహ్నానికి సుమారు పది నిమిషాల ముందు లేదా దానికి దగ్గరగా ఉంటుంది.
మూడవ నిషేధిత సమయం: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు, ప్రతి వ్యక్తి తన నమాజు గురించి స్వయంగా పరిగణించాలి, ఒకవేళ వ్యక్తి అస్ర్ నమాజు ఆచరించినట్లయితే; సూర్యుడు అస్తమించే వరకు అతనికి నమాజు నిషేధించబడుతుంది.
అయితే వాటిలో మినహాయించబడినవి:
1- ఫర్జ్ నమాజులు, ఉదాహరణకు: నిషేధిత సమయాలలో కూడా ఫర్జ్ నమాజులు చదవడం అనుమతించబడుతుంది, ప్రత్యేకించి ఒక వ్యక్తికి ఆ సమయాల్లో నమాజ్ ఖజా అయినట్లు గుర్తుకు వస్తే. అతను వెంటనే ఆ నమాజ్ను చదవాలి. దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ సాధారణ ఆదేశం ఆధారం: «ఎవరైనా నమాజు చేయకుండా నిద్రపోయినా లేదా దాన్ని మరిచిపోయినా, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును ఆచరించాలి.»[79] [79] దీన్ని బుఖారీ కితాబ్ మవాఖీతుస్సలాత్ లో అధ్యాయం మన్ నసియ సలాతన్ హదీసు సంఖ్య (597) లో ఉల్లేఖించారు. మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ లో అధ్యాయం ఖదాస్సలాతిల్ ఫాయిత హదీసు సంఖ్య (684) లో హజ్రత్ అనస్ రదీయల్లాహు అన్హు కథనం. బుఖారీ నిద్ర గురించి ప్రస్తావించలేదు.
2- బలమైన అభిప్రాయం ప్రకారం, నిషేధిత సమయాలలో కూడా కారణంతో కూడిన ప్రతి నఫిల్ నమాజ్ మినహాయించబడుతుంది. ఎందుకంటే, ఈ రకమైన నమాజ్ దాని కారణంతో ముడిపడి ఉంటుంది, మరియు నమాజ్ ఈ కారణంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల నిషేధం ఏర్పడటానికి గల కారణమైన జ్ఞానం (హిక్మత్) తొలగిపోతుంది. ఉదాహరణకు: ఒకవేళ మీరు అస్ర నమాజ్ తర్వాత మస్జిద్లోకి ప్రవేశిస్తే, మీరు రెండు రకాతుల నమాజ్ చేయవచ్చు. దీనికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ మాట ఆధారం: «మీలో ఎవరైనా మస్జిద్లోకి ప్రవేశించినప్పుడు, రెండు రకాతులు నమాజ్ చేసే వరకు కూర్చోవద్దు.» [80] అదేవిధంగా, మీరు ఫజ్ర్ నమాజ్ తర్వాత లేదా సూర్యుడు నడినెత్తిపై ఉన్నప్పుడు (జవాల్ సమయం) మస్జిద్లోకి ప్రవేశించినా చదవవచ్చు. [80] ఈ హదీస్ను బుఖారీ తన 'కితాబుత్-తహజ్జుద్'లో, 'బాబు మా జా'అ ఫిత్-తతవ్వూ' మస్నా మస్నా' అనే అధ్యాయంలో, నంబర్ (1163) వద్ద ఉల్లేఖించారు. అదేవిధంగా, ముస్లిం తన 'కితాబుస్-సలాత్'లో, 'బాబు ఇస్తిహ్బాబి తహియ్యతుల్ మస్జిద్' అనే అధ్యాయంలో, నంబర్ (714) వద్ద అబూ ఖతాదా రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.
అలాగే, ఒకవేళ అస్ర నమాజ్ తర్వాత సూర్యగ్రహణం (కుసూఫ్) సంభవిస్తే, అప్పుడు గ్రహణం నమాజ్ చదవవచ్చు. ఎందుకంటే ఈ నమాజుకు ప్రత్యేక కారణం (సూర్యగ్రహణం) ఉంది.
అలాగే ఒక వ్యక్తి ఖుర్ఆన్ చదివి సజ్దా ఆయతును చదివినప్పుడు, అతను ఆ సమయంలో కూడా సజ్దా చేయాలి; ఎందుకంటే అది ఒక కారణం.
నమాజు విడిచిపెట్టే వాడి గురించి ఆదేశము
ప్రశ్న: ఒక వ్యక్తి తన కుటుంబీకులను నమాజు చేయమని ఆదేశించినప్పుడు, కానీ వారు అతని మాట వినకపోతే, అతను వారితో కలిసి నివసించాలా లేదా ఇంటిని విడిచి వెళ్లిపోవాలా?
జవాబు: ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడూ విధిగా చేయవలసిన నమాజులు చేయకపోతే; వారు ఇస్లాం నుండి బయటకు వెళ్లిన తిరస్కారులు మరియు ముర్తద్లు, మరియు వారితో నివసించడం అనుమతించబడదు.
అయితే, అతను వారిని దైవమార్గం వైపు పిలవడం, పదే పదే ఒత్తిడి చేయడం మరియు పునరావృతం చేయడం తప్పనిసరి. బహుశా అల్లాహ్ వారికి సన్మార్గం చూపవచ్చు. ఎందుకంటే, నమాజ్ వదిలివేసినవాడు తిరస్కారి – అల్లాహ్ తో దీని నుండి ఆశ్రయం కోరుతున్నాము – ఖుర్ఆన్, సున్నత్, సహాబాల మాటలు మరియు సరైన తార్కిక దృక్పథం దీనికి రుజువులు. ఇది ఎంతటి భయంకరమైన పని అని హెచ్చరిస్తుంది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ముష్రికుల గురించి ఇలా సెలవిచ్చాడు: కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు... [తౌబా: 11] ఈ ఆయత్ యొక్క భావం ఏమిటంటే, వారు నమాజ్ మరియు జకాత్ చెల్లించనట్లయితే మనకు సోదరులు కారు. పాపాలు ఎంత పెద్దవైనప్పటికీ, వాటి వల్ల ధార్మిక సోదరత్వం తొలగిపోదు. అయితే, ఇస్లాం నుండి బయటపడటం ద్వారా అది తొలగిపోతుంది.
సున్నత్ నుండి దీనికి ఆధారం ఏంటంటే, సహీహ్ ముస్లిం లో జాబిర్ రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మనిషికి మరియు అవిశ్వాసము, బహుదైవారాధన మధ్య ఉన్న భేదము నమాజు వదిలివేయుట. [81]” అదేవిధంగా, సునన్ గ్రంథాలలో బురైదా రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము: నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [82] [81] దీనిని ముస్లిం కితాబుల్ ఈమాన్ లో ఉల్లేఖించారు, బాబు బయాని ఇత్లాఖి ఇస్మిల్ కుఫ్రి అలా మన్ తరకస్సలాత, హదీసు సంఖ్య (82). [82] దీనిని తిర్మిజీ కితాబుల్ ఈమాన్ లో, బాబు మాజా ఫీ తర్క్ అస్సలాత్, హదీసు నెంబరు (2621), నసాయీ కితాబ్ అస్సలాత్ లో, బాబు హుక్మ్ ఫీ తారిక్ అస్సలాత్, హదీసు నెంబరు (464), ఇబ్నె మాజా కితాబ్ ఇఖామత్ అస్సలాత్ లో, బాబు మాజా ఫీమన్ తర్క్ అస్సలాత్, హదీసు నెంబరు (1079), మరియు అహ్మద్ (5/346) ఉల్లేఖించారు.
సహాబాల మాటల విషయానికి వస్తే, అమీరుల్ ముమినీన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: నమాజు వదిలిన వానికి ఇస్లాం లో భాగం లేదు. [83] "అల్-హద్దు" అంటే భాగం, ఇక్కడ, ఇది నిషేధం సందర్భంలో వచ్చిన ఒక అనిర్దిష్ట పదం, కాబట్టి ఇది సర్వసాధారణ అర్థాన్ని ఇస్తుంది. అంటే: ఎటువంటి భాగం లేదు, అది తక్కువైనా సరే, ఎక్కువైనా సరే. [83] దీనిని మాలిక్ "అల్-మువత్తా" యహ్యా బిన్ యహ్యా రివాయత్ లో: కితాబ్ అస్సలాత్, బాబ్ అల్-అమల్ ఫీమన్ గలబహు అద్దమ్, (1/81) హదీసు నెంబరు (93), అబ్దుర్ రజాక్ "అల్-ముసన్నఫ్" లో (1/150), ఇబ్నె అబీ షైబా "అల్-ముసన్నఫ్" లో (11/25), అహ్మద్ "అల్-జుహుద్" పుట (154) లో ఉల్లేఖించారు.
మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ షఖీఖ్ ఇలా తెలిపారు: మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఆచరణల్లో దేనిని విడిచి పెట్టినా ‘కుఫ్ర్’గా తలపోసే వారు కాదు, ఒక్క నమాజును తప్ప. [84] [84] దీన్ని తిర్మిజీ కితాబుల్ ఈమాన్ లో ఉల్లేఖించారు, బాబు మా జా ఫీ తరకస్సలాత, హదీసు నెంబరు (2622).
సరైన దృక్పథం నుండి ఆలోచిస్తే, ఇలా అడగవచ్చు: తన హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వ్యక్తి, నమాజ్ యొక్క గొప్పదనాన్ని, దాని పట్ల అల్లాహ్ యొక్క శ్రద్ధను తెలుసుకొని కూడా, దాన్ని పూర్తిగా వదిలివేయడానికి పట్టుబడతాడా? ఇది అసాధ్యమైన విషయం.
నమాజ్ చేయనివాడు కాఫిర్ కాడని వాదించేవారు ఆధారంగా చేసుకున్న రుజువులను నేను పరిశీలించాను. అవి ఐదు స్థితుల నుండి బయటపడవు;
1- అది అసలుగా ఎటువంటి ఆధారమును కలిగిఉండకపోవచ్చు.
2- లేదా అది ఒక ప్రత్యేక పరిస్థితితో పరిమితం చేయబడి ఉంటుంది, ఆ పరిస్థితిలో నమాజు వదిలేయడం అసాధ్యమవుతుంది.
3- లేదా అది ఒక పరిస్థితితో పరిమితం చేయబడి ఉంటుంది, ఆ పరిస్థితిలో ఈ నమాజు వదిలేయడాన్ని మన్నించబడినదిగా పరిగణించవచ్చు.
4- లేదా అది సాధారణమైనదిగా ఉంటుంది, అయితే నమాజు వదిలినవాడు కాఫిర్గా మారతాడని తెలిపే హదీసులతో ప్రత్యేకీకరించబడుతుంది.
5- లేదా అవి బలహీనమైనవి, సాహీహ్ హదీసులకు ప్రతిఘటించలేనివి.
నమాజును వదిలినవాడు ముమిన్ అని, లేదా అతను స్వర్గంలో ప్రవేశిస్తాడని, లేదా నరకం నుండి తప్పించుకుంటాడని ఎక్కడా నుసూస్ (పవిత్ర గ్రంథాలు)లో లేదు. ఇలాంటి సందర్భాలలో, నమాజును వదిలినవాడిపై విధించిన కుఫ్ర్ను కుఫ్రు నిమత్ లేదా కుఫ్ర్ దూన్ కుఫ్ర్ అని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు.
నమాజ్ వదిలివేసిన వ్యక్తి కుఫ్ర్ చేసినవాడని స్పష్టమైతే, అతని ఈ కుఫ్ర్ వల్ల ముర్తదుల కోసం వర్తించే నిబంధనలు (అహ్కామ్) వర్తిస్తాయి. వాటిలో కొన్ని:
మొదటిది: నమాజ్ చేయనివాడికి వివాహం చెల్లదు. ఒకవేళ అతడు నమాజ్ చేయకుండానే నికాహ్ (వివాహ ఒప్పందం) చేసుకుంటే, ఆ నికాహ్ బాతిల్ (చెల్లనిది) అవుతుంది. ఆ భార్య అతనికి హలాల్ (ధర్మసమ్మతం) కాదు. దీనికి అల్లాహ్ తఆలా వలస వచ్చిన స్త్రీల గురించి ఇలా అన్నాడు: {వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు.} [అల్ ముమ్'తహిన:10]
రెండవది: ఒకవేళ నికాహ్ జరిగిన తర్వాత నమాజ్ విడిచిపెడితే అతని వివాహం రద్దు అవుతుంది, మరియు అతనికి భార్య హలాల్ కాదు; ఇది గతంలో మనం ప్రస్తావించిన ఆయత్ ఆధారంగా జరుగుతుంది. పండితుల (అహ్లుల్ ఇల్మ్) మధ్య ఉన్న వివరణ ప్రకారం, ఇది దంపతులు కలిసే ముందు లేదా కలిసిన తర్వాత జరిగిందా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
మూడవది: నమాజ్ చేయని ఈ వ్యక్తి జుబహ్ చేస్తే, అతని వధించిన మాంసం తినబడదు, ఎందుకంటే అది హరామ్ (నిషిద్ధం). ఒక యూదుడు లేదా క్రైస్తవుడు జబహ్ చేస్తే, వారి వధించిన మాంసం మనం తినడానికి హలాల్ అవుతుంది. కాబట్టి, (అల్లాహ్ తో దీని నుండి ఆశ్రయం కోరుతున్నాము) నమాజ్ చేయని వ్యక్తి జుబహ్ చేయడం యూదులు మరియు క్రైస్తవులు జుబహ్ చేయడం కంటే కూడా దుర్మార్గమైనది అవుతుంది.
నాలుగవది: నమాజ్ చేయని వ్యక్తికి మక్కా లేదా దాని పవిత్ర ప్రదేశం (హరమ్) పరిధిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. దీనికి అల్లాహ్ త'ఆలా ఈ ఆయత్ ద్వారా చెప్పిన మాట ఆధారం: {ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్). కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు...} [తౌబా: 28]
ఐదవది: ఒకవేళ అతని బంధువులలో ఎవరైనా మరణిస్తే, వారసత్వంలో అతనికి ఎటువంటి హక్కు ఉండదు. ఒక ముస్లిం వ్యక్తి, అతను నమాజ్ చేస్తాడు, మరణించాడు. అతనికి నమాజ్ చేయని ఒక కుమారుడు మరియు నమాజ్ చేసే ఒక దూరపు పెదనాన్న కొడుకు (ఆసిబ్) ఉన్నారు. అయితే, అతనిని ఎవరు వారసత్వంగా పొందుతారు?
జవాబు: అతని దూరపు పెదనాన్న కొడుకు, అతని కుమారుడు కాదు. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా హదీసులో ఇలా అన్నారు: "ఒక ముస్లిం కాఫిర్కు (అవిశ్వాసికి) వారసుడు కాడు, మరియు ఒక కాఫిర్ ముస్లింకు వారసుడు కాడు." ముత్తఫఖున్ అలైహి[85], దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «వారసులకు సంపదను పంచిపెట్టండి మిగిలినది ఆ వ్యక్తి కి సంభందించిన దగ్గరి మగబందువుకు చెందుతుంది.» ముత్తఫఖున్ అలైహి [86] "మరియు ఇది అన్ని వారసులకు వర్తించే ఒక ఉదాహరణ." [85] దీనిని బుఖారీ తన ఫరాయిద్ పుస్తకంలో, ముస్లిం కాఫిర్ను వారసత్వంగా పొందలేడు అనే అధ్యాయంలో, నంబర్ (6764), మరియు ముస్లిం తన ఫరాయిద్ పుస్తకంలో, నంబర్ (1614) ఉల్లేఖించారు. [86] దీన్ని బుఖారీ కితాబుల్ ఫరాయిద్ లో అధ్యాయం మీరాసుల్ వలద్ మిన్ అబీహి వ ఉమ్మిహి లో ఉల్లేఖించారు హదీసు సంఖ్య (6732), మరియు ముస్లిం కితాబుల్ ఫరాయిద్ లో అధ్యాయం అల్ హికూ ఫరాయిద్ బి అహ్లిహా లో ఉల్లేఖించారు హదీసు సంఖ్య (1615) ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు.
ఆరవది- అతను మరణించినప్పుడు అతనికి గుసుల్ చేయబడదు, కఫన్ వస్త్రము తొడగబడదు, అతని జనాజా నమాజు చదవబడదు, అతను ముస్లింలతో కలిసి ఖననం చేయబడడు. అయితే మేము అతని పట్ల ఏమి చేయాలి?
జవాబు: మేము అతనిని ఎడారికి తీసుకెళ్తాము, అతనికి గోతిని త్రవ్వి, అతని దుస్తులతోనే ఖననం చేస్తాము; ఎందుకంటే అతనికి గౌరవం లేదు. ఈ కారణంగా, ఎవరి వద్ద మృతుడు ఉంటే, మరియు అతను నమాజు చదవడు అని తెలిసి ఉంటే, అతన్ని ముస్లింలకు నమాజు కోసం సమర్పించటం అనుమతించబడదు.
ఏడవది: ప్రళయ దినం నాడు అతను (నమాజ్ను విడిచిపెట్టిన వ్యక్తి) ఫిర్ఔన్, హామాన్, ఖారూన్ మరియు ఉబై బిన్ ఖలఫ్ వంటి కుఫ్ర్ (అవిశ్వాసం) నాయకులతో పాటుగా లేపబడతాడు[87] - అల్లాహ్ మనకు రక్షణ కలిగించుగాక. మరియు అతను స్వర్గంలో ప్రవేశించడు, అతని కుటుంబ సభ్యులలో ఎవరూ అతని కోసం దయ మరియు క్షమాపణ కోసం ప్రార్థించడం అనుమతించబడదు, ఎందుకంటే అతను అవిశ్వాసి (కాఫిర్) కాబట్టి దానికి అర్హుడు కాడు; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు.} [తౌబా: 113] [87] మరియు దీనిని ఇమామ్ అహ్మద్ "ముస్నద్" లో (2/169) అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా హదీసు నుండి ఉల్లేఖించారు.
"సోదరులారా, ఈ విషయం చాలా తీవ్రమైనది. దురదృష్టవశాత్తు, కొంతమంది ప్రజలు ఈ తీవ్రమైన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు."
కానీ తౌబా యొక్క ద్వారం తెరిచి ఉంది -అల్లాహ్ కు స్తుతులు- అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు: {కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు. 59 కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి మరియు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు. 60 అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా ఆయన వాగ్దానం పూర్తయి తీరుతుంది. 61 వారందులో మీకు శాంతి కలుగు గాక (సలాం!) అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు మాటలు వినరు. మరియు అందులో వారికి ఉదయం మరియు సాయంత్రం జీవనోపాధి లభిస్తూ ఉంటుంది.} 62 [మర్యం: 59-62]
అందువలన మేము అల్లాహ్ తఆలాను వేడుకుంటున్నాము! అల్లాహ్ తఆ'లా మమ్మల్ని మరియు మా ముస్లిం సోదరులను, ఆయనకు సంతోషం కలిగించే విధంగా ఆయన విధేయతను నిర్వర్తించడానికి మార్గనిర్దేశం చేయుగాక. మరియు అల్లాహ్ కు బాగా తెలుసు మరియు అల్లాహ్ మా ప్రవక్త ముహమ్మద్పై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురిపించుగాక.
ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్
తౌబా (పశ్చాత్తాపము)
అత్తౌబహ్: పశ్చాత్తాపం అంటే అల్లాహ్ తఆ'లా యొక్క అవిధేయత నుండి ఆయన విధేయత వైపు తిరిగి రావడం.
తౌబా చేయడం ప్రతి విశ్వాసిపై విధి, {ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే!} [తహ్రీమ్: 8]
తౌబా అల్లాహ్ అజ్జవజల్ కు ఎంతో ప్రియమైనది, {నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.} [అల్ బఖర: 222]
పశ్చాత్తాపం (తౌబా) విజయానికి కారణాలలో ఒకటి. {మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలిసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకోండి, బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు!} [నూర్: 31] అల్-ఫలాహ్: అంటే మానవుడు తాను కోరుకున్నది పొందడం మరియు తాను భయపడే దాని నుండి విముక్తి పొందడం.
తౌబా ద్వారా అల్లాహ్ పాపాలను క్షమిస్తాడు, అవి ఎంత పెద్దవైనా మరియు ఎంత ఎక్కువైనా, {ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత."} 53 [జుమర్: 53] పాపియైన నా సోదరా! నీ ప్రభువు కరుణ పట్ల నిరాశ చెందకు. పశ్చాత్తాపపు ద్వారం సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు తెరిచే ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా అల్లాహ్ రాత్రిపూట తన హస్తాన్ని చాపుతాడు, పగటిపూట తప్పు చేసినవాడు పశ్చాత్తాపపడటానికి. మరియు పగటిపూట తన హస్తాన్ని చాపుతాడు, రాత్రిపూట తప్పు చేసినవాడు పశ్చాత్తాపపడటానికి. సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు ఇది కొనసాగుతుంది." దీనిని ముస్లిం ఉల్లేఖించారు [88] [88] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, కితాబ్ అత్తౌబా, బాబ్ ఖుబూల్ అత్తౌబా మిన్ అద్ధునూబ్, హదీసు నెంబరు 2759, హదీసు అబూ మూసా రజియల్లాహు అన్హు.
ఎంతమంది పెద్ద పెద్ద పాపాల నుండి పశ్చాత్తాప పడి తిరిగి వచ్చినవారికి అల్లాహ్ క్షమాపణ ప్రసాదించాడు! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. 68 పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు. 69 కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.} 70 [అల్ ఫుర్ఖాన్: 68-70]
నిజాయితీగల పశ్చాత్తాపం (తౌబతున్-నసూహ్) ఐదు షరతులు కలిగినది:
మొదటిది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు చిత్తశుద్ధి, అంటే, దానిని అల్లాహ్ తఆ'లా యొక్క ప్రసన్నత కొరకు చేయడం, దాని ద్వారా పుణ్యం పొందాలని, మరియు ఆయన శిక్ష నుండి రక్షణ పొందాలని ఉద్దేశించడము.
రెండవది: పాపం చేసినందుకు పశ్చాత్తాపపడటం. అంటే, దానిని చేసినందుకు విచారించడం మరియు దానిని చేయకపోయి ఉంటే బాగుండేదని కోరుకోవడం.
మూడవది: పాపాన్ని తక్షణమే మానేయడం. అది అల్లాహ్ తఆలా హక్కుకు సంబంధించినదైతే, అది నిషేధించబడిన చర్య అయితే దానిని విడిచిపెట్టాలి, మరియు అది ఒక తప్పనిసరి విధిని విడిచిపెట్టడం అయితే దానిని వెంటనే నిర్వర్తించాలి. అది ఒక సృష్టి (మానవుని) హక్కుకు సంబంధించినదైతే, వెంటనే దాని నుండి విముక్తి పొందాలి, లేదా దానిని తిరిగి అతనికి అప్పగించడం ద్వారా, లేదా అతని క్షమాపణ కోరడం ద్వారా, లేదా దాని నుండి అతనిని క్షమించమని వేడుకోవడం ద్వారా.
నాలుగవది: భవిష్యత్తులో ఆ పాపాన్ని తిరిగి చేయకూడదని దృఢ సంకల్పం చేసుకోవడం.
ఐదవది: పశ్చాత్తాపం (తౌబా) దాని ఆమోద సమయం దాటిపోక ముందు ఉండాలి, అది మరణం సంభవించక ముందు లేదా సూర్యుడు పడమర నుండి ఉదయించక ముందు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, “ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను” అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు.} [నిసా: 18] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘సూర్యుడు పడమర నుండి ఉదయించక ముందే పశ్చాత్తాప పడ్డవారి తౌబా ను అల్లాహ్ ఆమోదిస్తాడు’ దీనిని ముస్లిం ఉల్లేఖించారు [89] ఓ అల్లాహ్! నిజాయితీగల పశ్చాత్తాపాన్ని (తౌబతున్-నసూహ్) చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మరియు మా నుండి (పశ్చాత్తాపాన్ని) స్వీకరించు; నిశ్చయంగా నీవే అన్నీ వినేవాడివి, అన్నీ తెలిసినవాడివి. [89] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, కితాబుల్-జిక్ర్ లో, ఇస్తిగ్ఫార్ యొక్క ప్రాముఖ్యత పై బాబ్, హదీసు నెంబరు 2703, అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు.
దీన్ని ముహమ్మద్ సాలిహ్ అల్ ఉసైమీన్ రచించారు.
17/4/1406 హి
మొదటి ఆధ్యాయం: జనాయిజ్ (అంత్యక్రియలు)
మృతునికి గుసుల్ చేయుట యొక్క ఆదేశాలు.
మృతునికి గుసుల్ చేసే పద్దతి.
మృతునికి కఫన్ (వస్త్రం) చుట్టే పద్ధతి.
మృతుని కొరకు నమాజు చేసే విధానం.
మృతున్ని ఖననం చేసే పద్ధతి.
మృతుని గుసుల్ చేయించటం యొక్క ఆదేశాలు
సర్వస్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి. అల్లాహ్ ఒక్కడే తప్ప వేరే ఆరాధ్యదైవం లేడని, ఆయనకు ఎవరు సాటి లేరని, మొదటి మరియు చివరి తరాల ఆరాధ్యదైవం ఆయనేనని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడని, ఆయన ప్రవక్త అని, ప్రవక్తలలో చివరివాడని, భయభక్తుల నాయకుడని నేను సాక్ష్యం పలుకుతున్నాను. అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు దాతృత్వంతో ఆయనను అనుసరించే వారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక. అమ్మాబాద్:
ఇవి మృతుని గుసుల్, కఫన్, ఖననం గురించి కొన్ని విషయాలు, మరియు మనం ప్రధాన విషయానికి ముందుగా కొన్ని అంశాలను ప్రస్తావించుకుందాం:
1- ముస్లిం మృతునికి గుసుల్ చేయటం, కఫన్ వస్త్రమును తొడిగించటం, ఖననం చేయటం ఫర్జె కిఫాయ. కాబట్టి, ఈ పనులను చేసే వ్యక్తి అల్లాహ్ తఆ'లా నుండి ప్రతిఫలం మరియు పుణ్యాన్ని పొందడానికి ఇది ఒక తప్పనిసరి విధిని నిర్వర్తిస్తున్నానని సంకల్పం చేసుకోవాలి. కానీ కాఫిర్కు గుసుల్ చేయటం, కఫన్ ఇవ్వటం, ముస్లింలతో కలిసి ఖననం చేయటం అనుమతించబడదు.
2- మృతుని గుసుల్ చేయునవాడు అతని పట్ల నమ్మకస్తుడు, కాబట్టి అతడు గుసుల్ చేయుట మరియు ఇతర అవసరమైన పనులు చేయుట అనివార్యము.
3- మృతుని గుసుల్ చేసే వ్యక్తి మృతుని పట్ల విశ్వసనీయుడై ఉండాలి, అందువల్ల అతను మృతునిలో ఏదైనా లోపాన్ని చూస్తే దాన్ని కప్పి ఉంచాలి.
4- గుసుల్ చేయించువాడు మృతుని పట్ల విశ్వసనీయుడు, కాబట్టి అతనికి సహాయం చేయడానికి అవసరమైనవారు తప్ప మరెవరినీ అతని సమీపంలో ఉండనీయకూడదు; మృతుని తిప్పడం, నీరు పోయడం వంటి పనులలో సహాయం చేయడానికి మాత్రమే.
5- గుసుల్ చేయించువాడు మరణించిన వ్యక్తికి విశ్వసనీయుడు. కాబట్టి, అతను అతనితో మృదువుగా మరియు గౌరవంగా వ్యవహరించాలి మరియు అతని బట్టలు తీసేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు లేదా ఇతర సమయాలలో కఠినంగా లేదా ద్వేషంతో ఉండకూడదు."
6- ఒక పురుషుడు స్త్రీకి గుసుల్ ఇవ్వకూడదు, కానీ ఆమె అతని భార్య అయితే తప్ప. అలాగే, ఒక స్త్రీ పురుషుడికి గుసుల్ ఇవ్వకూడదు, కానీ అతను ఆమె భర్త అయితే తప్ప. అయితే, ఏడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు, పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ గుసుల్ ఇవ్వవచ్చు, అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా.
7 - గుసుల్ ముగిసిన తర్వాత, వ్యక్తికి జనాబత్ స్నానం (శుక్రస్ఖలనం తర్వాత చేసే స్నానం) లాగా స్నానం చేయడం ముస్తహబ్ (అనుమతించబడినది). ఒకవేళ అతను స్నానం చేయకపోయినా, అతనికి ఎలాంటి తప్పు లేదు.
మృతుని గుసుల్ చేసే పద్దతి
మృతునికి గుసుల్ చేయడంలో విధి ఏమిటంటే, శరీరమంతా నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. మరింత మెరుగైన పద్ధతి క్రింది విధంగా ఉంటుంది:
1- మృతుని కడగడానికి ఉంచిన వస్తువుపై అతని పాదాల వైపుకు దిగువుగా ఉంచాలి.
2- మృతుని వస్త్రాలను తొలగించే ముందు, బొడ్డు నుండి మోకాలి వరకు ఒక గుడ్డను చుట్టాలి. ఇలా చేయడం వల్ల దుస్తులు తీసిన తర్వాత మృతుని యొక్క గోప్య భాగం బహిర్గతం కాదు.
3- మృతుని దుస్తులు సున్నితంగా విప్పాలి.
4- గుసుల్ చేయించే వ్యక్తి తన చేతులకు ఒక గుడ్డను చుట్టుకుని, మృతుని యొక్క గోప్యతను బహిర్గతం చేయకుండా శుభ్రపరచాలి, పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత గుడ్డను పారవేయాలి.
5- మృతుని దంతాలు మరియు ముక్కును శుభ్రపరచడానికి ఒక గుడ్డను నీటిలో తడిపి శుభ్రపరచాలి.
6- మృతుని యొక్క ముఖం, మోచేతుల వరకు చేతులు, తల, మరియు మోకాళ్ళ వరకు కాళ్ళు శుభ్రం చేయాలి. కుడి చేతితో మొదలుపెట్టి ఎడమ చేతిని, అలాగే కుడి కాలుతో మొదలుపెట్టి ఎడమ కాలును శుభ్రం చేయాలి.
7 - మృతుని నోటిలో లేదా ముక్కులో నీటిని పోయకూడదు; కేవలం గుడ్డతో శుభ్రపరచడం సరిపోతుంది.
8- శరీరాన్ని మూడు, ఐదు, ఏడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పూర్తిగా శుభ్రం చేయాలి. శరీరానికి అవసరమైన శుభ్రతను బట్టి ఈ సంఖ్యను నిర్ణయించాలి. శుభ్రపరచడం మొదలుపెట్టినప్పుడు, ఎల్లప్పుడూ కుడి వైపు నుండి ప్రారంభించి, ఆ తర్వాత ఎడమ వైపును శుభ్రం చేయాలి.
9- శరీరాన్ని కడగడానికి ఉపయోగించే నీటిలో రేగి ఆకులు కలపడం ఉత్తమం; ఎందుకంటే అది శుభ్రతలో మరింత ప్రభావంతంగా ఉంటుంది. రేగి ఆకులతో కలిపిన నీటిని చేతితో కొట్టి దాని నురుగు కనిపించేలా చేయాలి, ఆ నురుగుతో తలను మరియు గెడ్డమును కడగాలి, మిగతా శరీరాన్ని మిగిలిన నీటితో కడగాలి.
10- చివరిగా కడగటంలో కాఫూర్ కలపడం ఉత్తమం, ఇది సుపరిచితమైన సుగంధ ద్రవ్యం.
11- మృతునికి జుట్టు ఉన్నట్లయితే, దానిని దువ్వాలి. జుట్టును ముద్దగా చేయకూడదు, అలాగే దానిలో ఏ భాగాన్ని కూడా కత్తిరించకూడదు.
12- మరణించినది మహిళ అయితే, ఆమె జుట్టు అల్లికలు వేసి ఉంటే వాటిని విప్పాలి. జుట్టును శుభ్రపరిచి, ఆ తర్వాత, దానిని మూడు జడలుగా అల్లి, ఆ అల్లికలను ఆమె వీపు వెనుక భాగాన ఉంచాలి.
13 - మృతుని కొన్ని అవయవాలు వేరుగా ఉన్నట్లయితే, వాటిని శుభ్రపరిచి, ఆపై మృతదేహానికి కలపాలి.
14- ఒకవేళ మృతదేహం కాలిన గాయాలతో లేదా ఇతర కారణాలతో విచ్ఛిన్నమై, దానిని శుభ్రపరచడం సాధ్యం కాకపోతే, చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం, దానికి తయమ్మమ్ చేయాలి. తయారు చేయు వ్యక్తి తన చేతులతో భూమిని తట్టి, ఆ చేతులతో మృతదేహం యొక్క ముఖాన్ని మరియు చేతులను తుడవాలి.
మృతునికి కఫన్ (వస్త్రం) చుట్టే పద్ధతి.
మృతునికి కఫన్ ఇవ్వటంలో కనీస విధి ఏమిటంటే, ఒక వస్త్రంతో శరీరమంతటినీ కప్పి ఉంచాలి. అయితే, ఉత్తమ పద్ధతి క్రింద వివరించబడింది:
1- మృతదేహాన్ని మూడు తెల్లటి వస్త్రాలతో కప్పాలి. ఈ వస్త్రాలను ఒకదానిపై ఒకటి పేర్చి, వాటిపై మృతదేహాన్ని ఉంచాలి. ఆ తర్వాత, పై వస్త్రం యొక్క కుడి వైపు భాగాన్ని మృతదేహం యొక్క ఛాతీపైకి మడవాలి, ఆపై ఎడమ వైపు భాగాన్ని కూడా అదే విధంగా మడవాలి. రెండవ మరియు మూడవ వస్త్రాలకు కూడా ఇదే పద్ధతిని పాటించాలి. చివరగా, వస్త్రాల అంచులను మృతదేహం యొక్క తల మరియు కాళ్ళ వైపు నుండి వెనక్కి మడిచి, ముడి వేయాలి.
2 - కప్పడానికి ఉపయోగించే వస్త్రాలను ధూపంతో సువాసన చేయాలి. ఆ వస్త్రాల మధ్య కొద్దిగా హనూత్ చల్లాలి. హనూత్ అంటే మృతదేహాల కోసం తయారుచేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల మిశ్రమం.
3- హనూత్ను మృతుని యొక్క ముఖం, శరీరంలోని లోతైన మడతలు, మరియు సజదా చేసే ప్రదేశాలపై ఉంచాలి.
4- హనూత్ను (సువాసన ద్రవ్యము) కొద్దిగా దూదిలో ఉంచి, మృతదేహం యొక్క కళ్ళపైన, ముక్కుపుటాలపై మరియు పెదవులపై ఉంచాలి.
5- హనూత్ను(సువాసన ద్రవ్యము) కొద్దిగా దూదిలో ఉంచి, మృతదేహం యొక్క పిరుదుల మధ్య ఉంచాలి, ఆపై దానిని ఒక గుడ్డతో గట్టిగా కట్టాలి.
6- స్త్రీకి ఐదు వస్త్రాలలో కఫన్ ఇవ్వాలి: అవి: ఇజార్ (కింద కట్టుకునే వస్త్రం), ఖిమార్ (తల కప్పుకునే వస్త్రం), ఖమీస్ (చొక్కా), మరియు రెండు లిఫాఫత్ (శరీరాన్ని చుట్టే వస్త్రాలు). ఒకవేళ స్త్రీకి పురుషుడిని కప్పినట్లుగా కప్పినా ఎటువంటి అభ్యంతరం లేదు.
7- మృతుణ్ణి సమాధిలో పెట్టినప్పుడు కఫన్ ముడులు విప్పాలి.
మృతుని కొరకు నమాజు చేసే విధానం.
1- ముస్లిం మృతుని కొరకు (జనాజా నమాజ్) చదవాలి, అతను చిన్నవాడైనా పెద్దవాడైనా, పురుషుడైనా స్త్రీయైనా.
2- గర్భస్రావం అయిన శిశువుపై కూడా నమాజ్ చేయాలి. అయితే ఇది శిశువుకు నాలుగు నెలలు నిండిన తర్వాత జరిగితేనే వర్తిస్తుంది. ఈ శిశువును పెద్దవారి మాదిరిగానే చూస్తారు, అంటే నమాజ్ చేయడానికి ముందు గుసూల్ ఇవ్వాలి, కఫన్ చేయాలి.
3- గర్భస్రావం అయిన శిశువుకు నాలుగు నెలలు నిండకముందే అది సంభవిస్తే, దానిపై నమాజ్ (జనాజా నమాజ్) చేయకూడదు. ఎందుకంటే ఈ దశలో శిశువులో ప్రాణం పోయబడి ఉండదు. అలాంటి శిశువుకు గుసూల్ లేదా కఫన్ కూడా అవసరం లేదు. దానిని ఎక్కడైనా ఖననం చేయవచ్చు.
4- మృతుని నమాజు చేసేటప్పుడు, ఇమామ్ (నమాజుకు నాయకత్వం వహించే వ్యక్తి) పురుషుడి మృతదేహం తల వద్ద నిలబడాలి, మరియు స్త్రీ మృతదేహం మధ్య భాగం వద్ద నిలబడాలి. ప్రజలు ఇమామ్ వెనుక నిలబడి నమాజ్ చేయాలి.
5- జనాజా నమాజులో నాలుగు తక్బీరులు పలుకబడతాయి, మొదటి తక్బీర్ లో అఊజుబిల్లాహ్, బిస్మిల్లాహ్ తరువాత సూరె ఫాతిహ పఠించాలి.
రెండవ తక్బీర్ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించాలి, ఇలా చెప్పాలి: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ [90]. [90] దీనిని బుఖారీ హదీసు నెంబరు 3370,లో అబూ దావూద్ హదీసు నెంబరు 978.లో ఉల్లేఖించారు.
మూడవ తక్బీర్ తర్వాత, మరణించిన వ్యక్తి కోసం దుఆ (ప్రార్థన) చేయాలి. ఈ దుఆను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన విధంగా చేయడం ఉత్తమం. ఒకవేళ ఆ దుఆ తెలియకపోతే, తెలిసిన విధంగా దుఆ చేయవచ్చు. [91] అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వమయ్యితినా, వ షాహిదినా వగాయిబినా, వసగీరినా వకబీరినా, వజకరినా వ ఉన్సానా, అల్లాహుమ్మ మన్ అహ్యైయ్తహు మిన్నా ఫ అహ్యిహీ అలల్ ఇస్లాం, వమన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్, అల్లాహుమ్మగ్ఫిర్ లహూ వర్హమ్హూ, వఆఫిహీ వఅఫు అన్హు, వఅక్రిమ్ నుజూలహూ వవస్సిఅ్ ముద్ఖలహు, వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బర్ది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహీ, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ జవ్జన్ ఖైరన్ మిన్ జవ్జిహి, వ అద్ఖిల్హుల్ జన్నత, వ అయిజ్,హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అజాబిన్నార్, అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు, వలా తుజిల్లనా బాదహు, వగ్ఫిర్ లనా వలహు యా రబ్బల్ ఆలమీన్, వఫ్సహ్ లహూ ఫీ ఖబ్రిహీ, వ నవ్విర్ లహూ ఫీహి. (ఒక వేళ చిన్నవాడైతే ఇలా చదవాలి:) అల్లాహుమ్మజ్అల్హు జుఖ్ రన్ లివాలిదైహి, వ ఫరతన్, వ అజ్రన్, వ షఫీఅన్ ముజాబన్. అల్లాహుమ్మ సఖ్ఖిల్ బిహి మవాజీనహుమా, వ అఅ'జిమ్ బిహి ఉజూరహుమా, వ అల్హిఖ్హు బిసాలిహి సలఫిల్-ము'మినీన్, వజ్అల్హు ఫీ కఫాలతి ఇబ్రాహీమ్, వ ఖిహి బిరహ్మతికా అ'జాబల్-జహీమ్."
నాల్గవ తక్బీర్ తరువాత కొద్దిసేపు నిలిచి, సలాం చెప్పాలి, సలాం చేయడానికి ముందు ఇలా చెప్పవచ్చు: ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని, పరలోకములో మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు. [92] అందులో ఎటువంటి తప్పు లేదు. [92] దీనిని బుఖారీ హదీసు నెంబరు 6026, ముస్లిం హదీసు నెంబరు 2690 లో ఉల్లేఖించారు.
మృతున్ని ఖననం చేసే పద్ధతి.
1- మృతుడిని ఖననం చేయడంలో విధి ఏమిటంటే, అది జంతువుల నుండి రక్షించబడే విధంగా సమాధి ఉండాలి, ఖిబ్లా వైపునకు తిరిగి ఉండాలి. సమాధి ఎంత లోతుగా ఉంటే, అంత మంచిది.
2- మృతదేహాన్ని ఖననం చేయడంలో లహద్ పద్ధతి ఉత్తమమైనది. ఈ పద్ధతిలో, సమాధి యొక్క లోపల, ఖిబ్లా వైపునకు ఎదురుగా ఒక చిన్న గొయ్యి తవ్వబడుతుంది.
3- అవసరమైతే, అంటే భూమి మెత్తగా ఉన్నప్పుడు, షఖ్ పద్ధతిలో కూడా సమాధిని తవ్వవచ్చు. ఈ పద్ధతిలో, సమాధి యొక్క లోపల, మధ్య భాగంలో మృతదేహం కోసం ఒక గొయ్యి తవ్వబడుతుంది.
4 - మృతదేహాన్ని సమాధిలో ఉంచేటప్పుడు, అది కుడి పక్కకు తిరిగి, ఖిబ్లా వైపునకు ఎదురుగా ఉండేలా చూడాలి.
5- మృతదేహాన్ని సమాధిలో ఉంచిన తర్వాత, ఇటుకలను నిటారుగా అమర్చాలి. ఇటుకల మధ్య ఉన్న ఖాళీలను తడి మట్టితో నింపాలి. ఇలా చేయడం వల్ల మట్టి మృతదేహంపై కూలిపోకుండా ఉంటుంది.
6- ఆ తరువాత సమాధిని పూడ్చి పెట్టాలి, ఎత్తుగా చేయకూడదు, గచ్చుతో లేదా ఇతర వస్తువులతో పక్కాగా నిర్మించకూడదు.
7- మూడు సమయాల్లో ఖననం చేయడానికి అనుమతి లేదు:
సూర్యుడు ఉదయించి, ఒక ఈటె ఎత్తుకు పైకి వచ్చే వరకు ఉన్న సమయంలో. .
మధ్యాహ్న సమయం (జవాల్) నుండి సూర్యుడు పడమర వైపునకు వాలే వరకు.
సూర్యాస్తమయానికి ముందు, సూర్యుడు ఒక ఈటె ఎత్తులో ఉన్నప్పటి నుండి పూర్తిగా అస్తమించే వరకు.
మొదటి మరియు చివరి రెండు సమయాలు (సూర్యోదయం తర్వాత మరియు సూర్యాస్తమయానికి ముందు) సుమారు పదిహేను నిమిషాల పాటు ఉంటాయి. మధ్య సమయం (మధ్యాహ్నం) సుమారు పది నిమిషాలు లేదా దానికి దగ్గరగా ఉంటుంది.
8- అవిశ్వాసి ముస్లింల ఖనన వాటికలో ఖననం చేయబడడు; అతనికి గుసుల్ చేయబడదు, కఫన్ చేయబడదు, జనాజా నమాజు చదవబడదు. అతన్ని ఎవరికీ చెందినది కాని స్థలంలో ఖననం చేయబడుతుంది, లేక అతని స్వదేశానికి తరలించబడుతుంది.
స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
అల్లాహ్ తఆలా యొక్క అవసరం కలవాడు దీనిని రచించాడు
ముహమ్మద్ అస్సాలిహ్ అల్ ఉసైమీన్