إعداد خطيب ماهر

إعداد خطيب ماهر

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

Language: lang_te
Prepared by:
Version: 1.0
Translations 26
Assamese Azerbaijani German English +22
Attachments 7
PDF
Audio
Video
+3

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

ఇన్నల్ హమ్ద లిల్లాహి, నహ్మదుహు వ నస్తయీనుహు వనస్తగ్ఫిరుహు, వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అఅ్ మాలినా, మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్ లిల్ ఫలా హాదియలహు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, సల్లల్లాహు అలైహి వ అలా ఆలిహి వ అస్హాబిహి వ మన్ తబిఅహుమ్ బి ఇహ్‌సానిన్ వ సల్లిమ్ తస్లీమన్. (నిశ్చయంగా స్థుతులన్నీ అల్లాహ్ కొరకే, మేము ఆయన స్థుతులను పలుకుతున్నాము, ఆయనతోనే సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపును వేడుకుంటున్నాము. మరియు మా హృదయముల చెడు నుండి మరియు మా దుష్కర్మల నుండి అల్లాహ్ తో మేము శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపినవారిని అపమార్గమునకు లోను చేసేవాడు ఎవడూ లేడు మరియు ఆయన అపమార్గమునకు లోను చేసినవారిని సన్మార్గము చూపేవాడు ఎవడూ లేడు. అల్లాహ్ ఒక్కడు తప్ప వేరే ఆరాధ్యదైవం లేడని, ఆయనకు ఎవరు సాటి లేరని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యం పలుకుతున్నాను. ఆయనపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై మరియు దాతృత్వంతో వారిని అనుసరించే వారిపై అల్లాహ్ శుభాలను, శాంతిని కురిపించుగాక.)

(ఇక) దీని తరువాత : నిస్సందేహంగా ప్రజల నిరంతర అవసరాలను బట్టి వారి పరిస్థితుల దిద్దుబాటుకొసం షరీఅత్ (ధర్మశాస్త్రం) దానిని నెరవేర్చే (ఆదేశాలను) తెచ్చింది. ఇందులో జుముఅహ్ ప్రసంగానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందువలన జుముఅహ్ ప్రసంగీకుని యొక్క బాధ్యతలు అత్యంత గొప్పవి. మరియు ఈ కారణంతోనే ఈ అంశంతో ఒక పుస్తకాన్ని సిద్ధం చేయాలని (అల్ ముఖ్తసర్ లిల్ ముఅజ్జిన్ వల్ ఇమాం వల్ ఖతీబ్ వ అహ్కామిల్ మసాజిద్) ([1]), మరియు దాని వివిధ భాషలలో అనువందించాడనికి నిశ్చయించాము. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని: - https://islamcontent.com/ar/single-content/74839.

జుమా నమాజు మరియు దాని భావన, దాని సమయం, ఒక ముస్లిం (ముకల్లఫ్) పాటించాల్సిన కొన్ని నియమాలు, అలాగే జుమా ఖుత్బహ్, దాని ఆదేశం, షరతులు, మూలస్తంభాలు, సున్నతులు, దాని అనువాదం, ఇంకా ఖతీబ్ పాటించాల్సిన మర్యాదలు, ప్రసంగం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు మరియు దానిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే అంశాలను కూడా ఈ గ్రంథం వివరించింది.

ఈ విషయం అత్యంత ప్రాముఖ్యత కలిగినది కాబట్టి, మునుపటి పుస్తకానికి కొనసాగింపుగా మరియు దానిని మరింత విస్తరిస్తూ (ఎలాంటి లోటుపాట్లు లేకుండా) (ఇ'దాద్ ఖతీబ్ మాహిర్) అనే పేరుతో ఈ రెండవ సందేశాన్ని (పుస్తకాన్ని) తీసుకురావడం జరిగింది.

మా ఈ పనిని సత్కార్యంగా స్వీకరించాలని, ఇది కేవలం ఆయన (అల్లాహ్) ప్రీతి కోసమే చేసిన నిష్కల్మషమైన కార్యంగా మార్చాలని మరియు ఇందులో శుభాలను (బరకత్) ప్రసాదించాలని మేము అల్లాహ్‌ను వేడుకుంటున్నాము. అల్లాహ్ కే అత్యంత నిఖార్సైన జ్ఞానం ఉంది. అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి మా ప్రవక్త ముహమ్మద్ ﷺ పై వర్షించుగాక

(జుమా ఖుత్బా ప్రాముఖ్యత)

జుముఅ ప్రసంగ వేదిక (మింబర్): ప్రజలను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటి - కాదు, అత్యంత శక్తివంతమైన సాధనం - దానిని సరిగ్గా ఉపయోగించినట్లయితే. ఎందుకనగా, ప్రసంగీకుడు (ఖతీబ్) ప్రతి వారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు, ఇది సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ప్రజలు తమ మనసులను, హృదయాలను ఆయన కోసం తెరిచి ఉంచుతారు. ఒక చిన్న రాయిని తాకడం వంటి పనులు కూడా చేయకుండా (ఏకాగ్రత చెడకుండా) ఆయన మాటలను వింటారు. మరియు అతని నుండి ఉపదేశాలు, హితబోధలు, పాఠాలు మరియు గుణపాఠాలను నిరంతరం స్వీకరిస్తూనే ఉంటారు.

విజయవంతమైన మరియు అల్లాహ్ అనుగ్రహం పొందిన ఖతీబ్ (ప్రసంగీకుడు) ఎవరికైతే అల్లాహ్ ఒప్పించగల శైలిని మరియు శక్తివంతమైన వాగ్ధాటిని ప్రసాదించాడో, అతను వారిపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశా ఆ ప్రభావం, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులపై చూపే ప్రభావం కంటే మరియు సోషల్ మీడియా ప్రభావం కంటే మరింత తీవ్రంగా మరియు బలంగా ఉండవచ్చు; ఎందుకంటే ఖుత్బా అనేది నమాజు అనే ఒక గొప్ప ఆరాధనతో ముడిపడి ఉంది; మరియు ఎందుకంటే వాక్చాతుర్యం, హితబోధ మరియు స్పష్టమైన ప్రసంగం కలిగిన ఖతీబు వారి ముందు నిలబడి ప్రజలను నేరుగా సంబోధిస్తాడు, వారు అతని ముఖ కవళికలను మరియు కంటి చూపులను చూస్తారు, తద్వారా అతను శ్రవణ మరియు దృశ్య ఇంద్రియాల ద్వారా వారిపై ప్రభావం చూపుతాడు, మరియు వారి హృదయాలను మరియు మనస్సులను తాకుతాడు, మరియు అతని ఖుత్బా సమయం మొత్తం వారు మౌనంగా శ్రద్ధగా వింటారు, మరియు అతను వారికి హేతుబద్ధమైన మరియు ప్రామాణిక గ్రంథాల ఆధారాలను మరియు వాదనలను అందిస్తాడు, వాటి ద్వారా అతను - అల్లాహ్ అనుమతితో - వారిని ఒప్పించి, వారి భావనలను సరిదిద్దగలడు.

విజయవంతమైన మరియు అల్లాహ్ అనుగ్రహం పొందిన ఖతీబ్ (ప్రసంగీకుడు) ఎవరంటే: కేవలం ప్రసంగ వేదికను (మింబర్) మాత్రమే తన ధర్మప్రచారానికి పరిమితం చేయకుండా, దానిని ఒక ప్రధాన ద్వారంగా మలుచుకుని జ్ఞానాన్ని మరియు మేలును వ్యాప్తి చేసేవాడు. అంతేకాకుండా, తన శక్తి మేరకు పుణ్యకార్యాలు మరియు సమాజ సేవకు సంబంధించిన ప్రతి రంగంలోనూ అతను తన వంతు సహకారాన్ని అందిస్తాడు. ఎక్కడ మంచి జరుగుతున్నా అక్కడ అతను ముందు వరుసలో కనిపిస్తాడు, అల్లాహ్ మార్గంలో త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ అతను ఒక సైనికుడిలా సిద్ధంగా ఉంటాడు

కాబట్టి ఈ ఖతీబు, ప్రవక్తలు మరియు సందేశహరులు (అలైహిముస్సలాతు వస్సలాం), మరియు ఇస్లాం ఉమ్మత్ యొక్క నిష్కల్మషమైన పండితులు మరియు బోధకుల వలె, అల్లాహ్ వైపుకు పిలవడం మరియు ముస్లింలకు ప్రయోజనం చేకూర్చడం పట్ల శ్రద్ధ వహించేవాడు, మరియు తన ప్రసంగాలలో నూతనత్వాన్ని, ఆకర్షణను మరియు వినేవారిలో కుతూహలాన్ని కలిగించడానికి ఆసక్తిని చూపేవాడు.

ఒక ఖతీబుకు ఉండవలసిన అర్హతలు చాలా మంది ఖతీబులలో ఉన్నప్పటికీ, సత్యసంధత మరియు చిత్తశుద్ధితో దైవ సందేశాన్ని అందించే ఖతీబు నుండి ఆశించబడే విధంగా వారి ఖుత్బా ఆశించిన ఫలాలను ఇవ్వదు.

మరియు ప్రతి శుక్రవారం అతను వారి భావోద్వేగాలను మరియు అవసరాలను స్పృశించే, వారి హృదయాలను ఆకట్టుకునే ఒక అంశంతో వారి వద్దకు వస్తాడు, మరియు ఒక సంవత్సరంలో యాభై సార్లు వారిని కలుస్తాడు. అయితే, ఈ సాధనం కంటే ఎక్కువ ప్రభావం చూపే సాధనం మరొకటి ఉంటుందా?

కావున, జుమా ఖుత్బా ఇస్లాం యొక్క అత్యంత శ్రేష్ఠమైన ఆచారాలలో ఒకటి, మరియు అల్లాహ్ వైపునకు ఆహ్వానించుటకు, ఆయన షరిఅత్ ను ప్రచారం చేయుటకు, ఆయన దాసులపై సత్యాన్ని నిరూపించడంలో (ఇఖామతుల్ హుజ్జ) అత్యంత కీలకమైన వేదిక అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీనినే ఇస్లాం శత్రువులు తమ ధర్మంలో కూడా ఇలాంటిది ఉండాలని ఆకాంక్షిస్తారు. ఎంతగా అంటే ఇస్లాంతో పోరాడే పార్టీల నాయకులలో ఒకరు ఇలా అన్నారు: అయ్యో! నా వద్ద కూడా ఇలాంటి ప్రసంగ వేదికలు (మింబర్లు) ఉండి ఉంటే ఎంత బాగుండేది?

విద్యలు మరియు కళలు వాటి లక్ష్యాల గొప్పదనాన్ని బట్టి గౌరవించబడతాయి. ప్రసంగ కళకు అత్యంత ప్రాముఖ్యత గల ఒక లక్ష్యం ఉంది: అదేమిటంటే, ప్రజలకు సత్యాల వైపు మార్గనిర్దేశం చేయడం, మరియు ఈ ప్రాపంచిక జీవితంలోనూ, ఆ పరలోక జీవితంలోనూ వారికి ప్రయోజనం చేకూర్చే విషయాల పట్ల వారిలో అభిలాషను కలిగించడం.

ఉపన్యాసం, నాయకత్వం మరియు ఆధిపత్య సాధనాలలో ఒకటిగా పరిగణించబడింది..

ప్రసంగంలో గొప్ప గౌరవం ఉంది: దాని గౌరవం ఏమిటంటే, దానిని నిర్వర్తించేవాడు వివేకవంతుడు, పండితుడు మరియు సువక్త అయి ఉండాలి» ([2]). - "అల్-ఖితాబతు ఇందల్-అరబ్", లి-ముహమ్మద్ అల్-ఖద్ర్ హుసైన్: 178- 179.

మరియు షరిఅత్, నమాజీపై మీ ప్రసంగాన్ని మౌనంగా వినడాన్ని విధిగావించింది, ఓ ప్రసంగీకుడా సోదరా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు వ్యర్ధమైనపని చేసినవాడవు అవుతావు.” ముత్తఫఖున్ అలైహి[3] లగౌత అర్ధము: సదరు వ్యక్తి జుమా నమాజు యొక్క పూర్తి పుణ్యాన్ని (సవాబ్) కోల్పోతాడు అని అర్థం. బుఖారీ హదీసు నెంబరు 934, ముస్లిం హదీసు నెంబరు 851.

అంతేకాదు, ప్రజలు తమ ముఖాలను మీ వైపు తిప్పడం ముస్తహబ్బ్. ఈ విషయంపై ఇమాం అన్-నవవీ, ఇబ్నుల్ మున్దిర్ మరియు ఇబ్ను అబ్దిల్ బర్ (వారిపై అల్లాహ్ కరుణ వర్షించుగాక) పండితుల ఏకాభిప్రాయాన్ని ఉల్లేఖించారు ([4]). - "అల్ మజ్మూఅ్": 4/ 447.

(కరుణామయుని దైవదూతలు నీ మాటను ఆలకిస్తున్నారు, కనుక వారికి తగిన గౌరవం ఇవ్వు.)

ఓ జుమా ఖతీబ్ గారూ! మీకు లభించే అత్యంత గొప్ప గౌరవం మరియు గర్వకారణం ఏమిటంటే అల్లాహ్ యొక్క దైవదూతలు నీవు ఇచ్చే ప్రసంగాన్ని మరియు హితబోధలను వినడానికి స్వయంగా హాజరవుతారు. సహీహైన్ లో ఉన్నట్లుగా, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు ([5]): జుమా రోజున మస్జిదులోని ప్రతి ద్వారం వద్ద దైవదూతలు కూర్చుని మొదట ప్రవేశించిన వారి పేర్లు రాస్తారు, తరువాత ఇమామ్ మింబర్ మీద కూర్చోగానే, వారు తమ రిజిస్టర్ మూసివేసి ఖుత్బా (ప్రసంగం) వినడంలో లీనమైపోతారు. బుఖారీ హదీసు నెంబరు 3211,ముస్లిం హదీసు నెంబరు 850.

మీరు దానిని గ్రహించినప్పుడు: మీ హృదయంలో ఖుత్బా యొక్క ఘనత పెరుగుతుంది, మరియు సత్యాన్నే పలకాలని, అప్పగించబడిన బాధ్యతను (అమానత్) నెరవేర్చాలని మరియు ప్రజలకు హితబోధ చేయాలనే నీ తపన రెట్టింపు అవుతుంది, వారి మెప్పును ఆశించకుండా మరియు వారిని ప్రసన్నం చేయకుండా ఉండటంపై మీ శ్రద్ధ అధికమవుతుంది.

ఓ ఆశీర్వదించబడిన ఖతీబ్ (ప్రసంగకర్త)! నీతో సమానమైన వారు ఇంకెవరున్నారు?

అల్లాహ్ ప్రజలపై మీ మాటలను శ్రద్దగా వినాలని మరియు మీ ప్రసంగానికి మౌనం వహించాలని తప్పనిసరి చేసాడు. ఎంతగా అంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు వారు కనీసం కదిలించడం వంటి పనుల ద్వారా దృష్టి మళ్లించడాన్ని కూడా ఆయన నిషేధించాడు. అంతెందుకు, ఆ సమయంలో పక్కవాడు ఏదైనా తప్పు చేస్తున్నా, అతన్ని నోటితో వారించడాన్ని (నహీ అనిల్ మున్కర్) కూడా అల్లాహ్ వారించాడు. నీ ప్రసంగాన్ని వినడానికి ఆయన తన దైవదూతలను పంపాడు!

ఇంతటి గొప్ప అవకాశం నీకు లభించినందున, నీవు అల్లాహ్ పట్ల పూర్తి చిత్తశుద్ధిని (ఇఖ్లాస్) కలిగి ఉండటం తప్పనిసరి చేస్తుంది, నీ ప్రసంగాలు మరియు హితబోధల ద్వారా ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమంగా మేలు చేకూర్చాలి. మరియు మీ ఖుత్బాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అల్లాహ్ స్మరణ, ప్రజలకు హితబోధ చేయడం, వారి ధార్మిక మరియు ప్రాపంచిక జీవితాలను చక్కదిద్దే విషయాల గురించి వారికి తెలియజేయడం.

***

(ఏది ఉత్తమం: ఖుత్బాను చూడకుండా ఇవ్వడమా లేక కాగితం చూసి చదవడమా?)

నిస్సందేహంగా, ఖతీబ్ (ప్రసంగీకుడు) ఒక కాగితం చూసి ప్రసంగం చదవడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది ప్రసంగీకులకు మరియు వక్తలకు ఆశువుగా (ఏమీ చూడకుండా) మాట్లాడటం కంటే, ఇలా కాగితం చూసి చదవడమే సరైన పద్ధతి కావచ్చు. ఇది మనం నిత్యం చూస్తున్న వాస్తవం.

ఆశుప్రసంగం, ఖతీబ్ (ప్రసంగీకుడు) యొక్క ప్రతిస్పందన మరియు ఉత్సాహంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, ఇది - నిస్సందేహంగా వినేవారిలో కూడా అదే స్థాయి అనుభూతిన విరుద్ధంగా (అంటే ప్రసంగీకుడు ఉత్సాహం లేకుండా ఉంటే), వినేవారిలో కూడా నిస్సత్తువ కనిపిస్తుంది.

వినికిడి మరియు చూపు అనే రెండు ఇంద్రియాలు కలిసి విషయాన్ని గ్రహించినప్పుడు, అది విషయాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రభావితం కావడంలో మరియు మనస్సులో స్థిరపడటంలో మరింత ప్రభావవంతంగా ఉంటుందనేది సువిదితం. దీనికి భిన్నంగా, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే పనిచేస్తే అంత ప్రభావం ఉండదు. కాబట్టి, ప్రజల వైపు తిరిగి, వారి కళ్ళలోకి చూస్తూ, చూసి చదవకుండా ప్రసంగించే ఖతీబ్, కాగితం చూసి ప్రసంగించే వాని కన్నా మరింత ప్రభావశీలిగా ఉంటాడు. ఎందుకంటే కాగితం చూసి ప్రసంగించే వాని నుండి ప్రజలు కేవలం వినికిడి ద్వారా మాత్రమే విషయాన్ని గ్రహిస్తారు. ఆ వినికిడి కూడా, చూసి చదవకుండా ప్రసంగించే ఖతీబ్ విషయంలో ఉన్నంత ప్రభావవంతంగా ఉండదు, ఎందుకంటే అతని స్వరం మరింత బలంగా ఉంటుంది మరియు ప్రజలతో మరింతగా మమేకమవుతుంది.g

ఎవరైతే ఆశుప్రసంగం చేయడానికి అనేకసార్లు ప్రయత్నించి, తన ప్రసంగంలో ఎక్కువగా సంకోచించడం, తడబడటం, మరచిపోవడం, లేదా తీవ్రమైన భయం మరియు ఒత్తిడిని గమనిస్తాడో, మరియు రోజులు గడిచేకొద్దీ, నిరంతర అభ్యాసం చేసినప్పటికీ ఈ విషయాలు తగ్గడం లేదని భావిస్తాడో, అతను ప్రసంగాలను చూసి చదవడమే ఉత్తమం. ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ ఆశుప్రసంగం చేసే భాగ్యం లభించదు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రజల మధ్య భౌతిక సంపదలను ఎలాగైతే పంచిపెట్టాడో, అలాగే వారి మధ్య నైతిక విలువలు, సామర్థ్యాలు, ప్రతిభలు మరియు ఆకాంక్షల వంటి ఆధ్యాత్మిక సంపదలను కూడా పంచిపెట్టాడు.

(ప్రసంగ కళలో విజయానికి మార్గాన్ని సుగమం చేసే ఎనిమిది సోపానాలు)

మొదటిది: దానిపై సహాయం కొరకు అల్లాహ్‌ను హృదయపూర్వకంగా ప్రార్థించడం, మరియు పూర్తి చిత్తశుద్ధితో, వినమ్రతతో ఆయనను వేడుకోవడం.

రెండవది: ఈ విషయంలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌పై సత్యసంధమైన తవక్కుల్ (భరోసా) మరియు ఆయనపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం. అల్లాహ్ తన దాసుని నమ్మకానికి అనుగుణంగానే ఉంటాడు. ఎవరైతే ఆయనపై భరోసా ఉంచుతారో, వారి చింతలను మరియు కోరికలను తీర్చడానికి ఆయనే చాలు.

మూడవది: ప్రసిద్ధ మరియు ప్రతిభావంతులైన ప్రసంగీకుల (ఖతీబ్‌ల) ఉపన్యాసాలను వినడం మరియు వారి అనుభవాల నుండి ప్రయోజనం పొందడం.

నాల్గవది: ఖుత్బాను ఒంటరిగా ఇవ్వటం శ్రేష్ఠమైనది, అది మస్జిద్ లోపలి మైక్ ద్వారా అయినప్పటికీ. ఒకవేళ మింబర్ పై నుండి ఇస్తే అది ఇంకా చాలా శ్రేష్ఠమైనది.

ఐదవది: భావాలను వ్యక్తపరచడంపై అభ్యాసం చేయటం, అలాగే భావోద్వేగాలను మరింత బలపరచుకోవడం.

ప్రసంగం, ఉపన్యాస కళ మరియు ప్రజలను ప్రభావితం చేయడంలో అత్యంత విజయవంతులైన వారి రహస్యాల గురించి నేను లోతుగా ఆలోచించాను: అల్లాహ్ అనుగ్రహం తర్వాత, వారి విజయానికి అసలు రహస్యం వారిలో ఉన్న 'భావోద్వేగ శక్తి' వారు తమ భావాలను పైపైన కాకుండా, అత్యంత వివరంగా షరిఅత్ పరిమితులకు లోబడి ప్రదర్శించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటమే దీనికి కారణం.

నిశ్చయంగా, భావోద్వేగ శక్తి: వాక్చాతుర్యం కలవారిని దానిని వ్యక్తపరచడానికి, మరియు వివేకవంతులను దానిని ప్రదర్శించడానికి పురికొల్పుతుంది. అది తన సమ్మోహనంతో హృదయాలను ఆకర్షిస్తుంది, మరియు తన అందం మరియు నైపుణ్యంతో మేధస్సులను మంత్రముగ్ధులను చేస్తుంది. భావోద్వేగం బలహీనంగా ఉన్నవాడి జ్ఞానంలో అధిక భాగం అతని భావోద్వేగంతో పాటే మరణిస్తుంది, మరియు అతని భావాలు మరణించడంతో ప్రజలపై అతని ప్రభావం అంతరించిపోతుంది.

ఖతీబుకు ఇది తప్పనిసరి: తాను ప్రబోధించే విషయం పట్ల పూర్తి ఉత్సాహంతో, దాని సత్యంపై దృఢ విశ్వాసంతో నిండి ఉండాలి. ఎందుకంటే, హృదయం నుండి వెలువడిన మాట హృదయంలోకి చేరుతుంది. అందువల్ల, ఖతీబు యొక్క ఉత్సాహం, వినేవారి ఉత్సాహం కంటే బలంగా ఉండాలి. తద్వారా అతను వారిని ప్రభావితం చేసి, వారి జ్ఞానదాహాన్ని తీర్చగలడు. లేకపోతే, శ్రోతలు అతనిలోని నిరుత్సాహాన్ని గ్రహిస్తారు, తద్వారా అతని మాటల ప్రభావం శూన్యమవుతుంది.

తమ ఆలోచనలను, భావాలను లిఖించడం, వాటి గురించి ఒంటరిగా మాట్లాడుకోవడం, ఆ తర్వాత వాటిని తమకు ప్రియమైన వారి ముందు వ్యక్తీకరించడం ద్వారా నిరంతరం సాధన చేయడం తప్పనిసరి.

భావాలు బంధించి ఉంచితే, అవి ఎండిపోయి అంతరించిపోతాయి. కానీ వాటికి స్వేచ్ఛను ఇస్తే అది కూడా షరిఅత్ పరిమితులకు లోబడి ఉంటే అవి జలపాతంలా ఉప్పొంగుతాయి. ఆ ప్రవాహం కాగితాలపైకి చేరితే రచనలుగా, గ్రంథాలుగా మారుతుంది; ప్రసంగ వేదికలపైకి చేరితే అద్భుతమైన వాక్ధాటిగా, ప్రసంగాలుగా మారుతుంది; ప్రజల వద్దకు చేరితే అది ప్రేమగా, కరుణగా మారుతుంది

ప్రబోధకుడవైన నా సోదరా, మీ భావాలకు మరియు అనుభూతులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వు; తద్వారా నీలోనూ మరియు ఇతరులలోనూ జీవం, సృజనాత్మకత, చైతన్యం, అభివృద్ధి మరియు కరుణ యొక్క స్ఫూర్తి జీవం పోసుకుంటుంది.

ఎవరి మనోభావాలు ఉన్నతంగా ఉంటాయో, అతని నైతికత శ్రేష్ఠంగా ఉంటుంది, అతని వ్యక్తిత్వం గౌరవనీయమవుతుంది, అతనికి స్నేహితులు అధికమై శత్రువులు తగ్గిపోతారు, అతని వారి వాదనలో స్పష్టత కనిపిస్తుంది, వారి మాటల్లో ప్రభావం (బలాగత్) పెరుగుతుంది మరియు వారి వాక్చాతుర్యం (ఫసాహత్) గొప్పగా మారుతుంది.

ఆరవది: నిజాయితీ గల, వివేకవంతుడైన, అనుభవజ్ఞుడైన మరియు నీ శ్రేయస్సును కోరే (మిత్రుని) నుండి సలహాలను కోరడం. అతను నీలోని లోపాలను వేలెత్తి చూపి, వాటిని నీవు సరిదిద్దుకోవడానికి సహాయపడతాడు; అలాగే నీలోని మంచి లక్షణాలను గుర్తించి, వాటిని నీవు కొనసాగించేలా మరియు మరింత మెరుగుపరుచుకునేలా ప్రోత్సహిస్తాడు.

ఏడవది: ఖుత్బా కొరకు ముందుగానే సిద్ధం చేసుకోవడం.

ఎనిమిదవది: జుమా ఖుత్బాను సిద్ధం చేయడం మరియు దానిని ప్రసంగించే విధానానికి సంబంధించిన పుస్తకాలను అధ్యయనం చేయటం. - చూడండి : (అల్ ముఖ్తసర్ అల్ ముఫీద్ లిల్ ముఅజ్జిన్ వల్ ఇమాం వల్ ఖతీబ్ వ అహ్కామిల్ మసాజిద్) : పేజి 95, https://islamcontent.com/ar/single-content/74839.

ఖుత్బా ఇచ్చే ప్రారంభంలో ఆందోళన మరియు ఒత్తిడి కలగడం ఒక సాధారణమైన మరియు సహజమైన విషయం.

ప్రసంగాలు ఇచ్చే తొలినాళ్లలో మీకు ఆందోళన మరియు భయం కలుగుతుంది. ఇది మానవులందరి సహజ స్వభావం. బహుశా, ప్రజలు మిమ్మల్ని చూడటం వల్ల లేదా మీ జ్ఞానం బలహీనమైనదనే మీ ఆలోచన కారణంగానే ఈ భావన కలుగుతోందని మీకు అనిపించవచ్చు.

మరియు మీ ఆందోళనను పెంచేది: ప్రజలు మీలో దీనిని గ్రహించి, దానిని అయిష్టపడుతున్నారని మీరు భావించడం, మరియు బహుశా అదే వారు మీ నుండి దూరమవడానికి కారణం కావచ్చు.

నిస్సందేహంగా, మీరు అల్లాహ్‌తో మీ అనుబంధాన్ని పెంచుకోవడం, ఆయనపైనే భరోసా ఉంచడం, చిత్తశుద్ధితో దుఆ చేయడం మరియు నిరంతర సాధన చేయడం ద్వారా మీలోని భయం పూర్తిగా తొలగిపోతుంది. చివరికి నీవు ప్రసంగకళను ఆస్వాదించే స్థాయికి చేరుకుంటావు. ఆ ప్రసంగంలోని మాధుర్యాన్ని చవిచూడటానికి నీవు శుక్రవారం (జుమా) కోసం ఆత్రుతగా ఎదురుచూసే స్థితికి వస్తావు.

కాబట్టి మానవునికి సాఫల్యం యొక్క నిధులు మరియు మహా దాత, వరప్రదాత అయిన అల్లాహ్ సుబ్ హానహు యొక్క కృపలు తెరవబడేంత వరకు ఓపిక పట్టడమే (సబర్) ఏకైక మార్గం.

ప్రారంభంలో ఎదురయ్యే కఠినమైన శ్రమను ఓర్పుతో భరించడం, అంతిమంగా విశాలమైన సౌభాగ్యానికి, ఉన్నత స్థానానికి మరియు సంతోషానికి దారి తీస్తుంది.

మరియు నీ మనస్సులో ఇలా అనుకో: కష్టం తరువాత ఉపశమనమే ఉంటుంది, మరియు ఇబ్బంది తొలగిపోతుంది, మరియు అలసట తరువాత విశ్రాంతే ఉంటుంది, ఇది కేవలం ఒక గడియ సహనం మాత్రమే, కాబట్టి సహనం వహించు మరియు స్థిరంగా ఉండు, తద్వారా నీవు ప్రసంగ పీఠాలను అధిరోహించి, అల్లాహ్ వైపు పిలుపును బహిరంగంగా ప్రకటించగలవు, మరియు అల్లాహ్ మాట సత్యం, మాట ఇవ్వడంలో అల్లాహ్ కంటే మించిన సత్యవంతుడు ఇంకెవరు? మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. [అల్-అన్'కబూత్: 69]

ఖతాదహ్ - రహిమహుల్లాహ్ - ఎంత అద్భుతమైన మాట పలికారు: “ఓ ఆదం కుమారుడా, నీవు కేవలం ఉత్సాహం ఉన్నప్పుడు మాత్రమే మంచి పనులు చేయాలనుకుంటే, నిశ్చయంగా నీ ఆత్మ విసుగు, అలసట మరియు నిరుత్సాహం వైపు మొగ్గు చూపుతుంది, కానీ విశ్వాసి తనను తాను ఒత్తిడి చేసుకుని (కష్టాన్ని భరించి) ముందుకు సాగేవాడు, తనను తాను బలపరుచుకునేవాడు మరియు (లక్ష్య సాధనలో) దృఢంగా ఉండేవారు» ([7]). ముతషద్దిద్ అనగా: సత్కార్యాలను కాపాడుకుంటూ, వాటిని నిరంతరం కొనసాగించడాన్ని తనపై తాను విధిగా చేసుకున్నవాడు. - "తఫ్సీర్ ఖుర్తుబీ": (1/251). మరియు ఖతాద -రహిమహుల్లాహ్- యొక్క ఉల్లేఖనం, దీనిని అబుల్ ఖాసిమ్ ఇబ్నె బుష్రాన్ అల్-బగ్దాదీ (మరణం: 430 హి.) తన "అమాలీహ్" లో (1454) ఉల్లేఖించారు.

(ప్రసంగమంటే కలిగే విపరీతమైన భయం నుండి విముక్తి పొందే కారణాలు/మార్గములు)

భయము - ముఖ్యంగా ప్రారంభంలో భయం కలగడం అనేది చాలా సాధారణమైన మరియు సహజమైన విషయం. నిజానికి, ఆ భయం 'సానుకూలమైనది' అది ప్రసంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మరియు దాని కోసం ముందస్తుగా సిద్ధపడటానికి సహాయపడుతుంది. మరియు ప్రజలను తేలికగా తీసుకోవటం, విజ్ఞానభరితమైన విషయం యొక్క నాణ్యతపై శ్రద్ధ వహించకపోవటం, మరియు తగిన పదాలను, అర్థాలను ఎంచుకోకపోవటం వంటి వాటికి దారితీసే మనస్సు యొక్క మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అదుపులో ఉంచుతుంది.

కానీ ప్రతీ ఖుత్బాలో మరియు దీర్ఘకాలం పాటు భయం నిరంతరం ఉండటం ఒక ప్రతికూలమైన విషయం - దీనిని ఆధునిక యుగంలో సోషల్ ఫోబియా (సామాజిక భయం) అని అంటారు -: దాని నుండి విముక్తి పొందటానికి కొన్ని మార్గాలను చేపట్టాలి, వాటిలో కొన్ని:

మొదటిది: అల్లాహ్ తఆలా పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండటం, ఆయనను ఆశ్రయించడం, మరియు ఆయన నీకు సంతృప్తిని ప్రసాదించమని, నీ హృదయంపై ప్రశాంతతను అవతరింపజేయమని తరచుగా దుఆ చేయడం.

రెండవది: ఖుత్బాకు ముందు పుదీనా వంటి కొన్ని శాంతపరిచే పానీయాలు త్రాగడం, ఎందుకంటే ఇది ఆందోళన మరియు భయాన్ని శాంతపరచడంలో ప్రభావం చూపుతుంది.

మూడవది: విమర్శను వినడానికి మరియు దాని పట్ల సంతోషించడానికి మనస్సును స్థిరపరచుకోవడం; ఇది పురోగతికి మరియు సృజనాత్మకతకు ఒక సోపానంగా ఉంటుంది, మరియు తప్పుల పట్ల భయం లేకుండా చేస్తుంది.

నాలుగవది: ముందుగానే హాజరవ్వడం. నిస్సందేహంగా, సమయాన్ని అందుకోవడానికి హడావిడిగా వచ్చే ఖతీబ్ మనస్సు కలత చెందుతుంది, అతని హృదయం అశాంతికి లోనవుతుంది, మరియు అతన్ని ఆందోళన, ఒత్తిడి ఆవరిస్తాయి. ఈ పరిస్థితి ఖుత్బా సమయంలో కూడా కొనసాగుతుంది.

ఐదవది: ప్రజలను చూసేందుకు మీ తల పైకెత్తండి, అప్పుడప్పుడు కాగితం చూడకుండా స్వతహాగా మాట్లాడండి. ప్రారంభంలో కష్టంగా అనిపించినా, తప్పులు దొర్లినా, తడబడినా సరే, మీరు కాగితంలో ఉన్నదానికే పరిమితమై, ధైర్యంగా ప్రేక్షకులను చూడకుండా ఉంటే, అది వినేవారిలో మీ ప్రసంగం పట్ల ఉత్సాహాన్ని పోగొడుతుంది మరియు మింబర్ పట్ల మీలో భయం, ఆందోళన కొనసాగేలా చేస్తుంది.

సంవత్సరాల తరబడి ఖుత్బా ఇస్తున్న అనుభవం ఉన్న కొంతమంది ఖతీబ్ లు, కానీ వారు కాగితంలో ఉన్నది చూసి చదవడం తప్ప ప్రజల వైపు చూడరు, వారు ప్రతి ఖుత్బా సమయంలో భయం మరియు ఆందోళనను అనుభవిస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, వారిలో ఒకరు ఇలా అంటారు: "ప్రతి ఖుత్బాలో నేను ఆందోళన మరియు భయంతో, మొదటిసారి ఖుత్బా ఇస్తున్నట్లుగా ఉంటాను!

అయితే, మీ ప్రసంగాల ప్రారంభంలో ప్రజల ముఖాల వైపు చూడకండి. ఎందుకంటే, మీరు భయపడే వారిపై మీ దృష్టి పడితే మీరు తడబడవచ్చు, మరియు ప్రజల చూపులు మిమ్మల్ని కలవరపరచవచ్చు. దానికి బదులుగా, వారిపై మరియు వారి కళ్లపై దృష్టి పెట్టకుండా, వారి తలల వైపు చూడండి.

ఆరవది: మీరు మింబర్ పైకి ఎక్కేటప్పుడు, జరగబోయే ప్రతికూలతలు లేదా తప్పుల గురించి ఆలోచించవద్దు. దానికి బదులుగా, అల్లాహ్ అనుమతితో ఆశించిన సానుకూల ఫలితాల గురించి, మరియు మీ ఖుత్బా ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం, మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును నిషేధించడం అనే ఆరాధనను స్థాపించడానికి అల్లాహ్ మీకు ఇచ్చే తౌఫీఖ్, మరియు ఆయన వైపునకు ఆహ్వానించడం వంటి గొప్ప ప్రయోజనాల గురించి ఆలోచించండి.

ఏడవది: ఖుత్బాకు ముందు సరైన పద్ధతిలో శ్వాస తీసుకోండి. అదెలాగంటే, ముక్కు ద్వారా లోతుగా శ్వాస పీల్చుకుని, కొద్ది క్షణాల పాటు గాలిని బిగబట్టి, ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ విధమైన శ్వాస ఉద్రిక్తతను తొలగించడంలో గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. నిపుణులు మరియు వైద్యులు పేర్కొన్న దాని ప్రకారం, సాధారణ శ్వాస ప్రక్రియలో మెదడుకు ఏడు నుండి పది లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది, అయితే సరైన పద్ధతిలో శ్వాస తీసుకున్నప్పుడు దాదాపు డెబ్బై ఐదు లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇది ఆందోళన మరియు ఉద్రిక్తతకు కారణమయ్యే హార్మోన్ల స్థాయిలను తగ్గించడానికి దారితీస్తుంది. ఈ పద్ధతిని ప్రయత్నించి చూడగా, ఉద్రిక్తత, దుఃఖము మరియు ఆందోళనను తొలగించడంలో దీని గొప్ప ప్రభావం ఉన్నట్లు కనుగొనబడింది.

ఇక ఖుత్బా సమయంలో, హాజరైన వారి దృష్టిని ఆకర్షించని విధంగా లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రసంగంలో తగిన విరామం తీసుకున్నప్పుడు నోటి ద్వారా గానీ, ముక్కు ద్వారా గానీ వేగంగా, ఎక్కువ పరిమాణంలో శ్వాస తీసుకుని, ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించాలి. దాదాపుగా ప్రతి విరామంలోనూ ఇదే విధంగా చేయాలి.

(మీపై వచ్చే తప్పుడు విమర్శలకు అత్యుత్తమ పరిష్కారం)

ఓ ప్రసంగీకుడా సోదరా! బాగా ఆలోచించి, పరిశీలించి, అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాత, మీరు తీసుకున్న నిర్ణయంలో గానీ, మీరు ఎంచుకున్న శైలిలో గానీ, లేదా మీరు అనుసరించిన మార్గంలో గానీ మీకు పూర్తి నమ్మకం కలిగితే, అప్పుడు విమర్శకులను, నిందించేవారిని పట్టించుకోవద్దు. ఎందుకంటే, ఒక వ్యక్తి ఏమి చేసినా, అతని హోదా ఎంత ఉన్నతమైనదైనా, ప్రజల విమర్శల నుండి ఎవరూ తప్పించుకోలేరు.

మరియు ఒకవేళ మీరు వారి విమర్శల వైపు దృష్టి సారించినట్లైతే: మీ సంకల్పం బలహీనపడుతుంది, మీ హృదయం సంకుచితమైపోతుంది, మరియు అభివృద్ధి, సృజనాత్మకత పట్ల గల ఆకాంక్ష యందు మీరు విరక్తి చెందుతారు.

ప్రతీ పుస్తకానికి, వ్యాసానికి మరియు కర్మకు దానిని తప్పుపట్టేవాడు మరియు విమర్శించేవాడు ఉంటాడు.

విమర్శకులతో సున్నితంగా, గౌరవంతో వ్యవహరించి, వారికి ఉత్తమమైన పద్ధతిలో ప్రతిస్పందించాలి. మరియు ఆ విమర్శకుడు మీ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తి కాకపోయినప్పటికీ, వారి వద్ద ఉన్న సత్యాన్ని గర్వపడకుండా స్వీకరించాలి.

(ఖుత్బాకు ముందు ఖతీబుకు హితబోధలు)

ఓ ఖతీబ్ సోదరా, మీరు ఖుత్బాకు ముందు కొన్ని పనులను చేపట్టాలి, అవి అల్లాహ్ తఆలా సహాయం తర్వాత, మింబర్ పై నిలబడి మీ ఖుత్బాను ఇవ్వడానికి మీకు తోడ్పడతాయి. వాటిలో కొన్ని:

మొదటిది: మీరు అల్లాహ్ సందేశాలను చేరవేయడానికి మరియు ఆయన వైపుకు ఆహ్వానించడానికి వెళ్తున్నారని మనస్సులో ఉంచుకొని, అప్పుడప్పుడు ఆయన యొక్క ఈ సూక్తిని చదవండి: వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరి ఇతర సమయాల్లో అల్లాహ్ యొక్క ఈ వాక్యాన్ని చదవాలి: మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: "నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది? [ఫుస్సిలత్: 33]

అల్లాహ్ వాక్కు: (వారితో) అను: "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను! [యూసుఫ్: 108]

మరియు ఇది మిమ్మల్ని మరింత నిజాయితీ, దృఢ సంకల్పం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడానికి ప్రేరేపిస్తుంది. ఇంకా, ప్రసంగం యొక్క మహోన్నత లక్ష్యాన్ని స్మరించుకోవడానికి కూడా ఇది ప్రోత్సహిస్తుంది; ఆ లక్ష్యం కొరకే మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపాడు. ఆ లక్ష్యమే: ధర్మాన్ని (దీన్‌ను) చేరవేయడం మరియు దానిని వ్యాప్తి చేయడం. మరియు ఇదే ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప పదవి.

రెండవది: మింబర్ పైకి ఎక్కే కొంచెం ముందు, అల్లాహ్ నీకు ఇఖ్లాస్, తౌఫీఖ్ మరియు సవ్యతను ప్రసాదించాలని, ఇంకా నీవు చెప్పే మాటల ద్వారా నీకు మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలని ఆయనను ప్రార్థించు. ఎందుకంటే, ఎందరో ఖతీబ్'లు మరియు వక్తలు తాము చెప్పే విషయాల నుండి తామే హితబోధ పొందరు, ఒకవేళ పొందినా కాలక్రమేణా వారు చెప్పినది వారే మర్చిపోతారు."

మీకు వాగ్ధాటి మరియు స్పష్టతను ప్రసాదించమని ఎల్లప్పుడు అల్లాహ్ ను అర్థిస్తూ ఉండండి.

మూడవది: సాధారణంగా, మీరు ఖుత్బా ఇవ్వడానికి చాలా కాలం ముందే అనేక ఖుత్బాలను సిద్ధం చేసుకోవాలి; కొన్నిసార్లు వాటిని సిద్ధం చేయడానికి మరియు ఇవ్వడానికి మధ్య నెలలు లేదా సంవత్సరాల సమయం కూడా ఉండవచ్చు.

ఎందుకంటే, మీ మదిలోకి ఒక విషయం వచ్చినప్పుడు, లేదా మీరు చదువుతున్నప్పుడు ఒక విలువైన ప్రయోజనం మీ దృష్టికి వచ్చినప్పుడు, లేదా మిమ్మల్ని ఆకట్టుకున్న ఒక హదీసు తారసపడినప్పుడు, లేదా మీరు ధ్యానించిన ఒక ఆయతు ఎదురైనప్పుడు: ఆలస్యం చేయకుండా వెంటనే దానిని నమోదు చేసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో భావాలు ఉప్పొంగుతూ ఉంటాయి, మరియు ఆలోచనలు తాజాగా మరియు పొందికగా ఉంటాయి. ఒకవేళ మీరు ఆ సమయంలో వ్రాయడాన్ని వాయిదా వేస్తే, ఆ ఆలోచనలు మరియు భావనలు మరుగునపడిపోతాయి, మరియు వాటిని గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి, మీ మదిలో మెదిలిన దానిని వెంటనే వ్రాసిపెట్టుకోండి. ఆ తర్వాత, ఖుర్ఆను, సున్నతు, మరియు మీరు వారి గ్రంథాలను లేదా వారి నుండి ఉల్లేఖించబడిన గ్రంథాలను చదివేటప్పుడు చూసిన పండితుల మాటల నుండి, విజ్ఞాన సామగ్రిని - అతిగా శ్రమించకుండా - సేకరించడం ప్రారంభించండి. అవసరమైనప్పుడు మక్తబా షామిలాలో, లేదా ఇంటర్నెట్‌లో వెతకండి.

ఖుర్ఆన్ ఆయతులు, హదీసులు, సలఫ్‌ల సూక్తులు మరియు వారి బోధనలు, చరిత్ర, మరియు సమకాలీన దైవభక్తిగల పండితుల మాటలపై, ముఖ్యంగా ఆధునిక సమస్యలు మరియు సంఘటనలకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలి.

ఖుత్బా అంశానికి సంబంధించి మీకు లభించిన దాన్ని, క్రమబద్ధీకరించకుండా, సరిచూడకుండా తీసుకుని, కంప్యూటర్‌లోని ఒక ఫైల్‌లో భద్రపరచండి.

మీకు తట్టే లేదా మీ దృష్టికి వచ్చే విషయాలు మరియు ప్రయోజనాల విషయంలో ఎల్లప్పుడూ ఇలాగే చేయండి. ఆ సమయంలో మనసుకు తోచినది వ్రాసుకోండి, మీకు సాధ్యమైనంత వరకు పరిశోధించి వ్రాయండి. ఆ తర్వాత దానిని వదిలేసి, మీ యధావిధి పఠనాన్ని కొనసాగించండి. ఒకవేళ మీరు వ్రాసిన లేదా కొంత భాగం వ్రాసిన ఉపన్యాసాలలో దేనికైనా సంబంధించిన ఏదైనా ప్రయోజనం, ఆయతు లేదా హదీసు మీకు కనిపిస్తే, దానిని దానికి జోడించండి.

బహుశా ఒక ఖుత్బా మీ వద్ద అనేక సంవత్సరాల పాటు ఉండవచ్చు, దానిని మీరు మీ పాఠాలలో, ఉపన్యాసాలలో లేదా ఇతర ప్రసంగాలలో ఇస్తూ ఉండండి. అలా చేస్తున్నప్పుడు, మీకు ఇంతకు ముందు స్ఫురించని అనేక సూక్ష్మమైన విషయాలు మరియు ప్రయోజనాలు స్పష్టమవుతాయి, మీరు మరచిపోయిన విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. తద్వారా, మీరు దానిని జుమా ఖుత్బాలో ప్రసంగించే సమయానికి, అది సాధ్యమైనంత వరకు సంసిద్ధంగా మరియు సంపూర్ణంగా ఉంటుంది.

నాలుగవది: దీనిని సంపూర్ణంగా లేదా భాగాలుగా, మస్జిదులలో లేదా మీ వ్యక్తిగత సభలలో ప్రసంగించడం. దీని ఉద్దేశ్యం:

ఎ- సమాచారాన్ని స్థిరపరచడం మరియు దానిని కంఠస్థం చేయడం.

బి- ప్రజల మధ్య దానిని ప్రచారం చేయటం, ప్రత్యేకంగా మీరు ఖుత్బా ఇచ్చే (జుమా) మస్జిదుకు దగ్గరగా లేని మస్జిద్ లలో, ఎందుకంటే సాధారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు నీవు జుమా ప్రసంగం చేసే మసీదుకు రాలేరు.

సి- విషయాన్ని మరింత లోతుగా పరిశోధించడం. సాధారణంగా మీరు ప్రసంగం చేసినప్పుడు, ప్రసంగం మధ్యలో లేదా ఆ తర్వాత చర్చించవలసిన ముఖ్యమైన విషయాలు, లేదా మీ ప్రసంగం విన్న వారి నుండి ప్రశ్నలు మరియు సందేహాలు మీకు స్పష్టమవుతాయి.

ఐదవది: జుమా రోజున ఖుత్బా సమయానికి సుమారు రెండు గంటల ముందు, నీవు ప్రసంగ వేదికపై ఎలాగైతే ప్రసంగిస్తావో అదే విధంగా ఆ ప్రసంగాన్ని పూర్తిగా ఒక్కసారి అభ్యాసం చేయి.

ఆరవది: పరిశోధన మరియు తయారీలో అతిగా ప్రయాసపడకుండా, మొదట మీకు, ఆ తర్వాత వివిధ స్థాయిలలోని శ్రోతలకు ప్రయోజనం చేకూర్చే విషయాలను సేకరించడంపైనే మీ ప్రధాన దృష్టిని కేంద్రీకరించండి.

‘తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట’ (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ) అనేది ప్రతి విషయంలో హానికరమైనదిగా మరియు కష్టతరమైనదిగా ఉండటాన్ని నేను చూశాను, మరియు అది దానిని అవలంబించిన వానిని చాలా సందర్భాలలో మధ్యలోనే విరమించుకొనుటకు లేదా విసుగు మరియు నిరుత్సాహానికి దారితీస్తుంది.

ఖుత్బా సమయంలో ఖతీబుకు హితబోధలు

ప్రసంగం చేస్తున్న సమయంలో నీవు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి:

మొదటిది: మీరు కథలు, సంఘటనలు మరియు గుణపాఠాలలోని సందర్భాలను అనుభూతి చెందుతున్నప్పుడు, భావోద్వేగాలను కృత్రిమంగా సృష్టించుకోవద్దు, లేదా వాటిని అణచిపెట్టుకోవద్దు. సందర్భానుసారంగా మీ ముఖ కవళికల ద్వారా, మీ కళ్ళలోని హావభావాల ద్వారా, మరియు మీ స్వరంలోని హెచ్చుతగ్గుల ద్వారా మీ భావాలను వ్యక్తపరచండి.

నీవు చెప్పే విధానం ఎంత సహజంగా, కృత్రిమత్వం లేకుండా ఉంటుందో, అది అంత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి, ప్రసంగం కాకుండా ఇతర సంభాషణలలో నీవు అనుసరించే నీ సహజ శైలిలోనే ఉంటూ, స్వరంలోని హెచ్చుతగ్గులపై శ్రద్ధ వహించి, ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి.

చాలా మంది ఖతీబ్ లు, ఖుత్బాకు ఒక మూస పద్ధతి మరియు దానికి మాత్రమే ప్రత్యేకమైన శైలి ఉందని భావిస్తూ, తమకు అలవాటైన సహజ శైలికి పూర్తిగా భిన్నమైన శైలిని అనుసరిస్తారు. దీనివల్ల వారు వినేవారిపై ప్రభావం చూపలేకపోతారు మరియు వారి హృదయాలను చేరలేరు.

రెండవది: ఖుత్బాను ఏకధాటిగా చెప్పకూడదు, మరియు వినేవారు పూర్తిగా గ్రహించలేనంత వేగంగా ప్రసంగించకూడదు. నిదానంగా ఖుత్బా ఇవ్వాలి, అవసరమైనప్పుడు చిన్న విరామాలు తీసుకోవాలి. సందర్భానికి తగినట్లుగా కంఠ స్వరంలో హెచ్చుతగ్గులపై శ్రద్ధ వహించాలి. సందర్భం కోరినప్పుడు స్వరం పెంచి, వేగంగా మాట్లాడాలి.

మూడవది: ఖుత్బా సమయాన్ని ఖచ్చితంగా లెక్కించాలి, అవసరమైతే తప్ప దానిని పొడిగించకూడదు.

నాల్గవది: ఖుత్బా సమయంలో నమాజీల నుండి కొన్ని తప్పులు జరగడం మీరు చూస్తే, వాటిపై సున్నితంగా హెచ్చరించండి. ఉదాహరణకు, ఖుత్బా సమయంలో ఎవరైనా మాట్లాడటం మీరు చూస్తే, ఈ తప్పుపై ఒక సాధారణ హెచ్చరిక చేయండి.

ఖుత్బా అనంతరం ఖతీబు కొరకు ఉపదేశాలు

ఖుత్బా తరువాత మీరు చేయవలసిన విషయాలలో కొన్ని:

మొదటిది: ఖుత్బా ప్రసంగాన్ని విజయవంతంగా పూర్తి చేసే భాగ్యాన్ని (తౌఫీఖ్) నీకు ప్రసాదించినందుకు అల్లాహ్ తాలాకు కృతజ్ఞతలు తెలుపుకోవడం.

రెండవది: సానుకూల అంశాలను బలోపేతం చేయడానికి మరియు పటిష్టం చేయడానికి, మరియు ప్రతికూల అంశాలను నివారించి వాటి నుండి దూరంగా ఉండటానికి, మీ ఖుత్బాలను ప్రసంగించిన తర్వాత తిరిగి వినడం.

మరియు ఇవన్నీ:

మొదటిది: ప్రసంగం (ఖుత్బా) యొక్క గౌరవాన్ని మరియు స్థాయిని గుర్తించడం; ఎందుకంటే ఇస్లాంలో దీనికి ఒక ప్రత్యేకమైన విలువ మరియు స్థానం ఉంది.

రెండవది: తమ ప్రభువుకు విధేయత చూపుతూ, తమ సృష్టికర్త పిలుపుకు స్పందిస్తూ మరియు మీ వద్ద ఉన్న దానిని వినాలనే ప్రేమతో వచ్చిన నమాజీలను గౌరవించడం.

అదేవిధంగా, దానిలోని మంచి చెడుల గురించి మీకు మార్గనిర్దేశం చేయుటకు, మీరు దానిని ఒక సత్యసంధుడైన సలహాదారునికి చూపించవచ్చు.

అదేవిధంగా, సాధ్యమైతే ఈ ప్రసంగాలను రికార్డ్ చేసి ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఖతీబ్‌లు (ప్రసంగీకులు) తక్కువగా ఉన్న ప్రాంతాలలో, మీతో పాటు నమాజ్ చేయని సాధారణ ప్రజలు కూడా ప్రయోజనం పొందేలా వీటిని ఆడియో మరియు లిఖిత రూపంలో ప్రచురించాలి.

ఒకవేళ అతని కోసం సోషల్ మీడియాలో ఒక పేజీని, అలాగే ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను సృష్టిస్తే, అది మంచిది.

అలాగే ప్రసంగాలను ప్రచురించే వెబ్‌సైట్‌లతో సహకరించడం మరియు ఆ వెబ్‌సైట్‌లలో అతని ప్రసంగాలను వ్యాప్తి చేయడం, ముఖ్యంగా అనువదించబడిన ప్రసంగాలను, ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి.

ఖతీబు మరియు అల్లాహ్ వైపు పిలుపునిచ్చేవారి కోసం కొన్ని సాధారణ సలహాలు

ఓ జుమా ఖతీబ్ సోదరా! ఈ సూచనలు మనందరి కోసం ఒక జ్ఞాపిక మాత్రమే:

[1](శుభవార్త వినిపించండి, దూరం చేయకండి)

సఫలీకృతుడైన ఖతీబు అంటే, ప్రజలకు శుభవార్తను అందించి, వారిని దూరం చేయకుండా, వారిలో ఆశావాదాన్ని, నమ్మకాన్ని నింపుతాడు, అది వారిలోని నిరాశను మరియు సోమరితనాన్ని తొలగించి, వారిని కష్టపడి పనిచేసేలా మరియు పురోగమించేలా ప్రోత్సహిస్తుంది.

ఓ ఖతీబ్ సోదరా, మీ ఉపన్యాసాల అంశాలు కేవలం విషాదాలు, విపత్తులు మరియు ప్రతి కాలంలో, ప్రతి ప్రదేశంలో సంభవించే ప్రతికూలతలకే పరిమితం కాకుండా చూసుకోండి. దానికి బదులుగా, మీ ఉపన్యాసాలలో అధిక భాగం ఆశావాదాన్ని నింపేవిగా, నైతికత, ప్రవర్తన మరియు వ్యక్తులలోని ప్రకాశవంతమైన ఆదర్శాలను ప్రస్తావించేవిగా ఉండాలి. తద్వారా ప్రజలు ఈ నైతికతను, ప్రవర్తనను మరియు ఈ వ్యక్తులను తమకు ఆదర్శంగా, మార్గదర్శక దీపంగా స్వీకరిస్తారు.

ఒకవేళ మీరు ఏదైనా తప్పును చూస్తే, దాని గురించి ధర్మబద్ధమైన పద్ధతిలో మరియు తగిన విధానంలో తెలియజేయడం మరియు ప్రజలను దాని నుండి హెచ్చరించడం అనుమతించబడిన విషయమే.

[2] (సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకోవడం)

అల్లాహ్ మిమ్మల్ని రక్షించుగాక - సామాన్య ప్రజలను మీ దృష్టిలో ఉంచుకోండి: ఎందుకంటే మీ ప్రసంగాలు మరియు హితబోధలకు వారే ఎక్కువ అర్హులు మరియు ప్రాధాన్యత కలవారు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ రజియల్లాహు అన్హును తన గూడెం జనులకు ఇమామ్ గా నియమించినప్పుడు ఆయనతో ఇలా అన్నారు: మరియు వారిలో అత్యంత బలహీనుడిని అనుసరించు." [8] అబూదావూద్ హదీసు నెంబరు 531, ఇబ్నె మాజ హదీసు నెంబరు 987, అహ్మద్ హదీసు నెంబరు 17906, తదితరులు, మరియు అల్బానీ గారు దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

అనగా: బలహీనుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి కష్టం కలిగించని విధంగా నమాజు చదవాలి. శారీరకంగా బలహీనులైన వారిని పరిగణించడం ఎంత ముఖ్యమో, అవగాహనలో బలహీనులైన వారిని పరిగణించడం కూడా అంతే ముఖ్యం.

ఒకవేళ నీవు వారిలోని ప్రముఖులను, ప్రత్యేక వ్యక్తులను, నిన్ను ప్రేమించేవారిని మరియు నీ విద్యార్థులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, సాధారణ ప్రజలను పట్టించుకోకపోతే, అది నిన్ను అనేక ప్రమాదాలకు గురిచేస్తుంది:

మొదటిది: పదాలను ఎంచుకోవడంలో అతిగా ప్రయాసపడటం; అలాగే సామాన్య ప్రజల స్థాయికి కాకుండా, కేవలం (విద్యావంతులైన) కొందరికి మాత్రమే అర్థమయ్యే అంశాలను ఎంచుకోవడం.

రెండవది: సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఉపదేశాలు మరియు సామాజిక సమస్యల పరిష్కారాల నుండి వారిని దూరం చేయడం; ఎందుకంటే మీరు విద్యావంతులు మరియు ఇతరులకు ఆసక్తి కలిగించే విషయాలలో నిమగ్నమై ఉన్నారు. వారు విజ్ఞాన శాస్త్రాల యొక్క సూక్ష్మ నైపుణ్యాలు, అనుమితులు, కొత్త మరియు వింత విషయాల గురించి వినడానికి ఇష్టపడతారు. వారిలో కొందరు రాజకీయాలు మరియు వాస్తవికతలో లోతుగా మునిగిపోవడం గురించి వినడానికి ఇష్టపడతారు. కానీ అది వారి ధర్మానికి గానీ, వారి ఇహలోకానికి గానీ ప్రయోజనం చేకూర్చదు.

మూడవది: సంకల్పం (నియ్యత్) పాడైపోవడం. నీవు చేసే పని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ఉండాల్సింది పోయి, నీ అభిమానులను మెప్పించడం కోసం మరియు వారికి నచ్చేలా, వారిని సంతృప్తి పరిచేలా ఉండటం కోసం మారిపోయింది.

ప్రజలు నీ ప్రసంగాలను మెచ్చుకోవడం, వాటిని వినడానికి మరియు హాజరు కావడానికి వారు పోటీ పడటం నీవు చూసినప్పుడు. నిస్సందేహంగా నీవు వారిని గమనించడం ప్రారంభిస్తావు మరియు వారికి నచ్చే విధంగానే ప్రసంగించడానికి ప్రయత్నిస్తావు.

అప్పుడు, అల్లాహ్ నీ నుండి బర్కత్‌ను (శుభాన్ని), అంగీకారాన్ని (మఖ్బూలియత్), ప్రయోజనాన్ని మరియు లబ్ధిని తొలగిస్తాడు.

అంతేకాక, ఖతీబ్ సామాన్య ప్రజల ప్రయోజనంపై దృష్టి పెట్టడం అంటే; వారిలో చాలామంది అవగాహన స్థాయికి మించిన ముఖ్యమైన విషయాలను అస్సలు ప్రస్తావించకూడదని కాదు. విద్యార్థులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు లేదా నిపుణులకు ఉపయోగపడే అంశాలను కూడా చర్చించవచ్చు; కానీ అది అవసరాన్ని బట్టి మాత్రమే ఉండాలి.

[3] నిన్ను నీవు గొప్పగా భావించుకోవడం, లేదా ప్రజల పొగిడినప్పుడు ఉప్పొంగిపోవడం పట్ల జాగ్రత్త వహించు.

శుక్రవారం ఖతీబ్ మింబర్ ఎక్కినప్పుడు, అక్కడ హాజరైన అసంఖ్యాకమైన ప్రజలను చూసి వారిలో పండితులు (ఆలిమ్), వైద్యులు, పెద్దలు, న్యాయమూర్తులు (ఖాజీ), ధనవంతులు మరియు అధికారులు తన ప్రసంగం వినడానికి వచ్చారని గమనించినప్పుడు: అతని హృదయంలో గర్వం (అహంకారం) ప్రవేశించవచ్చు. ముఖ్యంగా వారిలో చాలా మంది తన కోసమే హాజరయ్యారని అతనికి తెలిసినప్పుడు ఇది మరింత ప్రమాదం, కాబట్టి వివేకవంతుడైన ఖతీబ్ ఆత్మస్తుతి మరియు అహంకారం నుండి అల్లాహ్ శరణు వేడటం తప్పనిసరి. ప్రతి జుమా నాడు ఆత్మస్తుతి మరియు గర్వం నుండి తనను తాను విడిపించుకోవడానికి తన ఆత్మతో పోరాడాలి. మరియు ఈ ఘనతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కే ఆపాదించాలి, ఎందుకంటే ఆయనే ప్రజలను తన వైపుకు మళ్లించాడు.

కొందరు పూర్వీకులు (సలఫ్) ఇలా అన్నారు: «నీవు ప్రజలకు బోధించడానికి కూర్చున్నప్పుడు, ముందుగా నీ హృదయానికి మరియు నీ ఆత్మకు బోధించుకో, నీ చుట్టూ వారు గుమికూడటం నిన్ను భ్రమలో పడవేయకూడదు; ఎందుకంటే వారు నీ బాహ్యాన్ని మాత్రమే గమనిస్తారు, కానీ అల్లాహ్ నీ అంతరంగాన్ని గమనిస్తాడు» ([9]). - మదారిజుస్సాలికీన్ బైన మనాజిల్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్: (2/ 66).

కావున, నీవు సర్వోన్నతుడైన అల్లాహ్ పట్ల చిత్తశుద్ధిని విధిగా కలిగియుండు, మరియు నీ విశ్వాసమును బలపరచుకో. మరియు ప్రజలు చేసే ప్రశంసల పట్ల ఆనందించకుండా జాగ్రత్త వహించాలి; ఎందుకంటే నిశ్చయంగా చాలా మంది ప్రజలు ప్రశంసించినప్పుడు హద్దులు మీరుతారు, మరియు నీ గురించి నీవు బాగా ఎరిగినవాడవు!

ఇబ్నుల్ జౌజీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: «గొప్ప పరీక్ష ఏమిటంటే సామాన్య ప్రజల పొగడ్తలు, అవి ఎంతోమందిని మోసగించాయి!» [10] [సైద్ అల్-ఖాతిర్: 67].

ప్రజలు మిమ్మల్ని లేదా మీ ప్రసంగాలను ప్రశంసించినందుకు మీరు సంతోషించడం దోషం కాదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఒకవ్యక్తి సత్కార్యాలు చేస్తాడు, ప్రజలు అతన్ని ఆ కార్యాల నిమిత్తం ప్రశంసిస్తూ ఉంటారు?” దానికి ఆయన ఇలా బదులిచ్చారు: «అది విశ్వాసికి ప్రాపంచిక శుభవార్త» [11]. - దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు సంఖ్య: (2642).

విశ్వాసి ఒక పని చేసినప్పుడు «అతను అల్లాహ్ కోసం నిష్కల్మషంగా (ఇఖ్లాస్‌తో) పని చేసినప్పుడు, ఆ తర్వాత అల్లాహ్ విశ్వాసుల హృదయాలలో అతని పట్ల మంచి ప్రశంసలను కలిగిస్తాడు. . అప్పుడు అతను అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యం వల్ల ఆనందించి, దానితో సంతోషపడతాడు. ఇది అతనికి ఎలాంటి హాని కలిగించదు» ([12]). - ఇబ్నె రజబ్ రహిమహుల్లాహ్ పుస్తకం "జామివూల్ ఉలూమ్'వల్ హకమ్": 1/84.

నిజానికి దోషం మరియు పాపం అంటే, వారి పొగడ్తల కారణంగా మీరు మీ గురించి గొప్పగా భావించుకుని, మీ కృషి మరియు మీ పని పట్ల సంతోషించి, ఆ ఘనతను మీకు మీరే ఆపాదించుకోవడం; మరియు మీ సంతోషం, మీ వద్దకు మేలును తీసుకువచ్చి, దానిని మీకు ప్రియమైనదిగా మరియు సులభతరంగా చేసిన అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఆయన కారుణ్యం మరియు ఆయన దాతృత్వం వలన కాకుండా ఉండటం.

నీకు ఆత్మస్తుతి (అహంకారం) అనే వ్యాధి సోకినదానికి లక్షణం: విమర్శ నుండి విముఖత చూపడం, మరియు హితోపదేశము పట్ల అయిష్టత.

[4](వారి ధర్మంలో మరియు వారి ఇహలోకంలో వారికి ప్రయోజనం కలిగించేదే మాట్లాడు)

మీ వద్ద ఉన్న విషయాలను వినడానికి వచ్చిన వారికి, వారి ధార్మిక మరియు ప్రాపంచిక జీవితంలో ప్రయోజనం చేకూర్చే విషయాలను వినిపించండి. మరియు (ప్రసంగానికి) సిద్ధమవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: 'ప్రజలు మస్జిద్ నుండి బయటకు వెళ్ళిన తరువాత, వారి ధర్మంలో మరియు నైతికతలో నేను వారికి ఏ ప్రయోజనం చేకూర్చగలను?'

వారికి దేని నుండి ప్రయోజనం కలగదో, దానిని ప్రస్తావించవద్దు.

ఉదాహరణకు, నీవు రాజకీయాల్లోని లోతైన విషయాల గురించి మాట్లాడితే లేదా ముస్లింల కష్టాల గురించి అతిగా చర్చిస్తే' ప్రజలు దాని నుండి పొందే ప్రయోజనం ఏమిటి?

మరియు నేను ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకుని, దానిని నేరుగా చెప్పడానికి భయపడి (నా భద్రత గురించి), కేవలం అతి కొద్దిమందికి మాత్రమే అర్థమయ్యేలా సంజ్ఞలు మరియు అస్పష్టమైన మాటలతో (ముమ్మని) మాట్లాడితే. ప్రజలకు దాని వల్ల కలిగే లాభం ఏమిటి

మరియు ప్రజల ముందు పాలకుడికి (పాలకులకు) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హితబోధ చేయడం వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? పాలకుడికి బహిరంగంగా నసీహత్ (హితబోధ) చేయడాన్ని సలఫె సాలెహీన్ (పుణ్యాత్ములైన పూర్వీకులు) నిషేధించారు. ఎందుకంటే ఇది తరచుగా ఫిత్నాలకు (అశాంతికి) దారితీస్తుంది మరియు ఖతీబ్‌కు కూడా హాని కలిగిస్తుంది.

[5] ఖుత్బా సమయంలో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించు.

ఖుత్బా సమయంలో ప్రశాంతంగా ఉండాలి, అతి ఉత్సాహం మిమ్మల్ని ఆవహించి, మీరు విషయం నుండి వైదొలగకూడదు, లేదా ఆ తర్వాత పశ్చాత్తాపపడే మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ ఖతీబ్ యొక్క ఉత్సాహం తీవ్రమైతే, అప్పుడు అతను చాలావరకు తన ఏకాగ్రతను మరియు తన మాటలపై నియంత్రణను కోల్పోతాడు. మరియు బహుశా అతని స్వరం చాలా మంది శ్రోతలను ఇబ్బంది పెట్టే స్థాయికి పెరగవచ్చు.

[6](ఖుత్బాను పొడిగించడం పట్ల జాగ్రత్త)

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారు ఖుత్బాను సంక్షిప్తంగా ఇచ్చేవారు, అదే విధంగా ఆయన సహచరులు - రజియల్లాహు అన్హుమ్ - మరియు వారి తరువాత వచ్చిన పుణ్యాత్ములైన పూర్వీకులు (సలఫ్) - అల్లాహ్ వారిపై కరుణించుగాక - కూడా అదే మార్గాన్ని అనుసరించారు.

అబూ వాయిల్ రహిమహుల్లాహ్ ఉల్లేఖించారు: అమ్మార్ రజియల్లాహు అన్హు మాకు క్లుప్తంగా మరియు ప్రభావవంతంగా ప్రసంగించారు. ఆయన క్రిందికి దిగినప్పుడు, మేము ఇలా అన్నాము: "ఓ అబుల్ యఖ్జాన్! మీరు చాలా ప్రభావవంతంగా మరియు క్లుప్తంగా ప్రసంగించారు. మీరు మీ ప్రసంగాన్ని ఇంకాస్త పొడిగించి ఉంటే బాగుండేది కదా?" దానికి ఆయన ఇలా అన్నారు: "నిశ్చయంగా నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: «సుదీర్ఘమైన నమాజ్ చేయటం, సంక్షిప్తంగా ఉపన్యసించటం అనేది మనిషి వివేకానికి ఆనవాలు. కనుక మీరు నమాజ్ ను సుదీర్ఘంగా చేయండి, ఉపన్యాసం సంక్షిప్తంగా ఇవ్వండి. నిశ్చయంగా కొన్ని ప్రసంగాలలో మంత్రముగ్ధులను చేసే ప్రభావం (సిహ్ర్) ఉంటుంది» ([13]). - ముస్లిం, హదీథు సంఖ్య (869).

ఆయన పలికిన (తనఫ్ ఫస్త) అనే పదానికి అర్థం: ప్రసంగాన్ని సుదీర్ఘం చేయడం.

అల్లాహ్ ప్రకటన:(మఇన్నత్): అనగా లక్షణము (గుర్తు), (మిన్ ఫిఖ్'హిహి): అనగా, ఒక వ్యక్తి యొక్క ధర్మజ్ఞానాన్ని సూచించే వాటిలో ఒకటి. మరియు ఒక విషయాన్ని సూచించే ప్రతిదీ దానికి ఒక గుర్తు.

ఖుత్బాను సంక్షిప్తం చేయడంలో మూడు విలువైన ప్రయోజనాలు కలవు:

మొదటిది: సున్నతును అనుసరించుట.

రెండవది: ఖుత్బా తయారీలో సౌలభ్యం, మరియు దానిని సిద్ధం చేసేటప్పుడు, ప్రసంగించేటప్పుడు, మరియు పూర్తి చేసిన తర్వాత మనశ్శాంతి లభించటం.

చాలా మంది ఖతీబులు ఖుత్బాను ఒక భారంగా భావించేవారు, జుమా రోజు ఫజ్ర్ నుండి లేదా అంతకు ముందు నుండే దాని తయారీలో మానసికంగా నిమగ్నమై ఉండేవారు. మరియు ఎప్పుడైతే వారు ఖుత్బాను సంక్షిప్తం చేసి, దానిని పది నిమిషాలకు మించకుండా చేశారో, ఆ భారం మొత్తం లేదా దానిలోని అధిక భాగం తొలగిపోయింది.

మూడవది: వినేవారికి తేలికపరచటం. ఎందుకంటే, తన ఖుత్బాను కుదించే వ్యక్తి పట్ల దాదాపు ప్రజలందరూ సంతృప్తి చెందుతారు, మరియు దానిని పొడిగించే వ్యక్తి పట్ల విముఖత చూపుతారు.

ఖతీబ్ మరియు వినేవారికి అనువైన సమయం సుమారుగా పది నిమిషాల నుండి పావు గంట వరకు ఉంటుంది; ఎందుకంటే, ఖుత్బాను పొడిగించడం కంటే సంక్షిప్తంగా ఉంచడమే తమకు అత్యంత ఇష్టమైనదని మరియు తేలికైనదని ప్రజలందరూ దాదాపు ఏకీభవిస్తారు.

[7] అస్పష్టమైన మాటల నుండి దూరంగా ఉండటం.

కఠినమైన మరియు అపరిచితమైన మాటలను పలకడం మానుకో: ఎందుకంటే ప్రజలకు నీ నుండి అటువంటి మాటల అవసరం ఉండదు, మరియు అది వారికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. వాటిని ప్రస్తావించడంలో మరియు అధికంగా వాడటంలో నీ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవాలి' అనే స్వార్థం (నఫ్స్ కోరిక) ఉండే అవకాశం ఉంది.

విశ్వసనీయ సాహిత్యవేత్తలు మరియు వాగ్విశారదులు అసాధారణమైన పదజాల ప్రయోగానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.

[8] ప్రాస కోసం అనవసరమైన ప్రయత్నం నుండి దూరంగా ఉండటం.

అస్-సజ్’ఉ: అంటే “వచనంలో వాక్యాల చివర ఒకే విధమైన ప్రాసను ఉపయోగించడం ”. వివేకవంతుడైన శాసనకర్త సజ్’ఉను బలవంతంగా జొప్పించడాన్ని నిషేధించాడు, మరియు సాహిత్యవేత్తలు, వాగ్ధాటిగల పండితులు కూడా దీనిని ఇష్టపడలేదు; «ఎందుకంటే సజ్’ఉలో కృత్రిమమైన పదజాలం ఉంటుంది, అది వినేవారి మనస్సులను అర్థాలను పూర్తిగా గ్రహించకుండా కప్పివేస్తుంది. ఒకవేళ సజ్’ఉ అనుమతించబడితే, అది కేవలం సహజంగా, ఎటువంటి కృత్రిమ ప్రయత్నం లేకుండా వాటంతట అవే వచ్చినప్పుడు మాత్రమే. అంటే, మాట్లాడేవాడు ప్రాసను వెతకడం కాదు, ప్రాసయే మాట్లాడేవాడిని వెతుక్కుంటూ రావాలి» ([14]). - ఇబ్నె ఆషూర్ యొక్క "ఉసూలుల్-ఇన్షా వల్-ఖితాబహ్": (పేజీ: 126).

కాబట్టి, ప్రాసను కృత్రిమంగా జొప్పించడాన్ని విడనాడండి; ఎందుకనగా, అటువంటి ప్రయత్నం దానిని రూపొందించడంలో మీకు, దానిని అర్థం చేసుకోవడంలో వినేవారికి శ్రమను కలిగిస్తుంది. అలాగాక, అది మీ మనసులోకి సహజసిద్ధంగా వచ్చి, దాని పదాలు మీ నాలుకపై తేలికగా పలుకుతూ, వినేవారికి అర్థమయ్యే విధంగా ఉంటే, అప్పుడు దానిలో దోషం ఏమీ లేదు.

[9] బాహ్య రూపం మరియు వేషధారణపై శ్రద్ధ వహించడం.

ప్రసంగీకుడు తన బాహ్య స్వరూపం యొక్క సంస్కరణపై పెట్టే శ్రద్ధ, తన అంతర్గతం యొక్క సంస్కరణపై పెట్టే శ్రద్ధ కంటే తక్కువ కాదు. బాహ్య స్వరూపం సంస్కరించబడటం లేదా పతనమవడం అనేది, అంతర్గతం సంస్కరించబడటం లేదా పతనమవడం యొక్క ఫలితమే. మరియు ప్రసంగీకుడి బాహ్య స్వరూపం యొక్క సంస్కరణ ఈ క్రింది విధంగా ఉంటుంది:

మొదటిది: అతిగా ఆడంబరాలకు పోకుండా లేదా వృథా (ఇస్రాఫ్) చేయకుండా, తన దుస్తుల అందం మరియు శుభ్రతపై శ్రద్ధ వహించాలి.

రెండవది: శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, సువాసన కలిగి ఉండటం, మీసాలను గొరగటం లేదా కత్తిరించుకోవటం, మరియు గడ్డాన్ని పెంచుకోవటం.

మూడవది: మస్జిద్ బయట ప్రజలకు సలాం చేసేటప్పుడు, ఖుత్బా కోసం ప్రవేశించేటప్పుడు మరియు అది ముగిసిన తర్వాత అతని ముఖంలో ఉల్లాసం మరియు చిరునవ్వు ఉండటం అతని సౌందర్యం; ఎందుకంటే నిజాయితీ గల చిరునవ్వు, ప్రసన్న వదనం మరియు ఉల్లాసమైన ముఖం, ప్రజలు ఖతీబ్ ను, అతని ప్రసంగాలను మరియు సలహాలను ఇష్టపడేలా చేస్తాయి. అల్లాహ్ కోసం నిష్కల్మషంగా చేసేవారికి ఇది ఒక ఆరాధన. ఇదే హృదయాలను మరియు మేధస్సులను ఆకట్టుకుంటుంది. ప్రసన్న వదనం గల వ్యక్తి యొక్క పనులు ప్రశంసించబడతాయి, అతని చిన్న పొరపాట్లు కూడా ఆమోదించబడతాయి. దీనికి భిన్నంగా, ముఖం చిట్లించుకుని కోపంగా ఉండే వ్యక్తి నుండి శరణు కోరబడుతుంది, అతన్ని కలిసినప్పుడు హృదయాన్ని దుఃఖం మరియు ఇబ్బంది ఆవరిస్తాయి.

కావున ఓ నా సోదర ధర్మోపదేశకుడా! మీరు ఆహ్లాదంగా, నగుమోముతో ఉండండి. అప్పుడు మీరు హృదయ ప్రశాంతతను, ప్రజల ఆదరణను, వారి మధ్య మంచి పేరును, మీ మార్గదర్శకత్వాలు మరియు ఉపదేశాల పట్ల వారి స్వీకృతిని, మరియు మీ పొరపాట్లకు, తప్పిదాలకు వారు సర్దిచెప్పడాన్ని చూస్తారు.

నాలుగవది: వినయంగా, అణుకువతో నడవటం, మెంబరు పైకి ఎక్కటం, దానిపై కూర్చోవటం, మరియు కూర్చున్నప్పుడు, ఖుత్బా సమయంలో ప్రజలను చక్కగా ఆదరించే తీరు ఉండాలి.

గమనించదగ్గ విషయాలలో ఒకటి: కొంతమంది ఖతీబ్ లు ఖుత్బాకు ముందు కూర్చున్నప్పుడు, ప్రజల పట్ల ఏమాత్రం పట్టింపు లేనివారిలా కూర్చుంటారు, మరియు ప్రజల ముఖాలను పరిశీలించడంలో నిమగ్నమై ఉంటారు. ఇక ఖుత్బా ప్రారంభించినప్పుడు, ప్రజల పట్ల తనకు ఏమాత్రం పట్టింపు, శ్రద్ధ లేదనే భావన కలిగించేలా వారి వైపు చూస్తుంటారు. తాను చాలా ధైర్యవంతుడినని, సాహసిని అని వారికి తెలియజేస్తున్నట్లుగా ఉంటారు. కఠినమైన స్వరంతో, గొంతు పెంచి వారిని సంబోధిస్తూ, తన ఆజ్ఞలను, నిషేధాలను నేరుగా వారికి నిర్దేశిస్తారు. ఇటువంటి శైలిని మనసులు స్వీకరించలేవు, పైగా ప్రజలు దీని వల్ల దూరమవుతారు.

ఐదవది: అవసరం లేకుండా గడ్డాన్ని నిమరడం, తాకడం, మరియు ముఖ్యంగా మెంబరుపై కూర్చున్నప్పుడు అతిగా అటూ ఇటూ చూడటం చేయకూడదు; ఎందుకంటే అది ఖతీబ్ యొక్క గంభీరతను తగ్గిస్తుంది, లేదా తన ముందు ఉన్నవారిని పట్టించుకోవడం లేదనే భావనను కలిగిస్తుంది.

ఆరవది:[ ఖుద్బాకు ముందు మిస్వాక్ చేయటం సున్నత్] దానిని మృదువుగా మరియు మర్యాదగా చేయాలి. కొంతమంది ఖతీబ్‌లు - అల్లాహ్ వారికి మార్గనిర్దేశం చేయుగాక - మస్జిద్‌లో ప్రవేశించినప్పుడు, వారు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మిస్వాక్ చేస్తూ ప్రవేశిస్తారు, మరియు వారిలో కొందరు ఖుత్బా ప్రారంభించడానికి కొంచెం ముందు వరకు మిస్వాక్ చేస్తూనే ఉంటారు, దానివల్ల మిస్వాక్ యొక్క కొన్ని చిన్న ముక్కలు వారి నోటిలో మిగిలిపోతాయి, మరియు వారు ఖుత్బా ఇస్తున్నప్పుడు ఆ మిగిలిపోయిన ముక్కలను బయటకు తీస్తారు. ఇది ఒక అసహ్యకరమైన చర్య, మరియు ఇది ప్రజల పట్ల మరియు ఖుత్బా యొక్క గొప్ప స్థానం పట్ల వారి అగౌరవాన్ని సూచిస్తుంది.

ఏడవది: దుస్తులలో ఇస్బాల్ (దుస్తులు చీలమండల కంటే కిందకు ఉండటం) చేయకుండా, మరియు గడ్డాన్ని పెంచడం ద్వారా సున్నత్ కు కట్టుబడి ఉండటం. ఎందుకంటే ఖతీబ్ ఆదర్శప్రాయుడు. తన చేతలే తన మాటలకు విరుద్ధంగా ఉన్న వ్యక్తిని ప్రజలు ఎలా ఆదర్శంగా తీసుకుంటారు? తన మాటలే తనపై ప్రభావం చూపని వ్యక్తి యొక్క మాటల ద్వారా ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు?

ఎనిమిదవది: మాట్లాడేటప్పుడు శరీరం ప్రశాంతంగా ఉండటం; ఎందుకంటే అది ఆత్మ ప్రశాంతతకు నిదర్శనం.

[10](ఖుత్బాను సిద్ధం చేసే సమయంలో వ్యత్యాసం)

ఖుత్బా ప్రసంగం యొక్క తయారీ సమయం: ఇది ఖతీబు యొక్క సంస్కృతి, జ్ఞానం మరియు అతను ప్రసంగించే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఆ అంశం రెండు రకాలుగా ఉంటుంది:

మొదటిది: అది విజ్ఞానపరమైనదిగా ఉండాలి, ఉదాహరణకు ఫిఖ్ (ధర్మశాస్త్రం) లేదా అఖీదా (విశ్వాస) సంబంధిత విషయాలు మరియు వాటి మూలాలను వివరించడం. వీటికి వాటి స్థాయికి తగినంత సమయం కేటాయించడం తప్పనిసరి. వీటిని తేలికగా పరిగణించరాదు మరియు ఖుత్బాకు కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే సిద్ధం చేయకూడదు.

రెండవది: అది ఉపదేశాత్మకమైనదిగా లేదా సామాజికమైనదిగా మొదలైనవిగా ఉండటం వలన, సాధారణంగా దానిని సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది.

ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడంలో తగినంత అనుభవం మరియు జ్ఞానం లేని కొత్తవారికి నా సలహా ఏమిటంటే: వారు ప్రారంభంలో తమ పూర్వీకుల ఖుత్బాల నుండి ప్రయోజనం పొందాలి, మరియు వారు ఎవరి నుండి అయితే ప్రయోజనం పొందుతున్నారో, వారి ఖుత్బాలు మూడు లక్షణాలతో వర్ణించబడాలి:

మొదటిది: అది చిన్నదిగా ఉండాలి, తద్వారా దానిని వినిపించడం (ప్రసంగించడం) అతనికి భారం కాకుండా ఉంటుంది.

రెండవది: వ్యాకరణపరంగా మరియు విజ్ఞానపరంగా దోషరహితమైనదై ఉండాలి.

మూడవది: పదాలలో మరియు విషయ వస్తువులో కృత్రిమత్వం (ఆడంబరం) లేకుండా ఉండాలి.

కాలక్రమేణా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంలో తప్పులేదు. ఆ తర్వాత, తనకంటే ముందున్న వారి నుండి నేర్చుకుంటూ, స్వయంగా ఖుత్బాను రాయడానికి ప్రయత్నించాలి.

[11](శ్రోతలకు ప్రత్యక్ష ఆదేశాల నుండి దూరంగా ఉండటం)

అల్లాహ్ మిమ్మల్ని రక్షించి, మీకు సన్మార్గం చూపుగాక. మాట్లాడే వ్యక్తిని కాకుండా కేవలం వినేవారిని ఆదేశించే పదాలకు దూరంగా ఉండండి. ఉదాహరణకు: 'మీరు చేయండి' లేదా 'మీరు చేయకండి' వంటివి. వాటికి బదులుగా: 'మనం చేద్దాం', 'మనం వదిలేద్దాం' మొదలైన పదాలను ఉపయోగించండి. ఎందుకంటే ఈ పద్ధతి వినేవారికి మీ వినయాన్ని, మరియు మీరు మీ కోసం ఇష్టపడినట్లే వారి మేలును కూడా మీరు కోరుకుంటున్నారని, మరియు మీరు వారి కంటే ధర్మంలో గానీ, ప్రవర్తనలో గానీ ఉన్నతులు కారని తెలియజేస్తుంది.

దైవానుగ్రహం పొందిన ఖతీబ్ ఇతరులకు ప్రసంగించే ముందు తన ప్రసంగాన్ని తనకే నిర్దేశించుకుంటాడు, ఇతరులకు హితబోధ చేసే ముందు తనకు తాను హితబోధ చేసుకుంటాడు. అందువల్ల, అతని ఖుత్బాలలోని మాటలు ప్రజలను ఉద్దేశించి చెప్పే ముందు, మొట్టమొదట తనను ఉద్దేశించి ఉంటాయి. అతను అలా చేసినప్పుడు, అల్లాహ్ అతని స్థాయిని ఉన్నతం చేస్తాడు, అతను చెప్పే మాటల ద్వారా అతనికి ప్రయోజనం చేకూరుస్తాడు మరియు అతనికి మార్గదర్శకత్వం, (ప్రజల) ఆమోదం మరియు సత్యసంధతను అధికం చేస్తాడు.

[12](ప్రసంగకళలో అనుకరణ ఎప్పుడు ప్రశంసనీయం మరియు ఎప్పుడు నిందనీయం?)

ఒక నిర్దిష్ట ఖతీబును అతని శైలిలో లేదా ప్రసంగ విషయంలో అనుకరించవద్దు, ఎందుకంటే అతనికి సరిపోయేది మీకు సరిపోకపోవచ్చు. అనుకరణ అనేది మీ సృజనాత్మకతను మరియు ప్రతిభను నశింపజేస్తుంది. కాబట్టి, మీ ప్రభువు మీకు ప్రసాదించిన సామర్థ్యాలు, ప్రతిభ మరియు జ్ఞానం ప్రకారం ఖుత్బా ఇవ్వండి.

ప్రారంభ దశలో ఉన్న వ్యక్తి, ఇతరుల నుండి వారి శైలిని మరియు విషయాన్ని నేర్చుకోవడంలో తప్పు లేదు. అయితే, అతను వారికి కేవలం ఒక నకలుగా (కాపీగా) ఉండకూడదు. బదులుగా, తనను తాను ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి దానిని ఒక సహాయకారిగా ఉపయోగించుకోవాలి.

[13](నీ వద్దకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని బాధపడకు, అలాగే వారు ఎక్కువగా ఉన్నారని సంతోషపడకు.)

తెలుసుకో - అల్లాహ్ మీ ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక -: మనస్సు ఎక్కువ మంది వినేవారిని, హాజరయ్యేవారిని, ముఖ్యంగా మీ బంధువులను మరియు స్నేహితులను కోరుకుంటుంది. బహుశా మీరు వారి హాజరు గురించి అడిగి ఉండవచ్చు, లేదా వారిలో ఎవరైనా హాజరు కానందుకు - మీ హృదయంలోనైనా సరే - నిందించి ఉండవచ్చు. కాబట్టి, ఈ వ్యాధి నుండి విముక్తి పొందడానికి మీ మనస్సుతో పోరాడండి. వారిలో ఎవరైనా హాజరు కాకపోవడం మీరు బలహీనులని అర్థం కాదు, బహుశా వారికి వేరే ఖతీబ్ వద్ద ఉపశమనం లేదా ప్రయోజనం కలుగుతుండవచ్చు, లేదా ఆ మస్జిద్ వారి ఇంటికి దగ్గరగా ఉండవచ్చు లేదా ఇతర కారణాలు ఉండవచ్చు.

సత్యవంతుడైన ప్రసంగీకుడు: ప్రజలు తన వద్ద కాకుండా వేరొకరి వద్దకు హాజరవుతున్నారని విన్నప్పుడు సంతోషిస్తాడు, ఆ ఖతీబ్ విజయవంతం కావాలని మరియు అతని ద్వారా ప్రజలకు మేలు జరగాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తాడు. అంతేకాకుండా, అతనిలో ఏదైనా మంచి ఉన్నట్లు తెలిస్తే అతనిని ప్రశంసిస్తాడు కూడా.

ఒకవేళ నీ వద్దకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటాన్ని, ప్రజలు నీ నుండి విముఖత చూపడాన్ని నీవు గమనించినట్లయితే, అప్పుడు నీ ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకంటే ఆ లోపం నీలోనే ఉండవచ్చు: అది నీ శైలిలో బలహీనత కావచ్చు, లేదా నీవు సమర్పించే విషయంలోని బలహీనత కావచ్చు, లేదా నీవు ఖుత్బా (ప్రసంగం)ను దీర్ఘంగా చేయటం కావచ్చు, లేదా నీ చిత్తశుద్ధిలో బలహీనత ఉండవచ్చు, లేదా ఇలాంటి ఇతర కారణాలైనా కావచ్చు.

సత్యసంధులు మరియు హితబోధకులైన సోదరుల సలహా కోరండి. మీ వద్దకు హాజరు కావాలని లేదా మీ ఖుత్బాను వినమని వారిని అభ్యర్థించండి. మరియు వారి పరిశీలనలను, అభిప్రాయాలను మీకు తెలియజేయమని వారిని నిజాయితీగా కోరండి. అల్లాహ్ తఆలా అనుమతితో మీరు ప్రయోజనకరమైన ఫలితాలను పొందుతారు.

[14](మంచి(తయారీ) సన్నాహం యొక్క ప్రాముఖ్యత)

మీరు ఖుత్బాను ఆశువుగా ప్రసంగించే వారైతే, దాని కోసం మీరు క్షుణ్ణంగా సిద్ధమవ్వాలి. ప్రసంగించబోయే అంశం మీకు చాలా సులభమైనదిగా అనిపించినా, లేదా గతంలో మీరు దాని గురించి ప్రస్తావించి ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యం వహించవద్దు.

ప్రసంగం కోసం ఉత్తమంగా సన్నద్ధమవ్వడం అనేది ఖతీబ్ లకు అత్యంత ఆనందదాయకమైన విషయాలలో ఒకటి. అంతేకాదు, తాము ఎంతో శ్రమించి సిద్ధం చేసుకున్న దానిని సమర్పించడానికి వారు జుమా రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే, ఎప్పుడూ స్వయంగా సిద్ధం చేసుకోకుండా, కేవలం ఇతరులు రాసిన ప్రసంగాలపైనే ఆధారపడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవి ఏవంటే:

మొదటిది: ఇది సంకల్పం బలహీనపడటానికి, పట్టుదల నశించడానికి మరియు ఆత్మగౌరవం దెబ్బతినడానికి కారణమవుతుంది. ఎందుకంటే, ఆ వ్యక్తి కేవలం ఇతరులను అనుకరించడానికే పరిమితమైపోతాడు.

రెండవది: దీనివల్ల మీరు ఉత్సాహం, చురుకుదనం మరియు ఆనందాన్ని కోల్పోతారు. అప్పుడది మీరు వదిలించుకోవాలనుకునే ఒక భారంలా తయారవుతుంది. ఇది మీ ప్రవర్తనా శైలిపైనా, ప్రజల ఆదరణపైనా ప్రభావం చూపుతుంది.

మూడవది: ఖుత్బా యొక్క శైలి మరియు విషయం, ఖతీబ్ యొక్క శైలి మరియు స్థాయికి భిన్నంగా ఉండటం వలన, చాలా మంది ప్రజలు ఆ ఖుత్బాను అతను స్వయంగా సిద్ధం చేయలేదని, బదులుగా ఇతరుల నుండి గ్రహించాడని భావిస్తారు, కాబట్టి వారి వద్ద ఆ ఖుత్బాకు ఆమోదం లభించదు.

నాలుగవది: దాని నుండి నీవు ఎలాంటి ప్రయోజనం పొందలేవు, ఒకవేళ పొందినా అది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఎందుకంటే, ఏ కార్యంలోనైతే దానిని చేసేవాడు పరిశోధన మరియు తయారీలో కృషి చేయడో, అది త్వరలోనే మరచిపోబడి కనుమరుగైపోతుంది.

నువ్వు ఎప్పటికీ అభివృద్ధి చెందలేవు, నీ ఆశయాలు (లక్ష్యాలు) పెరగవు, నీ సంకల్పం గొప్పదిగా మారదు మరియు ప్రజలు నీ జ్ఞానం నుండి ప్రయోజనం పొందలేరు, అల్లాహ్ తలచుకుంటే తప్ప.

అందుకే, నువ్వు ఎంతో శ్రమించి, ఉత్తమంగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని ఒకసారి గమనించు; దానిని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. కొన్ని సంవత్సరాల తర్వాత దానిని మళ్ళీ చూసినా, నువ్వు ఇప్పుడే ఆ ప్రసంగాన్ని వినిపించినంత స్పష్టంగా దానిలోని విషయాలు నీకు గుర్తుంటాయి.

ఇక మీరు ఇతరుల నుండి ఉల్లేఖించిన ఖుత్బాల విషయానికొస్తే, వాటిని మీరు త్వరగా మరచిపోతారు. దీనిని పరీక్షించి చూడండి. నాలుగు లేదా ఐదు సంవత్సరాలు గడిచిపోయిన ఖుత్బాలను తిరిగి చూస్తే, మీరు వాటిని మరచిపోయారని లేదా వాటిలో ఉన్న కొద్దిపాటి విషయాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకోగలరని మీరు గమనిస్తారు.

అంతేకాకుండా, నువ్వు స్వయంగా సిద్ధం చేసుకోకపోతే, ఆ విషయ సేకరణ ద్వారా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే ఒక పుస్తకాన్ని కూడా రూపొందించలేరు.

కాబట్టి, మీరు ఖుత్బాను ఒక పుస్తక రూపంలో ప్రచురించబోతున్నట్లుగా భావించి, దానిని సిద్ధం చేయడంలో కృషి చేయండి. కొంతమంది ముహద్దీథుల (హదీసు పండితుల) మాటల సహాయంతో హదీసులను ఉల్లేఖించి, వాటి ప్రామాణికత స్థాయిని స్పష్టం చేయండి. మీరు సంప్రదించిన ఆధారాలను మరియు మూల గ్రంథాలను నమోదు చేయండి. ఇంకా, వ్యాకరణ, అక్షర మరియు భాషా దోషాలు లేకుండా దానిపై శ్రద్ధ వహించండి.

[15](విరామ చిహ్నాల పట్ల శ్రద్ధ వహించడం)

ఒకవేళ నువ్వు ప్రసంగాన్ని చూసి చదువుతుంటే విరామ చిహ్నాల పట్ల, ముఖ్యంగా కామాలు వంటి వాటి పట్ల శ్రద్ధ వహించు. నీ శ్వాసకు అనుగుణంగా ఎక్కడ ఆగాలో తెలుసుకోవడానికి నీకంటూ కొన్ని ప్రత్యేక గుర్తులను పెట్టుకో. దీనివల్ల సరైన చోట కాకుండా వేరే చోట పదే పదే ఆగిపోవలసిన ఇబ్బంది కలగదు.

[16](విభిన్న విషయాలు మరియు శైలుల ప్రాముఖ్యత)

విషయాలను ప్రస్తావించడంలో వైవిధ్యాన్ని పాటించండి, మీ ఉపన్యాసాలు కేవలం హృదయాల స్థితుల గురించి, లేదా సమాజ సాధారణ వ్యవహారాల గురించి, లేదా అలాంటి వాటికే పరిమితం కాకుండా, ప్రజల యొక్క ధార్మిక మరియు ప్రాపంచిక అవసరాలను కూడా గమనించండి.

అంతేకాదు, నీ ప్రసంగ పద్ధతుల్లో వైవిధ్యాన్ని కలిగి ఉండాలి. దీనివల్ల ప్రజల మనస్సులలో నీ ప్రసంగాలను వినాలనే ఆసక్తి మరియు ఉత్సాహం నిరంతరం పెరుగుతుంది.

ఒకవేళ దానిని అనుసంధానమైన పరంపరగా చేసినట్లయితే, అవసరమైనప్పుడు దానిని విడగొట్టుటలో దోషమేమీ లేదు.

ఖుర్ఆన్, ప్రమాణీకమైన సున్నత్ మరియు గౌరవనీయులైన సహాబాల - రదియల్లాహు అన్హుమ్ - పలుకుల నుండి గ్రహించబడిన గాధలు వినేవారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని, మరియు వాటిలో గొప్ప పాఠాలు, గుణపాఠాలు, ఉపదేశాలు మరియు ఆణిముత్యాలు ఉన్నాయని తెలుసుకోండి. కాబట్టి, వాటిని ఆసక్తికరమైన శైలిలో వివరించడం పట్ల శ్రద్ధ వహించండి, మరియు వాటి నుండి ప్రయోజనాలు మరియు గుణపాఠాలను గ్రహించండి.

నీ ఖుత్బా (ప్రసంగాన్ని) చారిత్రక సంఘటనలు, కథలు, వాస్తవిక ఉదాహరణలు మరియు అలాంటి వాటి ప్రస్తావన లేకుండా ఖాళీగా వదిలివేయవద్దు; అలా చేస్తే నీ ప్రసంగాలు విసుగు పుట్టించేవిగా మరియు భారంగా మారతాయి.

కథలను మరియు సంఘటనలను ప్రదర్శించడంలో ఉత్తమ విధానంపైనా, వాటితో హృదయపూర్వకంగా మమేకం కావడంపైనా, ఆ ప్రభావం ముఖ కవళికలలో మరియు కంఠ స్వరంలో ప్రస్ఫుటం కావడంపైనా అత్యంత శ్రద్ధ వహించాలి.

ప్రజల వాస్తవ జీవితంలో, వారి బాధలలో పాలుపంచుకుంటూ జీవించడానికి ప్రయత్నించండి, తద్వారా మీరు ఒక దారిలో, వారు మరో దారిలో ఉన్నట్లుగా ఉండదు.

[17](ప్రసంగ, ప్రభావ నైపుణ్యాలు మరియు కళలను ఆర్జించుట యొక్క ప్రాముఖ్యత)

ప్రసంగ నైపుణ్యాలను, కళలను ఆర్జించవలసిన వారిలో ప్రప్రథముడు ఖతీబ్ (ప్రసంగీకుడు). ఎందుకంటే, ప్రజలు అతను చెప్పే విషయాలను అంగీకరించాలంటే, ఖతీబ్ వారిని ఒప్పించి, వారి దృష్టిని ఆకర్షించవలసి ఉంటుంది.

శక్తివంతమైన శైలి మరియు అద్భుతమైన ప్రసంగ పటిమ కలిగిన ఖతీబ్ (ప్రసంగీకుడు) వలన ప్రజలు - సాధారణంగా - ఆ లక్షణాలు లేని వ్యక్తి కంటే ఎక్కువగా ప్రయోజనం పొందుతారు, అతను ఎక్కువ జ్ఞానం మరియు ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ.

ఖతీబు ప్రసంగ కళకు సంబంధించిన పాఠాలను వినడం, లేదా ఆ విషయానికి సంబంధించిన పుస్తకాలను చదవడం అతనికి అవసరం, అయితే ఆ పాఠాలకు స్వయంగా హాజరవడం మరింత శ్రేష్ఠమైనది.

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల సత్యసంధతతో ఉండి, తనను తాను మరియు తన సమయాన్ని ఆయన కొరకు అంకితం చేస్తాడో, అల్లాహ్ అతనికి తన దయ మరియు అనుగ్రహం నుండి అతని ఊహలో లేనిది మరియు అతని మనస్సులో మెదలనిది ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే తనకు ఇష్టమైన దానిని అల్లాహ్'కు ఇస్తాడో, అల్లాహ్ అతనికి అతను ఇష్టపడే దానికంటే ఎక్కువగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే తనను తాను అల్లాహ్ కొరకు అంకితం చేసుకుంటాడో, అల్లాహ్ అతని కొరకు తన సృష్టిని వశపరుస్తాడు, మరియు అతని కొరకు ఆనందం, ఉన్నతి మరియు సాధికారత యొక్క మార్గాలను వశపరుస్తాడు.

కావున మీకు మరియు మహోన్నతుడైన ప్రభువు యొక్క అనుగ్రహాలకు మధ్య ఉన్నది కేవలం: సత్యసంధమైన సంకల్పం, అల్లాహ్ కొరకు బలమైన ఇచ్ఛాశక్తి, అల్లాహ్ ఇష్టపడే మరియు ఆయన ప్రసన్నత పొందే వాటి కొరకు మీరు ఇష్టపడే మరియు ఆశించే వాటిని వదిలివేయటం, మరియు ఇహలోక ప్రజలు, మనోవాంఛలు మరియు పదవుల వారి దృష్టిలో మీ హోదా తగ్గిపోయినప్పటికీ, ఆయన ధర్మం మరియు షరిఅత్ యొక్క ఉన్నతి కొరకు అవిశ్రాంతంగా కృషి చేయటం.

[18](మబ్దా అత్తజ్దీద్) నవీకరణ సూత్రం

నిశ్చయంగా అల్లాహ్ మానవుడిని శ్రేష్ఠత వైపు నూతనత్వాన్ని, మార్పును ప్రేమించేవానిగా సృష్టించాడు, అందువల్ల ప్రజలు ఒకే స్థితిలో స్థిరంగా ఉండరు; జీవితంలో ఏదైనా కొత్తదనం వచ్చినప్పుడల్లా, తమ శక్తి మేరకు దానిని పొందడానికి త్వరపడతారు.

నేటి మనిషి పది సంవత్సరాల క్రితం ఉన్నవాడు కాదు; బదులుగా, నేడు అతడు తన జీవిత విధానాన్ని, జీవనశైలిని, వాహనాన్ని మరియు ఇంటిని మార్చుకుని మరింత ఉత్తమంగా చేసుకున్నాడు.

జుమా ఖతీబ్ తన ప్రసంగ శైలిని పునరుద్ధరించుకోవడంలో, దానిని మెరుగుపరచుకోవడంలో, మరియు తన ప్రసంగ నైపుణ్యాలను, ప్రభావితం చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో ఇతరుల కన్నా ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకనగా, అతను ఖుత్బా ఇచ్చే బాధ్యతను స్వీకరించినప్పటి నుండి తాను అలవరుచుకున్న ఒకే పద్ధతిని అనుసరిస్తూ ఉంటే, అతను నిస్సందేహంగా ఉత్తమంగా మరియు శ్రేష్ఠంగా మారలేడు, అంతేకాక, అతను వెనుకబడిపోతాడు. ఎందుకంటే మానవ స్వభావం ప్రకారం, వయసు పెరిగే కొద్దీ మరియు వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతని ఉత్సాహం మరియు చురుకుదనం బలహీనపడతాయి, అతని ఆత్మ వాడిపోతుంది, మరియు అతని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి, తనను ఉత్తేజపరిచే, తన ఉత్సాహాన్ని మరియు ఆత్మను బలపరిచే, మరియు తన నైపుణ్యాలను మరియు శైలులను అభివృద్ధి చేసే వాటి అవసరం అతనికి ఉంది; తద్వారా అతను తనను, తన ఇంద్రియాలను మరియు తన ఉత్సాహాన్ని ఆవరించే బలహీనతలను అధిగమించగలడు.

చాలా మంది ఖుత్బా ఇచ్చేవారు ప్రసంగించడం ప్రారంభించినప్పటి నుండి వారిలో ఎటువంటి స్పష్టమైన మార్పు రాలేదు, అయితే దీని అర్థం వారు ప్రారంభించినప్పటి నుండే పరిపూర్ణతను చేరుకున్నారనా?

లేదు.

మరి అలాంటప్పుడు, తన జీవన మరియు ప్రాపంచిక వ్యవహారాలను మెరుగుపరచడానికి తీవ్రంగా కృషి చేసే అతను, ఎందుకు తనకు అలవాటైన పద్ధతిలోనే ఉండిపోతూ, తన శైలిని మరియు సమర్పణను సరిదిద్దుకోకుండా, మెరుగుదల, నవీకరణ మరియు సృజనాత్మకతలో సరైన చర్యలు తీసుకోడు?

ఒక వ్యక్తి తన జీవితంలో చేసే పనులలో ఖుత్బా ఇవ్వటం అనేది అత్యంత శ్రేష్ఠమైన మరియు గొప్ప కార్యం అయినప్పుడు, దాని కొరకు అతను ఎందుకు ప్రయత్నించడు?

[19](ప్రభావం చూపే రెండు సాధనాల పట్ల శ్రద్ధ వహించడం: స్వరం మరియు దృష్టి)

విజయవంతమైన ఖతీబ్ కు ఈ రెండు సాధనాలను ఉపయోగించడం అత్యంత అవసరం:

1- స్వరము (ద్వని), ఇది అత్యంత ప్రభావవంతమైన సాధనం, మరియు ఈ క్రింది విషయాలను పాటించడం ద్వారా దీని ప్రభావం పరిపూర్ణం అవుతుంది:

ఎ- స్వరము దాని హెచ్చుతగ్గులలో, వేగము-నిదానములో మధ్యస్థంగా ఉండాలి. అది శ్రోతలకు విసుగు మరియు నీరసం కలిగించేంత తక్కువగా లేదా నిదానంగా ఉండరాదు, అలాగే వారికి ఇబ్బంది కలిగించేంత లేదా వారు ఏకాగ్రతతో గ్రహించలేనంత బిగ్గరగా లేదా వేగంగా కూడా ఉండరాదు.

బి- స్వరం ఒకే రీతిలో ఉండకూడదు. కొంతమంది ఖతీబుల స్వరం ఖుత్బా అంతా ఒకేలా ఉంటుంది. అది బలహీనంగా ఉంటే విసుగును, బలంగా, బిగ్గరగా ఉంటే ఇబ్బందిని కలిగిస్తుంది.

ప్రసంగం ఏకరీతిలో సాగితే, శ్రోతలు ఖతీబ్ ప్రసంగంపై శ్రద్ధను కోల్పోతారు; ఎందుకంటే వారు ముఖ్యమైన విషయాలకు, సాధారణ విషయాలకు మధ్య తేడాను గుర్తించలేరు. నిస్సందేహంగా, ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన విషయాలు చెప్పేటప్పుడు, ప్రసంగ వేగాన్ని పెంచుతూ స్వరాన్ని కూడా స్పష్టంగా హెచ్చించడం, లేదా ప్రసంగ వేగాన్ని తగ్గిస్తూ స్వరాన్ని కూడా తగ్గించడం అవసరం.

సి: వాక్యాల సందర్భాన్ని బట్టి నీ స్వరాన్ని మార్చుకో, అది ప్రశ్న అయితే ప్రశ్నించే విధంగా, ఆశ్చర్యం అయితే ఆశ్చర్యపడే విధంగా పలుకు, ఇదే విధంగా ప్రతి వాక్యాన్ని దాని సందర్భానికి తగినట్లుగా పలకాలి.

డి- మీ సాధారణ సంభాషణలో కన్నా నోటిని ఎక్కువగా తెరవండి. ఇది అక్షరాల ఉచ్చారణ స్థానాలు స్పష్టంగా ఉండటానికి, అవి ఒకదానితో ఒకటి కలవకుండా ఉండటానికి, మరియు ధ్వనిని నియంత్రించే సామర్థ్యానికి సహాయపడుతుంది. అయితే ఇందులో అతిశయోక్తి ఉండకూడదు, ఎందుకంటే నోరు తెరవడంలో అతిశయోక్తి అతి ఉత్సాహానికి, మరియు ప్రసంగీకునికి తగని రూపానికి దారితీస్తుంది.

హ- మీ సాధారణ స్వరంతోనే ఖుత్బా ఇవ్వండి, ఖుత్బా కోసం ఒక ప్రత్యేకమైన స్వరాన్ని మరియు శైలిని ఏర్పరచుకోవద్దు. ఎందుకంటే అది మీకూ ప్రజలకూ మధ్య అంతరం ఏర్పరచడమే కాక, వినేవారిపై ప్రభావం చూపే మీ అత్యంత శక్తివంతమైన సాధనాలను కోల్పోయేలా చేస్తుంది.

విరామం తీసుకోవడం మంచిది అనిపించే సందర్భాలలో కొద్దిసేపు ఆగిపోవాలి. ఖతీబ్ ఒక ముఖ్యమైన విషయాన్ని తన శ్రోతల మనస్సులలో స్థిరపరచాలని కోరుకున్నప్పుడు, అతను వారి వైపు తిరిగి, ఏమీ మాట్లాడకుండా ఒక క్షణం పాటు నేరుగా వారి కళ్లలోకి చూడాలి.

ఈ ఆకస్మిక మౌనం వారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, అది వారి శ్రద్ధను ఆకర్షించి, ఆ మౌనం తర్వాత ఏమి వస్తుందోనని వారిలో ప్రతి ఒక్కరినీ శ్రద్ధగా మరియు ప్రేరేపితంగా ఉండేలా చేస్తుంది.

కానీ, ఈ విరామం (ఆగడం) మరీ ఎక్కువ సమయం ఉండకూడదు, మరియు అది సహజంగా ఉండాలి, బలవంతంగా (కృత్రిమంగా) అనిపించకూడదు.

దానికి ఉదాహరణ: అలీ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక బంగారం ముక్కను పంపించారు. దానిని ఆయన తన సహచరులలో కొందరి మధ్య పంచిపెట్టారు.

అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! అల్లాహ్‌ కు భయపడండి!” (...)

సత్యసంధుడు, విశ్వసనీయుడైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఎంతటి తెగింపు!

అందువల్లనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సాహసానికి ఆశ్చర్యపోతూ ఇలా ప్రవచించారు: (...) నేనే అల్లాహ్‌కు అవిధేయుడినైతే, ఇక అల్లాహ్‌కు విధేయత చూపేదెవరు? భూవాసుల విషయంలో అల్లాహ్ నన్ను నమ్మకస్తునిగా భావిస్తుంటే, మీరు నన్ను నమ్మరా?

బ్రాకెట్ల మధ్యలో ఉన్నది ఒక స్వల్ప విరామాన్ని సూచిస్తుంది; ఎందుకంటే ఆ సందర్భం, శ్రోతల శ్రద్ధను ఆకర్షించి, ఆ తర్వాత చెప్పబోయే విషయాల పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించడాన్ని కోరుతుంది.

మొదటి వాక్యం: (సత్యవంతుడు మరియు నమ్మకస్తుడైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఎంతటి సాహసం!!), ఇది ఒక ఆశ్చర్యార్థక శైలి, సందర్భానుసారంగా దానిని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే విధంగానే రచించబడింది.

మరియు రెండవ వాక్యము: (నేను అవిధేయతకు పాల్పడితే అల్లాహ్'కు విధేయత చూపేది ఎవరు? అల్లాహ్ భూమిపై ఉన్న ప్రజలలో నాపై నమ్మకముంచగా, మీరు నన్ను నమ్మరా?), ఇది ఒక ఖండనార్థక ప్రశ్న శైలిలో ఉండెను, ఎందుకంటే సందర్భం దానిని ఒక ఖండనార్థక ప్రశ్న రూపంలోనే రూపొందించాలని కోరింది.

2- దృష్టి: అనగా శ్రోతలందరిపై దృష్టిని ప్రసరింపజేయడం, మరియు మాట్లాడుతున్న విషయానికి అనుగుణంగా కళ్లతో ప్రతిస్పందించడం:

అ- కుడి, ఎడమ వైపులకు కొద్దిగా తిరగాలి, అయితే వేగంగా లేదా తరచుగా అతిగా తిరగకూడదు. ప్రత్యేకంగా ఖతీబ్ (ఖుత్బా ఇచ్చేవారు) కు ఇది సిఫార్సు చేయబడలేదు; ఎందుకంటే ఇది ఖతీబ్ తన భావోద్వేగాల ఆధీనంలో ఉన్నాడని సూచిస్తుంది, మరియు ఇది ఏకాగ్రతలో కచ్చితత్వం లోపించడానికి దారితీస్తుంది.

బి- కన్ను తెరవడం లేదా దానిపై తేలికగా నొక్కడం. కంటి కదలికలు హాజరైన వారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి, వారు వాటి నుండి నాలుకతో వ్యక్తపరచలేని అర్థాలను స్ఫూర్తి పొందుతారు.

స్వరం మరియు దృష్టి: ఇవి శ్రోతలపై ఖతీబ్ (ప్రసంగీకుడు) ప్రభావం చూపడానికి రెండు ప్రాథమిక మూలస్తంభాలు. అవి లేకుండా, అతను తాను చెప్పదలచుకున్న విషయాన్ని వారికి చేరవేయలేడు, వారిని ఒప్పించలేడు, వారి దృష్టిని ఆకర్షించలేడు మరియు వారిలో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని నింపలేడు.

ప్రతి వక్తకు ఎటువంటి సంకోచం లేదా ప్రయాస లేకుండా వాటిని ఉపయోగించే అవకాశం ఉంది, కానీ అతిశయోక్తి లేకుండా. ఎందుకంటే, దానిలో అతిశయోక్తి చిత్తచాంచల్యం మరియు అవివేకాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, గంభీరత మరియు నిశ్శబ్దంలో అతిశయోక్తి విసుగు మరియు విరక్తికి దారితీస్తుంది. అన్ని విషయాలలో మధ్యే మార్గం ఉత్తమమైనది.

మరియు జుమా ఖతీబ్ కు తగని కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిలో నుండి:

1- రెండు చేతులను కదిలించడం.

2- బిష్త్ (సాంప్రదాయ వస్త్రం) లేదా తలపాగాను కదపడం, మైకులతో ఆటలాడటం, మరియు అనవసరంగా ముందుకు వెనుకకు కదలడం వంటివి చేయకూడదు.

[20] (సున్నతె సహీహా ద్వారా స్థిరపడని ఒక నిర్దిష్ట పద్ధతికి కట్టుబడి ఉండవద్దు)

ప్రమాణికమైన సున్నత్ ద్వారా నిర్ధారించబడినవి తప్ప, మరే ఇతర నిర్దిష్టమైన వాక్యాలకు కట్టుబడి ఉండరాదు, తద్వారా అది ఒక సున్నత్ అని భావించబడకుండా ఉంటుంది. ఉదాహరణకు, మొదటి ఖుత్బా ముగింపులో ‘మహోన్నత ఖుర్ఆన్ ద్వారా అల్లాహ్ నాకు మరియు మీకు శుభాలు ప్రసాదించుగాక’ అని పలకడం.

చాలా సార్లు కొంతమంది ఖతీబులు ఖుత్బా చివరిలో ఒకే దుఆకు కట్టుబడి ఉంటారు, దానిని దాదాపుగా మార్చరు. వారిలో కొందరు ఈ పునరావృత దుఆను మరీ పొడిగిస్తారు. ఎంతగా అంటే, ఖతీబ్ దుఆ చేయడం ప్రారంభించినప్పుడు చాలా మంది ప్రజలు ఇబ్బందిగా, విసుగుగా భావిస్తారు; ఎందుకంటే దుఆలో ఉండవలసిన ప్రతిస్పందన లోపించి, కేవలం కథనంలా దానిని పదేపదే వినడం వల్ల వారు విసిగిపోతారు.

[21](అక్షరాల ఉచ్చారణా స్థానాలపై శ్రద్ధ వహించడం, అవి పరస్పరం కలవకుండా చూడటం)

అక్షరాలను వాటి ఉచ్ఛారణా స్థానాల నుండి పటిష్టంగా ఉచ్ఛరించడానికి జాగ్రత్త వహించాలి, ఎందుకంటే దానికి వాగ్ధాటి, స్పష్టత మరియు మాట యొక్క శక్తిపై గొప్ప ప్రభావం ఉంటుంది.

ఒక ఖతీబ్ చేసే పొరపాట్లలో ఒకటి: పదాలను చాలా వేగంగా పలకడం. దీనివల్ల మొదటి అక్షరం లేదా పదం సరిగ్గా వినబడకముందే రెండో దానితో కలిసిపోతుంది. కానీ, ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి మరియు పదాలను విడివిడిగా, విడమర్చి చెప్పాలి ([15]). - "అరబ్బుల వద్ద ఖతాబత్", ముహమ్మద్ అల్-ఖిద్ర్ హుసైన్: 189.

సృష్టి మొత్తంలో అత్యంత స్పష్టమైన భాషా ప్రావీణ్యం కలిగిన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాటలు కూడా ఇదే విధంగా (స్పష్టంగా మరియు నిదానంగా) ఉండేవి.

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం: “నిశ్చయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ వలె హదీసును ఏకధాటిగా చెప్పేవారు కాదు”([16]). - దీనిని బుఖారీ : (3568) మరియు ముస్లిం : (2493) లో ఉల్లేఖించారు.

[22](ఖుత్బా యొక్క ఉద్దేశ్యం, మరియు ఖతీబు తప్పనిసరిగా ప్రస్తావించవలసిన అతి ముఖ్యమైన విషయాలు)

ఖతీబ్ ప్రజల దృష్టిని ఇహలోకపు చింతలు, సంఘటనల నుండి మరల్చి, పరలోకం మరియు దాని కొరకు సిద్ధపడటం వైపు నడిపించాలి. మస్జిద్‌ను ఒక మీడియా వేదికగా మార్చకూడదు; అక్కడ ఖతీబ్ రాజకీయ విషయాలను ప్రస్తావించడం, లేదా వినేవారికి వారి ధార్మిక మరియు ప్రాపంచిక జీవితంలో ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని విషయాలలో తలదూర్చడం ఎంతమాత్రం తగదు.

విజయవంతమైన ఖతీబు తన ఖుత్బాలలో ఎక్కువగా విశ్వాసాన్ని మరియు అల్లాహ్ తఆలా పట్ల అనుబంధాన్ని పెంచే విషయాల గురించి ప్రస్తావిస్తాడు; ఎందుకంటే, ప్రజల విశ్వాసం పెరిగి, వారి ప్రభువు పట్ల వారి అనుబంధం బలపడినప్పుడు, అదే వారు పాపాలను మరియు నిరర్థకమైన విషయాలను విడిచిపెట్టడానికి గొప్ప కారణం అవుతుంది.

ఖతీబు విస్మరించకూడని మరియు నిరంతరం పునరావృతం చేయవలసిన ముఖ్య విషయాలు:

తౌహీద్ మరియు ఇస్లాం మూలస్థంభాలు

సలాహ్ (నమాజు) యొక్క పద్ధతి మరియు దానిలో ఖుషూ యొక్క ప్రాముఖ్యత.

సీజన్లకు సంబంధించిన అంశాలు, ఉదాహరణకు రమదాను మాసం వచ్చినప్పుడు దాని ఘనత గురించి చర్చించడం.

ఫిత్నాల నుండి హెచ్చరిక మరియు వాటితో వ్యవహరించవలసిన విధానం.

బిద్అత్ నుండి వారించబడుతుంది.

షైతాను మోసం మరియు అతను ప్రేరేపించే మార్గాల నుండి హెచ్చరిక.

నైతికలు మరియు పద్దతులు మరియు వాటికి సంబంధించిన విషయాలు.

విశ్వాసాన్ని మరియు అల్లాహ్ తో అనుబంధాన్ని పెంచే విషయాలు:

1- ప్రజల హృదయాలలో అల్లాహ్ యొక్క లక్షణాలను మరియు ఆయన అనుగ్రహాలను స్మరిస్తూ, ఆయనను ఘనపరచడం.

2- అల్లాహ్ యొక్క వాక్కయిన ఖుర్ఆను'ను గౌరవించుట.

3- ప్రవక్తల అలైహిముస్సలాం, వారిలో అగ్రగణ్యులు మరియు వారిలో పరిసమాప్తి అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు గౌరవనీయులైన సహాబాల రదియల్లాహు అన్హుమ్ యొక్క గాథలను ప్రస్తావించడం.

4- స్వర్గము, దాని లక్షణాలు, దానిలో ప్రవేశించే కారణాలు, అదేవిధంగా నరకమును గుర్తుంచుకోవడం.

5- హృదయ ఆరాధనల పట్ల శ్రద్ధ వహించడం: తవక్కల్, ఇనాబా, తౌబా, భయపడటం మరియు వినయం చూపటం.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల ప్రసంగాలను ఎవరైతే లోతుగా పరిశీలిస్తారో, అవి సన్మార్గం మరియు తౌహీద్‌ను స్పష్టం చేయడానికి, ప్రభువు - జల్ల జలాలుహు - యొక్క గుణగణాలను, విశ్వాసం యొక్క సమగ్ర సూత్రాలను, అల్లాహ్ వైపుకు ఆహ్వానాన్ని వివరించడానికి, ఆయనను తన సృష్టికి ప్రియమైనవానిగా చేసే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను ప్రస్తావించడానికి, ఆయన పట్టు (శిక్ష) గురించి భయపెట్టే ఆయన శిక్షా దినాలను గుర్తు చేయడానికి, మరియు వారిని ఆయనకు ప్రియమైనవారిగా చేసే ఆయన స్మరణ మరియు కృతజ్ఞతలను ఆజ్ఞాపించడానికి పూర్తిగా సరిపోతాయని వారు కనుగొంటారు. ఆ విధంగా, వారు అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆయన గుణాలు మరియు నామాలను ప్రస్తావించడం ద్వారా ఆయనను తన సృష్టికి ప్రియమైనవానిగా చేస్తారు; మరియు ఆయనకు విధేయత చూపమని, కృతజ్ఞతలు తెలపమని, మరియు ఆయనను స్మరించమని ఆజ్ఞాపించడం ద్వారా వారిని ఆయనకు ప్రియమైనవారిగా చేస్తారు. ఫలితంగా, శ్రోతలు తిరిగి వెళ్ళేటప్పుడు, వారు అల్లాహ్‌ను ప్రేమించేవారై, అల్లాహ్ వారిని ప్రేమించేవాడై ఉంటాడు.

ఆ తర్వాత, కాలం గడిచిపోయింది మరియు ప్రవక్తృత్వపు కాంతి మసకబారింది. ధర్మశాసనాలు మరియు ఆదేశాలు వాటి యదార్థాలను మరియు ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా పాటించే కేవలం ఆచారాలుగా మారిపోయాయి. ప్రజలు వాటికి బాహ్య రూపాలను మాత్రమే ఇచ్చి, తమకు తోచిన విధంగా వాటిని అలంకరించారు. వారు ఆ ఆచారాలను మరియు పద్ధతులను విధిగా పాటించవలసిన సున్నతులుగా మార్చేశారు, అయితే ఏ ఉద్దేశ్యాలనైతే విధిగా పాటించాలో, వాటినే వారు విస్మరించారు. వారు తమ ప్రసంగాలను ప్రాసలతో, అలంకారిక శైలితో నింపివేశారు. ఫలితంగా, వాటి నుండి హృదయాలు పొందే ప్రయోజనం తగ్గిపోయింది; వాస్తవానికి, అది పూర్తిగా కనుమరుగైపోయింది, మరియు వాటి అసలు లక్ష్యం దూరమైపోయింది ([17]). - "జాద్ అల్ మఆద్ ఫీ హది ఖైరిల్ ఇబాద్": 1/ 409-410.

ఆయన (రహిమహుల్లాహ్) ఖుత్బా యొక్క ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: «దీని ఉద్దేశ్యం: అల్లాహ్ ను స్తుతించడం మరియు ఆయన ఘనతను కీర్తించడం, ఆయన తౌహీద్ (ఏకత్వం)ను మరియు ఆయన సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సందేశహరత్వాన్ని గురించి సాక్ష్యమివ్వడం, అల్లాహ్ యొక్క దినాల గురించి దాసులకు జ్ఞాపకం చేయడం, ఆయన శిక్ష మరియు ఆగ్రహం నుండి వారిని హెచ్చరించడం, ఆయన మరియు ఆయన స్వర్గవనాల సామీప్యం కలిగించే విషయాల గురించి వారికి హితబోధ చేయడం, మరియు ఆయన ఆగ్రహానికి మరియు నరకాగ్నికి దగ్గర చేసే విషయాల నుండి వారిని వారించడం. ఇదే ఖుత్బా మరియు దాని కొరకు సమావేశమవడంలోని ముఖ్య ఉద్దేశ్యం» అ.హి([18]). ముందు పేర్కొన్న ఆధారం: 1/386.

ఖతీబు ప్రజల మధ్య వ్యాపించి ఉన్న విశ్వాసం, ఆరాధనలు, నైతికత, పరస్పర వ్యవహారాలు, జీవన విధానం, శిక్షణ మొదలైన వాటిలో ఉన్న తప్పుల గురించి వారిని జాగృతం చేయాలి. అలాగే, ఫితనాల బారిన పడకుండా వారిని హెచ్చరించాలి మరియు వారికి వారి ధార్మిక విషయాలను బోధించాలి.

అల్లాహ్ యే ఎరుగును. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.