الإسلام والإلحاد وجها لوجه
నాస్తికత్వం నుండి ఇస్లాం ధర్మం వైపు రావడం
నాస్తికత్వం నుండి ఇస్లాం ధర్మం వైపు రావడం
ప్రశ్నలు మరియు జవాబులు:
అల్లాహ్ పేరుతో, సకల స్తోత్రాలు మరియు ప్రశంసలు అల్లాహ్'కే శోభిస్తాయి మరియు దైవప్రవక్త పై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై మరియు ఆయన మార్గమును అనుసరించే వారిపై శాంతి, శుభాలు కురియుగాక! అమ్మా బాద్:
ఈ పుస్తకం పేరు: 'నాస్తికత్వం నుండి ఇస్లాం ధర్మం వైపు రావడం'
ఈ చిరుపుస్తకం నాస్తికత్వం యొక్క అర్థాన్ని, దాని సందిగ్దమైన అంశాలను మరియు అది ఎలా హేతువుకు మరియు సహజ స్వభావం యొక్క ఖచ్చితమైన వాస్తవాలకు బద్ధవిరుద్ధంగా ఉన్నదో సవివరంగా తెలుపుతున్నది.
ఇంకా ఇది మహోన్నతుడైన సృష్టికర్త ఉనికిని రుజువు చేసే కొన్ని ఆధారాలను కూడా అందజేస్తున్నది.
వాస్తవానికి, మనం బుద్ధీ, వివేకం ద్వారా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను గురించి తెలుసుకుంటాము. అల్లాహ్ ఈ విధంగా తెలియ చేస్తున్నాడు:
{వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?} (35)
సూరతుత్తూర్
సహేతుకంగా చూస్తే కేవలం మూడు అవకాశాలు మాత్రమే ఉన్నాయి (నాల్గవ దానికి అస్సలు అవకాశం లేదు):
మొదటిది: మనం సృష్టికర్త లేకుండా సృష్టించబడ్డాము (లేదా వారు ఏమీ లేకుండా సృష్టించబడ్డారా), మరియు ఇది అసాధ్యం. ఎందుకంటే సృష్టికర్త లేకుండా మనం ఎలా సృష్టించబడగలం?
రెండవది: మనల్ని మనమే సృష్టించుకున్నాము (లేదా స్వయంగా వారే సృష్టికర్తలా) మరియు ఇది కూడా అసాధ్యం. ఎందుకంటే నేను ఉనికిలో లేకుండానే నన్ను నేను ఎలా సృష్టించుకోగలను?
కాబట్టి బుద్దితో ఆలోచిస్తే కేవలం మూడవ విషయం మాత్రమే మిగిలి ఉంది మరియు దాని గురించి ఖుర్ఆన్ (వచనం) ఏమి అనలేదు. ఎందుకంటే ఆ వాస్తవం చాలా స్పష్టమైనది - అదేమిటంటే మనల్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు.
కాబట్టి, మనం అల్లాహ్ (మన సృష్టికర్తను) బుద్థి ద్వారా గుర్తించవచ్చు.
అలాగే సహజసిద్ధంగా అల్లాహ్ (మన సృష్టికర్త) గురించి మనకు తెలుసు.
మరియు విశ్వాన్ని సృష్టించే శక్తి లేదని, బ్యాక్టీరియా మరియు మానవులను సృష్టించడం, మానవ శరీరం యొక్క విధులను క్రమపద్ధతిలో నియంత్రించడం లేదా కట్టుదిట్టంగా పరమాణువు మొదలు పాలపుంత (గెలాక్సీ) వరకు సృష్టి అంతటినీ నియంత్రించడం వంటి అపూర్వ కార్యాలు విగ్రహాలకు మరియు ప్రకృతికి సాధ్యం కాదనే వాస్తవం మనకు సహజంగానే తెలుసు.
కావున అవిశ్వాసులు పూజించే విగ్రహాలు మరియు నాస్తికులు నమ్మే ప్రకృతి రెండూ తమ సృష్టికర్త యొక్క అవసరం ఉన్నవే.
వారు తమ సొంత వ్యవహారాలపై నియంత్రణ కలిగి లేకపోవటమే కాదు, వారు తమ శరీరంలో, అధిక మోతాదులో ఉన్న హార్మోన్లను కూడా నియంత్రించలేరు. వారు మిలియన్ల కొద్దీ సమాచారాన్ని కలిగి ఉన్న ప్రతి జీవకణానికి జన్యు సంకేతాన్ని (genetic code) కూడా సరఫరా చేయలేరు. ఇంకా, వారు దేనినీ ఉనికిలోకి తీసుకురాలేరు, ఆఖరికి తమను తాము కూడా.
కాబట్టి, అన్ని అద్భుతాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు గొప్పవాడు, సర్వజ్ఞుడు, శక్తిమంతుడు, సర్వ జ్ఞాని అయిన సృష్టికర్త.
నాస్తికులు ఉపయోగించే హానికరమైన ఆరోపణలను మరియు సృష్టికర్త ఉనికికి సంబంధించిన తార్కిక మరియు సహజమైన రుజువులను తప్పుగా మార్చడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను ఈ చిరుపుస్తకం సవివరంగా చర్చిస్తుంది.
అటువంటి ప్రయత్నాలలో అత్యంత ప్రసిద్ధమైనది "విశ్వం యాదృచ్చికం ద్వారా ఉద్భవించిందనే" వారి వాదన. సంభావ్యత యొక్క ప్రాథమిక సూత్రాల గురించి వారికి అవగాహన లేకపోవడం లేదా వాటిని విస్మరించడం దీనికి కారణం. ఎందుకంటే యాదృచ్చికానికి రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయి.
అవి: సమయం మరియు స్థలం.
యాదృచ్చికం, తన ప్రభావాలను ముందుకు తీసుకురావడానికి ఒక షరతు సమయం.
దాని ప్రభావాన్ని ఉత్పత్తి చేయగల వస్తు మాధ్యమం కూడా దీనికి అవసరం.
అయితే, మన విశ్వం కాలముని మరియు స్థలముని లేనిది నుండి ఉద్భవించిందని చెప్పబడితే, యాదృచ్ఛికతకు ఏ విధమైన పాత్ర ఉందని చెప్పగలము? ఎందుకంటే, ఇది స్వయంగా యాదృచ్ఛికతకే అసాధ్యమైనదిగా మారుతుంది!
తరువాత ఈ చిరుపుస్తకం, ధర్మం యొక్క ఆవశ్యకత, ధర్మం యొక్క అర్థం మరియు విశ్వ ప్రభువుకు సమర్పించుకోవడం మరియు విధేయత చూపడం యొక్క ఆవశ్యకతలపై కొన్ని మేధోపరమైన ఆధారాలను అందిస్తుంది. నిజానికి, అల్లాహ్ కు సమర్పించుకోవడం మరియు విధేయత చూపుతూ ఆయనకు లొంగిపోవడమే ధర్మం యొక్క సారాంశం.
కాబట్టి, నీవు అల్లాహ్కు విధేయుడవై, నీ సృష్టికర్తకు మరియు నీకు ప్రతి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, మార్గదర్శకత్వాన్ని ప్రసాదించిన ఆహారప్రధాత ఆరాధన చేస్తున్నావు.
తన దాసుల ఆరాధనపై కేవలం తనకు మాత్రమే హక్కు ఉన్నది, ఎందుకంటే ఆయనే మనల్ని శూన్యం నుండి సృష్టించినాడు, మనకు జీవితాన్ని ప్రసాదించాడు, మనకు మార్గదర్శకత్వం వహించాడు మరియు మన కొరకు ప్రవక్తలను పంపాడు, మనలో ఎవరు శ్రేష్ఠుడో పరీక్షించడానికి. కాబట్టి, ఆరాధన అనేది అల్లాహ్ కు మనపై ఉన్న హక్కు.[
{ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.} [2]
సూరతుల్ ముల్క్.
కొంచెం ముందుకు సాగితే, ఈ చిరుపుస్తకం ఇస్లాం యొక్క ప్రామాణికతకు నిరూపించే కొన్ని రుజువులను అందిస్తుంది. ఇంకా ఇస్లాం ధర్మాన్ని తప్ప మరే ఇతర ధర్మాన్నీ అల్లాహ్ మానవజాతి నుండి స్వీకరించడనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{మరియు ఎవరైనా ఇస్లాం ధర్మం (అల్లాహ్ కు విధేయత చూపుట, సమర్పించుట) తప్ప మరే ఇతర ధర్మాన్నైనా అవలంబించగోరితే అది ఎంత మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరతాడు.}
సూరతు ఆలె ఇమ్రాన్ : 85
కాబట్టి ఇస్లాం దర్మమే అల్లాహ్ తన ప్రవక్తలందరికీ మరియు తన సందేశహరులందరికీ ఇచ్చి పంపిన ధర్మము.
అల్లాహ్ కు సమర్పించుకోవడం మరియు ఆయనను మాత్రమే ఆరాధించడం అనే అర్థాన్ని కలిగి ఉండటం అనేది ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన లక్షణం.
అదనంగా, ఇస్లాం ధర్మము అల్లాహ్ కు లొంగిపోవాలని ప్రోత్సహించే అత్యంత పరిపూర్ణమైన దివ్యాజ్ఞ,
మరియు ప్రవక్తలందరూ బోధించిన అల్లాహ్ యొక్క ఏకత్వం వైపు పిలిచే ఏకైక ధర్మము ఇది.
తమకు ఇవ్వబడిన చట్టాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రవక్తలందరూ ఏక దైవారాధనకు కట్టుబడి ఉన్నారు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అనే దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.}[25]
సూరతుల్ అంబియా
ఇస్లాం ధర్మము తప్ప ఈ ఏకదైవ విశ్వాసాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న ధర్మమేదీ ఈనాడు భూమిపై మిగల లేదు. ఎందుకంటే ఇతర మతాల అనుచరులందరూ వేర్వేరు స్థాయిలలో బహుదైవారాధనలో పడిపోయారు. తమ ప్రజలను ఏకదైవారాధనపై వదిలిపెట్టిన వారి ప్రవక్తల మరణానంతరం, క్రమంగా వారు బహుదైవారాధనలో పడిపోవడం ప్రారంభించారు. ఈనాడు, ప్రవక్తలు బోధించిన స్వచ్ఛమైన ఏకదైవ విశ్వాసంపై నిలబడి, నిరాటంకంగా కొనసాగుతూ ఉన్న ఏకైక ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే.
చివరకు ఈ పుస్తకం, ఇస్లాం యొక్క అర్థం మరియు మానవజాతి కొరకు దాని ఆవశ్యకతను వివరిస్తూ, ఒక వ్యక్తి ముస్లింగా ఎలా మారగలడనే ముఖ్యాంశాన్ని తెలుపుతూ ముగుస్తుంది.
వాస్తవానికి, ఇస్లాం ప్రతి మనిషి మనస్సులో తలెత్తే అస్తిత్వ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తున్నది. ఉదారహణకు: మనం ఎక్కడి నుండి వచ్చాము? మనం ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాము? మరియు మనం ఎక్కడికి వెళ్తున్నాము?
ఇస్లాం ధర్మం ఈ ప్రశ్నలన్నింటికీ ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన ఒక వచనంలోనే సమాధానం ఇచ్చేసింది. సకల లోపాలకూ, బలహీనతలకూ అతీతుడు, పరమ పవిత్రుడైన మన ప్రభువు ఇలా సెలవిచ్చాడు :
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు (చిరవరకు) మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు."{22}
సూరతు యాసీన్
నేను ఎక్కడి నుండి వచ్చాను? అల్లాహ్ యే నన్ను సృష్టించాడు (الَّذِي فَطَرَنِي).
నేను ఎక్కడికి వెళ్తాను? నేను చేసిన కర్మలకు లెక్క ఇవ్వడానికి నేను అల్లాహ్ వద్దకే వెళ్తాను.
మీరు ఆయన వైపునకే మరలించబడుతారు.(وَإِلَيْهِ تُرْجَعُونَ).
నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? నేను అల్లాహ్ ను ఆరాధించడానికి మరియు పరీక్షింపబడటానికి.
నేను అల్లాహ్ నే ఎందుకు ఆరాధించాలి? సహజ సిద్ధంగా, నన్ను సృష్టించిన అల్లాహ్ ను మాత్రమే నేను ఆరాధించాలి. ఒక దాసునికి మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం యొక్క స్వభావం ఇది: దాసుడు తన ప్రభువు మరియు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి.
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించకూడదూ? (وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي).
ఈ ఒక్క ఖుర్ఆన్ వచన౦, మానవులను అయోమయానికి గురిచేసే అత్య౦త ముఖ్యమైన మూడు ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నది.
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు".{22}
సూరతు యాసీన్
ఇస్లాం అనేది ప్రపంచానికి అల్లాహ్ పంపిన చట్టం.
ఇస్లాం అంటే అల్లాహ్ కు సమర్పించుకోవడం మరియు ఆరాధనల ద్వారా ఆయనకు లొంగిపోవడం; దాసుడు తన సృష్టికర్త మరియు సంరక్షకుడికి పూర్తిగా లొంగిపోవాలి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకుంటాడో, అతడే సజ్జనుడు. అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే!} (22)
సూరతు లుఖ్మాన్
కాబట్టి, ఇస్లాం అంటే మన జీవితంలోని పెద్ద మరియు చిన్న వ్యవహారాలన్నింటిలోనూ కేవలం అల్లాహ్ కు మాత్రమే దాస్యం చేయుట అంటే అల్లాహ్ ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{(ఇంకా) ఇలా పలుకు : "నిశ్చయంగా నా సలాహ్ (నమాజ్), నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణమూ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే!} (162)
{"ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను!"} (163)
సూరతుల్ అన్ఆమ్
నా నమాజు, ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం అన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కోసమే. నేను చేసేదంతా అల్లాహ్ కోసమే. నేను అల్లాహ్ ను ప్రార్థిస్తాను, అల్లాహ్ కోసం నా తల్లిదండ్రులకు విధేయత చూపుతాను, అల్లాహ్ కోసం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి చదువుకుంటాను మరియు నేర్చుకుంటాను, రాత్రిపూట నిద్రిస్తాను, తద్వారా అల్లాహ్ నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించాడో అది పూర్తి చేయగలిగేటంతటి శక్తితో మరలా నిద్ర నుండి మేల్కొంటాను.
ప్రతి పనిలో అల్లాహ్ కు మాత్రమే దాస్యం చేయుట. ఇది అల్లాహ్ కు సమర్పించుకోవడంలో అత్యంత ముఖ్యమైన చిహ్నాలు మరియు వ్యక్తీకరణలలో ఒకటి.
మనకు అత్యంత ఆందోళన కలిగించే విషయాల గురించి తెలుసుకోవాలనే మన ఆకలిని మరియు ఆసక్తిని ఇస్లాం తప్ప మరేదీ తీర్చదు.
అతను చనిపోవడానికే పుట్టాడని తెలిపే నాస్తికత్వం ఒక వ్యక్తికి చాలీచాలని జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుంది.
ఈ చిరుపుస్తకము, నాస్తికత్వం యొక్క సమస్యాత్మక అంశాలను ప్రస్తావిస్తూ, ఇస్లాం యొక్క మాన్యతకు, ప్రమాణత్వానికి సంబంధించిన కొన్ని రుజువులను ప్రదర్శించే విజ్ఞానం మరియు మేధోపరమైన చర్చను సూచిస్తుంది.
ఇది ప్రశ్నోత్తరాల రూపంలో ఉంది.
దీనిని అల్లాహ్ అనుగ్రహంతో ప్రారంభిద్దాం.
1 - నాస్తికత్వం అంటే ఏమిటి?
జవాబు: నాస్తికత్వం అంటే అగోచరమైన శక్తుల ఉనికిని విశ్వసించకుండా, వాటిని తిరస్కరించడం.
నాస్తికుడు సృష్టికర్తను, ప్రవక్తత్వంను మరియు మరణాంతరం లేపబడటము మొదలైన వాటి ఉనికిని తిరస్కరిస్తాడు.
2 - మీరు నాస్తికత్వాన్ని ఎందువలన విమర్శిస్తారు?
జవాబు: నాస్తికత్వం కొరకు ధార్మిక విశ్వాసాన్ని మించిన విపరీత విశ్వాసం అవసరం.
అంటే, ఇది భ్రాంతిపూరితమైన సిద్ధాంతాలపై మరియు తప్పుడు ఊహలపై ఆధారపడిన విశ్వాసం. మన సొంత కళ్లతో మనం చూసే సహజమైన స్వీయ-స్పష్టమైన మరియు ప్రశ్నించలేని వాస్తవాలు, మేధో సిద్ధాంతాలు మరియు చట్టపరమైన రుజువులపై ఆధారపడి ఉండే ధార్మిక విశ్వాసం వలె కాకుండా, దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
కాబట్టి, నాస్తికుడిగా మారాలంటే, మీరు ఈ క్రింది వాటిని ఊహించుకోవాలి: ఎ-విశ్వం అనేది శూన్యాల సమ్మేళనం యొక్క ఉత్పత్తి, ఇది అత్యంత ఖచ్చితమైన కొలతలు మరియు సూక్ష్మ పరిమితులు కలిగి ఉన్న అద్భుతమైన, అపూర్వమైన విశ్వంగా మారింది. బి-యాదృచ్చికంగా విశ్వం ఏర్పడి సూక్ష్మ పరిమితులను మరియు భౌతిక స్థిరాంకాలను ఉత్పత్తి చేసింది. అయితే, యాదృచ్చికం సంభవించడానికి రెండు ప్రధాన పరిస్థితులు అవసరమనే వాస్తవానికి ఇది విరుద్ధంగా ఉంది: స్థలం మరియు సమయం. కానీ విశ్వం శూన్యం నుండి మరియు హఠాత్తుగా ఉద్భవించిందని వారు పేర్కొంటారు, ఇది యాదృచ్చిక భావనను పూర్తిగా తిరస్కరిస్తున్నది. సి-మానవ బుద్ధి దాని పూర్తి శక్తితో ఇప్పటికీ సరళమైన జీవన రూపాలను ఉత్పత్తి చేయలేకపోయినప్పటికీ, యాదృచ్ఛికత భూమి యొక్క ప్రాథమిక వాతావరణంతో పాటు జీవం, బ్యాక్టీరియా మరియు మనిషిని ఉత్పత్తి చేయగలదా. డి-మనం చెల్లుబాటు అయ్యేవిగా భావించే నైతిక విలువలన్నీ, భౌతికవాదానికి విరుద్ధంగా నడుస్తాయి, ఎందుకంటే నిజమైన నైతికత, భౌతిక భారం మరియు ప్రాపంచిక ఆసక్తులపై నష్టాన్ని సూచిస్తుంది; ఇవి అసలు వాస్తవాలు మరియు భౌతిక భావాల యొక్క ఫలితం. మీరు నాస్తికుడిగా మారాలంటే అటువంటి మేధోపరమైన అసాధ్యాల న్నింటినీ మీరు విశ్వసించాలి.
ఇ-నాస్తికత్వంలో, భూమిపై ఉన్న మానవులందరినీ నాశనం చేయడాన్ని నిరోధించే మేధోపరమైన లేదా భౌతిక ఆధారం లేదు.
నిజానికి, భౌతిక ప్రపంచం ఒప్పు మరియు తప్పులను గుర్తించదు,
అప్పుడు, నాస్తికవాదం దృష్టిలో భూమిపై ఉన్న మానవులందరినీ సజీవంగా ఉంచడం లేదా వారిని నిర్మూలించడంలో తేడా లేదు.
ఏది ఏమైనప్పటికీ, ఇది జ్ఞానం, వచనం లేదా మేధస్సుల రుజువు లేదా నైతికత యొక్క అవశేషాలు లేని విశ్వాసం మీద స్థాపించబడి ఉంది.
3-సృష్టికర్త ఉనికికి రుజువు ఏమిటి?
జవాబు: అనేక రుజువులు ఉన్నాయి, అయినప్పటికీ మేము వాటిలో రెండింటిని మాత్రమే మీ ముందు పెడుతున్నాము:
1-అస్తిత్వంలోనికి తీసుకు వచ్చిన రుజువు.
2-దూరదృష్టి, వివేకం మరియు పరిపూర్ణతల రుజువు.
3 - ఉనికిలోకి తీసుకురావడానికి రుజువు ఏమిటి?
జవాబు :ఉనికిలోకి తీసుకురావడానికి రుజువు ఏమిటంటే :
ప్రతి వస్తువు సృష్టించబడినదే, అంటే, అది ఒకప్పుడు లేనిది, తర్వాత ఉనికిలోకి వచ్చింది. కాబట్టి, దానిని ఉనికిలోకి తీసుకువచ్చేవాడు ఉండాల్సిందే, అంటే, ఒక సృష్టికర్త.
ఈ విధంగా, సృష్టికర్త యొక్క ఉనికిని నిరూపించే లెక్కలేనన్ని ఆధారాలు, ఋజువులు ఉన్నాయి, ఆయన మహోన్నతుడు, ఎలాంటి లోపాలూ, కొరతలూ లేనివాడు.
విశ్వంలోని ప్రతి పరమాణువు సృష్టికి సాక్ష్యం, ఎందుకంటే ఉనికిలోకి వచ్చిన ప్రతిదీ సృష్టికర్త ఉనికికి సాక్ష్యం. విశ్వంలోని ప్రతి పరమాణువు సృష్టికి సాక్ష్యం. ఎందుకంటే ఉనికిలోకి వచ్చిన ప్రతిదీ, తన సృష్టికర్త ఉనికికి సాక్ష్యంగా మారుతున్నది.
మరియు మీరు సృష్టిని పరిశీలిస్తే, అది తాత్కాలికమైనదనీ, క్రమంగా మారుతున్నదనీ, క్షీణిస్తున్నదనీ మరియు స్వయంగా శాశ్వతమైనది కాదనీ మీకు స్పష్టం అవుతుంది. అందువలన అది స్వయ సమృద్ధి కాదు. ఇంకా, అది తనను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త ఉన్నాడని మీ మనస్సులో దృఢంగా నమ్మేలా చేస్తుంది. కాబట్టి, మీరు విశ్వం వైపు చూసిన వెంటనే అది తనను ఉనికిలోనికి తెచ్చిన ఆ సృష్టికర్త వైపుకు మిమ్ముల్ని తీసుకు వెళుతుంది.
అందువలన, విశ్వం వైపు మరియు మన చుట్టూ ఉన్న విషయాల వైపు మన దృష్టిని ఆకర్షించే అనేక ఆయతులు (వచనాలు) ఖుర్ఆన్లో ఉన్నాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{ఇలా పలుకు: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికి రావు!} [101]
సూరతు యూనుస్
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.} [8]
సూరతు అర్రూమ్
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది?} {185}
సూరతుల్ ఆరాఫ్
సృష్టించబడిన ప్రతిదీ సృష్టికర్త ఉనికిని నిరూపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యమే.
5- దూరదృష్టి, వివేకం మరియు పరిపూర్ణతకు ఋజువు అంటే ఏమిటి?
జవాబు: దూరదృష్టి, వివేకం మరియు పరిపూర్ణతకు ఋజువు అంటే
ఉనికిలో ఉన్న ప్రతిదీ, అంటే ,సృష్టిలో అతి చిన్నగా గుర్తించబడిన సబ్అటామిక్ పార్టికల్ ఫార్మింగ్ మ్యాటర్ క్వార్క్ల నుండి ప్రారంభించి - గెలాక్సీల వరకు, ఎంతో కొంత క్రియాత్మక సంక్లిష్టతను కలిగి ఉంటుంది.
మరో మాటలో చెప్పాలంటే, ఒక ఖచ్చితమైన మరియు నిర్దిష్టమైన పనిని నిర్వహిస్తుంది.
ప్రకృతిలోని ప్రతి క్రియాత్మక సంక్లిష్టత నామమాత్రంగా ఉనికిలో ఉండటాన్ని కాకుండా, దానిని మించిన స్థితిని సూచిస్తుంది.
అంటే, ఉనికి ఒక పరిమాణము, ఒక దశ, ఒక స్థాయి.
మరియు ఉనికిలో ఉన్న వస్తువులోని సంక్లిష్టత కేవలం ఉనికిని మించిన స్థాయిని సూచిస్తుంది.
మీ చుట్టూ ఉన్న ప్రతిదీ నిర్దిష్ట కార్యాన్ని చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
దీని అర్థం మీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఒక క్రియాత్మక సంక్లిష్టతను కలిగి ఉంటుంది,
ఇది సృష్టి మరియు వస్తువులను ఉనికిలోకి తీసుకురావడానికి నిదర్శనం.
కాబట్టి, వాటిని ఉనికిలోకి తెచ్చిన మూలకర్త తప్పకుండా ఉండాలి.
దీనికి ఉదాహరణ విద్యుత్ దీపం; ఇది క్రియాత్మక సంక్లిష్టతను సూచిస్తుంది,
ఒక విద్యుత్ దీపం వీటిని కలిగి ఉంటుంది:
1 -ఫిలమెంట్.
2-ఒక సీసపు తీగ: ఇది ఫిలమెంట్కు విద్యుత్తును ప్రసారం చేస్తుంది.
3-తంతువుతో లేదా విద్యుత్తో సంకర్షణ చెందకుండా తంతును రక్షించే జడ వాయువు.
4-గాజు బల్బ్: గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోస్తుంది మరియు జడ వాయువు దీపం నుండి తప్పించుకుని పోకుండా ఆపుతుంది. తద్వారా ఫిలమెంట్ కాలిపోకుండా కాపాడుతుంది.
5-దీపం బేస్: ఇది బల్బును, దాని హోల్డర్తో కలుపుతుంది మరియు విద్యుత్ ప్రవాహానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది.
ఇది సరళీకృతం చేయలేని సంక్లిష్టత యొక్క వ్యవస్థ. కాబట్టి ఇది దీని తయారీ యొక్క పరిపూర్ణతను సూచించే స్పష్టమైన మేధోపరమైన అర్థాన్ని కలిగి ఉంటుంది.
విద్యుత్ దీపం యొక్క పరిపూర్ణ సృష్టి ఉనికిని తిరస్కరించే వ్యక్తి లేదా అది కేవలం యాదృచ్ఛికంగా వచ్చిందని వాదించే వ్యక్తి తన వాదనకు తగిన రుజువును సమర్పించాలి కదా!
విద్యుత్ దీపాన్ని తయారుచేసిన వానికి విద్యుత్తు అంటే ఏమిటో, అది ఎలా ప్రవహిస్తుందో, దీపం యొక్క ప్రయోజనాలు ఏమిటో మరియు ఫిలమెంట్ యొక్క సున్నితత్వం ఏమిటో బాగా తెలుసు. అందువలన, దీపం యొక్క ఉనికి ప్రత్యక్షంగా ఒక నైపుణ్యం కలిగిన దాని తయారీదారుడి ఉనికిని సూచిస్తుంది మరియు అది యాదృచ్ఛికంగా ఉనికిలోకి రాలేదని నిరూపిస్తున్నది. ఎందుకంటే దీనికి పూర్తి భిన్నంగా కనిపించే ఇతర దీపములు కూడా ఉనికిలో ఉన్నాయి.
అదే మేధో నైపుణ్యాన్ని ఉపయోగించి, మానవుడిలాగా క్రియాత్మకంగా సంక్లిష్టంగా ఉండేదేదో అతడిని సృష్టించిన మూలకర్తను కలిగి ఉండాలని మనము కనుగొంటాము.
అయితే విద్యుత్ దీపం కేవలం ఐదు భాగాలను మాత్రమే కలిగి ఉండగా,
మానవుడు తన శరీరంలోని ప్రతి కణంలో నాలుగు బిలియన్ భాగాలను కలిగి ఉంటాడు.
నాలుగు బిలియన్ భాగాలు జీవి యొక్క విధులను తయారు చేస్తాయి, వీటి పేర్లు: జన్యు సంకేతం, జన్యువు లేదా DNA. మరియు అవి మీ ప్రతి కణాల కేంద్రకంలో ఉంటాయి.
కాబట్టి, ఐదు భాగాలతో తయారైన విద్యుత్ దీపానికి ఒక తయారీకర్త ఉన్నాడని మీరు విశ్వసిస్తున్నప్పుడు, మీకు సృష్టికర్త లేడనటం మీకే సమస్యాత్మకంగా ఉంటుంది.
{వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?} (35)
సూరతు అత్తూర్
మీ చుట్టూ ఉన్న ప్రతిదానిలో సంక్లిష్టత ఉంది. ఒక రకమైన క్రియాత్మక సంక్లిష్టత లేకుండా ప్రకృతిలో ఏమీ లేదు; పరమాణువులో, కక్ష్యలలో (orbits) లేదా మీ స్వంత శరీరంలో కూడా.
ప్రతి అణువు మరియు కణం లోని క్రియాత్మక సంక్లిష్టత విశ్వంలోని ప్రతిదానిలో ఉంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; ఇంకా వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి.} [164]
సూరతుల్ బఖరహ్
ఇంకా ఇలాంటి ఆయతులు (వచనములు) చాలా ఉన్నాయి;
అయినప్పటికీ తమ వివేకాన్నీ ఉపయోగించే వారు మాత్రమే జాగ్రత్త పడతారు.
... వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. {7}
సూరతు ఆలె ఇమ్రాన్
ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగిస్తూ, ఉనికిని (అస్తిత్వంలోకి తీసుకురావడానికి నిదర్శనం) మరియు సృష్టింపబడిన జీవుల యొక్క ఖచ్చితత్వం మరియు విధులను (వివేకము మరియు పరిపూర్ణతకు నిదర్శనము) గురించి ఆలోచించినప్పుడు, సృష్టికర్త యొక్క ఉనికిని వివేకం ద్వారా ఖచ్చితంగా అంగీకరిస్తాడు.
6-మనిషి మరియు ఇతర జీవులు చాలా సరళమైన మరియు ఆదిమ ఏకకణ జీవుల నుండి ఎందుకు ఉద్భవించలేదు?
జవాబు: ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి:
మొదటి సమస్య: మానవుడు ఆదిమ ఏకకణ జీవుల నుండి ఉద్భవించాడని అటువంటి దిగ్భ్రాంతికరమైన ఊహాజనిత ముడిని విడదీసి, ఒక రకమైన జీవి మరొక రకంగా రూపాంతరం చెందిందని రుజువు చేసే ఒక్క సాక్ష్యం కూడా లేదు.
కాబట్టి, ఒక నాస్తికుడు ఎలాంటి ప్రత్యక్ష రుజువు లేని అటువంటి ఊహను ఎలా విశ్వసిస్తాడు మరియు మతపరమైన మేధో నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నామని మమ్మల్ని ఎలా నిందించగలడు?
రెండవ సమస్య: కనిష్ట జన్యువుల సమితి భావన ప్రకారం, ఏ జీవి అయినా రెండు వందల జన్యువుల కంటే తక్కువ కలిగి ఉండటం సాధ్యం కాదు.
కనిష్ట జన్యువుల సమితి అనేది ఒక జీవి జీవించగలిగే అతి తక్కువ జన్యువుల సంఖ్య!
అంటే, ఈ కనిష్ట జన్యువుల సమితిలో నుండి ఒక జన్యువు తక్కువైనా సరే, ఆ జీవి జీవించదు.
జన్యువు అనేది సమాచారాన్ని గుప్తీకరించే పెద్ద సంఖ్యలో జన్యు సంకేతాలను కలిగి ఉన్న సమాచార టేప్.
ఒక జీవి జీవించడానికి అవసరమైన కనీస సంఖ్యలో జన్యువుల ఆవశ్యకత ఉన్నది: కొన్ని జన్యువులు శక్తి కోసం గుప్తీకరించబడ్డాయి - వాస్తవానికి ఒక జీవి శక్తి లేకుండా జీవించదు - ఇతర జన్యువులు పోషణ కోసం, మరికొన్ని పునరుత్పత్తి కోసం, మరికొన్ని జీవితం యొక్క ప్రాథమిక విధుల కోసం గుప్తీకరించబడతాయి. ఇలాగే ఇంకా ఇతర జన్యువులు.
శాస్త్రవేత్తలు జీవితానికి అవసరమైన కనీస జన్యువుల సంఖ్యను లెక్కించారు మరియు అవి 200 జన్యువుల కంటే తక్కువ ఉండకూడదని నిర్ణయించారు.
క్రెయిగ్ వెంటర్ ఇన్స్టిట్యూట్ [J. Craig Venter Institute (JCVI)] కనీస సంఖ్యలో జన్యువులు మూడు వందల ఎనభై రెండు జన్యువుల కంటే తక్కువగా ఉండకూడదని నిర్ధారించింది.[1]
[1] J. క్రెయిగ్ వెంటర్ ఇన్స్టిట్యూట్ (JCVI) గ్లోబల్ ట్రాన్స్పోసన్ మ్యూటాజెనిసిస్ ద్వారా M. జెనిటాలియం యొక్క అన్ని ముఖ్యమైన జన్యువులను కనుగొనడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఫలితంగా 482 ప్రోటీన్ కోడింగ్ జన్యువులలో 382 అవసరమని వారు కనుగొన్నారు.
భూమిపై అతి చిన్న జీవి అయిన మైకోప్లాస్మాలో 468 జన్యువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మొత్తం సమస్య పదార్థానికి సంబంధించినది అయితే మరియు ప్రపంచం కేవలం భౌతిక వ్యవస్థ అయితే, మనం జీరో జన్యువు నుండి ప్రారంభించాలి - ఒకవేళ మనం హైడ్రోజన్ నుండి మనిషి వరకు వెళ్లాలంటే !
అయితే జీరో జీన్, ఒక జీన్, వంద జీన్స్ అంటూ ఏమీ లేవని సైన్స్ చెబుతోంది. దానికి బదులుగా, సైన్స్ ఏమంటుంది అంటే: మనకు కనీస పరిధిలో ఒక భారీ సమాచార వ్యవస్థ అవసరం ఉంది, లేకుంటే మొదట అసలు జీవి కనిపించదు.
ప్రకృతిలో, ఆదిమమైనది ఏమీ లేదు, కానీ ప్రతి వ్యవస్థ స్వంత ఆకర్షణతో ప్రారంభమైంది!
జీవులు ఉనికిలోకి రాకముందే వాటి ఎన్క్రిప్ట్ చేసే సమాచార వ్యవస్థలోని ఆకర్షణ, నాస్తికులకు మరియు దైవిక సృష్టిని తిరస్కరించేవారికి ఎప్పుడూ అడ్డంకిగానే మిగిలిపోతుంది!
ఖచ్చితమైన జీవసంబంధమైన విధులను రూపొందించడానికి మీ వద్ద నాలుగు బిలియన్ల ప్రత్యేక సమాచారం ఉంది - మీ ప్రతి ఒక్క కణాల కేంద్రకంలో.
నాస్తికుడు జీరో జన్యువు నుండి ప్రారంభమైన జీవులు ఉన్నాయని ఊహించాడు, కానీ కనీస జన్యువుల సిద్ధాంతం వచ్చి ఈ ఊహాగాణాన్ని తొలగించింది.
వాస్తవానికి, జీవులు మొదటి క్షణం నుండి క్రియాత్మకంగా సంక్లిష్టంగా కనిపించాయి, లేకుంటే, అసలు అవి మొదటి నుండే కనిపించకుండా ఉండేవి.
7- వివేకము, హేతువు మరియు పరిపూర్ణతల ఆధారాల ఉదాహరణలు ఏమిటి?
జవాబు: ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి.
మరియు భూమిపై కనబడేవి చాలా ఉన్నాయి.
ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్ మాటలు (సూచనలు వ్రాయటానికి) అవి చాలవు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. {27}
సూరతు లుఖ్మాన్
విశ్వంలోని ప్రతి అణువు దైవిక వివేచన యొక్క సూచన, ఈ వాస్తవాన్ని మనం ఈ రోజు లేదా రేపు తెలుసుకోబోతున్నాం.
ఎ-ఇన్సులిన్ - గ్లూకోజ్-డైజెస్టింగ్ హార్మోన్ - మీరు చక్కెరను తీసుకున్న మోతాదు ప్రకారం అదే మొత్తంలో క్లోమం ద్వారా స్రవిస్తుంది.
బి-గుండె యొక్క రక్తాన్ని పంపింగ్ చేసే శక్తి కండరాలకు అవసరమైన శక్తికి సమానంగా ఉంటుంది.
సి-మీ కడుపులో కవాటాలు ఉన్నాయి. అవి మీకు హాని కలిగించేలా, ఆహారం మీ నోటి వైపుకు తిరిగి వెళ్ళకుండా అడ్డుకుంటాయి.
డి-విసర్జన కవాటాల వలన మీ బట్టలు ప్రతి క్షణం తడిసిపోకుండా ఉంటాయి.
ఇ-మీ పుర్రె యొక్క ఎముకలు మీరు మీ తల్లి గర్భం నుండి సురక్షితంగా మరియు సులభంగా బయటకు వచ్చే వరకు బలపడవు, ఎందుకంటే అవి అక్కడే ఏకమై బలపడితే, అవి విరిగిపోకుండా తల్లి గర్భం నుండి బయటకు రావు. అలాగే, మీ మెదడు పూర్తిగా పెరిగే వరకు ఈ ఎముకలు కూడా పూర్తిగా పెరగవు.
యఫ్-ఎలక్ట్రికల్ సిగ్నల్లను ప్రసారం చేసే మీ నరాల యొక్క అన్ని ఆక్సాన్లు ఇన్సులేటింగ్ లేయర్తో పూత పూయబడి ఉంటాయి - మనం ఎలక్ట్రికల్ వైర్లకు ఇన్సులేట్ చేసినట్లుగా ఇప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్ దారితప్పకుండా, కోల్పోకుండా మనకు ఇబ్బంది కలిగించవు.
జి-ఎలక్ట్రాన్, న్యూక్లియస్ చుట్టూ సెకనుకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంత వేగంతో తిరగకపోతే ఆకర్షణ శక్తి కారణంగా న్యూక్లియస్ లోపల పడిపోతుంది, అప్పుడు విశ్వం ప్రారంభం కాకముందే కూలిపోయేది. అంతేకాదు, ఇది పరమాణువు ఏర్పడటానికి అనువైన వేగం.
హెచ్-రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసిపోయినప్పుడు, హైడ్రోజన్ ద్రవ్యరాశిలో 0.007% శక్తిగా మార్చబడుతుంది మరియు ద్రవ్యరాశి 0.007%కి బదులుగా 0.006% అయితే, ప్రోటాన్ న్యూట్రాన్తో కలిసిపోదు మరియు మొత్తం విశ్వం హైడ్రోజన్గా మాత్రమే ఉంటుంది. మరియు మిగిలిన అంశాలు కనిపించేవి కావు. శక్తిగా మార్చబడిన ద్రవ్యరాశి 0.007%కి బదులుగా 0.008% ఉంటే, సమ్మేళనం చాలా వేగంగా ఉంటుంది, ఇది విశ్వం నుండి హైడ్రోజన్ యొక్క తక్షణ అదృశ్యానికి దారి తీస్తుంది మరియు జీవితాన్ని అసాధ్యం చేస్తుంది. అందువలన, సంఖ్య తప్పనిసరిగా 0.006% మరియు 0.008% మధ్య మాత్రమే ఉండాలి.
ఐ-ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి న్యూట్రాన్ ద్రవ్యరాశిలో 0.2%ని సూచిస్తుంది మరియు ఇది పరమాణువు ఏర్పడటానికి ప్రామాణిక ద్రవ్యరాశి.
జె- మొగ్గలు, అంకురోత్పత్తి తర్వాత, నేరుగా కాంతి మూలం వైపుకు వెళ్తాయి మరియు మూలాలు క్రిందికి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మొలకలు కాంతికి అతి సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి మరియు వాటి పని తీరును నిర్వహించడానికి అవసరమైన మొత్తం సమాచారం విత్తనం లోపల ఎన్కోడ్ చేయబడుతుంది. మొక్క యొక్క ఎగువ మరియు పార్శ్వ పెరుగుదల మరియు మూలాల వైపు నియంత్రించే హార్మోన్లు ఉన్నాయి. ఈ హార్మోన్లన్నీ కూడా విత్తనం లోపల ఎన్కోడ్ చేయబడతాయి.
కె-మీరు ఒక రుచికరమైన పండుని తిని, ఆపై పొడిగా ఉండే రుచిలేని దాని టెంకను విసిరివేసినప్పుడు, మీరు ఆ పండులోని జన్యువులను పంపడానికి అనుమతిస్తున్నారు. అటువంటి పండు మీకు రుచికరమైన రుచిని ఇస్తుంది, దాని జీవితానికి మూలమైన దాని జన్యువులను మీకు నచ్చని పొడిగా ఉండే సున్నితమైన విత్తనంలోపల దాచి పెడుతుంది. ఒకసారి మీరు ఈ విత్తనాన్ని భూమిపైకి విసిరిన తరువాత, తగిన పరిస్థితులు అందుబాటులోకి రాగానే, దాని రెమ్మలు, కొమ్మలు మరియు వేర్లతో పండ్ల చెట్టు పెరగడం ప్రారంభిస్తుంది. దేనిపైనా ఎలాంటి అవగాహనా లేని మొక్కలలో ఇదంతా జరుగుతుంది.
యల్-ఆ అవ్యక్తమైన చెవిటి, మూగ పండు కోసం సమాచారాన్ని ఎవరు తయారు చేసారు మరియు అది మీకు ఆకర్షణీయంగా ఉండేలా దానిలోని మొత్తం చక్కెరను సర్దుబాటు చేసింది ఎవరు?
ఇంకా, విత్తనాన్ని తినడానికి ఆమోదయోగ్యం కానిదిగా మరియు రుచిలేనిదిగా చేసింది ఎవరు, తద్వారా మీకు దానిపై ఆసక్తి లేకుండా మరియు దానిని విసిరివేసేలా చేసింది ఎవరు?
విత్తనం యొక్క అన్ని వివరాలు మరియు విధులతో కొత్త ప్లాంట్ ను రూపొందించడానికి తగిన జన్యు సమాచారాన్ని ఎవరు దానిలోపల ఎక్కించారు?
యమ్-మనం ఈ మధ్యనే గ్రహించిన విషయం ఏమిటంటే: మనం ఎవరి ఆనందంలో జీవిస్తున్నామో ఆ జడత్వం (inertia) మొత్తం విశ్వపు ద్రవ్యరాశి యొక్క ఉత్పత్తి అని.
జడత్వం (inertia) అంటే ఏమిటి?
మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, హఠాత్తుగా అది ఆగిపోతే మీకు ఏమి జరుగుతుంది?
మీరు ముందుకు నెట్టబడతారు! ఇది నిజం కాదా?
జడత్వం అంటే ఇదే.
మన ప్రపంచం యొక్క జడత్వం ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువగా ఉంటే, తేలికపాటి గాలి కూడా బండరాళ్లను కదిలించగలదు మరియు అలాంటి ప్రపంచంలో, మనం నిరంతరం అన్ని రకాల వస్తువులతో దాడులకు గురియై ఉంటాము!
మరోవైపు ప్రపంచం యొక్క జడత్వం ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా ఉంటే, మనం మన వ్రేళ్లను కూడా కదపలేము.[2]
[2] Nature's Destiny: How the Laws of Biology Reveal Purpose in the Universe, Michael Denton.
జడత్వం యొక్క శక్తి ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది.
భౌతిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, మన సౌర వ్యవస్థను కలిగి ఉన్న పాలపుంత యొక్క ద్రవ్యరాశి జడత్వాన్ని నియంత్రించడంలో కేవలం 0.1 మిలియన్లు మాత్రమే పాల్గొంటుంది, అయితే భూమి యొక్క ద్రవ్యరాశి జడత్వాన్ని 0.001 మిలియన్లు మాత్రమే నియంత్రిస్తుంది.
ఈ విధంగా, ఆదర్శవంతమైన జడత్వం యొక్క మంచి పరిణామాలపై మనం జీవిస్తున్నాము మరియు దాని ద్వారా మన కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తున్నాము, ఇది మొత్తం విశ్వ శక్తి యొక్క ఉత్పత్తి.
{మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!} {27}
సూరతు సాద్
సైన్స్ ఎంత విస్తరిస్తుందో, అంతగా జ్ఞానం యొక్క అద్భుతాలు మరియు సృష్టి యొక్క సూక్ష్మ నైపుణ్యాలు బహిర్గతమవుతూ ఉంటాయి! [3]
[3] ఈ సమస్యను మైఖేల్ డాంటన్ తన పుస్తకంలో వివరంగా చర్చించారు: ది ఫేట్ ఆఫ్ నేచర్, దీని అనువాదం దార్ అల్ కాతిబ్ పబ్లికేషన్స్ జారీ చేసింది.
యన్-ఇప్పుడు మనం కంటి వైపుకి వెళ్దాం,
ఇది అమూల్యమైన అనుగ్రహం.
ఏమీ మేము అతని కొరకు అతను చూడగలిగేలా రెండు కళ్ళను తయారు చేయలేదా ?!
సూరతుల్ బలద్
కంటి రిజల్యూషన్ ఐదు వందల డెబ్బై ఆరు మెగా పిక్సెల్లకు సమానం.
కంటికి ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన లెన్స్ ఉంది.
రెటీనాలోని ఫోటో గ్రాహక పరిమాణం సగం చదరపు మిల్లీమీటర్కు మించదు మరియు ఇది వివిధ పరిమాణాల పది మిలియన్ల రంగు ఛాయల (shades) మధ్య తేడాను చూపుతుంది. ఇది నిజంగా ఒక అత్యద్భుతం మరియు మిరుమిట్లు గొలిపే దివ్య సృష్టి.
మీరు మీ ఎదురుగా ఉన్న వస్తువును చూసినప్పుడు, మరియు కాంతి రెటీనాపై పడినప్పుడు, ఆ సమయంలో అనేక సంక్లిష్ట రసాయన ప్రక్రియలు జరుగుతాయి మరియు చివరికి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ కరెంట్ మీ కంటి రెటీనా నుండి మీ మెదడుకు నరాల తీగల ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఇక్కడ మెదడు ఈ విద్యుత్ ప్రవాహపు ఫ్రీక్వెన్సీని కంటిచూపుగా నిర్వచిస్తుంది, మెదడు సమీకృత ప్రీ-సెట్ నిఘంటువు కలిగి ఉన్నట్లుగా, అది చేరిన విద్యుత్ ప్రవాహాన్ని మీ ముందు ఉన్నదాన్ని చూపే చర్యగా మారుస్తుంది.
మీరు దాని గురించి ఆలోచిస్తే, అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది!
ఈ మెదడు ఎముకల చీకటి పెట్టెలో ఉండటాన్ని ఒక సారి ఊహించండి - దానినే పుర్రె అంటారు.
విద్యుత్ ప్రవాహం మాత్రమే మెదడుకు చేరుతుంది.
మరి, మెదడు ఆ విద్యుత్ ప్రవాహాలను దృష్టిగా ఎలా అనువదించగలదు?
అది మీకు చూసే సామర్థ్యాన్ని ఎలా ఇస్తున్నది?
ఈ అద్భుతం మీరు కళ్లు తెరిచి చూడగానే క్షణాల్లో జరుగుతుంది!
వినికిడి విషయం లోకూడా అలానే జరుగుతుంది:
ధ్వని తరంగాలు మీ కర్ణభేరిలోకి ప్రవేశించినప్పుడు, అది వాటిని తరంగాల నుండి యాంత్రిక కదలికగా మారుస్తుంది. ఈ యాంత్రిక కదలిక మధ్య చెవిలోని మూడు చిన్న ఎముకల ద్వారా లోపలి చెవికి ప్రసారం చేయబడుతుంది, ఇది దానిని విద్యుత్ ప్రవాహంగా మారుస్తుంది.
ఇదే సమయంలో ఈ విద్యుత్ ప్రవాహం లోపలి చెవి నుండి మెదడుకు ప్రసారం చేయబడుతుంది, ఇది ఈ విద్యుత్ ప్రవాహాన్ని శబ్దాలుగా నిర్వచించడం ప్రారంభిస్తుంది, అప్పుడు మీరు ధ్వనిని వింటారు.
ఇదంతా ఒక సెకను కంటే తక్కువ సమయంలో జరుగుతుంది. {అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి – మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారుచేసినది ఆయనే – మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని!} {78} సూరతున్నహల్.
ప్రతి క్షణం కంటి, చెవి, స్పర్శ, రుచి, వాసన మరియు శరీరంలోని ఇతర వివిధ భాగాల నుండి మెదడుకు వేలకొద్దీ విద్యుత్ సంకేతాలు చేరతాయి, ఈ సంకేతాలన్నింటిని ఖచ్చితంగా గుర్తించవచ్చు ఒక సారి ఊహించండి ఇది మాహా అద్భుతమైనది.
{ఇదంతా అల్లాహ్ సృష్టియే! ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి. అలా కాదు ఈ దుర్మార్గులు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.}
సూరతు లుఖ్మాన్
{ఇది అల్లాహ్ పనితనం, ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.} {88}
సూరతున్నమ్ల్
అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో నుండి ఒక్క అనుగ్రహాన్నైనా పూర్తిగా గ్రహించగల శక్తి కలిగి ఉన్నది ఎవరు?
మీ శరీరంలోని ప్రతి కీలు మరియు ఎముకల గురించి ఆలోచించండి, అది అవసరమైన విధంగా కదలించడానికి మీకు అనుమతిస్తుంది.
ఎముకల మధ్య రాపిడి లేకుండా లేదా వొరుసుకు పోకుండా కదలడానికి మిమ్మల్ని అనుమతించే మృదువైన కీళ్ల గురించి ఆలోచించండి, వీటిలో అల్లాహ్ యంత్రాల జాయింట్లలో ఉంచబడే గ్రీసు వంటి ద్రవాన్ని కీళ్లలో నిక్షిప్తం చేసాడు!
ధ్యాసతో అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి ఆలోచించండి మరియు అల్లాహ్ కు కృతజ్ఞత చూపండి
అల్లాహ్ అనుగ్రహాలు లెక్కలేనన్ని ఉన్నాయి!
{ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు!}[20]
సూరతు లుఖ్మాన్
8-కొందరు నాస్తికులు అల్లాహ్ అనుగ్రహం యొక్క సాక్ష్యాల్ని విమర్శిస్తూ ఉంటారు. ఇంకా ఇలా ప్రశ్నిస్తారు, వ్యాధులు మరియు భూకంపాలు వంటి కొన్ని లోపాలు ఎందుకు ఉన్నాయి?
జ. విశ్వంలో పరిపూర్ణమైన విషయాలు లేవనే నాస్తికుడి మాట పరిపూర్ణత యొక్క ఉనికిని తిరస్కరించదు.
కానీ, ఇలా చెప్పడం ద్వారా, విశ్వంలో పరిపూర్ణత ఉందని అతను నిర్ధారించాడు.
మొట్టమొదట అసలు పరిపూర్ణత అనేది ఉనికిలోనే లేకపోతే, నాస్తికుడు అసంపూర్ణత ఉనికిని గ్రహించలేడు.
అసలు డిజైన్ యే లేకుండా, డిజైన్లో లోపం గురించి ఎలా మాట్లాడగలరు?
వారు అసంపూర్ణం అని వర్ణిస్తున్న వాటి విషయానికొస్తే, వాస్తవానికి అది వారికి వాటి గురించి సరైన జ్ఞానం లేకపోవడం లేదా విషయాల జ్ఞానాన్ని గ్రహించడంలో వారు వైఫల్యానికి గురి కావడం మాత్రమే సూచిస్తుంది.
విశ్వం వినాశకరమైన సంఘటనలనేవి ఏమీ లేకుండా చాలా పరిపూర్ణంగా ఉందని విశ్వాసులు వాదించరు. కానీ విశ్వం సంపూర్ణంగా సృష్టించబడిందని, దానిలో ఉద్దేశ్యం లేకుండా ఏదీ జరగదని మాత్రమే వారు పలుకుతారు.
నాస్తికుడి వైఖరి అంతరిక్ష నౌకలో భారీ మొత్తంలో నిలువ ఉండే పెట్రోలియం మూలకాల వలన వాహనం ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉన్నందున అది దాని నైపుణ్యం కలిగి లేదని దాని డిజైన్ ను నిరాకరించే వారితో సమానం!
ఆధునిక తత్త్వశాస్త్రంలో మత విమర్శ యొక్క ధోరణి – డా. సుల్తాన్ అల్-అమీరీ, డాక్టరేట్ థీసిస్
ప్రపంచం శాశ్వతంగా, ఎల్లకాలం ఉండేలా రూపొందించ బడలేదు, అలాగే మనం దేవుళ్ళుగా రూపొందించ బడలేదు.
బదులుగా మనము మంచి, చెడులతో పరీక్షించబడేలా రూపొందించబడ్డాము.
{మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు.} {35}
సూరతుల్ అంబియా
మంచి, చెడు మరియు అన్ని పరీక్షలు దైవ జ్ఞానం మరియు దైవ సంకల్పం యొక్క చట్రంలో తిరుగుతాయి.
9- విశ్వాన్ని సృష్టించిన భౌతిక కారణం ఉదాహరణకు: మరొక నాగరికతా లేదా మరేదైనా అంటువంటిది లేకుండా ఉనికిని ఏది నిరోధిస్తుంది? ప్రత్యేకంగా శాశ్వతమైన దేవుడే ఎందుకు ఉండాలి?
సమాధానం: వెయ్యి సంవత్సరాల క్రితం ఇస్లామీయ ధర్మ పండితులచే స్థాపించబడిన ఒక నియమం ఉంది, అదేమిటంటే: "కర్తల క్రమం, తప్పనిసరిగా చర్యలు జరగకపోవడానికి దారితీస్తుంది."[5]
[5] ظاهرة نقد الدين في الفلسفة الحديثة, డి. సుల్తాన్ అల్-అమిరి, PhD థీసిస్
కర్తల క్రమం అంటే ఒకరి కంటే ఎక్కువ మంది సృష్టికర్తలు ఉన్నారని అర్థం. చేతిలో ఉన్న ప్రశ్న 'మరో నాగరికత' ముందు దానిని ఉత్పత్తి చేసిన నాగరికత, ఇంకా రెండింటికి ముందు మరియు రెండింటినీ ఉత్పత్తి చేసిన మరో నాగరికత మొదలైన వాటిని సూచిస్తుంది. ఇది సృష్టికర్తల క్రమాన్ని సూచిస్తుంది,
ఈ క్రమం తప్పనిసరిగా ఎటువంటి చర్యలకు దారితీయదు.
చర్యలకు దారితీయదు అంటే, విశ్వం, మనిషి మరియు ఇతరులు వంటి సృష్టితాలు ఉనికిలో కనబడకపోవడం
కర్తలలోని క్రమం విశ్వం మరియు ఉనికి కనిపించకపోవడానికి దారితీస్తుంది.
ఒక నాగరికత దానిని సృష్టించిన మరొక నాగరికత ఉనికిపై ఆధారపడి ఉంటే, మరియు మరొక నాగరికత దాని ముందు మరియు దానిని సృష్టించిన మరొక నాగరికతపై ఆధారపడి ఉంటుంది మరియు అనంతం వరకు ఇలాగే ఉంటే, అప్పుడు ఈ నాగరికత లేదా దాని ముందు ఉన్నది లేదా వాటి కంటే ముందన్నది ... ఏ ఒక్కటీ కనిపించదు. ఇంకా ఉనికీ లేదా మరేదీ కనిపించదు.
ఎందుకంటే ప్రతి నాగరికత దాని ముందు ఉన్న నాగరికతపై ఆధారపడి ఉంటుంది, మరియు అందువలన ఏ నాగరికత కనిపించదు మరియు చివరకు ఏదీ కనిపించదు.
కాబట్టి, ప్రతి దాన్ని సృష్టించిన శాశ్వతమైన తొలి సృష్టికర్త ఉండాలి!
ఒక అనంతమైన క్రమం ఉండి ఉంటే మరియు గొలుసులోని (పరంపరలోని) ప్రతి లింక్ దాని ముందు దాని పై ఆధారపడి ఉంటే, అప్పుడు జీవులు, సృష్టి ఉనికి ఉండవు, ఎందుకంటే కర్త దాని ముందు ఉన్న కర్తపై ఆధారపడి ఉంటుంది, ఆపై దాని పూర్వీకుని పై ఆధారపడి ఉంటుంది. అది దాని మునుపటి వాటిపై,ఇలా మొదలైనవి; అందువలన, చివరకు ఏ కర్త మిగిలి ఉండడు.
కాబట్టి, పరంపర ఏదో ఒక పరిమితిలో ఆగిపోవాలి.
ఇక్కడ, మనము మొదటి సృష్టికర్త ఉన్నాడని ఆయన కంటే ముందు ఎవ్వరూ లేరని నిశ్చయించుకుందాము!
10- విశ్వాన్ని శాసించే చట్టాల గురించి మనకు తెలుసు మరియు భూకంపాలకు గల కారణాల గురించి మనకు బాగా తెలుసు, కాబట్టి మనకు చట్టాలు తెలిసినంత వరకు సృష్టికర్త అవసరం ఏందుకు ?
సమాధానం: విశ్వాన్ని సృష్టించడానికి మరియు దానిని కనిపించేలా చేయడానికి ప్రకృతి నియమాలు సరిపోతాయని నాస్తికుడు అనుకుంటాడు. కొంతమంది నాస్తికులు గురుత్వాకర్షణ నియమం మరియు విశ్వం యొక్క ఆవిర్భావానికి ఇది సరిపోతుందని వాదిస్తారు. కానీ, ఆ గురుత్వాకర్షణ సూత్రం యొక్క మూలం గురించి ఆలోచించడం ద్వారా లేదా దానిని ఎవరు క్రోడీకరించారు అనే దాని గురించి ఆలోచించడం ద్వారా లేదా ఇంటర్ ఫియరెన్సు మరియు ప్రభావాన్ని చూపే లక్షణాన్ని ఎవరు ఇచ్చారు అనే దాని గురించి ఆలోచించడం ద్వారా ఈ వాదన పతనమై పోతుంది.
ఈ ప్రాధమిక సిద్దాంతాలతో సంబంధం లేకుండా, గురుత్వాకర్షణ నియమం బిలియర్డ్ బంతిని తిప్పడానికి కారణం కాలేదు!
ఏ విషయమూ ప్రదర్శితం కాకుండా నియమం మాత్రమే దేనికీ కారణం కాలేదు.
గురుత్వాకర్షణ నియమం బిలియర్డ్ బాలును ఉత్పత్తి చేయదు., కానీ, అది బిలియర్డ్ స్టిక్ దానికి తగిలితే అది ముందుకు కదిలేలా చేస్తుంది.
నిజానికి, గురుత్వాకర్షణ నియమం స్వతంత్రమైనది కాదు, కానీ అది సహజమైన ఒక సంఘటనకు వివరణ.
అంతేకాకుండా, బిలియర్డ్ స్టిక్ బలంగా త్రోయకుండా మరియు కదిలించకుండా బిలియర్డ్ బంతిని గురుత్వాకర్షణ నియమం స్వయంగా కదిలించదు. ఆ స్టిక్ బలంతో త్రోసిన తరువతే , బిలియర్డ్ బంతి కదులుతుంది మరియు గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రభావం కనిపిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, ఒక నాస్తికుడు బిలియర్డ్ బాల్, బిలియర్డ్ స్టిక్ మరియు బంతిని సృష్టించడానికి గురుత్వాకర్షణ నియమం సరిపోతుందని ఊహిస్తాడు!
విశ్వం యొక్క ఆవిర్భావానికి కారణమైన సహేతుకమైన వాదనకు మరియు తర్కానికి ఏది దగ్గరగా ఉంటుంది: సృష్టికర్తనా లేదా నియమమా?
అదేవిధంగా, కారు ఇంజిన్ యొక్క అంతర్గత దహన నియమాలు (internal combustion laws) కారు ఇంజిన్ను సృష్టించలేవు.
అలాగే మనము కారు ఇంజిన్కు అంతర్గత దహన క్రియ నియమాలను (laws of internal combustion) జోడిస్తే, అదీ పనిచేయదు. దాని కొరకు పెట్రోల్ కావాలి, అది దానికి శక్తిని ఇస్తుంది, మరియు దహన (combustion) కోసం ఒక స్పార్క్ కావాలి, మరియు అన్నింటి కంటే ముందు ఇంజిన్ ఉండాలి, మరియు అప్పుడు మాత్రమే అంతర్గత దహన నియమాలు (laws of internal combustion) కనిపిస్తాయి మరియు ఇంజిన్ పని చేస్తుంది!
ఇంజిన్, దహన స్పార్క్ (spark of combustion), పెట్రోల్, డ్రైవర్ మరియు రహదారిని సృష్టించడానికి అంతర్గత దహన చట్టాలు (laws of internal combustion) సరిపోతాయని భావించడం సమంజసం కాదు.
వాస్తవానికి, విశ్వం యొక్క ఆవిర్భావాన్ని వివరించడానికి ఒక నియమం సరిపోతుందనే ఆలోచన హేతువుకు పూర్తిగా దూరమైనది.
అదనంగా, మేము ఆలోచనను ఊహించినట్లయితే, ఇది మునుపటి ప్రశ్నకు సమాధానంలో మేము వివరించిన కర్తల క్రమానికి దారి తీస్తుంది, ఈ నియమాన్ని ఎవరు సృష్టించారు మరియు దానిని ఉనికిలోకి ఎవరు తీసుకువచ్చారు? ఇది మరొక నియమం అని వారు వాదిస్తే, మేము ఏ నియమం లేదా ఏదైనా జీవుల ఆవిర్భావానికి కారణం కాని కర్తల క్రమంలోకి వస్తాము.
11- యాదృచ్చికం విశ్వానికి మూలం ఎందుకు కాకూడదు?
జవాబు: యాదృచ్చికం అనే ఆలోచనను స్వీకరించడం అనేది సంభావ్యత యొక్క సూత్రాల అజ్మేఞానమే, ఎందుకంటే యాదృచ్చికానికి రెండు అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి,
అవి రెండు: సమయం మరియు స్థలం.
యాదృచ్చికానికి దాని ప్రభావం చూపే సమయం అవసరం.
దాని ప్రభావాన్ని ఉత్పత్తి చేయడానికి భౌతిక మరియు ప్రాదేశిక ఉనికి అవసరం.
అలాంటప్పుడు, మన విశ్వం దాని సృష్టికి పూర్వం ఏ కాలంలోనూ, ఏ ప్రదేశంలోనూ లేకుండా ఉనికిలోనికి వచ్చినప్పటికీ, విశ్వాన్ని సృష్టించడంలో యాదృచ్చికం పాత్ర పోషించిందని ఎలా చెప్పగలం?
యాదృచ్చికం యొక్క ప్రభావం యాదృచ్ఛికమే ఉనికిలో లేకుండా ఎలా కనిపిస్తుంది?
యాదృచ్చికం దాని స్వంత ఉనికి లేదా యాదృచ్చికానికి రెండు ముఖ్యమైన పరిస్థితులు అయిన సమయం మరియు ప్రదేశం యొక్క ఉనికికి ముందే ఎలా ప్రభావాన్ని అందిస్తుంది?
12-విశ్వం శాశ్వతమైనది (దానికి ఆరంభమే లేదు) అని చెప్పే నాస్తికుడికి మనం ఎలా సమాధానం చెప్పగలం?
సమాధానం: థర్మోడైనమిక్ యొక్క రెండవ నియమం ప్రకారం: విశ్వం శాశ్వతమైనదిగా ఉండడం అసాధ్యం.
ఈ నియమాన్ని సరళీకృతం చేయడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది: మీరు గదిలో ఒక కప్పు వేడి నీటిని కలిగి ఉంటే, గది ఉష్ణోగ్రత కప్పు యొక్క ఉష్ణోగ్రతకు సమానం అయ్యే వరకు వేడి నీటి నుండి గదికి వేడి బదిలీ చేయబడుతుంది. ఇది థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం, ఇక్కడ శక్తి కాలక్రమేణా అధిక స్థాయి నుండి తక్కువ స్థాయికి ప్రవహిస్తుంది.
విశ్వం ఆవిర్భవించినప్పటి నుండి, విశ్వంలోని ప్రతిదాని ఉష్ణోగ్రత సమానంగా మారే వరకు ప్రతి క్షణంలో ఈ నియమం విశ్వంలోని ప్రతిదానిలో జరుగుతుంది మరియు ఇది జరిగినప్పుడు, విశ్వం యొక్క ఉష్ణ మరణం అని పిలుస్తారు. విశ్వం శాశ్వతంగా ఉంటే, అది ఇప్పుడు సస్పెండ్ చేయబడి ఉండేది - థర్మల్లీ డెడ్ -; అయినప్పటికీ, విశ్వం ఇప్పుడు గరిష్ట ఎంట్రోపీ కంటే తక్కువ స్థితిలో ఉంది మరియు ఇంకా ఉష్ణ మరణానికి చేరుకోలేదు. అందువలన, ఇది శాశ్వతమైనది కాదు, బదులుగా, ఇది సమయం మరియు స్థలం ప్రదర్శితమైన స్థిరమైన ప్రారంభాన్ని కలిగి ఉంది.
విశ్వం కనీసం ఎంట్రోపీలో ప్రారంభమైందని అదే నియమం ప్రకారం నిరూపించబడింది, అంటే దాని సంభవం ఒక పూర్వ ఉదాహరణ లేకుండా - ఇది ఏమీ లేకుండా సృష్టించబడింది -.
ఒక వైపు శాస్త్రీయ నియమం ఉంటే, నాస్తికత్వం దానికి పూర్తి భిన్నంగా మరొక వైపు ఉంది.
13-సృష్టికర్తకు కారణ నియమం ఎందుకు వర్తించదు? లేదా మరో మాటలో చెప్పాలంటే: సృష్టికర్తను ఎవరు సృష్టించారు?
జవాబు: మొదటిది: సృష్టించబడిన జీవుల నియమాలు సృష్టికర్తకు వర్తించవు; ఇది స్పష్టమైన వాస్తవం.
లేకుంటే, మనం ఇలా కూడా చెప్పవచ్చు: వంటవాడిని ఎవరు వండుతారు?
చిత్రకారుడిని ఎవరు చిత్రించారు?
కాలాన్ని, ప్రదేశాన్ని ఉనికిలోకి తెచ్చినవాడు సృష్టికర్త అనేది స్పష్టమైన నిదర్శనం. కాబట్టి, ఏమీ లేకుండా శూన్యం నుండి ఆయన సృష్టించిన నియమాలు మహోన్నతుడైన ఆయన పైనా వర్తించాలని చెప్పడం అనూహ్యమైనది!
రెండవది: సృష్టించబడిన ప్రతి జీవికి ఒక సృష్టికర్త ఉండాలనేది నిజమే; అయితే, సృష్టికర్త విషయంలో మాత్రం:
{ఆయనను పోలినది ఏదీ లేదు} {11}
సూరతు అష్షూరా
మూడవది: సృష్టికర్త సృష్టించబడలేదు, దానికి భిన్నంగా, ఆయన నిత్యుడు, శాశ్వతమైనవాడు. కాబట్టి, ఆయనను ఎవరు సృష్టించారు? అని మనం ఎలా ప్రశ్నించగలం:
నాల్గవది: సృష్టికర్త శాశ్వతంగా ఉండాలి మరియు నిత్యం ఉనికిలో ఉండాలి. లేకపోతే, మేము 'కర్తల క్రమం' యొక్క సమస్యలోకి ప్రవేశిస్తాము, అది తప్పనిసరిగా చర్యలు జరగకపోవడానికి దారి తీస్తుంది. మేము ఇప్పుడే విపులంగా వివరించాము. కాబట్టి, మహిమాన్వితుడైన సృష్టికర్త తప్పనిసరిగా ఉనికిలో ఉండాలి మరియు శాశ్వతంగా ఉండాలి.
14-విశ్వం చాలా పెద్దది. మన చిన్న పరిమాణంతో, ఈ బ్రహ్మాండమైన విశ్వానికి మనం ఎలా కేంద్రం కాగలం?
జవాబు: ఇలా అంటూ, నాస్తికుడు అర్ధం పర్థం లేని ఊహాగానాలు చేస్తున్నాడు: విశ్వం చాలా పెద్దది కాబట్టి, ఈ విశ్వంలో మనిషి కేంద్రం కాదు!
ఈ ఊహ "పొలాలు విస్తారంగా ఉన్నాయి మరియు వాటితో పోల్చితే దాని యజమాని చాలా చిన్నవాడు కాబట్టి, అతను వాటి యజమాని కాదు!" అనే పూర్వ నానుడిపై ఆధారపడి ఉన్నది.
వాస్తవానికి, దీనికి పరిమాణంతో సంబంధం లేదు.
భౌతిక పరిమాణం లేని నైతికత అనేది వ్యక్తులను అత్యంత ఉన్నతమైన లేదా అత్యంత తుచ్ఛమైన వ్యక్తులుగా పరిగణించబడేలా చేయడానికి ఒక గొప్ప ప్రమాణం.
వాస్తవానికి, ప్రజలు వారి నైతికత ప్రకారం బరువు కలిగి ఉంటారు.
అందువల్ల, పరిమాణం యొక్క సమస్య ఒక ప్రమాణం కాదు!
ఈ ఉదాహరణ పరిశీలిద్దాం: కొన్ని ఆజ్ఞలు వ్రాసి, తన కొడుకుకు సలహాలు ఇచ్చి, దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని వ్రాసిన రాజు ఎవరైనా ఉంటే, అతనికి ఎవరైనా ఇలా అభ్యంతరం చెప్పే అవకాశం ఉందా: లక్షలాది విస్తారమైన మరియు లెక్కలేనన్ని ఎకరాల భూములను కలిగి ఉన్న రాజు, తాను కలిగి ఉన్న మిలియన్ల ఎకరాల భూమిలోని ఒక భాగం కంటే తక్కువ పరిమాణం మరియు బరువు ఉన్న అతని కొడుకు మంచి చెడ్డలు ఎలా చూసుకుంటాడు?
మరియు అల్లాహ్ కు అత్యున్నత ఉదాహరణ.
ఏమిటి ఇది సహేతుకమైన అభ్యంతరమేనా?
సమస్య పరిమాణం లేదా బరువుది కాదు.
ఇంకా, ప్రపంచంలోని భౌతిక శాస్త్రవేత్తలందరూ గుర్తించినట్లుగా, ఈ విశ్వం పిన్ యొక్క కొన కంటే బిలియన్ల రెట్లు చిన్న బిందువు నుండి ఉత్పత్తి చేయబడలేదా?
అందువల్ల, పరిమాణం సాపేక్షంగా ఉంటుంది.
ఇంకా, అల్లాహ్ తాను కోరుకున్న విధంగా తాను కోరింది సృష్టిస్తే, నాస్తికుడికి ఏమిటీ బాధ?
పొదుపుగా ఖర్చు చేయడానికి సృష్టికర్త వద్ద వనరులు లేవా?
ఆయన అంత కంటే ఉన్నతుడు!
అయితే, ఈ విశ్వంలో మనం నిజంగా ఒక కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్నది నిజమేనా?
అవును, దైవిక నియామకం (divine assignment) ప్రకారం మానవుడే ఈ విశ్వానికి కేంద్రం.
ఈ దైవిక నియామకమే ధర్మము.
ధర్మం అనేది మనిషి భరించే విశ్వాసం, ఇది ఒక వ్యక్తి పయనించవలసిన గొప్ప పరీక్ష.
ఓ మనిషి నీవు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దాసునిగా ఉండాలి, అందు కొరకే మీరు ఈ విశ్వంలో కేంద్రంగా ఉన్నారు - మీ పరిమాణం, శక్తి లేదా సామర్థ్యాల వలన కాదు, దైవిక నియామకం వలన.
మీరు మంచిని చేయగలరు మరియు చెడును వదలివేయగలరు, మీరు విశ్వాసిగా లేదా అవిశ్వాసిగా ఉండగలరు.
మనకు ఇష్టం ఉన్నా, లేకున్నా మనపై ధార్మిక బాధ్యతలు మోపబడుతున్నాయని మనందరికీ తెలుసు!
నాస్తికుడు, విశ్వాసి, అజ్ఞేయవాది మరియు ప్రతి ఒక్కరితో సహా అతను మతపరమైన నియామకంలో ఉన్నాడని అందరికీ తెలుసు. అతను ఈ దైవిక నియామకాన్ని గ్రహించాడు మరియు నైతిక మనస్సాక్షి యొక్క జలదరింపును అనుభవిస్తాడు. తన మనస్సు ఏదో ఒకటి చెబుతోందని అతనికి తెలుసు: అలాంటివి చేయి, అలాంటివి చేయవద్దు. మంచి చేయి మరియు చెడు చేయకు. ”మనలో ప్రతి ఒక్కరికి తన స్వయంలోని వాస్తవికత నుండి తను నైతికతకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని తెలుసు!
మతపరమైన నియామకం ద్వారా మనం ఈ విశ్వానికి మధ్యలో ఉన్నాము.
అలాగే, మనం గ్రహించకడం పరంగా మరియు జ్ఞానపరంగా ఈ విశ్వంలో కేంద్రంగా ఉన్నాము. మన ఉనికి యొక్క వాస్తవికతను మరియు మన చుట్టూ ఉన్న విశ్వం యొక్క వాస్తవికతను మనం గుర్తించాము, గ్రహించాము మరియు బాగా అర్థం చేసుకున్నాము. ఇంకా మన ఉనికి యొక్క పరమార్ధాన్ని దృఢంగా పట్టుకున్నాము.
విధులు, బాధ్యతలు, ప్రత్యేకించబడిన కార్యాలకు మరియు పాపపుణ్యాల లెక్కకు మనమే బాధ్యులము.
జాగ్రత్తగా సూత్రీకరణ యొక్క వైభవం గురించి మనకు తెలుసు. మనము పరిపూర్ణత యొక్క చట్టాల గురించి తెలిసిన జీవులం మరియు ప్రత్యేకించ బడిన కార్యాలను నిర్వహించగలిగే లేదా అలా చేయడానికి తిరస్కరించగలిగే జీవులం. మనము ఎన్నుకునే పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాము మరియు విశ్వాసులు లేదా అవిశ్వాసులుగా ఉండటాన్ని ఎంచుకోగలము.
కాబట్టి, మనం ఈ విశ్వానికి మధ్యలో ఉన్నాము.
నిశ్చయంగా, మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను.
సూరతుల్ అహ్'జాబ్
15- మరి కొందరు నాస్తికులు ఇలా అంటారు: చాలా గ్రహాలు ఉన్నాయి; కాబట్టి, సాధ్యాసాధ్యాల సిద్ధాంతం ఆధారంగా, ఈ గ్రహాలలో ఒకటి జీవించడానికి అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు ... మరి, ఈ ఊహ సరైనదేనా?
జవాబు: అనేక గ్రహాల ఉనికికి మరియు పరిపూర్ణతను రుజువుగా నమ్మకపోవడం మధ్య సంబంధం ఏమిటి?
ఇది ముడి పదార్థాల విషయం గురించి జరుగుతున్న చర్చ కాదు.
అన్ని కూరగాయలు, పండ్లు మరియు జంతువులతో నిండిన అడవిలో ఉండటం అంటే అడవి మధ్యలో అకస్మాత్తుగా నా ముందు రుచికరమైన, వండిన ఆహారం కనిపించాలి అని కాదు కదా! సమస్య ముడి పదార్థాల గురించి కాదు!
అలాగే ప్రపంచంలోని ఎడారుల్లో ఇసుక ఉందంటే ఇసుకతో తయారు చేయబడిన డిజిటల్ ప్రాసెసర్లు, ఎలక్ట్రానిక్ చిప్లు ఎడారిలో నా చుట్టూ లభ్యమవుతాయా అంటే అదీ కాదు!
ఇక్కడ విషయం ముడి పదార్థాలు కాదు; దానికి బదులుగా, ఇది సృష్టి మరియు పరిపూర్ణత యొక్క విషయం (know how).
గ్రహాల సమూహం యొక్క ఉనికి మాత్రమే వాటి మధ్య భూమి వలె సంపూర్ణంగా సృష్టించబడిన ఒక గ్రహాన్ని కలిగి ఉండటానికి సరిపోదు.
ఇది పరిపూర్ణత, సృష్టి మరియు తయారీకి సంబంధించిన విషయం.
{అన్నీటిని పరిపూర్ణం చేసిన అల్లాహ్ యొక్క రూపకల్పన అలాంటిదే.} {88}
సూరతున్నమ్ల్
అనేక ఇతర గ్రహాల ఉనికి భూమిపై జీవం ఉందని నిరూపించదు.
అలాగే, మీరు ఉనికిలోకి రాకముందే, మీ అన్ని విధులు, అవయవాలు మరియు హార్మోన్లను సమర్ధవంతంగా నియంత్రించే నాలుగు బిలియన్ అక్షరాలతో కూడిన మీ లోపలి జన్యు సంకేతం ఉనికిని ఇది నిరూపించదు!
జీవితం అనేది సమాచారం, అంతేగానీ పదార్థం కాదు.
నేను మరియు నాస్తికుడు ఒక గ్రహాన్ని అధిరోహించి, సమర్దవంతమైన ఖచ్చితత్వంతో పనిచేసే ఒక క్లిష్టమైన పరికరాన్ని కనుగొన్న తరువాత, దాని పనితీరును ఇంకా అర్థం చేసుకోలేకపోయినా, మేము ఉన్న గ్రహం యొక్క భారీ పరిమాణం కారణంగా ఈ పరికరం యొక్క తయారీదారుని తిరస్కరించగలమా?
మానసిక అంతర్ దృష్టి నన్ను మరియు నాస్తికుడిని, మేము ఈ పరికరాన్ని చూసినప్పుడు, సమర్థుడైన సృష్టికర్త ఉనికిని అంగీకరించమని మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
ఈ హేతుబడ్డతను, సృష్టికర్త ఉనికిని తిరస్కరించేవాడే వాస్తవానికి సాక్ష్యాలను సమర్పించాల్సిన అవసరం ఉంది గానీ ఆయన ఉనికిని ధృవీకరించేవాడు కాదు!
ఈ అబ్బురపరిచే అందమైన విశ్వంలో సాక్ష్యాలను కోరేవాడు నాస్తికుడు, విశ్వాసి కాదు.
సృష్టికర్తను విశ్వసించని కార్ల్ సాగన్ అనే నాస్తికుడు ఒకసారి "CONTACT (కాంటాక్ట్)" అనే నవల రాశాడు, అందులో శాస్త్రవేత్తలు గ్రహాంతర మేధస్సు కోసం ఎలా శోధిస్తున్నారో వివరించాడు.
ఈ కల్పిత నవలలో, శాస్త్రవేత్తలు అంతరిక్షం నుండి వచ్చే ప్రధాన సంఖ్యల సుదీర్ఘ శ్రేణిని కనుగొన్నారు. ఈ ప్రారంభ క్రమం నిర్దిష్ట గణిత విలువను సూచిస్తుంది కాబట్టి, ఒక రకమైన ఖచ్చితత్వాన్ని సూచించే విలువ, ఈ సందేశం మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక నాగరికత నుండి వస్తోందని నిర్ధారించడానికి ఇది తగిన భౌతిక సాక్ష్యం!
తమాషా ఏమిటంటే, కార్ల్ సాగన్ స్వయంగా ప్రసిద్ధ అజ్ఞేయవాది, నాస్తికుడు అయినప్పటికీ, ఒక చిన్న సందేశం యొక్క సంక్లిష్టత మరియు క్రమం సృష్టి మరియు పరిపూర్ణతకు రుజువు అనే వాస్తవాన్ని అతని వివేకం అంగీకరిస్తుంది!
ప్రధాన సంఖ్యల శ్రేణి ఖచ్చితంగా ఒక పెద్ద నాగరికత ఉనికిని రుజువు చేస్తుంది; కాబట్టి మీరు మీ శరీరంలోని ప్రతి కణంలోని నాలుగు బిలియన్ అక్షరాలను ఎలా ఆపాదిస్తారు, అందులో ఒక అక్షరం తప్పిపోతే, ఒక విపత్తు సంభవిస్తుంది, మీరు ఈ పరిపూర్ణతను అశాస్త్రీయమైన నాస్తిక విచిత్రాలకు ఎలా ఆపాదిస్తారు?
సృష్టికర్త ఉనికికి సూచనగా దాని ఫ్రేమ్ వర్క్ లోని అద్భుతాల యొక్క వివరణను నిరోధించడానికి చమత్కారాలను (విచిత్రాలను) ఆశ్రయించడం సమంజసం కాదు.
ఇలా పలుకు: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికి రావు!
సూరతు యూనుస్
16- శాశ్వతమైన సృష్టికర్తలు ఒకరి కంటే ఎక్కువ ఎందుకు లేరు?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{ఒకవేళ ఈ రెండింటిలో అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్యుడు ఉన్నట్లయితే, ఖచ్ఛితంగా అవి సర్వసనాశనమై పోయేవి.} {22}
సూరతుల్ అంబియా
అల్లాహ్ తో పాటుగా మరో దేవుడి ఉనికి, బహుళత్వానికి దారి తీస్తుంది మరియు బహుళత్వం, లోపానికి దారి తీస్తుంది.
సకల లోపాలకు అతీతుడు, మహోన్నతుడైన సృష్టికర్త ఉనికిలో లేక పోవడం లేదా ఆయన యొక్క అసమర్థత, విశ్వం యొక్క అభద్రత మరియు దుర్బలత్వానికి కారణమవుతుంది, ఇది విశ్వాన్ని అవినీతికి గురి చేస్తుంది.
ఉనికిలో లేని దైవంతో విశ్వం మనుగడ సాగిస్తుందన్న గ్యారెంటీ లేదు!
వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.
సూరతుల్ అంబియా
అల్-బారి (సృష్టికర్త) నిరుపేక్షాపరుడు, అక్కరలు లేనివాడు మరియు కొరతలకు అతీతుడు. ఎందుకంటే ఆయన స్వయం సమృద్ధుడు, నిత్యుడు, అత్యంత మహిమాన్వితుడు, పవిత్రుడూను.
పైన పేర్కొన్న వాటికి జోడించండి: వారిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది దైవాలు ఉంటే, వారిలో సానుకూలత కంటే సంఘర్షణకు ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒకరి కంటే ఎక్కువ దైవాలు అంటే ఒకటి కంటే ఎక్కువ సంకల్పాలు (ఇష్టాలు) మరియు ఒకటి కంటే ఎక్కువ సంకల్పాలు, సంకల్పాల బహుళత్వం అంటే ఏ ఒక్క దైవమూ అందుబాటులో లేకపోవడమే, మరియు ఇది భూమ్యాకాశాలలో అవినీతికి దారి తీస్తుంది.
మనిషి యొక్క సహజ స్వభావం ఖచ్చితంగా సృష్టికర్త అంటే అల్లాహ్ ఒక్కడే అని ధృవీకరిస్తుంది. భౌతిక శాస్త్రవేత్త అయినా, లేక మరెవరైనా, ఈ విశ్వాన్ని జాగ్రత్తగా చూస్తే, దానికి ఒక సృష్టికర్త ఉన్నాడని మాత్రమే వారు గ్రహిస్తారు, ఎందుకంటే ఇది సహజమైన స్వభావం.
ధర్మం ఎందుకు?
జవాబు: అబద్ధం చెప్పడం కంటే నిజం పలకడమే మంచిదని కఠోర నాస్తికుడు కూడా నమ్ముతాడు, కరక్టేనా?
ఇంకా మోసం, ద్రోహం కంటే నిజాయితీ మంచిదని అతను నమ్ముతాడు, కరక్టేనా?
ఇవి ఈ ప్రపంచానికి సంబంధం లేని పరిభాషలు మరియు వాటి అర్థాన్ని లేదా అంతరార్థాన్ని సమర్థించేది భౌతిక ప్రపంచంలో ఏదీ లేదు.
సత్యసంధత అంటే ఏమిటి?
నిజాయితీ అంటే ఏమిటి?
మనం పరమాణువు గురించి లోతైన విశ్లేషణ చేస్తే, అందులో సత్యం మరియు అసత్యం వంటి కొన్ని అర్థాలను గుర్తించగలమా?
ఒకవేళ మనము గెలాక్సీల భౌతిక శాస్త్రాన్ని మరియు హార్మోన్ల రసాయన శాస్త్రాన్ని పరిశోధిస్తే, మనం వాటిలో నిజాయితీ లేదా మోసం / ద్రోహం మొదలైన వాటిని గుర్తించగలమా?
అటువంటి పరిభాష పదాలు ఈ భౌతిక ప్రపంచానికి చెందినవి కావు.
అయినప్పటికీ, అవి నిజమైన పరిభాష పదాలు,
మరియు చాలా ముఖ్యమైన అంశాలకు చెందినవి.
వాస్తవానికి, మానవుని విలువ అతని నైతికతపై ఆధారపడి ఉంటుంది. అంతేగానీ, అది అతని భౌతిక పరిమాణం, అతని అణువుల సంఖ్య లేదా అతని కణాల శక్తి స్థాయిలపై కాదు.
అతని విలువ దైవిక నియామకాల (divine assignments) విషయంలో అతని అంతర్గత నిబద్ధత (inner commitment) ద్వారా కొలవబడుతుంది.
భౌతిక ప్రపంచంలోని ఏ విషయమూ ఈ విలువను మానవునితో పంచుకోలేదు.
ఒక మంచి మనిషి ఉండవచ్చు మరియు ఒక చెడ్డ మనిషి ఉండవచ్చు.
కానీ, ఒక మంచి పర్వతం మరియు ఒక చెడ్డ పర్వతం అంటూ ఉండదు.
అలాగే మనము ఒక నిజాయితీ నిండిన గ్రహాన్ని మరియు మరొక నమ్మకద్రోహంతో నిండిన గ్రహాన్నీ కనుగొనలేము.
కేవలం మనిషి మాత్రమే నైతిక విలువలు, జీవిత ఉద్దేశ్యం మరియు ఉనికికి సంబంధించి ఆలోచన, ఆసక్తి కలిగి ఉంటాడు, పట్టించుకుంటాడు.
కేవలం మానవులు మరియు జిన్నులు మాత్రమే తాము ధార్మికపరమైన బాధ్యతలో ఉన్నామని (వాస్తవాన్ని) గ్రహించారు.
నైతికత యొక్క అర్థాన్ని గ్రహించడం అనేది మనలో దైవిక నియామకం యొక్క అంతర్గత సహజ భావనలో భాగం తప్ప మరేమీ కాదు.
కాబట్టి మనిషి అర్థం చేసుకోవడానికి ధర్మం చాలా అవసరం
కేవలం ధర్మం మాత్రమే నైతికత యొక్క అర్ధాన్ని సమర్థిస్తుంది, అంటే అది ఎందుకు ఉనికిలో ఉంది మరియు దానికి కట్టుబడి ఉండవలసిన అవసరం మనకు ఎందుకు అనిపిస్తుంది మొదలైనవి.
అదొక్కటే నైతికతకు దాని విశిష్ట లక్షణాన్ని ఇస్తుంది,
ఎందుకంటే ఇది దైవిక నియామకం యొక్క ప్రమాణాలలో మాత్రమే అర్థం చేసుకోబడుతుంది.
మానవ జాతిలో నైతికత సహజంగానే ఇమిడి ఉందని కేవలం ధర్మం ద్వారా మాత్రమే తెలుసుకోగలం.
మరియు ధర్మం ద్వారా, ఉనికి యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తిస్తాము మరియు మనం కట్టుబడి ఉండవలసి ఉందని భావించే నైతికతలు, వాస్తవానికి మనం పాటించకపోయినా, అవి దైవిక నియామకంలో భాగమని మనకు తెలుసు.
కాబట్టి, మానవుల కొరకు ధర్మం చాలా అవసరం.
అలాగే మనం ఇక్కడ ధర్మం ద్వారానే ఎందుకు ఉన్నామనే విషయం మీకు తెలుసా?
మరియు మరణం తర్వాత ఏం జరుజరుగుతుంది తెలుసా?
మరియు ఉనికి యొక్క అర్థం మనకు తెలుసా.
మరియు ఈ (ఉనికి) జీవితంలో మనకు ఏం అవసరమో తెలుసా?
కాబట్టి, మనిషికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ధర్మం తప్పనిసరి.
అందువలన, ధర్మం లేకుండా ప్రపంచం మొత్తం పూర్తిగా అంధత్వంలో, అజ్ఞానంలో పడిపోయి, శూన్యంగా మారిపోతుంది.
ఇబ్న్ అల్-ఖయ్యిమ్ (అల్లాహ్ అతనిపై దయజూపుగాక) ఇలా అన్నారు: “ప్రవక్తల ద్వారా తప్ప ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ సంతోషానికీ మరియు సాఫల్యానికీ మరే ఇతర మార్గమూ లేదు. వాటి ద్వారా తప్ప మంచి చెడ్డలను వివరంగా తెలుసుకునే మార్గం లేదు, వారి ద్వారా తప్ప అల్లాహ్ యొక్క ప్రసన్నత ఎన్నటికీ పొందలేము."[6]
[6] జాద్ అల్ మఆద్ 68/1
షేక్ అల్-ఇస్లాం ఇబ్న్ తైమియా (అల్లాహ్ అతనిపై దయ చూపుగా) పేర్కొన్నారు, "ధర్మం యొక్క సూర్యుడు మరియు దైవసందేశం యొక్క సూర్యుడు ఉదయించిన వాటిని మినహాయించి ప్రపంచం చీకటిగా మరియు శపించబడినదిగా మిగిలిపోతుంది".[7]
[7] మజ్మూఅ ఫతావా 19/93-94.
ధర్మం లేకుండా, ఉనికి యొక్క ఉద్దేశ్యం, మంచి యొక్క అర్థం మరియు విలువ తెలియవు.
మరియు దైవిక సందేశాలు లేకుండా, ప్రపంచం భయానక అసంబద్ధంగా, నిరర్థకంగా, న్యాయవిరుద్ధంగా మారిపోతుంది.
ధర్మం కనుమరుగై పోయినపుడు, ప్రవక్తత్వాన్ని ప్రజలు తిరస్కరించినప్పుడు, మనిషి కార్ల్ సాగన్ (Carl Sagan) చెప్పినట్లు భూగ్రహంపై వ్యర్థమైన వాడిగా మరియు సార్త్రే (Sartre) చెప్పినట్లు ఒక పురుగుగా మారిపోతాడు.[8]
[8] వీడియో మూలం: The Shores of the Cosmic Ocean [Episode 1] మనం ఎక్కడి నుండి వచ్చామో మన ప్రాణంలో కొంతభాగానికి తెలుసు. మనము తిరిగి రావాలని కోరుకుంటాము. మరియు మనము అలా రాగలం కూడా. ఎందుకంటే విశ్వం కూడా మనలోనే ఉంది. మనము నక్షత్ర ధూళితో (STAR STUFF) తయారు చేయబడ్డాము. విశ్వం తనను తాను తెలుసుకోవటానికి మనం ఒక మార్గము. 06 నిమి 04 సె. మనిషి కీటకంగా మారడం గురించి, సార్త్రే తన నవల నౌసియాలో పేర్కొన్నాడు.
స్టీఫెన్ హాకింగ్ (Stephen Hawking ) చెప్పినట్లుగా, అప్పుడు మనిషి వాస్తవానికి రసాయన వ్యర్థం లేదా మరింత ఖచ్చితంగా రసాయన మలినం అవుతాడు.[9]
[9] రియాలిటీ ఆన్ ది రాక్స్:బియాండ్ అవర్ కెన్, 1995 (Reality on the Rocks: Beyond Our Ken, 1995) అంశంపై కెన్ కాంప్బెల్(Ken Campbell) తో ఇంటర్వ్యూలో నుండి:
ప్రవక్తత్వం (Prophethood) అనేది ఉనికి యొక్క ఏకైక నాడి. మరియు ప్రవక్తత్వం లేకుండా, అత్యంత అద్భుతమైన ఆవిష్కరణలు మరియు ఎంతో పరవశంతో ఆనందించే కోరికలు భయానకంగా మారిపోతాయి!
ధర్మం లేకుండా, ఈ ప్రపంచం దాని ఆకర్షణీయమైన సౌందర్యంతో ఒక భయంకరమైన భూతంగా మారిపోతుంది.
మీరు నాస్తికుడిని "మనం ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాము లేదా మరణం తర్వాత ఏం జరుగుతుంది?" వంటి అస్తిత్వ సంబంధమైన ఏదైనా ప్రశ్న అడిగితే:
అతను మీ ప్రశ్నను వితండవాదం అంటాడు లేదా మౌనం దాల్చుతాడు.
కాబట్టి, ధర్మం అనేది మానవ అవగాహనకు మరియు నైతిక విలువల ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి ప్రకృతి సహజమైన అవసరం. అలాగే, ఉనికి యొక్క అర్థం మరియు ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి మరియు మన సృష్టికర్త అయిన అల్లాహ్కు విధేయతతో సమర్పించుకోవడానికి ధర్మం చాలా అవసరం, దీని ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది.
18- ఈ నైతికతలను మెదడు లేదా సమాజం యొక్క ఉత్పత్తి అవడం నుండి ఏది నిరోధిస్తుంది?
జవాబు: మెదడు, భౌతిక ప్రపంచ పదార్ధ భాగాల వలే సరిగ్గా అదే భాగాలను కలిగి ఉంటుంది!
మెదడు ఎంత క్లిష్టంగా ఉన్నాలేదా భౌతిక నిర్మాణము ఎంత క్లిష్టంగా ఉన్నా చివరికి శూన్యాల సమ్మేళనం చివరికి శూన్యాన్నే ఉత్పత్తి చేస్తుంది.
కాబట్టి, పదార్థానికి మంచి చెడు ఏమిటో తెలియకపోతే, మెదడుకు కూడా తెలియదు కదా.
ఇక్కడ, మనము నాస్తికుడిని ఇలా అడుగుదాము: మొత్తం భౌతిక ప్రపంచం నైతికంగా తటస్థంగా ఉన్నప్పుడు మరియు దానికి మంచి చెడులు తెలియనప్పుడు, మంచి మరియు చెడుల భావన ఎలా కనపడుతుంది?
రెండవ ప్రశ్న: భూమిపై ఉన్న ప్రజలందరినీ నాశనం చేయడానికి (మేధోపరంగా)మానసిక అవరోధం ఏమిటి?
బలహీన మానవ జాతులను జంతువుల బోనులలో బంధించకుండా ఏది నిరోధిస్తుంది?
నాజీ - యాక్షన్ T4 ప్రాజెక్ట్ -చే నిర్వహించబడిన సహజ ఎంపిక ప్రాజెక్ట్ లో జరిగినట్లుగా వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, బాలహీనులు మరియు అధమ జాతుల నిర్మూలనను ఏది నిరోధిస్తుంది?[1]
https://en.wikipedia.org/wiki/Aktion_T4
ఇటువంటి ప్రశ్నలకు కు భౌతికంగా ఉన్న మెదడు తప్పుగా భావించడం లేదా సరైనవిగా భావించడం ద్వారా సమాధానం ఇవ్వదు.
నైతికత విషయమీ మెదడు పూర్తిగా తటస్థంగా ఉంటుంది, ఎందుకంటే ఇది భూమి యొక్క అవే పరమాణువులతో కూడి ఉంటుంది.
వాస్తవానికి, మెదడు మరియు నైతికతల మధ్య దగ్గర, దూరం వంటి సంబంధం లేదు.
ఇక సమాజం, నైతికతకు మూలం అనే విషయానికి వస్తే, ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక మనిషిగా మనిషికే సంబంధించినది గానీ మొత్తంగా సమాజానికి కాదు.
ఇంకా, సమాజం పదార్ధం యొక్క అదే భాగాలను కలిగి ఉంటుంది మరియు అందువల్ల సున్నాల మొత్తం మళ్లీ సున్నాని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి సమాజం భౌతిక ప్రపంచానికి చెందనప్పుడు నైతికతతో ఎలా ముందుకు వస్తుంది?
అప్పుడు, ఇది నిజమని భావించి, మనం నైతికతను సమాజం యొక్క ఉత్పత్తిగా పరిగణించినట్లయితే, నాజీలు ఇతరులను నిర్మూలించడం సరైనదే అవుతుంది ఎందుకంటే సమాజం దీనిని నైతికంగా నమ్ముతుంది.
ప్రపంచం నాజీలను విచారణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, నైతికత అనేది సమాజం యొక్క ఉత్పత్తి కాదు అనే వాస్తవం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. లేకపోతే, వారు నాజీలను విచారించలేరు మరియు అసలు మొదట వారు తప్పు చేసారనే గ్రహించలేరు.
వాస్తవానికి, నైతికత సమాజం నుండి స్వతంత్రంగా ఉంటుంది. మంచి సమాజంలోనైనా లేక చెడు సమాజంలో నైన సరైనది, సరైనదిగానే పరిగణించబడుతుంది.
అలాగే, మంచి సమాజాలలోనూ మరియు చెడు సమాజాలలోనూ తప్పు, తప్పుగానే పరిగణించబడుతుంది.
నైతికత అనేది మెదడు మరియు సమాజానికి మించిన అర్థాన్ని కలిగి ఉంటుంది.
19-భూమిపైన ఉన్న వివిధ సంస్కృతులలో ఒకరి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు, ఏకైక దైవమైన అల్లాహ్ ను మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు నమ్మాలి?
జవాబు: భూమిపై ఉన్న అన్ని మతాలలో అల్లాహ్ తప్ప ఆరాధింపబడే మరో దైవం లేనే లేడు.
ప్రపంచ మతాలన్నింటితో మాకున్న విభేధం ఏమిటంటే, వారు క్రైస్తవ మతంలో యేసు మరియు పవిత్రాత్మ వంటి ఇతర దేవుళ్లను అల్లాహ్ తో ఆరాధిస్తున్నారు, హిందూ మతంలో విష్ణువు, శివుడు మరియు బ్రహ్మ... మొదలైనవారిని అల్లాహ్ తో ఆరాధిస్తున్నారు.
అన్ని మతాలు ఏకైక దైవమైన అల్లాహ్ ను విశ్వసిస్తాయి మరియు ఆయనను ఉనికి యొక్క సృష్టికర్తగా భావిస్తారు.
కానీ వారు అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్ళను కూడా ఆరాధిస్తారు.
బహుదైవారాధకుల విగ్రహాలను కూడా వారి సొంత దేవతలుగా పూజించరు, ఎందుకంటే వారు అల్లాహ్ సృష్టికర్త అని అంగీకరించారు, కానీ వారు వాటిని అల్లాహ్ కు మధ్యవర్తులుగా చేస్తారు.
{మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పక: "అల్లాహ్!" అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు?) {61}
సూరతుల్ అన్ కబూత్
షేకుల్-ఇస్లాం ఇబ్నె తైమియా (అల్లాహ్ అతనిపై దయజూపుగాక) ఇలా అన్నారు: మరియు విగ్రహాలను ఆరాధించేవారు విగ్రహాలు ప్రపంచాన్ని సృష్టిస్తాయని లేదా అవి వర్షాన్ని కురిపించాయని, మొక్కలను పెంచుతాయని లేదా జంతువులను సృష్టిస్తాయని లేదా మరేదైనా చేస్తాయని నమ్ముతారని ఎవరైనా అనుకుంటే, అతను వారి గురించి ఏమరపాటుకు లోనైఉన్నాడు.ఎందుకంటే విగ్రహారాధన చేసే వారు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో అదే రకమైన సమాధులను ఆరాధించే ముష్రిక్ ల ఉద్దేశం కూడా అదే.[11]
[11] మజ్మూఉల్ ఫతావా ఖండం 1, పుట 359.
విల్ డ్యురాంట్ (Will Durant) విగ్రహారాధక హిందూ మతం యొక్క మూలం చివరికి ఒకే దేవుడిపై ఉన్న విశ్వాసానికి వైపుకు తీసుకు వెళుతుందని నిర్ధారించాడు. ఇంకా అతను హిందూ దేవుళ్ళ గురించి ఇలా చెప్పాడు: “వేలాది మంది వ్యక్తులను సెయింట్లుగా కలిగి ఉండే క్రైస్తవ చర్చిల యొక్క అదే నమూనాను ఈ వేలాది దేవుళ్ళు అనుసరిస్తారు. అటువంటి లెక్కలేని దేవుళ్లకు అద్వితీయుడైన సృష్టికర్తకు ఉన్నంతటి సర్వోన్నతమైన సార్వభౌమాధికారం ఉందని ఒక హిందువు ఒక్క క్షణమైనా భావించడు.”[3]
The Story of Civilization, Will Durant, vol.3, p. 209.
భారతదేశంపై బ్రిటీష్ దురాక్రమణ సమయంలో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేదిక ఇలా పేర్కొంది: "పరిశోధనల నుండి చివరికి కమిటీకి చేరుకున్న అభిప్రాయం ఏమిటంటే, అత్యధిక సంఖ్యలో భారతీయులు ఒకే పరమాత్మపై దృఢమైన నమ్మకం కలిగి ఉన్నారు."[4]
మునుపటి మూలం.
భూమిపై ఉన్న అన్ని మతాలలో అసలు దైవం అల్లాహ్ ఒక్కడే .
{మరియు మా ప్రభువు మరియు మీ ప్రభువు ఒక్కడే} {46}
సూరతుల్ అన్ కబూత్
విగ్రహాలు మరియు మానవ దేవతలు అల్లాహ్ కు మధ్యవర్తులు అనడం వారి మతభ్రష్టత తప్ప మరేమీ కాదు.
{ఎవరైతే అల్లాహ్ ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నాము" అని అంటారు.}{3}
సూరతు అజ్జుమర్
20- ఒక వ్యక్తి తనకు అవసరం లేని పని చేస్తే, అది అసంబద్ధం! సృష్టికర్తకు మన అవసరం లేదు. అయినా మనల్ని ఎందుకు సృష్టించాడు?
జవాబు: అవసరాన్ని, అసంబద్ధతతో పోల్చడం వెర్రితనం!
నిజానికి, అవసరం వివేకంతో పోల్చబడుతుంది, అంతేగానీ, అసంబద్ధతతో కాదు.
మంచి పేరున్న ఒక సంపన్న వైద్యుడు వ్యక్తుల నుండి ఏమీ ఆశించకుండా (తన అవసరాల కొరకు కాకుండా) వారికి చికిత్స చేయవచ్చు కానీ తన సొంత ప్రయోజనం కోసం అతడు వారికి చికిత్స చేస్తాడు. ఇక్కడ మేము అతని చర్యను అసంబద్ధంగా వర్ణించము!
వివేకం మరియు ఆచరణ వెనుక నున్న గొప్ప ఉద్దేశం ముమ్మాటికీ అవసరం / అసంబద్ధతల చక్రం చుట్టూ తిరగవు!
అంతేకాకుండా, ఒక ఈతగాడు మునిగిపోతున్న పిల్లవాడిపై దయ కలిగి, ఆ పిల్లవాడిని రక్షించవచ్చు. తర్వాత అతనిని విడిచిపెట్టి, పిల్లవాడి తల్లిదండ్రులు అతనికి కృతజ్ఞతలు చెప్పే వరకు వేచి ఉండకుండా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ, అతని చర్య అవసరం లేదా అసంబద్ధంగా వర్గీకరించబడదు. దానికి భిన్నంగా, ఇది ఒక ఉదారమైన చర్య, గొప్ప పని మరియు మంచి ప్రవర్తనగా గుర్తించబడుతుంది!
కాబట్టి, అవసరం మరియు అసంబద్ధత తప్పనిసరిగా పరస్పర సంబంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు. [5]
ఆధునిక తత్వశాస్త్రంలో మత విమర్శ అనే ధోరణి, డా. సుల్తాన్ అల్అమీరీ, డాక్టరేట్ పరిశోధనా గ్రంథం.
సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన దాని ప్రకారం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ హదీసె ఖుద్సీలో ఇలా తెలియచేశాడు:
ఓ నా దాసులారా! మానవులలో మరియు జిన్నాతులలో, మీలో మొదటివాని నుండి చివరి వాని వరకు - మీలో ప్రతి ఒకరు అత్యంత పవిత్రమైన హృదయంతో ఉత్తములుగా ఉన్నా, అది నా ఆధిపత్యంలో దేనినీ కించిత్తు కూడా పెంచదు. ఓ నా దాసులారా! మానవులలో మరియు జిన్నాతులలో, మీలో మొదటివాని నుండి చివరివాని వరకు, ప్రతి ఒక్కరు అత్యంత చెడ్డ హృదయంతో దుర్మార్గులుగా ఉన్నా, అది నా ఆధిపత్యం నుండి దేనినీ తగ్గించదు. నేను మీ పనులను లెక్కించేది మీ కోసం మాత్రమే మరియు వాటికి బదులుగా మీకు ప్రతిఫలమిస్తాను. కాబట్టి, ఎవరైతే మంచిని కనుగొన్నారో, అతడిని అల్లాహ్ ను స్తుతించనివ్వండి మరియు అది తప్ప మరొకటి కనుగొంటే, అతను స్వయంగా తనను తప్ప మరెవరినీ నిందించకూడదు. [6]
సహీహ్ ముస్లిం హదీసు సంఖ్య : 2577
అల్లాహ్ లోకాల అవసరం లేని నిరుపేక్షాపరుడు.
మన ప్రయత్నం, కృషి, శ్రమ, ప్రయాస కేవలం మన కోసమే.
కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.{6}
సూరతుల్ అన్ కబూత్
అల్లాహ్ తన సృష్టి అన్నిటిలో వివేకం కలిగి ఉన్నాడని మనకు తెలుసు. ఒకవేళ మనకు దాని గురించి తెలియకపోయినా, రోగికి వైద్యుడి వివేకం గురించి తెలియకపోవడం వల్ల వైద్యుడి నిర్ణయాలు అసంబద్ధమైనవి అని అర్థం కాదు.
దైవిక జ్ఞానం మరియు వివేకంలోని కోణాలన్నింటినీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. వాటిలో కొన్నింటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది!
అల్లాహ్ ను ఆరాధించే బాధ్యత మనపై ఉందని మరియు దైవిక జ్ఞానం అనేది ఒకటి ఉందని తెలుసుకుంటే చాలు, అది మన కొరకు సరిపోతుంది. మామూలుగా ఇది మన కొరకు సరిపోతుంది; అలా కాకుంటే, 'మాకు అర్థం కాని వాటన్నింటినీ మేము నమ్మం' అనే వారి వలే అయిపోతాము.{కానీ వారు అర్థం చేసుకోని వాటిని తిరస్కరించారు మరియు వారిపై దాని హెచ్చరిక ఇంకా నెరవేరలేదు.}{39} సూరతు యూనుస్.
అల్లాహ్ మహావివేకవంతుడు మరియు ఆయన ఒక వివేకంతో మనల్ని సృష్టించాడు, ఆయన పరమ పవిత్రుడు.
నిజ ఆరాధనలకు అర్హుడు కేవలం ఆయన ఒక్కడే
అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనలకు అర్హులు కారు; శూన్యం నుండి మనల్ని ఉనికిలోకి తెచ్చిన సృష్టికర్త ఆయనే. ఆయన ప్రకటన:
{ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!} {21}
సూరతుల్ బఖరహ్
ఆయనే మనకు మార్గనిర్దేశం చేసేవాడు, మరియు ఆయనే ధర్మ శాసనాన్ని చేసేవాడు ఆజ్ఞాపించేవాడు మరియు వారించేవాడు.
{నిశ్చయంగా, సర్వ సృష్టి ఆయనదే ,ఆజ్ఞ నడిచేది ఆయనదే} {54}
సూరతుల్ ఆరాఫ్
కేవలం సృష్టి మాత్రమే కాదు, ఆజ్ఞ కూడా ఆయనదే. మేము ఆయన ఆజ్ఞలను పాటిస్తాము; ఆయన అత్యంత మహోన్నతుడు.
ఆరాధన అనేది దాసులపై అల్లాహ్ యొక్క హక్కు. సర్వ లోపాలకు అతీతుడు అయిన ఆయనే మనలను సృష్టించాడు, మనకు జీవితాన్ని ప్రసాదించాడు, మనకు జీవనోపాధిని ఇచ్చాడు, మనకు మార్గనిర్దేశం చేశాడు మరియు తన దూతలను మన వద్దకు పంపాడు, తద్వారా మనలో ఎవరు ఉత్తములో పరీక్షించడానికి. కాబట్టి, ఆరాధన అనేది మనపై అల్లాహ్ యొక్క హక్కు.
{ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు, బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.} {2}
సూరతుల్ ముల్క్.
మన ప్రాపంచిక జీవితం మరియు పరలోక జీవితం ఆరాధనతోనే సరిదిద్దబడుతుంది, అంతేగాక ఆరాధనతోనే మన నైతికత సంస్కరించబదుతుంది; ఎందుకంటే ఆరాధన అశ్లీలతను మరియు అధర్మాన్ని నిరోధిస్తుంది తద్వారా ప్రాపంచిక జీవితం సంస్కరించబడుతుంది. సర్వశక్తిమంతుడైన మన ప్రభువు ప్రకటన:
{మరియు నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది.} {45}
సూరతుల్ అన్ కబూత్
ఆరాధన ద్వారా మాత్రమే మనం స్వర్గాన్ని పొందగలము ఇది పరలోకంలో మోక్షాన్ని మరియు ప్రాపంచిక జీవితంలో ఆనందాన్ని కలుగజేస్తుంది.
ఆరాధన మన కోసం మరియు మన మేలు కోసం, మరియు ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు మనపై విధిగా ఉంది, ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త, మరియు దాని ప్రయోజనం మనకు మాత్రమే లభిస్తుంది మరియు నిర్లక్ష్యం మనపై చెడు ప్రభావం చూపుతుంది.
స్వర్గం ఖరీదైనది, కాబట్టి స్వర్గాన్ని కోరుకునే వారు దాని కోసం శ్రమించాలి. అవసరాలు కలిగినవారము మనము ఆయన సర్వ లోపాలకు అతీతుడు ... ఆయనను ఆరాధించే అవసరం మనకు ఉంది మరియు ఆయనకు ఏ అవసరమూ లేదు.
21- అల్లాహ్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి?
జవాబు: మనం అల్లాహ్ గురించి అనేక మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు కానీం ఇక్కడ వాటిలో నాలుగు మాత్రమే ప్రస్తావించాము:
మొదటి మార్గం: మనం అల్లాహ్ ను సహజ స్వభావం ద్వారా తెలుసుకోగలము.
తనకు ఒక సృష్టికర్త ఉన్నాడనే విషయం మనిషి తెలుసు. అద్భుతమైన నైపుణ్యంతో అవయవాలను సమకూర్చి ఈ ఆకారంలో ఒక రూపాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని సహజంగానే తెలుసు.
అలాగే, ఆరాధన ద్వారా తన సృష్టికర్తను ఆశ్రయించాల్సిన అవసరం ఉందని సహజంగా మనిషికి తెలుసు మరియు తన కొరకు తన సృష్టికర్త అవసరమని, ఆయన పరమ పవిత్రుడని, తనకు అల్లాహ్ అవసరం అనే భావన కష్టసమయాల్లో మరింతగా పెరుగుతుందని కూడా తెలుసు.
సమస్త మానవాళికి అల్లాహ్ అంటే ఎవరో సహజ స్వభావంతో తెలుసు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన
{కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.} {30}
సూరతు అర్రూమ్
పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: "ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: "అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: "నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని.} {172}
సూరతుల్ ఆరాఫ్
మనం ఇక్కడ పుట్టక ముందే, అల్లాహ్ పరిచయం మరియు ఆయనకు దాసులుగా ఉండాలనే సహజ స్వభావంతో మనం సృష్టించబడ్డాము.
{మరియు ఆయన వారిని తమ గురించి సాక్ష్యం చెప్పుకునేలా చేసాడు, "నేను మీ ప్రభువు కాదా?" అనే ఆయన ప్రశ్నకు వారు, “అవును; వాస్తవానికి, మేము సాక్ష్యమిస్తున్నాము" అని జవాబిచ్చారు.}
అల్-బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంథాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన ఒక హదీసు లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
'ఉత్తమ సహజ స్వభావంతో తప్ప ఏ శిశువూ జన్మించడు.'[7]
సహీహ్ ముస్లిం హదీసు నెంబరు : 2658
కాబట్టి మనమంతా ఆ సహజ స్వభావంపైనే జన్మించాము. ఇది సత్యాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి కొరకు అతడిని సత్యం వైపు మార్గదర్శకత్వం వహించడానికి సరిపోతుంది. అయితే, అతను దానిని కనుగొన్న తర్వాత ఆ సత్యానికి లోబడి ఉండాలి.
దృఢమైన అవిశ్వాసం కలిగిన ఉన్న వ్యక్తులు కూడా ముఖ్యంగా కష్ట సమయాల్లో ఈ వైఖరిని తిరస్కరించలేరు. వాస్తవానికి, ప్రజలందరూ కష్టాల్లో ఏకైక ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆశ్రయిస్తారు మరియు ఆరాధనలలో వారు ఆయనకు సాటి కల్పించిన వాటి గురించి మరచిపోతారు.
{మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు.}{67}
సూరతుల్ ఇస్రా
ఒక వ్యక్తి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు మరియు తన పై తప్పకుండా భయంకరమైన ఆపద వచ్చి పడబోతుందని భావించినప్పుడు, అతను అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ప్రార్థించడు మరియు తన బహుదైవారాధన విశ్వాసాలన్నింటినీ మరచిపోతాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ ఈ హృదయపూర్వకమైన ప్రార్థన ప్రతి వ్యక్తి తనలో ఉన్న సహజమైన స్వభావంతో ప్రేరేపించబడుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ దళాలకు కమాండర్ గా మరియు అమెరికన్ అధ్యక్షులలో ఒకరిగా పని చేసిన ఐసెన్ హోవర్ - ఘోర ప్రమాద సమయంలో బలగాలు సహజ స్వభావానికి ఎలా తిరిగి వస్తాయో చూసిన తర్వాత ఇలా అన్నారు: “కందకాలలో నాస్తికులు ఉండరు." [8]
https://en.wikipedia.org/wiki/There_are_no_atheists_in_foxhole
కందకంలో యుద్ధ సమయంలో, అల్లాహ్ ను తిరస్కరించేవారు ఎవరూ లేరు, వారందరూ ఆయన వద్దకు మరలి వస్తారు. ప్రతికూల సమయాల్లో మానవాళి మొత్తం అంగీకరించే నిజమైన సహజ స్వభావం ఇదే.
అల్లాహ్ ను తెలుసుకోవటానికి రెండవ మార్గం - బుద్ధీ, హేతువు, వివేకం: మనం అల్లాహ్ ను బుద్ధీ, వివేకం, హేతువుల ద్వారా తెలుసుకుంటాము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?} (35)
సూరతుత్తూర్
బుద్దీ, వివేకాన్ని ఉపయోగించి చూస్తే కేవలం మూడు అవకాశాలు మాత్రమే సాధ్యం అవుతాయి (నాల్గవ దానికి అస్సలు అవకాశం లేదు):
మొదటిది: మనం సృష్టికర్త లేకుండా సృష్టించబడ్డాము (లేదా వారు ఏమీ లేకుండా సృష్టించబడ్డారా), మరియు ఇది అసాధ్యం. ఎందుకంటే సృష్టికర్త లేకుండా మనం ఎలా సృష్టించబడగలం?
రెండవది: మనల్ని మనమే సృష్టించుకున్నాము (లేదా స్వయంగా వారే సృష్టికర్తలా) మరియు ఇది కూడా అసాధ్యం. ఎందుకంటే నేను ఉనికిలో లేకుండానే నన్ను నేను ఎలా సృష్టించుకోగలను?
కాబట్టి బుద్ధీ, జ్ఞానాల ముందు కేవలం మూడవ అవకాశం మాత్రమే మిగిలి ఉంది మరియు దాని గురించి ఖుర్ఆన్ ఆయతు (వచనం) ఏమి అనలేదు. ఎందుకంటే ఆ వాస్తవం చాలా స్పష్టమైనది ,మనల్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు.
మనం బుద్దీ, వివేకంతో అల్లాహ్ ను గుర్తించవచ్చు.
అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ మార్గం ఆయన సృష్టిపై దృష్టి సారించడం:
అల్లాహ్ యొక్క సృష్టి గురించి ఆలోచించడం అనేది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, ఘనతను మన ముందు ఉంచుతుంది.
{వారికి ఇలా పలుకు! ఆకాశంలో మరియు భూమిలో ఏముందో చూడు.} {101}
సూరతు యూనుస్
అల్లాహ్ యొక్క అతి సూక్ష్మమైన, సున్నితమైన సృష్టి మరియు అద్భుతమైన పరిపూర్ణత గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, ఆయన గురించి మన జ్ఞానం అంతగా పెరుగుతుంది.
ఉనికిలోకి తీసుకురావడానికి రుజువు మరియు దూరదృష్టి, వివేకం,పరిపూర్ణత యొక్క రుజువుల గురించి ఇంతకు ముందు వచ్చిన ప్రస్తావనలో మనం పేర్కొన్నది ఇదే.
అల్లాహ్ ను గురించి తెలుసుకోవడానికి నాల్గవ మార్గం ప్రవక్తల ద్వారా తెలుసుకోవడం:
మహోన్నతుడైన అల్లాహ్ గురించి మనం తెలుసుకోవటానికి ఇదే అత్యుత్తమ మార్గం. అనగా ఆయన ప్రవక్తలు మరియు సందేశహరుల ద్వారా ఆయనను గురించి తెలుసుకోవడం. అల్లాహ్ గురించి, ఆయన లక్షణాలు మరియు గుణగణాల గురించి ప్రవక్తలు మనకు తెలిపారు. ప్రవక్తల ద్వారా మనం అల్లాహ్ ను ఆయన యొక్క అత్యుత్తమ పేర్లు మరియు లక్షణాలతో తెలుసుకుంటాము మరియు ఆయనను ఎలా ఆరాధించాలో మరియు ఆయనకు సన్నిహితంగా ఎలా ఉండాలో తెలుసుకుంటాము. పాపపుణ్యాలు లెక్కింపబడే అంతిమ తీర్పుదినం నాడు అల్లాహ్ శిక్ష నుండి ఎలా రక్షించబడాలో మనకు తెలుసు. అలాగే ప్రవక్తలు అల్లాహ్ ను ఆరాధించమని ప్రజలను పిలిచారు, మరో మాటలో చెప్పాలంటే, వారు సృష్టించబడిన వారి సహజ స్వభావానికి మరలి రావాలని మరియు అల్లాహ్ ఆజ్ఞాపించిన విధంగా ఆరాధించమని వారిని పిలిచారు.
సందేశహరులు ప్రజలను సత్యం మరియు మోక్ష మార్గం వైపు నడిపించారు:
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! {165}
సూరతు న్నిసా
కాబట్టి పునరుత్థాన దినమున అల్లాహ్ సమక్షంలో వారి వద్ద ఎలాంటి సాకులు మిగిలకుండా, ప్రవక్తలు మరియు సందేశహరులు అల్లాహ్ గురించి మనకు తెలియజేసారు మరియు అల్లాహ్ ప్రసాదించిన అద్భుతాల ద్వారా వారికి మద్దతు లభించింది.
ఎందుకంటే, మహోన్నతుడైన అల్లాహ్, మీరు మీ సృష్టికర్తను తెలుసుకునేందుకు మీకు సహజమైన స్వభావాన్ని ప్రసాదించాడు, మీకు బుద్ధీ, హేతువు, వివేకాలను ప్రసాదించాడు, మీకు కంటి చూపు ప్రసాదించాడు, తద్వారా మీరు ఆయన సృష్టి గురించి ఆలోచిస్తారని మరియు మీ వద్దకు ప్రవక్తలను పంపారు. కాబట్టి, అల్లాహ్ ముందు మీ వద్ద ఎటువంటి సాకూ మిగల లేదు.
22- ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నాయి. మరి, ఇస్లాం యే ఎందుకు?
జవాబు: ఇతర మతాలలో వలే ఇస్లాం కేవలం ఒక మతం కాదు.
వాటికి భిన్నంగా ఇస్లాం, పాత నిబంధనలోని ప్రవక్తలందరి విశ్వాసాన్ని అంగీకరిస్తుంది.
ఇస్లాం అనేది దారి తప్పిన మతాల మార్గాన్ని సరిదిద్దుతుంది మరియు పాత నిబంధన ప్రవక్తల ఏకేశ్వర విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది .
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు} {13}
సూరతు అష్షూరా
నిజానికి, ఇస్లాం ఇతర మతాల వంటి మతం కాదు; భిన్నంగా, ఇది అన్ని మతాలకు మూలం.
18. ఇస్లాం అంటే ఏమిటి?
జవాబు: ఇస్లాం అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు మనస్పూర్తిగా సమర్పించుకోవడం, ఆయనకు విధేయత చూపటం.
మరియు మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.} {125}
సూరతు న్నిసా
అల్లాహ్ కు తన మఖమును సమర్పించటం అంటే అర్ధం: అల్లాహ్ కు పూర్తిగా లొంగిపోవటం మరియు పరమ పరిశుద్ధుడైన, మహోన్నతుడైన ఆయనకు విధేయత చూపటం మరియు మన ప్రభువు లోపాలన్నింటికీ అతీతుడు. మరియు ఆయన ధర్మం పై ఉన్నవారే ప్రజలలో ఉత్తములు.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{కనుక మీ ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్యదైవము. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు.} {34}
సూరతుల్ హజ్
ఆయనకు శిరసా వహించండి అంటే అర్ధం: మీరు ఆయన ఆదేశమును పాటించండి.
ఈ ఆయతులు - "ఇస్లాం యొక్క అర్థం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు సంపూర్ణంగా లొంగిపోవడం మరియు విధేయత చూపడం, మరియు సంతృప్తితో మరియు అంగీకారంతో ఆయన చట్టం మరియు పద్ధతికి కట్టుబడి ఉండటం, మరియు ఇది ఇస్లాం యొక్క సారాంశం మరియు సత్యం" అని పేర్కొంటున్నవి.
ఇస్లాం అల్లాహ్ తీర్పుకు మరియు ఆయన చట్టానికి లోబడి ఉండేటట్లు చేస్తుంది.
ఇస్లాం సమస్త మానవాళి కొరకు అల్లాహ్ ఎంపిక చేసిన ధర్మము. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన
{నిస్సందేహంగా ఇస్లాం'యే అల్లాహ్ వద్ద ధర్మం సమ్మతమైనది}{19}
సూరతు ఆలె ఇమ్రాన్
అల్లాహ్ మతాలలో ఇస్లాంను తప్ప మరే మతాన్ని అంగీకరించడు.
{మరియు ఎవరైనా ఇస్లాం ధర్మం (అల్లాహ్ కు విధేయత చూపుట, సమర్పించుట) తప్ప మరే ఇతర ధర్మాన్నైనా అవలంబించగోరితే అది ఎంత మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరతాడు.}[85]
సూరతు ఆలె ఇమ్రాన్
ప్రవక్తలందకీ, సందేశహరులందరికీ అల్లాహ్ ఇచ్చి పంపించిన ధర్మమే ఇస్లాం. కావున ప్రవక్తల ధర్మం ఒక్కటే. అదే ఇస్లాం. ప్రవక్తలందరి షరీయత్ లు (చట్టాలు) వేరైనప్పటికి వారందరు ఏకదైవఆరాధనను మాత్రమే బోధించారు.
మరియు మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అనే దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.}[25]
సూరతుల్ అంబియా
ఈ ఏక దైవఆరాధన పై ఇస్లాం తప్ప ఏ ధర్మం లేదు.
నేడు భూమిపై ఉన్న ఏకైక ఏకేశ్వరో పాసన మతం ఇస్లాం మతం.
అన్ని ఇతర మతాల అనుయాయులు బహుదైవారాధనలో తమ వంతు భాగాన్ని కలిగి ఉన్నారు, అది తక్కువైనా లేదా ఎక్కువైనా. ప్రవక్తలు మరణించిన తరువాత, తమ అనుయాయులను ఏకదైవారాధనలో విడిచిపెట్టిన తరువాత, కాలక్రమేణా వారు బహుదైవారాధక విషయాలలో నిమగ్నమయ్యారు, మరియు ఇస్లాం తప్ప ప్రవక్తలు తీసుకువచ్చిన ఈ స్వచ్ఛమైన ఏకదైవారాధనపై ఈ రోజు ఏమీ మిగిలి లేదు.
24. అంతుచిక్కని ప్రశ్నలకు ఇస్లాం వద్ద సమాధానాలు ఉన్నాయా?: మనం ఎక్కడ నుంచి వచ్చాం? మనం ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాం? మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి?
జవాబు: ఇస్లాం ఈ ప్రశ్నలన్నింటికీ ఖుర్ఆన్ ఒక్క ఆయతులో సమాధానం ఇచ్చింది. పరిశుద్ధుడైన మన ప్రభువు ఇలా సెలవిచ్చాడు :
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించ కూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు".{22}
సూరతు యాసీన్
నేను ఎక్కడి నుండి వచ్చాను? అల్లాహ్ యే నన్ను సృష్టించాడు (الَّذِي فَطَرَنِي).
నేను ఎక్కడికి వెళ్తాను? నేను చేసిన కర్మలకు గాను లెక్క తీసుకోబడటానికి నేను అల్లాహ్ వద్దకే వెళ్తాను (وَإِلَيْهِ تُرْجَعُونَ).
నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? అల్లాహ్ ను ఆరాధించడానికి మరియు పరీక్షించబడటానికి.
నేను అల్లాహ్ ను ఎందుకు ఆరాధించాలి? సహజంగా, నన్ను సృష్టించిన అల్లాహ్ నే నేను ఆరాధించాలి. ఒక దాసునికి మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం యొక్క స్వభావం ఇది: దాసుడు తన ప్రభువును మరియు సృష్టికర్తను ఆరాధించాలి (وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي).
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు".
ప్రజలను అయోమయానికి గురిచేసే మూడు అతి ముఖ్యమైన ప్రశ్నలకు ఈ ఒక్క వాక్యంలో సమాధానం ఉంది.
"మరియు నన్ను సృష్టించిన ఆయననే నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు".{22}
సూరతు యాసీన్
25 - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద నుండి వచ్చిన ప్రవక్త అని మీకు ఎలా తెలుసు?
జవాబు: అద్భుత సాక్ష్యం యొక్క వివిధ రుజువుల కొనసాగింపు ఖచ్చిత నమ్మకం వైపునకు సూచిస్తాయి.
అరిస్టాటిల్ తన మొత్తం రచనల ఆధారంగా ఒక తత్వవేత్త, అతను చేసిన ఒక్క ప్రకటన ద్వారా లేదా అతను నిర్వహించిన తాత్విక విశ్లేషణ ద్వారా కాదు.
అదేవిధంగా, హిప్పోక్రటీస్ తన మొత్తం వైద్య ప్రాజెక్టుల ఆధారంగా ఒక వైద్యుడు, అతను చేసిన ఒక్క శస్త్రచికిత్స ద్వారా కాదు.
అదే విధంగా, ప్రవక్త (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ఆయనపై ఉండుగాక) గురించి నివేదించబడిన అద్భుతానికి సంబంధించిన వివిధ రకాల రుజువుల కొనసాగింపు, అతను ఒక ప్రవక్త అనే ఖచ్చితమైన నమ్మకం వైపు సూచిస్తాయి.
ఒకవేళ మీరు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితచరిత్రను పరిశీలిస్తే, ఆయనను సత్యవంతుడిగా పొందుతారు మరియు ఆయన నిజాయితీ పరంగా ప్రసిద్ధి చెందాడు ఆయన పట్ల అత్యంత శత్రుత్వం ఉన్నవారి ఒప్పుకోలు ప్రకారం, మరియు ఆయన అబద్ధం లేదా అనైతికతపై ఎన్నడూ ఆరోపించబడలేదు; ఆయన భవిష్యత్తు విషయాల గురి౦చి ప్రవచి౦చేవారు, ఆయన చెప్పినట్లే అవి జరిగేవి; మొదటి రోజు నుండి ఆయన పిలుపునిచ్చిన ఆయన సిద్దాంతం ప్రవక్తలందరి సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నది; ప్రవక్తలు ఆయన గురించే శుభవార్త నిచ్చారు, పురాణాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాక గురించి వందల సంవత్సరాల ముందే శుభవార్తనిచ్చాయి. ఈ అనేక రుజువుల కొనసాగింపు, దైవదౌత్యము నిజమవటంపై సూచిస్తున్నాయి.
మరియు ఆయన తీసుకువచ్చిన గొప్ప సూచన ఏమిటంటే? అది పవిత్ర ఖురాన్
ఖుర్ఆన్ ద్వారా, అల్లాహ్ వాక్చాతుర్యం గల ప్రజలను దాని సూరాల వంటి సూరాలను తయారు చేయమని సవాలు చేశాడు - కాని వారు విఫలమయ్యారు.
సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا} ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు.{24}
సూరతుల్ బఖరహ్
వారు దానిని చేయలేదు మరియు చేయలేకపోయారు.
అద్వితీయమైన ఖుర్ఆన్ బహుదైవారాధకులలో వాక్చాతుర్యం కలిగి ఉన్న ప్రజలకు ఇప్పటికీ సవాలు చేస్తూనే ఉంది, మరియు వారు సవాలు స్వీకరించి ఇప్పటికీ దాని వంటి దానిని తయారు చేయలేకపోతున్నారు.
డాక్టర్ అబ్దుల్లాహ్ దిరాజ్ (అల్లాహ్ అతనిపై కనికరం చూపవచ్చు) ఇలా అన్నారు: "ప్రవక్త (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు అతనిపై ఉండుగాక) ఈ సవాలు ద్వారా వారి సాహిత్య పాండిత్యాన్ని ప్రేరేపిస్తుందని భయపడలేదా?
వారు తన ప్రత్యర్థి వద్దకు వస్తారు మరియు అప్రమత్తంగా ఉంటారు; వారి సొంత ప్రజల సమూహం కొన్ని విషయాల్లో అతనిని మించిన పదాలతో ముందుకు రావడానికి ఒప్పందం కుదుర్చుకుంటే అతను ఏమి చేస్తాడు!
అప్పుడు, ఆయనే స్వయంగా తన కాల౦లోని ప్రజలపై ఈ తీర్పును ప్రకటి౦చడానికి సుముఖ౦గా ఉ౦టే, ఆయన దాన్ని భవిష్యత్తు తరాలకు ఎలా అందిస్తాడు?
ఇది ఒక సాహసం తన సొంత విలువ తెలిసిన వ్యక్తి దైవిక శాసనాలు నిర్వహించే మార్గము పై మరియు స్వర్గం నుండి వచ్చే వెల్లడి గురించి ఖచ్చితంగా తెలుసుకుంటే తప్ప ఇది ఏ మానవుడూ చేయలేని ప్రమాదకరమైన సాహసం. అతను పూర్తి ప్రపంచం మధ్య సవాలు విసిరాడు, మరియు అది సంపూర్ణ నిశ్చయాత్మక నిర్ణయం. యుగయుగాలుగా ఆయనను ఎదిరి౦చిన వారెవరైనా స్పష్టమైన శక్తిహీనతతో, ఘోరమైన వైఫల్య౦లో కూరుకుపోతారు".{9}
[18] డాక్టర్ అబ్దుల్లాహ్ దిరాజ్ రహిమహుల్లాహ్ పుట 44-45
ఖుర్ఆన్ ను వ్యతిరేకించడం మరియు దాని సవాలును స్వీకరించడం కంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పోరాడటానికి పెద్ద సైన్యాలను సమీకరించడం అనేది సులభమైనది అని బహుదైవారాధకులు భావించారు, ఎందుకంటే వారు చేయగలిగినది. యుద్ధం మాత్రమే.
{మరియు సత్యతిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: "ఈ ఖుర్ఆన్ ను వినకండి! మరియు ఇది వినిపించబడినప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి, బహుశా మీరు ప్రాబల్యం పొంద వచ్చు!"} {26}
సూరతు ఫుస్సిలత్
అరబ్బులందరూ మరియు సవాలు అందజేయబడిన ఇతర దేశాలవారందరూ ఈ విషయంలో నాస్తికులను ఓదార్చగల లేదా వారు ఇతరులను ఓదార్చగల మార్గాలతో ముందుకు రాలేక పోయారు.
అలూసి రహిమహుల్లాహ్ ఇలా అంటున్నారు : "వారిలో ఎవరూ ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక వివరణ లేదా ఒక లక్షణాన్ని వ్యక్తపరచలేదు
జుబేర్ ఇబ్న్ ముత్ఇమ్ ఇలా అన్నారు అప్పటికి ఇంకా ఆయన ఇస్లామ్ స్వీకరించలేదు : ప్రవక్త (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ఆయనపై ఉండుగాక) మగ్రిబ్ లో సూరతు తుర్ పఠించడం నేను విన్నాను, మరియు ఆయన ఈ ఆయత్ కు చేరుకున్నప్పుడు:
{వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?} (35)
{లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా ? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.} (36)
{వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?} (37)
సూరతు తూర్
ఆయన ఇలా అన్నారు: దాదాపు 'నా హృదయం గాలిలో ఎగురుతున్నట్లుగా అనిపించింది.' [10]
సహీహ్ బుఖారీ హదీసు (4854)
ఖుర్ఆన్ లో మానవ ఆత్మకు చేరే అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి.
అబూ బకర్ ఖురాన్ పఠించినప్పుడు బహుదైవారాధక స్త్రీలు ఆయన ఇంటి చుట్టూ ఎలా గుమిగూడేవారో, ఆ పఠన ప్రభావంతో ఎలా ఆకర్షితులయ్యారో ఆలోచించండి, ఖురైష్ పురుషులు ఆ కారణంగా భయాందోళనలకు గురయ్యేవారు. [11]
సహీహ్ బుఖారీ హదీసు (3905)
ఇందువలనే అరబ్బు అవిశ్వాస ప్రతినిధులు "ఖుర్ఆన్ ను వినరాదు మరియు తమ కుటుంబాలను విననివ్వరాదనే" మాటపై ఏకీభవించారు. అవిశ్వాసంపై మిగిలి ఉండిపోవటానికి ఇదొక్కటే ఏకైక మార్గము అని వారు భావించారు.
ఖుర్ఆన్ అద్భుతాలలోని కొన్ని అద్భుతాలు అంతులేనివి, డాక్టర్ అబ్దుల్లా దిరాజ్ రహిమహుల్లాహ్ వివిధ సమయాల్లో ఖుర్ఆన్ వాక్యాల అవతరణ గురించి తెలియచేస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ఆయతులను సూరాలలోని కొన్ని నిర్ధిష్ట ప్రదేశాలలో మరియు కొన్ని ఆయతులను ఇతర ఆయతులతో కలిపి మరికొన్ని ప్రదేశాలలో ఎలా ఉంచబడ్డాయో సూచించారు. అప్పుడు ప్రతి సూరా ఒక స్వతంత్ర నిర్మాణంగా ఉద్భవిస్తుంది. మరియు ఆయన రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ఖుర్ఆన్ అవతరణ సమయంలో, ఖుర్ఆన్ లోని కొన్ని అంశాలు ఇతర అంశాలకు భిన్నంగా ఉండేవి,ఈ విధంగా అవి పెరుగుతూపోయాయి, తరువాత అవతరించబడిన ఇతర ఆయతులు వాటికి జోడించబడిన తరువాత క్రమంగా స్వతంత్ర విభాగాలుగా ఏర్పడ్డాయి; కొన్ని ఇక్కడ చేర్చబడతాయి మరియు ఇతర వచనాలు ప్రవక్త ఆదేశాల మేరకు వేరే సూరహ్ లో చేర్చబడతాయి, ఏవిధంగానైతే అతను పరిశుద్ధాత్మ నుండి అందుకున్నారో, ఆ విధంగా.
ఒకవేళ మనం అనేక తేదీలను అనగా పవిత్ర ఖుర్ఆన్ యొక్క ఆయతుల అవతరణ తేదీలను పరిగణనలోకి తీసుకుంటే - ఈ (వహీ) ద్యోతకం సాధారణంగా ప్రత్యేక పరిస్థితులు మరియు ప్రత్యేక సందర్భాలకు సంబంధించినదని మనము గమనిస్తాము, అయితే ఇది మనల్ని ప్రతి సూరహ్ ఒక స్వతంత్ర క్రొత్త భాగంగా చేర్చబడిన సంకలన ప్రక్రియ సమయం గురించి అడిగేలా చేస్తుంది.
తన పూర్వరూపంలో మరో చోట పునర్నిర్మించబడాలని ఉద్దేశించబడి, వేర్వేరు భాగాలలో చెల్లాచెదురుగా పడి పోయిన మరియు ప్రతి భాగం గుర్తింపు కొరకు ఒక నెంబరు ఇవ్వబడిన ఒక పురాతన భవనం వలే ఖుర్ఆన్ ఉన్నట్లు అనిపిస్తుంది; లేకుంటే, అనేక అధ్యాయాలకు సంబంధించి ఈ తక్షణ మరియు ఏకకాలంలో జరిగిన క్రమబద్ధమైన ఏర్పాటును ఇంతకంటే మంచిగా ఎలా వివరించగలం?
ఏదేమైనా, భవిష్యత్ సంఘటనలు, వాటి చట్టపరమైన అవసరాలు మరియు వాటికి కావలసిన పరిష్కారాలు, ఇంకా ఆ పరిష్కారాలు సమర్పించబడవలసిన భాషా రూపం మరియు ఒక నిర్దిష్ట సూరహ్ తో మరో నిర్దిష్ట సూరహ్ ను కలుపుతూ ఉన్న ప్రత్యేక శైలిలో అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఎలాంటి చారిత్రక హామీని పొందగలడు?
ఈ అద్భుత ప్రణాళికను పూర్తి చేయడానికి మరియు కోరుకున్న రూపంలో దాని తయారీ కొరకు, ఈ కోరుకున్న సమన్వయాన్ని ఏర్పరచగల సామర్థ్యం ఉన్న గొప్ప సృష్టికర్త జోక్యం అవసరమని మనం నిర్ధారించలేమా?[12]
డాక్టర్ అబ్దుల్లాహ్ దిరాజ్ రచించిన పుస్తకం మద్ఖల్ ఇలల్ ఖుర్ఆనిల్ కరీం. (مدخل إلى القرآن الكريم)
వాస్తవానికి, ఖుర్ఆన్, అతని ప్రవక్తత్వం (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు అతనిపై కురుయుగాక) యొక్క సత్యతను రుజువు చేసే ఒక స్వతంత్ర అద్భుతం.
ప్రవక్త (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు అతనిపై కురుయుగాక) ద్వారా జరిగిన అద్భుతాలు అనేకం, దాదాపు వెయ్యికి మించి ఉన్నాయి. అవి సంభవించి మరీ అంత ఎక్కువ కాలం గడవలేదు మరియు వాటి ఉల్లేఖకులు అత్యంత సత్యవంతులు మరియు నీతిమంతులు.
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెబితే, అతను అగ్నిలో విసిరి వేయబడతాడని హెచ్చరించబడిన తర్వాత, ఈ అద్భుతాలను మన వరకు చేరవేసిన ఆ ఉల్లేఖకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అబద్ధం చెప్పడం నుండి దూరంగా ఉండటమే కాకుండా, మామూలు విషయాలలో కూడా అబద్ధం చెప్పరు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని అద్భుతాలను వేలాది మంది సహచరులు ప్రత్యక్షంగా చూశారు మరియు వాటిని పదుల సంఖ్యలో నివేదించారు, కాబట్టి వీటి గురించి ఒకేలా అబద్ధం చెప్పడంలో అంతమంది ఎలా సహకరించుకోగలరు?
అనేక మంది ప్రత్యక్షంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అద్భుతాలను చూసారు, దీనికి ఉదాహరణ - చెట్టు కొమ్మ యొక్క బాధను తెలిపే హదీసు , ఇది ప్రసిద్ధ నిరంతర ఉల్లేఖకుల పరంపరతో నమోదు చేయబడిన హదీసు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒక చెట్టు కొమ్మను ఆసరాగా చేసుకుని ఉపన్యాసం ఇచ్చేవారు.ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఒక ఎత్తైన ఉపన్యాస వేదిక (మెంబర్) తయారు చేయబడినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై ఎక్కి ఉపన్యాసం ఇచ్చారు, అపుడు అంతవరకు తనను ఆసరాగా చేసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తూ ఉండిన చెట్టు కొమ్మ చిన్న పిల్లవాడిలా ఏడుస్తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని కౌగిలించుకునే వరకు అది అలా ఏడుస్తూనే ఉంది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దానిని కౌగిలించుకున్న తరువాత, అది శాంతించింది మరియు ఏడుపు ఆపింది.
ఈ హదీసును ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనస్ ఇబ్నె మాలిక్, జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్, అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్, అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్, ఉబై ఇబ్నె కఅబ్, అబూ సయీద్, సహ్ల్ ఇబ్నె సఅద్, ఆయిషా బిన్తే అబీ బక్ర్, మరియు ఉమ్మె సల్మా మొదలైన వారు ఉల్లేఖించారు.
ఇలా౦టి అద్భుత స౦ఘటనను నివేది౦చడ౦లో సమిష్టిగా అబద్ద౦ చెప్పడానికి, అక్కడ దానిని ప్రత్యక్షంగా చూసిన అనేకమ౦ది సహచరులు ఏకగ్రీవ౦గా ఒప్పుకు౦టారా?
అంతేకాదు వాస్తవానికి ఆయన చేసిన కొన్ని అద్భుతాలను వేల మంది సహాబాలు చూశారు, (ముతావతీర్) హదీసులో ఉదహరించబడినట్లుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన చేతి వేళ్ల మధ్య నుండి నీటి ఊట ప్రవహించింది ఆ నీటి ద్వారా ఒక వేయి అయిదు వందల మంది సహచరులు ఉదూ చేసుకుని, కడుపు నిండా త్రాగారు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
మరొక అద్భుత సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్ది మొత్తంలో ఉన్న ఆహారాన్ని తన భారీ సైన్యానంతటికీ తినిపించారు. దీనిని అనేక మంది సహచరుల ఉల్లేఖనలలో నివేదించబడింది. ఒక్క అల్-బుఖారీ గ్రంథంలోనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఆహారం ఎన్నో రెట్లు ఎక్కువైన అద్భుతాన్ని ఐదు చోట్ల ఉదహరించారు.[13]
బుఖారీ (1217), బుఖారీ (2618), బుఖారీ (3578), బుఖారీ (4101), బుఖారీ (6452). ఇవన్నీ బుఖారీలో మాత్రమే ఉన్న వేర్వేరు భిన్నమైన సంఘటనలు మరియు వాస్తవాలు
సత్యం యొక్క రుజువులు అనేక సార్లు నిరూపితమయ్యాయి మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వాన్ని ధృవీకరించే అద్భుతాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా తెలివిగల వ్యక్తి వీటన్నింటిని అబద్ధమని ఎలా కాదనగలడు?
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క అద్భుతాలలో నుండి మరికొన్ని ఉదాహరణలు:
ఆయన (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ఆయనపై కురుయుగాక) ఒక రాత్రి సమయంలో బలమైన గాలి వీస్తుందని ముస్లింలకు చెప్పారు మరియు ప్రజలను బయట నిలబడ వద్దని నివారించారు. అయినా (ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట వినకుండా) ఒక వ్యక్తి లేచి నిలబడగా, గాలి అతడిని సుదూరమైన ప్రదేశంలోకి విసిరి వేసింది. [23]
సహీహ్ ముస్లిం హదీసు: 3319
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నజాషీ రాజు మరణించిన రోజునే అతని మరణ వార్త ప్రజలకు తెలియజేశారు. మరియు అతనిపై నాలుగు తక్బీర్లు పలికారు అనగా (అతని జనాజా సలాహ్ పూర్తి చేశారు).[15]
సహీహ్ బుఖారీ హదీసు: 1333
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్, ఉస్మాన్, అలీ, తల్హా, మరియు జుబేర్ రదియల్లాహు అన్హుమ్'ల షహాదత్ (వీరమరణం) గురించి మరియు ఇతర ప్రజల వలె వారు పడకలపై మరణించరు." అని ముందుగానే తెలియజేశారు.
ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బకర్, ఉమర్, 'ఉస్మాన్, 'అలీ, తల్హా, మరియు జుబేర్ లతో కలిసి పర్వతం పై ఎక్కారు. ఒక బండ రాయి కదిలింది; అప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పర్వతాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు: "ప్రశాంతంగా ఉండు, ఎందుకంటే నీపై ప్రవక్త, సత్యాన్ని ధృవీకరించే వ్యక్తి మరియు షహీద్ (అమరవీరుడు) ఉన్నారు. [16]
సహీహ్ ముస్లిం హదీసు : 2417
కావున ఆయన తనను తాను ప్రవక్తగా మరియు అబూబకర్ ను సత్యవంతునిగా మరియు మిగిలిన వారు అమరగతి పొందుతారని దృవీకరించారు. కొన్నాళ్ళకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగానే జరిగింది.
దాదాపు 150 హదీసులలో నమోదు చేయబడిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో దుఆ చేయగా, ప్రజలు చూస్తుండగానే వారి దుఆ వెంటనే స్వీకరించబడింది. [17]
ఈ హదీసులను సయీద్ బిన్ అబ్దుల్ ఖాదిర్ బాషన్ఫర్ తనపుస్తకము దలాయిలున్నుబువ్వ మరియు దారె ఇబ్నె హజమ్ రచించిన పుస్తకము నుండి సేకరించారు.
మక్కా ప్రజలు తమకు ఒక అద్భుత సాంకేతాన్ని చూపించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగినప్పుడు, ఆయన వారికి చంద్రుడిని రెండు భాగాలు చేసి చూపించారు, వారు హీరా పర్వతాన్ని ఆ రెండు భాగాల మధ్యలో నుండి చూశారు. ఇది అత్యధిక స్థాయి ప్రామాణికతను కలిగి ఉన్న సామూహికంగా ఉల్లేఖించబడిన హదీసులో నివేదించబడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం మరియు ఈద్ వంటి ప్రధాన సమావేశాలలో, ప్రజలు ఆయన అద్భుతాలను గురించి వినడానికి చంద్రుడిని విడదీసే అద్భుతం గురించి ప్రస్తావించబడిన సూరతుల్ ఖమర్ ను పఠించేవారు. ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వపు సత్యానికి నిదర్శన౦గా ఉదహరి౦చబడి౦ది.
అదేవిధంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆదాము అలైహిస్సలాం సకల జీవరాశులలో చివరి సృష్టి అని కూడా తెలియచేశారు: "మరియు శుక్రవారం నాడు అస్ర్ తరువాత చివరి సృష్టిగా ఆదాము సృష్టించబడ్డాడు". [18]
సహీహుల్ జామీ: 8188
ఈ శాస్త్రీయ సైన్స్ వాస్తవం ఇప్పుడు నిర్ధారించబడింది, అయితే మరి మొక్కలు మరియు జంతువులు కనబడిన తర్వాత భూమిపై కనిపించిన చివరి జీవి ఆదమ్ అలైహిస్సలాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలా తెలుసు?
సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కును పరిశీలించండి:
{మేము రేయింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రిని మేము కాంతిహీనంగానూ, పగటిని మేము కాంతివంతంగానూ చేశాము.} {12}
సూరతుల్ ఇస్రా
రాత్రికి సంకేతమైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉండేవాడని, అప్పుడు దాని కాంతి క్షీణించినదని ఈ ఆయతు పేర్కొంది.
సహాబాలు ఈ ఆయతుకు చేసిన వ్యాఖ్యానాన్ని ఇమామ్ ఇబ్న్ కసీర్ తన తఫ్సీర్ లో ఇలా పేర్కొన్నారు: "అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపారు : "చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించేవాడు, అయితే అది రాత్రికి సంకేతంగా కాబట్టి చీకటి ఏర్పడింది.
ఆశ్చర్యకరంగా, ఈ రోజు సైన్స్ చేరుకున్న తుది అభిప్రాయం కూడా ఇదిే. నాసా తన అధికారిక వెబ్ సైట్ మరియు ఛానల్ లో ఇలా ప్రచురించింది: చంద్రుని ప్రారంభ శకంలో అది కాంతిమంతంగా మరియు ప్రకాశవంతంగా ఉంది. [19]
http://www.nasa.gov/mission_pages/LRO/news/vid-tour.html https://www.youtube.com/watch?v=UIKmSQqp8wY
ఈ అద్భుతాలు జరిగాయని, భూమి మరియు ఆకాశాల అసంఖ్యాకమైన భవిష్యత్తు విషయాలు, రహస్యాలు ఒకే వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడ్డాయి మరియు ఖుర్ఆన్ ఆయన పై అవతరించింది, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మునుపటి ప్రవక్తలు తీసుకువచ్చిన అదే సందేశంతో వచ్చిన వ్యక్తి అని సామూహిక ఉల్లేఖనల ద్వారా రుజువు చేయబడింది. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సహాయము పొందాడు మరియు ధర్మాన్ని (షరీయా) పరిపూర్ణం చేసిన తరువాతే ఈ ప్రపంచాన్ని వీడారు.
ఆయన ప్రవక్త అని నిర్ద్వంద్వ౦గా ధృవీకరి౦చడ౦ సహేతుకమైన చర్య.
అగోచర విషయాలకు సంబంధించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచనలు వెయ్యికి పైగా ఉన్నాయి.
ఆ అద్భుతాలను నివేదించిన వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ప్రజలందరిలో అత్యంత సత్యవంతులు మరియు నీతిమంతులు.
ఆశ్చర్యకరమైన విషయమేమిట౦టే, తొలికాలపు సహాబాలు ఆ అద్భుతాలు చూడకము౦దే ఇస్లా౦ స్వీకరి౦చారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యవంతుడని మరియు ఎప్పుడూ అబద్ధం చెప్పడు అని వారికి తెలుసు.
తొలికాలపు సహాబాల వైఖరి ఎంతో వివేకవంతమైనది. ప్రవక్త యొక్క నిజాయితీ, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంప్రవక్తత్వం యొక్క సత్యానికి తగినంత సాటిలేని రుజువు. నిజానికి, తాను ప్రవక్తనని చెప్పుకునే వ్యక్తి సత్యవ౦తుడు, ఎ౦దుక౦టే ఆయన నిజమైన ప్రవక్త, ప్రవక్తలు ప్రజలలో అత్య౦త సత్యవ౦తులుగా ఉ౦టారు;
లేదా అతను ప్రజలలో అత్యంత అబద్దీకుడు కావచ్చు , ఎందుకంటే అతను అత్యంత ప్రాముఖ్యత ఉన్న విషయాలలో అబద్ధాన్ని కల్పిస్తున్నాడు.
మిక్కిలి నిజాయితిపరులు అత్యంత అసత్యవంతులతో అస్సలు కలవరు కానీ అత్యంత అజ్ఞానులు తప్ప. [20]
సుబూతున్నుబువ్వాతి 'అక్లన్ వ నక్లన్, ఇబ్న్ తయ్యిమియాహ్ చే, దార్ ఇబ్న్ అల్-జావ్జీచే ప్రచురింపబడినది (పుట 573); మరియు అదే పుస్తకంలోని 318 పేజీలో ఇదే విధమైన పదాలు ఉన్నాయి.
ప్రజలలో అత్య౦త సత్యవ౦తుడు మరియు అత్య౦త అసత్యపరుడి మధ్య తేడాను గుర్తి౦చడ౦ ఒక జ్ఞానవ౦తుడి కొరకు ఎ౦తో సులభం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏనాడు అబద్దం పలకలేదు, ఈ విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడిన మొదటి దినం నుండే ముష్రికులు సైతం అంగీకరించారు. వారు ఆయనతో ఇలా పలికారు : "మీరు అబద్దం పలికిన సందర్భం మాకు ఎన్నడూ ఎదురు కాలేదు". [21]
సహీహ్ బుఖారీ హదీథు సంఖ్య : 4971
ఇస్లాం స్వీకరించక పూర్వం అబూ సుఫ్యాన్ ను, హెర్క్యులస్ ఇలా అడిగాడు: "అతను (ఇస్లాం సందేశం) గురించి చెప్పడానికి ముందు అతను అబద్ధం చెప్పాడని మీరు ఎప్పుడైనా ఆరోపించారా?
అబూ సుఫ్యాన్ 'లేదు' అని సమాధానమిచ్చారు.
ఆ తర్వాత హెర్క్యులస్ ఇలా అన్నాడు: "ప్రజల విషయంలో అబద్ధాలు చెప్పని అతను, అల్లాహ్ విషయంలో అబద్ధాలు ఎలా చెప్పగలడు."
ఆ తర్వాత, హెర్క్యులస్ అన్న మాట సుప్రసిద్ధమైనది ఇలా తెలిపాడు: "ఒకవేళ నేనే గనక అతని వద్ద ఉంటే, అతని పాదాలు కడిగేవాడిని." [22]
సహీహ్ బుఖారీ హదీథు సంఖ్య: 7
అవిశ్వాసులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి జీవితంలో ఒక్క అబద్ధాన్ని పలికినట్లు కూడా ఋజువు చేయలేకపోయారు, మరియు ప్రవక్తగా ఎంచుకోబడక పూర్వం నుండీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్థితి గురించి వారికి బాగా తెలిసినప్పటికీ వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పై అవిశ్వాసం చూపారు అందుకే ఖుర్ఆన్ వారిని తీవ్రంగా విమర్శించింది. పరమ పవిత్రుదనడైన మన ప్రభువు ఇలా ప్రకటించాడు
{లేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?} {69}
సూరతుల్ మోమినూన్
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పరిస్థితి మరియు ఆయన జీవిత చరిత్ర ఆయన ఒక సందేశహరుడు అనటానికి ఒక సంపూర్ణ స్వతంత్రమైన రుజువు.
అల్లాహ్ ఆయనపై శుభాలను, శాంతిని కురిపించు గాక!
సాధారణంగా నిజాయితీకి గల కారణాలన్నీ పరస్పరం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వాన్ని సమర్ధిస్తున్నప్పుడు జ్ఞాన వంతుడైన వ్యక్తి వీటన్నింటినీ ఎలా తిరస్కరించగలడు?
26- నేను అల్లాహ్ ను విశ్వసించాల్సిన అవసరం ఉందని నాకు ఎలా తెలుస్తుంది?
జవాబు: మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు పరీక్షించబడ్డారని మీకు తెలుస్తుంది. సరైనది చేయమని, తప్పు చేయవద్దని తెలిపే భావన మీలో కలుగదా?
మీ ఎదురుగా డబ్బు పడి ఉంది, దాని యజమాని ఎటువైపో చూస్తూ ఉంటే లేదా ఏదో పనిలో నిమగ్నమైన ఉంటే, మీరు ఆ డబ్బును తీసుకొని, స్వీయానికి వాడుకోవాలనే ఆలోచన మీలో కలగ వచ్చు. లేక అలా దొంగలించటం నిషేధం మరియు నేరం అనే వ్యతిరేక భావన మీలో కలగవచ్చు.
మీ జీవితంలోని ప్రతి సందర్భంలో మీరు పరీక్షించబడతారు.
అయితే చేయాలా - వద్దా అనే భావన మీలో మాటిమాటికీ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే, మీరు నిజంగా పరీక్షించబడుతునే ఉన్నారు మరియు మిమ్మల్ని సృష్టికర్త నిర్లక్ష్యంతో అలా ఊరికే వదిలి వేయలేదు. మీరు విలువ లేని పనికిమాలిన వస్తువు కాదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడు కావచ్చు!}{3}
సూరతుల్ ఇన్సాన్
'చేయలా - వద్దా' అనే భావన కలిగి ఉండటం అంటే మానవుడు తన జీవితంలోని ప్రతి అంశంలో కృతజ్ఞత కలిగి ఉంటాడని లేదా కృతఘ్నుడుగా ఉంటాడని అర్థం.
బదులుగా, తన జీవితంలోని ప్రతి అడుగులో, అతను మంచి చేయవచ్చు లేదా చేయకపోవచ్చు, అనగా అతను మస్జిదుకు వెళ్లవచ్చు లేదా ఆటపాటల్లో, తమాషాలలో పాల్గొనవచ్చు.
సర్వోన్నతుడు గౌరవప్రదాత అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}{56}
సూరతు అజ్జారియాత్
అడుగడుగున, మీరు పరమ పవిత్రుడు అయిన అల్లాహ్ కు విధేయతను లేదా అవిధేయతను కలిగిఉంటారు.
కాబట్టి, అల్లాహ్ ఆజ్ఞకు లోబడి ఆచరించినవాడు రక్షింపబడ్డాడు మరియు ఆయన ఆజ్ఞలకు ఆవిధేయత చూపినవాడు తప్పు చేస్తున్నట్లే.
ఈ ఎంపిక ఫలితం మనిషి తన కర్మలన్నింటికి స్వయంగా తనకు తానే బాధ్యత వహిస్తాడని సూచిస్తుంది.
మనం సృష్టించబడటానికి గల అసలు ఉద్దేశ్యం పరీక్షించబడటం మరియు సత్యశోధన, సత్యాన్వేషణ చేయటమే. దాని కొరకే అల్లాహ్ తన ప్రవక్తలను పంపి, తన గ్రంథాలను అవతరింపజేసినాడు.
{నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము,[ప్రజలారా ]కేవలంఅల్లాహ్'ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి'} {36}
సూరతున్నహల్
మరియు మరణంతోనే మన పరీక్షలు ముగుస్తాయి తర్వాత, మనము అల్లాహ్ వద్దకు తిరిగి చేరుకుంటాము, {మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే.} {22}
{మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని};{42}
సూరతున్నజమ్
{నిశ్చయంగా (అందరూ) మరలిపోవలసింది నీ ప్రభువు వైపే.}{8}
సూరతుల్ అలఖ్
మనం చేసిన కర్మల లెక్క ఇవ్వుటకు అల్లాహ్ వద్దకు తిరిగి వస్తాము.
{మరియు నిశ్చయంగా అతని కృషిని అతి త్వరలో చూపించబడుతుంది.}{40}
{అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని};{41}
సూరతున్నజమ్
మీరు చేసిన కర్మలను మీరు చూస్తారు మరియు వాటికి మీరు బాధ్యులు అవుతారు.
{మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.} {7}
{మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.} {8}
సూరతు అజ్జల్ జలహ్
27-ప్రవక్తలను విశ్వసించకుండా, కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసిస్తే సరిపోతుందా?
జవాబు: లేదు, ముమ్మాటికీ సరిపోదు.
ప్రవక్తలను విశ్వసించకుండా అల్లాహ్ ఉనికిని విశ్వసించడం అల్లాహ్ కొరకు ముస్లింగా ఉండటానికి సరిపోదు. అల్లాహ్ సృష్టికర్త, పోషకుడు, వ్యవహారకర్త అని విశ్వసించి ఆ తరువాత ఆయన దివ్యవాణిని మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించడం యొక్క అర్ధం ఏమిటి?
ఇది ఘోరాతి ఘోరమైన అవిశ్వాసం.
అంతేకాదు, అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించడం కంటే ఘోరమైన అపరాధం ఏదీ లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ -}{150}
{ఇలాంటి వారే - నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.}{151}
సూరతున్నిసా
అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించేవాడే నిజమైన అవిశ్వాసి.
ప్రవక్తలలో ఒకరిని నమ్మనివాడు, వాస్తవానికి అతను అల్లాహ్ ను నమ్మడు, ఎందుకంటే అతను అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించాడు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వాన్ని నిరాకరించడం వల్ల గ్రంథ ప్రజలైన - యూదులు మరియు క్రైస్తవులు - అవిశ్వాసులయ్యారు.
{నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.}{6}
సూరతుల్ బయ్యినహ్
వారు అగ్నిలో విసిరివేయబడతారని అల్లాహ్ హెచ్చరించిన మాట వాస్తవమే, {దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది.} సూరతు ఖాఫ్ {14}
అల్లాహ్ సృష్టికర్త, పోషకుడు, ప్రాణం పోసేవాడు మరియు ప్రాణం తీసేవాడు అని మాత్రమే అంగీకరించడం ద్వారా ఒకరు ముస్లిం కాలేరు లేదా మోక్షాన్నీ పొందలేరు. అయితే, దాని కొరకు ఆయన ప్రవక్తలను కూడా తప్పకుండా నమ్మాలి.
కాబట్టి అల్లాహ్ ఉనికిపై విశ్వాసం మరియు ప్రవక్తల పట్ల అవిశ్వాసం అనేది ఎంత మాత్రమూ సరైనదికాదు, మరియు దీని వలన ప్రళయ దినమున అల్లాహ్ వద్ద దాసునికి ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించాలి మరియు ఆయన ప్రవక్తలందరినీ తప్పకుండా విశ్వసించాలి.
అల్లాహ్ ఉనికిపై విశ్వాసం ఒక్కటే సరిపోతే అల్లాహ్ తన ప్రవక్తలను పంపించేవాడే కాదు మరియు తన గ్రంథాలను అవతరించేవాడే కాదు. ఎందుకంటే మానవులందరూ తమ సహజ స్వభావం ద్వారా అల్లాహ్ ను గుర్తిస్తారు.
నిన్ను సృష్టించి, మార్గనిర్దేశం చేసి, మీకు జీవనోపాధిని అందిస్తున్న అల్లాహ్ మాత్రమే తన సందేశహరులు మరియు ప్రవక్తల ద్వారా అవతరింపజేసిన దివ్యసందేశంలో తెలిపిన విధంగా సకల ఆరాధనలకు అర్హుడు.
28 - ఒక అవిశ్వాసి తను చేసిన మంచి పనులకు బదులుగా అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందుతాడా?
జవాబు: మంచి పనులు చేయడం అనే సహజ స్వభావం పైనే అల్లాహ్ మనుషులను సృష్టించాడు. కాబట్టి, అవిశ్వాసి అయినప్పటికీ లేదా బహుదైవారాధకుడు అయినప్పటికీ ఏ వ్యక్తి అయినా సరే ధర్మబద్ధమైన మంచి పనులు చేయవచ్చు. ప్రజలందరూ వారు సృష్టించబడిన సహజ స్వభావం కారణంగా మంచి పనులు చేస్తారు.
అయితే, ఒక సత్కార్యం ఆమోదించబడడానికి ప్రధాన షరతు ఏమిటంటే అది కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేసినదై ఉండాలి, అంటే అల్లాహ్ నుండి దాని ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసినదై ఉండాలి.
కాబట్టి, అల్లాహ్ ను విశ్వసించని వ్యక్తితో మరియు అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్ళను ఆరాధించే వ్యక్తితో, మేము ఇలా అంటాము: మీరు మీ మంచి పనుల కొరకు అల్లాహ్ తో పాటు మీరు భాగస్వాములుగా చేసిన వారి వద్దకు వెళ్లి, వారి నుండి మీ ప్రతిఫలాన్ని పొందండి. ఎందుకంటే మీరు అల్లాహ్ ను మాత్రమే సంతోషపెట్టడానికి మంచి పనులు చేయలేదు గనుక.
ఉపమానంగా ఒక వ్యక్తి గురించి ఊహించండి - అతని కుటుంబమే అతనిని పోషించింది మరియు అతను ఒక బలమైన యువకుడిగా మారే వరకు అతనిపై ఖర్చు పెట్టింది. ఆ తర్వాత అతను తన కుటుంబీకులకు సేవ చేయకుండా ఇతరులకు సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. మరి, ఇతరులకు సేవ చేసినందుకు గాను నాకు వేతనం చెల్లించండి అని తన కుటుంబం వద్దకు తిరిగి వెళ్ళి అడిగే హక్కు అతనికి ఉంటుందా?
అతను ఎవరికి సేవ చేసాడో వారి వద్దకు వెళ్లి వారి నుండి తన వేతనాన్ని పొందనివ్వండి.
మరియు ఈ విషయంలో అల్లాహ్ ఒక అత్యున్నతమైన ఉదాహరణ.
అల్లాహ్ మిమ్మల్ని సృష్టించి, మిమ్మల్ని పోషించి మరియు మీపై అన్ని అనుగ్రహాలు కురిపించినప్పటికీ, మీరు ఆయనను ఆరాధించకుండా విడిచిపెట్టి, మీ పనులకు ప్రతిఫలాన్ని ఆయన నుండి పొందాలని కోరుకుంటున్నారా? అది ఎలా సాధ్యం?
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.}{23}
సూరతుల్ ఫుర్'ఖాన్
పరమపవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు}{39}
సూరతున్నూర్
అవిశ్వాసులు ఒకవేళ నీతిమంతులు అయినప్పటికీ, తమ కర్మలకు ప్రతిఫలం పొందేందుకు అర్హులు కారు. ఎందుకంటే, ఆ అవిశ్వాసులు తమ ధర్మబద్ధమైన పనుల ద్వారా తమ ప్రభువు నుండి ప్రతిఫలాన్ని పొందాలని లేదా తమ సృష్టికర్త యొక్క ప్రసన్నతను పొందాలని గానీ సంకల్పించుకోలేదు.
కాబట్టి, కేవలం మంచి పని చేసినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే మనమందరం ఎన్నో మంచి పనులు చేయడానికి సహజంగా తయారు చేయబడ్డాము. అయితే, మీరు ఈ మంచి పని ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేదే అసలు ప్రశ్న - మీరు ఆ మంచి పనిని మీ స్వంత ప్రయోజనాల కోసం చేస్తున్నారా లేక మీరు ఆడంబరంగా ఇతరుల ముందు ప్రదర్శించేందుకు చేస్తున్నారా లేదా అల్లాహ్ కోసం కాకుండా మరొకరి కోసం చేస్తున్నారా?
ఇదంతా అల్లాహ్ కోసం చేసినది కాదు; కాబట్టి, ఈ మంచి పనులకు అల్లాహ్ నుండి ఎటువంటి ప్రతిఫలం లభించదు. అల్లాహ్ కొరకు చేసే మంచి పనుల కొరకు మాత్రమే ఆయన నుండి ప్రతిఫలం ఆశించబడుతుంది.
29 - ఒకవేళ ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మం అయితే, దాని గురించి అపోహలు ఎందుకు ఉన్నాయి?
జవాబు: ఇస్లాం గురించిన అపోహ అనేది ఒక ముస్లిం అర్థం చేసుకోలేని సమస్య. దానికి సమాధానం కనిపెట్టే వరకు అది అతనిని గందరగోళానికి గురి చేస్తుంది.
ఇస్లాం యొక్క కొన్ని ద్వితీయ అంశాలలో కొన్ని అస్పష్టమైన విషయాలు ఉండాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సంకల్పించి ఉంటాడు. తద్వారా అసత్యవాదులు వాటి కారణంగా తమ ప్రభువుకు విధేయత చూపడంలో ముందడుగు వేయరు.
సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} {7}
సూరతు ఆలె ఇమ్రాన్
హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్) వెంట పడి: హృదయాలలో వక్రత ఉన్న వారు ఫిత్నాను కోరుతూ, అల్లాహ్ కు దూరంగా ఉంటూ ఇలాంటి అపోహలను అనుసరిస్తారు.
తన వివేకం ద్వారా అల్లాహ్, ప్రజలలో విశ్వాసం మరియు అవిశ్వాసం ఉండాలని సంకల్పించాడు.
{మీలో కొందరు అవిశ్వాసులు మరియు మీలో మరికొందరు విశ్వాసులు}{2}
సూరతు తగాబూన్
అవిశ్వాసంలో మునిగిపోయిన వారు ఈ దురభిప్రాయాలతో ముడిపడి ఉంటారు మరియు వారిని ఈ అపోహలు వారి అసలు మతం, ప్రార్థనలు మరియు విశ్వాసానికి దూరంగా ఉంచుతాయి.
ఇక విశ్వాసి విషయానికొస్తే, అతను సత్యధర్మం యొక్క ప్రామాణికత మరియు దివ్యసందేశం (ఉమ్ముల్ కితాబ్ ఖుర్ఆన్) యొక్క ప్రామాణికతల కొరకు ఖచ్చితమైన ఆధారాలను అనుసరిస్తాడు. అతను అర్థం చేసుకోనిది ఏదైనా ఎదురైతే, అతను (పండితులను) దాని గురించి అడుగుతాడు, కానీ అతను అర్థం చేసుకోలేని విషయం కారణంగా తన ధర్మం లేదా ప్రార్థన నుండి ఎప్పటికీ దృష్టి మరల్చడు.
తమ హృదయాలలో రోగం ఉన్నవారు మాత్రమే తాము అర్థం చేసుకోని విషయం వలన తమ ధర్మం నుండి దారి తప్పుతారు, పరధ్యానంలో పడిపోతారు.
{ఇంకా – హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, “ఇంతకీ ఈ దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు?” అని చెప్పటానికి కూడా (మేము ఈ విధంగా చేశాము). ఈ విధంగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు, తను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.}{31}
సూరతు అల్'ముద్దస్సిర్
ఈ అస్పష్టమైన విషయాల కారణంగా, జ్ఞానం మరియు అంతర్దృష్టి ఉన్న వ్యక్తులు వేర్వేరు స్థానాలు కలిగి ఉంటారు. అంటే జ్ఞానం ఉన్నవాడు అటువంటి అస్పష్టమైన విషయాలకు సమాధానం తెలుసుకుని, విశిష్టతను కలిగి ఉంటాడు. ధర్మం గురించి లోతైన జ్ఞానం లేని, లేదా దానిని సరిగ్గా అధ్యయనం చేయని సాధారణ వ్యక్తి అలాంటి ధర్మం జ్ఞానం కలిగిన వ్యక్తికి భిన్నంగా ఉంటాడు. కాబట్టి, జ్ఞానం ఉన్నవారి స్థాయిని అల్లాహ్ పెంచుతాడు.
నిజం చాలా స్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ అపోహలు కూడా అవసరమే. వీటి ద్వారా విశ్వాసుల విశ్వాసం (ఈమాన్) ధృవీకరించబడుతుంది.
అల్లాహ్ తన సృష్టిలో ఏర్పాటు చేసిన నియమావళి విధి, మరియు విధిలో ఆయన చేసిన ఏర్పాటు కొంత జ్ఞానాన్ని గోప్యంగా ఉంచడం. రహస్యంగా మరియు నిగూఢంగా ఉన్నవాటిని ఊహించడానికి తనకు తెలిసిన దానిని ఉపయోగించుకునే వ్యక్తి విజయవంతమవుతాడు, మరియు విజయవంతం కానివాడు తన అజ్ఞానాన్ని ఒక ముసుగుగా చేసుకొని, తన జ్ఞానాన్ని తనకు తెలియని వాటిని ఊహించడానికి ఆటంకంగా మార్చుకుంటాడు.
30. అల్లాహ్ చెడును ఎందుకు సృష్టించాడు? లేదా మరో మాటలో చెప్పాలంటే, ఒక ముస్లిం "చెడు" అనే చిక్కు సమస్యకు ఎలా ప్రతిస్పందించగలడు?
జవాబు: చెడు యొక్క సమస్య, దాదాపు పూర్తి చరిత్రలో నాస్తికత్వానికి ప్రధాన కారణం.
{మరియు ప్రజలలో కొందరు అంచున నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే!}{11}
సూరతుల్ హజ్
తమకు ఎదురయ్యే పరీక్ష, బాధ లేదా విపత్తు కారణంగా అల్లాహ్ ను నమ్మని వారు కూడా ఉన్నారు.
ఇక్కడ, ఒక నాస్తికుడు తరచుగా అడిగే ప్రశ్న: మొట్టమొదట అసలు చెడు ఎందుకు ఉంది?
దీనికి సులభమైన సమాధానం: ఎందుకంటే మనం ధార్మిక విధి (నియామకం)లో ఉన్నాము కాబట్టి.
మనం పరీక్షల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి.
పరిశుద్ధుడైన మన ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు:
{మరియు మేము మిమ్మల్ని చెడు మరియు మంచితో పరీక్షిస్తాము, విచారణ కొరకు.}{35}
సూరతుల్ అంబియా
నీవు ధర్మ నియమకానికి కట్టుబడి ఉండటం వలన మంచి మరియు చెడులను ఎదుర్కొంటావు, మరియు ఇదే నీ ఉనికి వెనుక నున్న అసలు ఉద్దేశ్యం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.}{2}
సూరతుల్ ముల్క్.
చెడు మరియు పరీక్షలు, విపత్తుల ఉనికి, స్వయంగా సత్యధర్మం యొక్క ప్రామాణికతకు నిరూపణ మరియు నాస్తికత్వం యొక్క లోపానికి గొప్ప సాక్ష్యం.
మనం భౌతిక ప్రపంచం యొక్క (material world) సంతానమైతే (అంటే ఇహలోకమే మన సర్వస్వమైతే), మనం మంచి, చెడులను అర్థం చేసుకోలేము.
ఒకవేళ విశ్వమంతా అర్థరహితమైనదైతే, అది అర్థరహితమైనదని మనం అస్సలు గ్రహించలేము.[23] ఎందుకంటే నాస్తిక దృక్పథం ప్రకారం కఠినమైన భౌతిక అవసరాలను మనం అనుసరిస్తాము మరియు ప్రకృతి నియమాలు మనకు వర్తిస్తాయి. మరి, అలాంటప్పుడు, మనం చెడు యొక్క సారాంశాన్ని లేదా 'చెడు' అనే పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోలేము.
C. S. Lewis (సి.యస్.లూయిస్)
కాబట్టి, అత్యంత అధునాతన జంతువులు చెడు యొక్క వైరుధ్యాన్ని గ్రహించగలవా?
వాస్తవానికి, చెడును అర్థం చేసుకోవడం అంటే మనం ఈ భౌతిక ప్రపంచ వనరులం కాదు మరియు డార్విన్ భౌతికవాద ఉనికి యొక్క సిద్ధాంతం నుండి కాకుండా మరొక సిద్ధాంతం నుండి చెడు ఉనికి గురించి మన అవగాహనను పొందడం.
మనం దైవిక సిద్ధాంతానికి చెందినవారమే గానీ, దానికి భిన్నంగా భౌతికవాద, ప్రాపంచిక నాస్తిక నమూనాకు చెందిన వారం ఎంతమాత్రమూ కాదు మరియు ఇదే మనం చెడును ఎందుకు అర్థం చేసుకున్నామో తెలిపే వివరణ.
మనపై ధార్మిక బాధ్యతలు మోపబడినంత కాలం, పరీక్షలు మరియు బాధలు ఉండటం సహజం మరియు చెడు యొక్క అర్ధాన్ని మనం గ్రహించడం సహజం.
చెడు, కొంత నొప్పి మరియు అవిధేయతకు పాల్పడటం అనేది సహజమైనది మరియు స్వీయ-సాక్ష్యం. ఇది స్వేచ్ఛా సంకల్పం మరియు దైవిక నియామకం యొక్క ఫలితం.
చెడు, బాధ, విపత్తులు మరియు కోరికల ఉనికి మంచి వ్యక్తి యొక్క ఉత్తమమైన స్వభావాన్ని మరియు అవినీతిపరుడైన వ్యక్తి యొక్క నీచ స్వభావాన్ని వెల్లడిస్తుంది.
చెడు ఉంది కాబట్టి నాస్తికులు సృష్టికర్త ఉనికిని తిరస్కరించడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం; తమ వాదనకు సమర్ధనగా వారు క్రింది విశ్లేషణను ఉపయోగిస్తారు:
1 - ఒకవేళ తండ్రి దయగలవాడై ఉండి, తన కుమారుని ఎంతో ప్రేమించే వాడైతే (అతడి కష్టాన్ని భరించని వాడైతే), చికిత్స కొరకు సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా తన కుమారుడికి బాధాకరమైన ఇంజెక్షన్ ఇవ్వడానికి అతను ఎందుకు అనుమతిస్తాడు?
2 - ఇంజెక్షన్ వల్ల అతడి కుమారుడు నొప్పితో బాధపడడా?
3-అలాంటప్పుడు, తండ్రి ఉనికిలో ఉండడు.[24]
[33]అసస్ గాయిబ్, ము. అహ్మద్ హసన్, మర్కజ్ దలాయిల్ బితశరఫ్ పుస్తకం నుండి.
మరి, ఇది సమంజసంగా, కనబడుతున్నదా?
అంతేకాక, మంచి మరియు చెడులలో ఇమిడి ఉన్న దైవిక జ్ఞానం యొక్క అన్ని సూక్ష్మబేధాలు మనకు అర్థం కాకపోవడం సహజం.
అల్లాహ్, మూసా (అలైహిస్సలాం)కు ఖిజర్ యొక్క ఆచరణలలోని వివేకాన్ని వెల్లడించాడు, అవి స్పష్టంగా ఆమోదించబడని మరియు తిరస్కరించబడిన చర్యలు అయినప్పటికీ, వాటిలో గొప్ప మేలు ఉంది. అలాగే, మూసా మరియు ఖిజర్ గాధ ఖుర్ఆన్ లో ఉల్లేఖన లేదా కథ రూపంలో పేర్కొనబడలేదు, అది మానవ ఆత్మలోని లోపం మరియు దాని తొందరపాటు తీర్పును అంగీకరించే స్పష్టమైన నిదర్శనంగా ప్రస్తావించబడింది.
చెడు అనే అంశం గురించి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే: ప్రపంచంలో చెడులు లేకుంటే, మీరు పుట్టిన ప్రదేశాన్ని వదిలి వెళ్ళరు!
ఏ నాగరికత ఉండేది కాదు, నగరాలు, కర్మాగారాలు లేదా గృహాలు నిర్మించబడేవి కావు, ఇంకా ప్రజలకు పని అవసరం కూడా ఉండేది కాదు, ఇంకా ప్రజలు వ్యాధిని నిరోధించడం, సమస్యను పరిష్కరించడం లేదా వసతి, సౌఖ్యము, సదుపాయం మొదలైన వాటిని పొందే ఉపాయాల్ని కనిపెట్టడం గురించి ఆలోచించేవారు కారు!
అలాగే ఒక వ్యక్తి అసలు తన జన్మస్థలం నుండి వేరే ప్రాంతానికి మారాల్సిన అవసరమే ఉండేది కాదు.
ఎందుకంటే మనం పరిష్కారాలను వెతకవలసిన చెడు, ఇబ్బంది, బాధ, అలసట మరియు సమస్య కాదు కదా!
కాబట్టి ఎందుకు శ్రమించాలి, ఎందుకు అంత ఆలస్యం వరకు మేల్కొనాలి, మరియు పని చేస్తూ ఎందుకు ఆలోచించాలి?
ఈ ప్రపంచంలో చెడు ఉండటమనేది అత్యవసరం!
కాబట్టి, ఆలోచించండి!
మరియు మనస్సాక్షిగా అల్లాహ్ కు విధేయులుగా ఉండండి, ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఇవ్వబడింది.
చాలా మంది ప్రజలు బాధలు మరియు చెడులను ఎదుర్కోగానే వారు అల్లాహ్ వద్దకు తిరిగి వచ్చి పుణ్యాత్ములుగా మారిపోతారు. మహిమాన్వితుడైన అల్లాహ్, గొప్పవాడు, మరియు సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి.
అల్లాహ్ యొక్క అన్ని ముందస్తు నిర్ణయాలలో (విధివ్రాతలో) వివేకం మరియు శుభం ఉంటుంది.
ఒక ముస్లిం అల్లాహ్ యొక్క అన్ని ముందస్తు నిర్ణయాలను (విధివ్రాతను) విశ్వసించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు:
"అల్లాహ్ మార్గంలో మీరు దానం చేసిన ఉహద్ పర్వతానికి సమానమైనంత బంగారం మీ వద్ద ఉంటే, మీరు దైవిక శాసనాన్ని విశ్వసించే వరకు మరియు మీకు ఏమి జరగాలో అది మీకు జరిగి తీరుతుందని తెలుసుకోనంత వరకు అది (ఆ దానం) మీ నుండి స్వీకరించబడదు; మరియు మీకు ఏమి జరగాలని వ్రాయబడి లేదో, అది మీకు జరగదు; మరియు మీరు దీన్ని కాకుండా మరేదైనా నమ్మి చనిపోతే, మీరు నరకంలోకి ప్రవేశిస్తారు."[25]
సహీహ్ సునన్ అబీ దవూద్, హదీసు: 4699
ఒక ముస్లిం అల్లాహ్ యొక్క విధి నిర్ణయాన్ని దానిలోని మంచి మరియు చెడులను సంపూర్ణంగా అంగీకరించాలి.
వాస్తవానికి, అల్లాహ్ యొక్క విధి నిర్ణయం అంతా శుభమైనదే. వాటిలో కొన్ని బయటికి చెడుగా, ఇబ్బందిగా లేదా హానికరంగా అనిపించినప్పటికీ, చివరికి అవి గొప్ప శుభాన్ని మరియు విస్తృతమైన దైవిక వివేకాన్ని కలిగి ఉంటాయి.
31- గతకాలంలో భూమి పై జరిగిన మత యుద్ధాలకు మతమే కారణమా?
జవాబు: మానవాళి వేల సంవత్సరాలుగా ఏకేశ్వరోపాసన నియమాలతో మరియు నాలుగు వేల సంవత్సరాలు మూడు గొప్ప ఇబ్రహీమీ చట్టాలతో మనుగడ కొనాసాగించింది. కానీ మతం ఎన్నడూ మానవ జాతికి ప్రత్యక్ష ముప్పు కాలేదు. దానికి భిన్నంగా, అది మానవాళికి అత్యున్నత నైతిక విలువలను అందించింది మరియు నిజమైన నాగరికతలను మరింతగా స్థాపించింది. దీనిని విశ్వాసి మరియు నాస్తికుడు ఇద్దరూ అంగీకరిస్తారు. భూమిపై ఉన్న మంచి అంతా ఆ ప్రవక్తల ప్రభావాలలో ఒకటి అని మనం వాదించవచ్చు! మతం వేలాది కేసుల నుండి కోర్టులకు ఉపశమనం కలుగ జేసింది. వీటన్నింటినీ మించి, మతం భూమిపై మానవ ఉనికి ప్రయోజనం కోసం జ్ఞానం, ప్రవర్తన మరియు నైతిక విలువలకు పునాది వేసింది! ఏకేశ్వరోపాసన నియమాలను స్వీకరించిన దేశాలు ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగి ఉన్నా, అవి ప్రత్యర్థులకు కూడా తమ దేశంలో స్థానం ఇచ్చింది మరియు వారికి ఏకేశ్వరోపాసన చట్టాల కింద రక్షణ కల్పించింది. మరోవైపు, కొన్ని దేశాలు నాస్తికత్వానికి చేరువైన వెంటనే, మానవాళి అంతా కేవలం ఒక శతాబ్దంలోనే విధ్వంసం అంచుకు చేరుకుంది! ఇప్పుడు మానవాళికి మతం వల్ల కలిగే ప్రమాదం గురించి మాతో మాట్లాడే నాస్తికులు మన ముందుకు వచ్చారు! ఇంత వరకు నాస్తికత్వం కంటే ప్రమాదకరమైన విధానము మానవ చరిత్ర ముందుకు రాలేదు. నాస్తికుడు లెనిన్ మాజీ సోవియట్ యూనియన్లో చేసిన గులాగ్ మారణకాండలు, నాజీ జర్మనీలో మైనారిటీ జాతుల నిర్మూలన, నాస్తికుడు పాల్ పాట్ ద్వారా కంబోడియన్ జనాభాలో నాలుగింట ఒక వంతు మందిని ఖాళీ చేయించడం, అతి ఘోరమైన సాంస్కృతిక విప్లవంలో నాస్తికుడైన మావో జెడాంగ్ చేతిలో 52 మిలియన్ల చైనీయుల హత్య మరియు ఐరోపాలో లీగ్ ఆఫ్ మిలిటెంట్ నాస్తికుల ఆవిర్భావం దేని ద్వారానైతే అధికారికంగా 42 వేల మత సంస్థలు - చర్చిలు మరియు మసీదులును - మూసివేయబడి, వేలకు వేల మంది ధార్మిక ప్రజలు చంపబడ్డారు. ఇవన్నీ నాస్తికత్వ ఆవిర్భావం యొక్క సహజ పరిణామాలు మరియు ఫలితాలు.[26] ఇంకా, మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు మానవ జాతుల నాస్తిక అవగాహనలు మరియు జాత్యహంకార స్వచ్ఛత కోసం ప్రయత్నించే ఆలోచనలతో నిర్వహించబడిన నాస్తిక యుద్ధాలు. ఫలితంగా ప్రపంచ జనాభాలో దాదాపు 5% మంది వధించబడినారు. ప్రపంచ యుద్ధాలు గెలిచిన మరియు ఓడిపోయిన వారిని ఒక శతాబ్దంలో మూడవ వంతు వెనుకకు నెట్టి, వారి క్షీణతకు కారణమయ్యాయి. తత్వవేత్తలు నాగరికత ముగింపుకు ఉపమానంగా పారిస్ మధ్యలో ఒక మరుగుదొడ్డిని (urinal) ఉంచారు. నాస్తిక పోరాటాలు మొత్తం మానవ జాతిని అనేకసార్లు నిర్మూలించడానికి సరిపడా అణ్వాయుధాల ఆయుధాగారాన్ని మిగిల్చాయి. నిజానికి, ఇరవయ్యవ శతాబ్దపు యుద్ధాలను సింపుల్ గా చదివితే, నాస్తికత్వం ఎంత దుర్భరమైనదో అర్ధమవుతుంది భవిష్యత్తులో జరిగే ఏ యుద్ధంలోనైనా మానవ జాతి అంతరించిపోవడమనేది సరైన ఆలోచన అనీ మరియు నాస్తికవాదం నుండి ఆశించిన ఫలితం అదేననే భావనను నాస్తికత్వం మిగిల్చుతున్నది.
https://en.wikipedia.org/wiki/League_of_Militant_Atheists
32-పాశ్చాత్య దేశాలు ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ముస్లింలు తమ ఏకేశ్వరోపాసనను అనుసరిస్తూ ఎందుకు వెనుకబడి ఉన్నారు?
జవాబు: ఇది నాగరికతకు సంబంధించిన ప్రశ్న!
ప్రవక్తలు ఈ ప్రశ్నలు ఎదుర్కొని చాలా బాధ పడేవారు.
మరియు ఇది చాలా మంది అనుచరులను దూరం చేసింది .
నాగరికత యొక్క ప్రశ్న యుగయుగాలలో సమాజాల అవిశ్వాసానికి మూలం అయినది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది?"}{73}
సూరతు మరియం
సత్యధర్మం యొక్క ఖచ్చితత్వాన్ని నిరూపించే ఋజువులతో కూడిన ఆయతులు పఠించబడినప్పుడు, అవిశ్వాసులు అటువంటి ఆయతులను వ్యతిరేకించడానికి అవిశ్వాస సమాజాల అభివృద్ధిని వాదనగా ఉపయోగించారు.
{ "రెండు వర్గాలలో ఏది నివాసాల పరంగా మంచిది మరియు సామాజిక సమావేశాలలో ఉన్నతమైనది?"}
పరిశోధకుడు ఇబ్రహీం అస్-సక్రాన్ (అల్లాహ్ అతనిని కాపాడుగాక) ఇలా అన్నారు: "ఇది చారిత్రాత్మక నిజం మరియు ఒక నియమం. ఇది యుగయుగాలుగా ఎలా కొనసాగుతోందో ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రవక్తత్వం ఆరంభమైన నాటి నుండి సమాజంలోని అత్యధిక ప్రజలు అల్లాహ్ గురించి సరైన సమాచారం పొందారు. ఇస్లాం సందేశం ఎల్లప్పుడూ "భౌతిక శక్తులను" ఎదుర్కొంటూనే, వాటిని దాటి, ప్రజలు తననే అనుసరించేలా ప్రోత్సహించింది.
ప్రవక్తల అనుభవాలు చూడండి, మీరు దాదాపు అందరు ప్రవక్తలకు మరియు "భౌతిక శక్తుల" ప్రభావానికి మధ్య సంఘర్షణ గురించి వివరించే కథలను మీరు కనుగొంటారు. మతం కోసం పనిచేసే వారందరూ భౌతిక వ్యక్తీకరణల పట్ల ప్రజల మోహం కారణంగా చాలా కష్టాలను అనుభవించారని మీరు కనుగొంటారు. మొదటి ప్రవక్త, నూహ్ (అలైహిస్సలాం) యొక్క ప్రజలు అతనితో అన్ని భౌతిక స్పష్టతలతో ఇలా అన్నారు:
{మరియు మాలో తక్కువస్థాయి వారు తప్ప మిమ్మల్ని అనుసరించే వారిని మేము చూడలేము}{27}
సూరతు హూద్
అప్పుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త మూసా కనిపించగానే, అతని దివ్యసందేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ బలగాల దౌర్జన్యం మరియు దురహంకారాల పరంపర పునరావృతం అయ్యింది.
మూసా ఇలా ప్రార్థించాడు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు ఫిర్ఔన్ కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ! వారిని (ప్రజలను) నీ మార్గం నుండి వారు తప్పించ వచ్చు.(88)
సూరతు యూనుస్
మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇటువంటి పరిస్థితి కొత్తదేమీ కాదు, ఎందుకంటే ఆయన ప్రవక్తత్వాన్ని మరియు దివ్యసందేశాన్ని తిరస్కరించిన వారు, ఆయన నుండి తప్పించుకునేందుకు ఆయన ఆర్థిక బలహీనతను ఒక సాకుగా చూపించారు.
వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"(31)
సూరతుల్ జుఖ్'రుఫ్
ఇబ్రాహీము అస్ సక్రాన్ మాట ముగిసింది.
అన్ని యుగాలలో మరియు ప్రవక్తత్వం యొక్క చరిత్రలో, సత్యతిరస్కారుల ఆర్థిక బలం యొక్క ఆకర్షణ, వ్యామోహం వలన కలిగిన బాధ మానవాళికి దేని ద్వారా కలుగలేదు.
అసలు పురోగతి మరియు సత్యం మధ్య ఎటువంటి సంబంధం లేనప్పటికీను.
వాస్తవానికి, భౌతిక పురోగతి మరియు వెనుకబాటుతనానికి ఎవరు ఒప్పు లేదా ఎవరు తప్పు అనే దానితో సంబంధం లేదు.
ఒక వ్యక్తి సద్గుణవంతుడు కావాలంటే, అతను ఆర్థికంగా అభివృద్ధి చెందిన ధనవంతుడై ఉండవలసిన అవసరం లేదు.
ఒక వ్యక్తి ఇస్లాం బోధనలకు కట్టుబడి ఉన్నా, నిరుపేదగా మరియు సాదాసీదాగా జీవితం గడుపుతూ ఉండవచ్చు లేదా దానికి భిన్నంగా కూడా ఉండవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ దేశపు ప్రజలు అల్లాహ్ యొక్క చట్టం, ధర్మం మరియు దివ్యసందేశం నుండి చాలా దూరంగా ఉన్నారు.
ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు. [9]
సూరతు అర్రూమ్
భౌతిక పురోగతి మరియు ఆర్థిక సంపద ఎవరు సత్యానికి కట్టుబడి ఉన్నారు అనే దాన్ని నిర్వచించడానికి ప్రమాణం కాదు.
ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వపడ్డారు; కాబట్టి వారు దేని గురించి పరిహాసాలాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది.(83)
సూరహ్ గాఫిర్ (మో'మిన్)
కాబట్టి, భౌతిక పురోగతి, ఆర్థిక అభివృద్ధి స్వయంగా ప్రశంసించదగినది కాదు మరియు నిరాకరించదగినది కాదు. దానికి భిన్నంగా, “అది దివ్యసందేశం ద్వారా ఎంతగా కీర్తించబడిందో అంత ఎక్కువగా, దానిలో ధర్మం ఎంత వరకు వర్తింప జేయబడుతుందో అంత ఎక్కువగా, దాని నుండి మీ ధర్మంలో మీరు ఎంత వరకు ప్రయోజనం పొందుతున్నారో అంత ఎక్కువగా, దానిని మీరు అల్లాహ్ కోసం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి మరియు ప్రజల స్థితి మెరుగు పరచడానికి ఎంత వరకు ఉపయోగిస్తున్నారో అంత ఎక్కువగా” అది ప్రశంసించ బడింది.
ఇదే ఆవశ్యకమైన పురోగతి.
మానవుల మధ్య శ్రేష్ఠతకు నిజమైన ప్రమాణం వారి భౌతిక పురోగతితో కాదు, వారి భక్తి మరియు మంచిపనులు. భౌతిక పురోగతి మరియు ఆర్థిక అభివృద్ది ఒక సాధనంగా మాత్రమే గాని అంతిమ ప్రమాణంగా కాదు. అది అల్లాహ్ కోసం ప్రజలకు సేవ చేయడానికి మరియు ప్రయోజనం చేకూర్చడానికి ఒక సాధనంగా మాత్రమే వస్తుంది.
అందువలన, ఇది మాత్రమే ఆవసరమైన భౌతిక పురోగతి, దివ్యసందేశం ద్వారా ప్రశంసించబడింది కూడా ఇదే.
ఇదే భూమిపై నిజమైన వారసత్వం: అల్లాహ్ సేవపై ఆధారపడిన వారసత్వం మరియు జీవితంలోని అన్ని అంశాలలో విశ్వాస సంబంధిత శుద్ధీకరణ యొక్క వారసత్వం.
వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ స్థాపిస్తారు, విధిదానం (జకాత్) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతిలోనే వుంది.(41)
సూరతుల్ హజ్
మరియు ఒక ముస్లిం తాను చేయవలసి ఉన్న పనిని చేస్తే, అల్లాహ్ అతని కొరకు ఈ ప్రపంచంలో శుభము, సంతోషము మరియు పురోగతి మార్గాలన్నీ సులభతరం చేస్తాడని, ఇంకా పరలోక జీవితంలో మోక్షం ప్రసాదిస్తాడని మరియు ఉన్నత స్థాయికి చేరుస్తాడని తెలుసుకోండి.
మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు.(55)
సూరతున్నూర్
ముస్లింలు తమ ధర్మం పై సరిగ్గా ఆచరించిన కాలంలో, వారు మతపరమైన మరియు ప్రాపంచికపరమైన వ్యవహారాలలో నాయకులుగా ప్రసిద్ధి పొందారు.
వారి చేతుల్లో ఇస్లాం ఒక సుప్రసిద్ధ నాగరికతగా 1200 సంవత్సరాలు కొనసాగింది, నేటి కాలంలో అంతరాయం లేకుండా లేదా విరమణ లేకుండా కొనసాగిన సుదీర్ఘమైన నాగరికత అది.
ఇస్లాం, ఇస్లామీయ నాగరికతకు జన్మనిచ్చింది.
ఈ విధంగా, నాగరికతను స్థాపించిన ఏకైక ధర్మం ఇస్లాం,
మిగిలిన మతాలన్నీ కూడా నాగరికతలను స్వీకరించాయి.
ఉదాహరణకు, పాశ్చాత్య నాగరికత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది మరియు భారతీయ నాగరికత హిందూ మతాన్ని స్వీకరించింది.
కాబట్టి, నిస్సందేహంగా నాగరికతను స్థాపించిన ఏకైక మతం: ఇస్లాం.
ముస్లింలు తమ మతానికి సంబంధించి ఏం చేయాలో తెలుసుకున్నప్పుడు, వారు ప్రపంచాన్ని భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించారు.
క్రీ.శ.1453లో ఇస్లాం కాన్స్టాంటినోపుల్లోకి ప్రవేశించిన తర్వాతనే, యూరోపులో చీకటి మధ్యయుగం ముగిసింది.
చీకటి యుగాల ముగింపు తేదీ 1453 AD, ఇస్లాం యూరప్లోకి ప్రవేశించింది కూడా అదే సంవత్సరం.
ఇస్లాం యూరోప్ నడిబొడ్డున ప్రవేశించగానే అక్కడ విజ్ఞానపు వెలుగు ప్రకాశించింది.
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో, పాశ్చాత్య నాగరికత పురోగతికి సంబంధించిన మూలాలను సూచించే వృత్తాలు లైబ్రరీ యొక్క ప్రధాన హాల్ పైకప్పుపై చెక్కబడి ఉన్నాయి మరియు అక్కడి ఏడు వృత్తాలలో పేర్కొన్న ఏకైక మతం ఇస్లాం.
అక్కడ ప్రస్తావించబడిన ఏకైక మతం ఇస్లాం మరియు ఇది ప్రకృతి సహజ శాస్త్రాలలో ప్రత్యేకత కలిగి ఉంది.
ఇస్లాం: భౌతిక శాస్త్రము
మిగిలిన సర్కిల్లు దేశాల పేర్లు మరియు సాహిత్య, కళాత్మక లేదా భాషా పురోగతి పరంగా ఈ దేశాలు అందించిన వాటి గురించి పేర్కొంటున్నాయి!
ఇస్లాం విజ్ఞాన శాస్త్రాన్ని అందించింది మరియు (గతంలో) 700 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ యొక్క అంతర్జాతీయ భాష: అరబిక్.[27]
https://www.telegraph.co.uk/news/science/science-news/3323462/Science-Islams-forgotten-geniuses.html
ముస్లింలు తమను తాము ధార్మికంగా సరిదిద్దుకుంటే వారి ప్రపంచం సంస్కరించబడుతుంది.
33 - పరమ పవిత్రుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ను ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు: మనిషి, స్వతహాగా తన స్వభావాన్ని గుర్తించలేడు, మనశ్శాంతి పొందలేడు మరియు అల్లాహ్ను ఆరాధించడం ద్వారా తప్ప అతని హృదయంలోని ఒంటరితనాన్ని శాంతింపచేయలేడు.
ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.(28)
సూరతు ర్రఅద్
ఆరాధన ద్వారా, హృదయానికి తృప్తి లభిస్తుంది
మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.(97)
కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.(98)
మరియు నీ ప్రభువును ఆరాధించు.
సూరతుల్ హిజ్ర్
నీ హృదయానికి తృప్తి, నిశ్చింత కలిగేందుకు నీ ప్రభువును ఆరాధించు.
కాబట్టి, వినయంతో మరియు ధ్యానంతో అల్లాహ్ కొరకు చేసే రెండు రకాతుల నమాజ్ ద్వారా మానవ ఆత్మ పొందే తృప్తిని, గంటల తరబడి మానసిక ప్రశాంతత కొరకు జరిగే ప్రోగ్రాములు సాధించలేక పోతున్నాయి.
నిశ్చయంగా, ఆరాధన మానవ ఆత్మకు ప్రశాంతతను చేకూరుస్తుంది మరియు అల్లాహ్ స్మరణకు దూరంగా ఉన్నవారు ఎవరైనా సరే అశాంతికి గురవుతారు; అతను ఎల్లప్పుడూ ప్రాపంచిక లాభాల కోసం ఆరాటపడుతున్నాడని మీరు కనుగొంటారు, అయినప్పటికీ అతను సంతృప్తి చెందడు లేదా ప్రశాంతత పొందడు.
మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము."(124)
సూరహ్ తాహా
ఒక వ్యక్తి ఎంత సంపన్నుడు అయినప్పటికీ; విశ్వాసం లేకుండా, అతని జీవితం వ్యధా భరితంగానే ఉంటుంది. మరియు తెలియని వారితో అపరిమితమైన అంతం కాని పరుగులో పాల్గొంటాడు, కాబట్టి మీరు అతడు ఎల్లప్పుడూ ఆందోళనలో ఉండటాన్ని చూస్తారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "ఎవరైతే ప్రాపంచిక జీవితంపై మాత్రమే దృష్టి పెడతారో, అల్లాహ్ అతని వ్యవహారాలను గందరగోళానికి గురి చేస్తాడు, అతనిని నిరంతరం పేదరికానికి భయపడేలా చేస్తాడు మరియు అతని కోసం విధివ్రాతలో ముందుగా నిర్ణయించబడినది తప్ప, అతనికి ఈ లోకం నుండి ఏమీ లభించదు. మరి, ఎవరైతే పరలోకంపై దృష్టి సారిస్తారో, అల్లాహ్ అతని కోసం అతని వ్యవహారాలను పరిష్కరిస్తాడు, అతని హృదయాన్ని సుసంపన్నం చేస్తాడు మరియు అది అతనికి లోబడి ఉంటుంది."[28]
సహీహ్ సుననె తిర్మిజీ హదీసు 2465.
అల్లాహ్ యొక్క ఆరాధన ఒక ముస్లింను ప్రాపంచిక జీవితానికి లొంగకుండా చేస్తుంది మరియు అతడికి స్వేచ్ఛను ప్రసాదించి, స్వతంత్రుడిగా చేస్తుంది.
కాబట్టి, అల్లాహ్ను నిజంగా ఆరాధించే ముస్లిం జీవిత పరమార్థాన్ని, ఈ ప్రపంచం యొక్క విలువను, ఈ ప్రపంచంలో తన ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటాడు మరియు, ఈ ప్రపంచం ఒక పరీక్ష స్థలం మరియు తన ప్రభువును ఆరాధించడం హక్కు అని అర్థం చేసుకుంటాడు మరియు అతడు దాని క్రింద నిరుపయోగమైన ఆందోళనలతో జీవించకూడదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు.(2)
సూరతుల్ ముల్క్.
34. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు లోబడటం యొక్క వ్యక్తీకరణలు ఏవి? లేదా మరో మాటలో చెప్పాలంటే, మీరు ముస్లిం అని మరియు అల్లాహ్ కు పూర్తిగా లోబడి ఉన్నారని మీకు ఎలా తెలుసు?
సమాధానం: అల్లాహ్ కు లోబడటానికి నాలుగు సంకేతాలు ఉన్నాయి, అవి :
మొదటిది: మీ జీవితంలోని చిన్న పెద్ద విషయాలలో అల్లాహ్ యొక్క ధ్యాసం చేయడం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(ఇంకా) ఇలా అను : "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే! (162)
"ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను!" (163)
సూరతుల్ అన్ఆమ్
నా సలాహ్ (నమాజు, ప్రార్థన), ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం అన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కోసమే. నేను చేసేదంతా అల్లాహ్ కోసమే. నేను అల్లాహ్ కోసం నమాజ్ స్థాపిస్తాను, అల్లాహ్ కోసం నా తల్లిదండ్రులకు విధేయత చూపుతాను, అల్లాహ్ కోసం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి చదువుకుంటాను మరియు నేర్చుకుంటాను, రాత్రిపూట నిద్రిస్తాను, తద్వారా అల్లాహ్ నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించాడో అది పూర్తి చేయగలిగేటంతటి శక్తితో మరలా నిద్ర నుండి మేల్కొంటాను.
ఇది ప్రతి పనిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లాహ్ యొక్క ధ్యాసం. ఇది అల్లాహ్కు లొంగిపోవడానికి గల మొదటి సంకేతం.
అల్లాహ్ కి పూర్తిగా లోబడటానికి రెండవ సూచన ఏమిటంటే, అల్లాహ్ ఆజ్ఞాపించిన దానిని పాటించడం మరియు ఆయన నిషేధించిన వాటిని నివారించడం. పరిశుద్ధుడైన మన ప్రభువు ఇలా సెలవిచ్చాడు:
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలి పోకండి.(20)
సూరతు అన్'ఫాల్
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఓ విశ్వాసులారా మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి.(208)
సూరతుల్ బఖరహ్
"ఫిస్సిల్మి" అనగా: ఇస్లాంలో అని అర్ధం.
ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి అంటే : అల్లాహ్ ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చండి మరియు ఆయన నిషేధించిన ప్రతిదాన్ని విడిచిపెట్టండి
మీరు అల్లాహ్కు పూర్తిగా విధేయులుగా ఉండాలంటే, మీరు అల్లాహ్ ఆజ్ఞాపించిన దానికి కట్టుబడి ఉండాలి మరియు ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండాలి.
అల్లాహ్ కు లోబడటానికి మూడవ సంకేతం ఏమిటంటే, మనము అల్లాహ్ ధర్మ శాస్త్రానికి, ఆదేశాలకు లోబడి ఉండాలి, కావున మేము ఆయన ధర్మశాస్త్రం పట్ల సంతృప్తి చెంది దానిని అంగీకరిస్తాము.
మేము అన్ని దైవిక శాసనాలను అంగీకరిస్తాము మరియు తిరస్కరించము. ఉదాహరణకు, అల్లాహ్, తన చట్టంలో చేసిన శిక్షలను తిరస్కరించము. బదులుగా, మనం అల్లాహ్ యొక్క చట్టంతో సంతృప్తి చెందుతాము, ఎందుకంటే అల్లాహ్ కు సృష్టి కోసం ఏది సరైనదో తెలుసు, మరియు ఈ శిక్షలు సమాజాన్ని శుద్ధి చేస్తాయనీ అల్లాహ్ కు తెలుసు {ఆయన అత్యంత సూక్ష్మంగా, సర్వజ్ఞుడై ఉంన్నప్పుడు తన స్వంత సృష్టి గురించి ఆయనకు తెలియదా?}(సూరతుల్ ముల్క్ 14)
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
అల్లాహ్ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు.(50)
సూరతుల్ మాఇదహ్
ప్రజలకు ప్రాపంచిక పరంగా మరియు పరలోక పరంగా ఎటువంటి సంస్కరణలు అవసరమో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తెలుసు
అల్లాహ్ యొక్క ధర్మశాస్త్రాన్ని అన్వయి౦చుకోవడ౦ ప్రజలను పరిశుద్ధపరుస్తు౦ది, వారు సురక్షిత౦గా జీవి౦చేలా చేస్తు౦ది
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వెల్లడి చేయబడిన విషయాలలో తాను అల్లాహ్ను విశ్వసిస్తున్నానని చెప్పుకునే వ్యక్తి, ఏదేని ఒక ఆజ్ఞ జారీ చేసే విషయంలో అల్లాహ్ యొక్క ప్రవక్త తనకు అనుకూలంగా లేని తీర్పును జారీ చేస్తారనే భయంతో, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వెళ్లకుండా తాను కోరుకున్న తీర్పును ఆశిస్తూ కాబ్ ఇబ్న్ అల్-అష్రఫ్ అనే యూదుడి వద్దకు వెళ్లాడు, అపుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించినాడు:
(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.(60)
సూరతు న్నిసా
మీరు అల్లాహ్కు లొంగిపోయే ముస్లిం అయితే, మీరు అల్లాహ్ యొక్క చట్టానికి కట్టుబడి ఉండాలి మరియు అల్లాహ్ తీర్పు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క తీర్పును పూర్తి విశ్వాసం తో అంగీకరించాలి. అల్లాహ్ యొక్క చట్టాన్ని వదిలి, మీ సమస్యలో మిమ్మల్ని మీరు సంతోషపెట్టడానికి, యూదుల వద్దకు వెళ్లకూడదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:
దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ ఆజ్ఞతో అతనిని అనుసరించాలనే పంపాము.(సూరతు నిసా 64)
వారు (షరియా) ధర్మ శాస్త్రాన్ని వదిలివేసి ఇతర చట్టాలను అనుసరించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపలేదు
అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ సంఘటన నుండి ఉపదేశిస్తున్న గుణపాఠాన్ని ముగించాడు మరియు ఇది అల్లాహ్ యొక్క చట్టానికి లోబడి ఉండవలసిన అవసరాన్ని తెలియపరిచే ముఖ్యమైన ఆయతు కూడా, మన సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇలా సెలవిచ్చాడు :
{అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!}[65]
సూరతు న్నిసా : 65. అల్లాహ్ షరియాకు మనం పూర్తిగా లోబడాలి, ఎందుకంటే అల్లాహ్ షరియాకు లోబడటం ఇస్లాంకు లొంగిపోయే సంకేతాలలో ఒకటి.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కి లోబడటానికి నాల్గవ సంకేతం: అల్లాహ్ యొక్క ముందస్తు నిర్ణయానికి లోబడడం, ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన జ్ఞానంతో ముందే నిర్దేశించాడు మరియు అందువల్ల ముస్లిం తన విధి యొక్క మంచి చెడులో అల్లాహ్ కి లొంగిపోతాడు.
ఒక ముస్లింకి ఏదైనా మంచి జరిగితే, అతను కృతజ్ఞత చూపిస్తాడు; మరియు ఏదైనా కష్టం సంభవించినప్పుడు, అతను సహనం వహిస్తాడు.
ఒకవేళ అల్లాహ్ మీకు మంచి ఆహారం, మంచి జీవనోపాధి, మంచి ఇల్లు, చదువులో విజయం, ఆరోగ్యవంతమైన శరీరం మరియు మంచి కుటుంబాన్ని అందిస్తే, మీరు అల్లాహ్కు కృతజ్ఞతలు చూపాలి.
మరోవైపు, ఒక ముస్లిం అనారోగ్యం, పేదరికం, భయం, విచారణ లేదా దుఃఖంతో బాధపడుతుంటే, అతను ఈ బాధలో సహనం, ఓర్పుతో ఓపికగా ఉండి, అల్లాహ్ సహాయం కోరాలి. మహిమాన్వితుడైన తన ప్రభువుకు లొంగిపోయే ముస్లిం వైఖరి ఇలాంటిదే.
మంచి ఆరోగ్యం మరియు అనారోగ్యం, వైభవం మరియు పేదరికం అల్లాహ్ ఆజ్ఞ ద్వారా ప్రతిదీ నిర్ణయించబడుతుంది. అంతా ఆయన ముందస్తు నిర్దేశం మరియు జ్ఞానానికి అనుగుణంగా జరుగుతుంది. ఒక ముస్లిం విధి పట్ల సంతృప్తి చెందాలి, ఎందుకంటే అది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ చే ముందే నిర్ణయించబడింది.
పరిశుద్ధుడైన మన ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు:
నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము. [49]
సూరతుల్ ఖమర్
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
అల్లాహ్ మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు.(51)
సూరతు త్తౌబహ్
అల్లాహ్ మా కొరకు నిర్దేశించినది తప్ప మరొకటి మాకు జరగదు.
మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
అల్లాహ్ ఆజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు.(145)
సూరతు ఆలె ఇమ్రాన్
ఆయుష్షు అల్లాహ్ చేత ముందే నిర్ణయించబడింది.
విశ్వంలో జరిగే ప్రతిదీ, ప్రపంచంలో కదిలే ప్రతి అణువు, జరిగే ప్రతి ప్రమాదం, అల్లాహ్ జ్ఞానం, అల్లాహ్ చిత్తం, అల్లాహ్ విచక్షణ, అల్లాహ్ వివేకం మరియు అల్లాహ్ శక్తితో జరుగుతాయి.
పరిశుద్ధుడైన మన ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు:
ఆయన ప్రతి వస్తువును సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్థారించాడు.(2)
సూరతుల్ ఫుర్'ఖాన్
పరమ పవిత్రుడైన ఆయన సమస్తమును సృష్టి౦చి, ప్రతిదానిని ము౦దే నిర్ణయి౦చాడు, మరియు ఆయన కోరిందే జరిగినది, ఆయన కోరనిది జరగలేదు.
ఒక ముస్లింగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అన్ని ముందస్తు సూచనలకు నేను లోబడాలి.
ఈ విధంగా ఒక వ్యాక్తి అల్లాహ్ కు ముస్లిం అవటం సరిఅవుతుంది.
ముగింపులో, నేను ఇస్లాంను ఎలా స్వీకరించగలను?
ఇస్లాం సమస్త మానవాళి కొరకు అల్లాహ్ ధర్మము. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు
{నిస్సందేహంగా ఇస్లాం'యే అల్లాహ్ వద్ద ధర్మం సమ్మతమైనది}{19}
సూరతు ఆలె ఇమ్రాన్
అల్లాహ్ మతాలలో నుంచి ఇస్లాం తప్ప మరే మతాన్ని అంగీకరించడు.
{మరియు ఎవరైనా ఇస్లాం ధర్మం (అల్లాహ్ కు విధేయత చూపుట, సమర్పించుట) తప్ప మరే ఇతర ధర్మాన్నైనా అవలంబించగోరితే అది ఎంత మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరతాడు.}(85)
సూరతు ఆలె ఇమ్రాన్
కాబట్టి, ప్రతి మనిషి ఇస్లాం స్వీకరించాలి.
ఇస్లాంలో నరకాగ్ని నుండి విముక్తి మరియు అల్లాహ్ మన్నతతో,స్వర్గముతో సాఫల్యం కలదు.
ఇస్లాంలో ప్రవేశించడం గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, ఇది మీ ఉనికిలో గొప్ప మరియు ముఖ్యమైన విషయం.
వాస్తవానికి, ఇస్లాం అనేది సహజ స్వభావం, మరియు బుద్దీ జ్ఞానాల వైపు తిరిగిరావడం.
ఇస్లాంలోకి ప్రవేశించడం సులభం మరియు ఏ ఆచారాలు లేదా ఏ అధికారిక విషయాలతో అవసరం లేదు, ఒక వ్యక్తి మాత్రమే రెండు షహాదాలను ఉచ్చరించాలి: అల్లాహ్ తప్ప దేవుడు లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను.
తద్వారా, అతను ముస్లిం అవుతాడు.
అప్పుడు అతను ఇస్లాం పాటించడం ప్రారంభిస్తాడు.
ప్రతి ఒక్కరూ తమ సొంత భాష ప్రకారం ఇస్లాం హౌస్ ను అనుసరించాలని నేను సిఫార్సు చేస్తున్నాను, తద్వారా కొత్త ముస్లిం ఇస్లాంను ఎలా ఆచరించాలో నేర్చుకుంటాడు.
వెబ్ సైట్ లింక్ : https://islamhouse.com/te/main/